బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Published : 27 Jul 2024 04:40 IST
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను కేంద్ర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ సర్వీసును పునరుద్ధరించారని తెలిపారు. ఆగస్టు 18 నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ సర్వీసు నడుస్తుందని ప్రకటించారు. కర్నూలు నుంచి విజయవాడకు కూడా అక్టోబరు ఆఖరు నుంచి సర్వీసు నడిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. రన్వే పొడిగింపుతో పాటు రాత్రి వేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవసరమయ్యే విద్యుదీకరణ పనులకు రూ.113 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.