March 20, 20197 yr 4 minutes ago, Bollu said: cofferdam is more than enough to irrigate kariff season for 36 lac acres. full dam is bonus for rabi. polavaram ecrf dam gross storage 194 tmc . 75 tmc is live storage which can be used for krishna delta through gravity. out of 119 tmc(194 - 75) used for godavari delta rabi. currently we are using sileru water for godavari delta in rabi season , by giving power to orissa in exchange of water . if we continue getting sileru water from orissa in exchange of power, we can supply water to krishna delta rabi crop(in the worst case dry crops + drinking water) . only requirement is we need mobile lifts to lift water to polavaram right canal at polavaram reservoir.
March 20, 20197 yr 1 minute ago, ravindras said: polavaram ecrf dam gross storage 194 tmc . 75 tmc is live storage which can be used for krishna delta through gravity. out of 119 tmc(194 - 75) used for godavari delta rabi. currently we are using sileru water for godavari delta in rabi season , by giving power to orissa in exchange of water . if we continue getting sileru water from orissa in exchange of power, we can supply water to krishna delta rabi crop(in the worst case dry crops + drinking water) . only requirement is we need mobile lifts to lift water to polavaram right canal at polavaram reservoir. that is wrong statement regarding dam, Left Canal F.S.L. AT START : + 40.54 m (+133 ft), M.S.L. AT START : + 37.00 Sill level of left side head regulator; Right Canal F.S.L. AT START : + 40.23 , M.S.L. AT START : + 35.50 (Sill level of right side head regulator) cofferdam can store water up to 120 tmc, 35 meters varuku 25 tmc water store cheyachhu. canals start at 35 m kabatti, we can send 90 tmc of water through canals. main dam ki coffer dam ki storage difference is just 70 tmc,. krishna delta mothaniki rabi ki only polavaram water saripovu, appudu koooda we need draw water from seleru.
March 20, 20197 yr 1 hour ago, ravindras said: polavaram ecrf dam gross storage 194 tmc . 75 tmc is live storage which can be used for krishna delta through gravity. out of 119 tmc(194 - 75) used for godavari delta rabi. currently we are using sileru water for godavari delta in rabi season , by giving power to orissa in exchange of water . if we continue getting sileru water from orissa in exchange of power, we can supply water to krishna delta rabi crop(in the worst case dry crops + drinking water) . only requirement is we need mobile lifts to lift water to polavaram right canal at polavaram reservoir. Why lifts needed , Pattiseema lifts can be used by releasing water downstream.
March 26, 20197 yr హోం తాజావార్తలు- ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు ఏపీ విషయంలో తెలంగాణ కొత్త పేచీ!26-03-2019 20:05:32 న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కొత్త అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులపై పున:సమీక్షించాలని, అప్పటి వరకూ పోలవరాన్ని ఆపాలంటూ సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. మరోసారి పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలని, ఆ తర్వాతే పోలవరానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన కేసులో సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ముంపు అంచనాతో.. 2005లో పోలవరానికి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, ప్రస్తుతం డిజైన్ మార్పుతో ఆ ముంపు ప్రభావం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని అఫిడవిట్లో పేర్కొంది. మరోసారి పర్యావరణ అనుమతులు ఇచ్చే ముందు వరద ముంపు ప్రభావాన్ని అంచనా వేయాలని కోరింది. అదేవిధంగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఏపీ గోదావరి నీటిని వినియోగించుకుంటోందని, ప్రతిగా తెలంగాణ వాటాగా 45 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు అనుమతివ్వాలని కోరింది. దీంతోపాటు 9,10 షెడ్యూల్ల్లోని ఆస్తుల విభజన చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో టి.సర్కార్ పేర్కొంది. ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలంది.
March 26, 20197 yr NATION, CURRENT AFFAIRS Telangana files fresh objection on Polavaram DECCAN CHRONICLE. | VUJJINI VAMSHIDHAR PublishedMar 27, 2019, 12:45 am IST UpdatedMar 27, 2019, 12:45 am IST The state government has asked the apex court to review the environmental clearance accorded to the project. Telangana government logo Hyderabad: The Telangana state government on Tuesday raised a new objection against the Polavaram project before the Supreme Court. The state government has asked the apex court to review the environmental clearance accorded to the project. The state government has filed the additional affidavit before the Supreme Court in this regard in a petition filed by politician Ponguleti Sudhakar Reddy. Stressing that the clearance has to be reviewed on the grounds that the Union government had given permission in 2005, the Telangana state requested the court to stop the construction until it gets new clearance as per the present status of the project. The government also wants the impact of flooding to be assessed before clearance is granted.
March 26, 20197 yr హోం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు పోలవరాన్ని ఆపాల్సిందే!27-03-2019 02:21:27 మరోసారి పర్యావరణ ప్రభావ మదింపు జాతీయ హోదాపై మా మాటా వినాలి ఢిల్లీలోని ఏపీ భవన్ మొత్తం తెలంగాణదే స్థాన ప్రాతిపదికన ఆస్తులను విభజించాలి అఫిడవిట్ సిద్ధం చేసిన తెలంగాణ సర్కారు మళ్లీ అవే వాదనలతో సుప్రీంలో కౌంటర్ న్యూఢిల్లీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపి తీరాల్సిందేనని తెలంగాణ సర్కారు మళ్లీ మళ్లీ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తూనే ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన అంశంపై తమ అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. తాజాగా మళ్లీ పర్యావరణ ప్రభావ మదింపు, బ్యాక్వాటర్ ప్రభావ మదింపు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతోంది. గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొని 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, ఆ తర్వాత కాలంలో డిజైన్లు మార్చిన నేపథ్యంలో గరిష్ఠ వరద ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని వివరించింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, అంశాలు, నిబంధనలను అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేయనున్న కౌంటర్ అఫిడవిట్లో ఒక్కో అంశం అమలు స్థితి గురించి పేర్కొంది. నిర్ణీత గడువులోగా చట్టంలో ఉన్నవన్నీ పూర్తి చేయాలని కోరింది. 2017-18తో పాటు ఈ ఏడాదిలోనూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 టీఎంసీల నీటిని మళ్లించిందని, తద్వారా గోదావరి జలాల్లో తమ వాటా పెరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో గోదావరి నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్ తీర్పు మేరకు ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా 45 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించింది. అలాగే రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, 4.56 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని, దాంతో ప్రాజెక్టును ఆధునికీకరించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసిందని, కానీ ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టకుండా వివాదాలను సృష్టిస్తోందని ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వంటి ముఖ్యమైన డైవర్షన్ పాయింట్ దగ్గర టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయని కారణంగా కృష్ణా బేసిన్కు అధికంగా నీటిని తరలిస్తున్నారని పేర్కొంది. పాలమూరు, డిండికీ జాతీయ హోదా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినందున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని కోరింది. కాళేశ్వరంతో పాటు మహబూబ్నగర్ జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏపీ నిధులు తెలంగాణకు.. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో భాగంగా భవిష్యత్తులో ఏపీకి విడుదల చేసే నిధుల నుంచి తెలంగాణకు సర్దుబాటు చేయాలని కోరింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదట్లో కేంద్ర పథకాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఖాతాల్లో జమ చేసిందని, రూ.1630.53 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ ఇవ్వలేదని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆ రాష్ట్రానికి విడుదల చేసే నిధుల నుంచి తెలంగాణకు సర్దుబాటు చేయాలని కోరింది.
March 27, 20197 yr 9 hours ago, Bollu said: హోం తాజావార్తలు- ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు ఏపీ విషయంలో తెలంగాణ కొత్త పేచీ!26-03-2019 20:05:32 న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కొత్త అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులపై పున:సమీక్షించాలని, అప్పటి వరకూ పోలవరాన్ని ఆపాలంటూ సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. మరోసారి పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలని, ఆ తర్వాతే పోలవరానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన కేసులో సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ముంపు అంచనాతో.. 2005లో పోలవరానికి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, ప్రస్తుతం డిజైన్ మార్పుతో ఆ ముంపు ప్రభావం 50 లక్షల క్యూసెక్కులకు చేరిందని అఫిడవిట్లో పేర్కొంది. మరోసారి పర్యావరణ అనుమతులు ఇచ్చే ముందు వరద ముంపు ప్రభావాన్ని అంచనా వేయాలని కోరింది. అదేవిధంగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఏపీ గోదావరి నీటిని వినియోగించుకుంటోందని, ప్రతిగా తెలంగాణ వాటాగా 45 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు అనుమతివ్వాలని కోరింది. దీంతోపాటు 9,10 షెడ్యూల్ల్లోని ఆస్తుల విభజన చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో టి.సర్కార్ పేర్కొంది. ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలంది. Eh rastram lo asthulu ah raastraniki ayithey.... eh rastram lo appulu ah rastraanikey kada?
March 31, 20197 yr as per video so June/July floods lo water Dam meeduga velthayi annamata inthaki crest gates level ki vasthe - RMC ki neellu andutaya? Coffer dam complete avvakapothe, floods ki mottham kottuku pothundi so aa time ki dam, gates varaku anna complete cheyyali along with upper coffer dam so very crucial until June Edited March 31, 20197 yr by rk09
April 15, 20197 yr Author మళ్లీ ‘పోల’వారం 15-04-2019 03:10:09 ఎన్నికలు ముగియడంతో సమీక్షలు మొదలు నేడు డిజైన్ల కమిటీ సమావేశం హెడ్వర్క్స్ పనులు 60.94% పూర్తి మొత్తంగా 69 శాతం పూర్తి అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికారంలోకి ఎవరొస్తారన్న ఊహాగానాలు కొనసాగుతున్నా.. వాటితో నిమిత్తం లేకుండా.. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై జరిగే సమీక్షలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ ఇంకా అమల్లో ఉన్నందున రేపటి నుంచి అధికారులే ఈ సమీక్షలు చేపట్టనున్నారు. ఇప్పటికే 100 పోలవారాలు పూర్తయ్యాయి. సోమవారం జరిగేది 101వది. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంలోని కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్.కె.జైన్, సీఈ ఏకే ప్రధాన్, పీపీఏ డీడీ కె.శంకర్, కేఆర్ఎంబీ చైర్మన్ ఆర్.కె.గుప్తా.. ప్రాజెక్టు డిజైన్లపై సమీక్షించనున్నారు. ఇదే సమయంలో పనుల వేగాన్ని కూడా సమీక్షిస్తారు. స్పిల్వే కుడి ఎడమలలో బండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ డిజైన్లపై పీపీఏ తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. కాగా.. ప్రాజెక్టు పనులన్నీ దరిదాపుగా 69 శాతం వరకూ పూర్తయ్యాయి. హెడ్వర్క్స్ పనులు 60.89 శాతం .. అంటే 61 శాతం వరకూ జరిగాయి. మట్టి తవ్వకం పనులు 85 శాతం, కాంక్రీట్ పనులు 72.40 శాతం అయ్యాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. రేడియల్ గేట్లు 66.22 శాతం పూర్తయ్యాయి. కనెక్టివిటీ ప్యాకేజీ పనులు 61.42 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 90.87 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 70.30 శాతం వరకూ పూర్తయ్యాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల నిర్మాణానికి జెట్ గ్రౌటింగ్ పనులూ పూర్తయ్యాయి.
Create an account or sign in to comment