రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం
By Andhra Pradesh News DeskPublished : 14 Dec 2025 05:14 IST
Ee
Font size
1 min read
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీకి రాజధాని అమరావతిలో రూ.165 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక జీ+5 భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయవాడ- గుంటూరు మధ్య కాజ వద్ద అద్దె భవనంలో నడుస్తున్న జ్యుడీషియల్ అకాడమీకి సీఆర్డీఏ పిచ్చుకలపాలెం వద్ద 4.83 ఎకరాల స్థలాన్ని 60 ఏళ్ల లీజుకు కేటాయించింది. అక్కడ భవనాన్ని కూడా సీఆర్డీఏనే నిర్మించనుంది. ఈ ప్రాంతం హైకోర్టుకు సుమారు 3 కి.మీ. దూరంలో ఉంది. ఈ భవన నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇటీవల ఆమోదం లభించింది.
జ్యుడీషియల్ అకాడమీ హైకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే శిక్షణ సంస్థ. న్యాయమూర్తులు, న్యాయాధికారులు, కోర్టుల సిబ్బందికి నైపుణ్యాల పెంపు, కోర్టు మేనేజ్మెంట్, న్యాయ విజ్ఞానంలో ఇక్కడ శిక్షణ ఇస్తారు.
కొత్తగా సర్వీసులో చేరిన జడ్జిలతో పాటు, ఇప్పటికే సర్వీసులో ఉన్నవారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది.
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి రాజధానిలో అత్యాధునిక క్యాంపస్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఎకడమిక్ బ్లాక్, నివాస సదుపాయాలు, డిజిటల్ క్లాస్రూమ్లు, ఆడిటోరియం, సమావేశ మందిరాలు, క్రీడలు, వినోద సదుపాయాలు, కెఫెటేరియా వంటివి ఉంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు భవన నిర్మాణం చేపడుతున్నారు.