-
Posts
64,505 -
Joined
-
Last visited
-
Days Won
83
sonykongara last won the day on April 10 2019
sonykongara had the most liked content!
About sonykongara
- Birthday 09/01/1987
Profile Information
-
Gender
Male
-
Location
PALNADU, CHENNAI
Recent Profile Visitors
sonykongara's Achievements
-
sonykongara changed their profile photo
-
Mangalagiri International Cricket Stadium
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Amaravati to Anantapur Expressway
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Amaravati to Anantapur Expressway
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Amaravati to Anantapur Expressway
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
ఎక్స్ప్రెస్వేకు ‘ఎన్నిక’ మెలిక 20-04-2019 02:17:14 రాజకీయ నిర్ణయం తీసుకోవాలి ఎన్నికలయ్యాక చూద్దాం లెండి ‘అనంత-రాజధాని’పై నాన్చుడు కీలక దశలోని ప్రాజెక్టుకు కొర్రీలు 10రోజుల ముందంతా అద్భుతం అంతలోనే మారిన కేంద్రం తీరు అమరావతి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అనుసంధానించే అనంతపురం-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రె్సవేను కేంద్రం నాన్చుతోంది. కీలకమైన అనుమతులు ఇచ్చే సమయంలోనే అసంబద్ధమైన కారణాలను తెరమీదకు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ‘ఎన్నికలయ్యాక రాజకీయ నిర్ణయం తీసుకుందాం. ఎన్నికలయ్యాక చుద్దాంలేండి’ అంటూ కొత్తగా మెలికపెట్టింది. రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లడానికి ముందు అదిగో అమరావతి ఎక్స్ప్రె్సవే అంటూ ఊరించిన కేంద్రం...తీరా ఇప్పుడు ఎన్నికల తర్వాత చూద్దాంలే అని సరిపెడుతోంది. ఈ పరిణామంపై అటు అధికారులు, ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదేకాదు, రూ. 3200 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలను కూడా కేంద్రం పక్కనపెట్టినట్లు తెలియవచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, అనంతపురం-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రె్సవే రహదారి నిర్మాణ ప్రతిపాదనలు ఇప్పుడు చాల కీలకదశకు చేరుకున్నాయి. రూ. 21వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో అతి కీలకమైన రహదారి నిర్మాణ అలైన్మెంట్కు (షార్టెస్ట్ స్ట్రెయిట్ అలైన్మెంట్) ఆరు నెలల క్రితమే ఆమోదం లభించింది. గత ఏడాది అక్టోబరులో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ( ఎంవోఆర్టీహెచ్) అనుమతి ఇచ్చింది. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రిగా ఉన్న నితిన్గడ్కరీ అధికారికంగా వెల్లడించారు కూడా. అంతేకాదు, ప్రాజెక్టు భూసేకరణ వ్యయంలో 50 శాతం తాము భరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ దిశగా మన రాష్ట్రం నుంచి వడివడిగా నివేదికలు వెళ్లాయి. భూసేకరణ పనులను ప్రారంభించారు. ఆ వివరాలను భూమిరాశి పోర్టల్కు అప్లోడ్ చేశారు. ఇక, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుకు (డీపీఆర్) సంబంధించిన కసరత్తు ఎప్పుడో ఆరు నెలల క్రితమే ముగిసింది. అయితే, దాన్ని కేంద్రానికి సమర్పిస్తే, ఏ కారణాలతోనయినా తిరస్కరిస్తుందేమోనన్న ఆందోళనతో అధికారులు ఆచితూచి అడుగులేశారు. డీపీఆర్లో పేర్కొన్న అనేకానేక అంశాలకు ఒక్కటొక్కటిగా అనుమతులు సాధించారు. ఆపై డీపీఆర్ నకలు ప్రతిని కూడా ఎంవోఆర్టీహెచ్ అధికారులకు పంపించారు. సరిగ్గా పది రోజుల క్రితం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కీలక నివేదికను ఏపీ అధికారులు ఆ మంత్రిత్వశాఖ పెద్దలకు సమర్పించారు. అంతా అద్భుతంగా ఉందని, త్వరగా అటవీ అనుమతులు, ఎకో జోన్కు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి తలకిందులయినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు పనిలోభాగంగా వెళ్లినవారికి ఆ పెద్దలు షాక్ ఇచ్చారు. ‘‘దాని గురించి ఇప్పుడేం తొందర! మీ రిపోర్టును మేం ఇంకా పూర్తిగా చూడాలి. అటవీ శాఖ నుంచి మీరు కోరుతున్న ఆ రెండు కిలోమీటర్లకు సెన్సిటివ్ ఎకోజోన్ పర్మిషన్ రాలేదుకదా! అయినా దీనిపై ఇంకా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలయ్యాక పరిశీలన చేద్దాం. ఆ తర్వాత రండి’’ అని బదులిచ్చినట్లు తెలిసింది. అంతా సవ్యంగా సాగిపోతుంది....రహదారికి ఎన్హెచ్ నంబర్ కేటాయించడం, నిర్మాణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థకి (ఎన్హెచ్ఏఐ) అప్పగించవచ్చని చాలా ఆశలుపెట్టుకున్న రాష్ట్రానికి, కేంద్రం కొత్తగా పెట్టిన మెలికలు షాక్నిస్తున్నాయి. ప్రజాప్రయోజన ప్రాజెక్టులపై ఇలా కూడా చేస్తారా అంటూ అధికారవర్గాలు విస్తుపోతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే తీరు.. రహదారి ప్రాజెక్టుల విషయంలో కీలక దశలో కొర్రీలువేసి, మెలికలుపెట్టడంలో కేంద్రం తీరు నాలుగేళ్లుగా ఇలాగే ఉందన్న విమర్శలు ఉన్నాయి. అనంతపురం-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రె్సవే నిర్మాణ ప్రతిపాదన చర్చకొచ్చినప్పుడు ప్రధాని అద్భుతమైనదంటూ ప్రశంసించారు. స్ట్రెయిటెస్ట్ అలైన్మెంట్ చాలా సేఫ్ అంటూ కేంద్ర మంత్రి గడ్కరీ పొగిడారు. ఆరుకాదు ఎనిమిది వరుసల రహదారి నిర్మాణమైనా సహకరిస్తామంటూ ఊదరగొట్టారు. తీరా ప్రతిపాదనల దశలో ఆరు వరుసల ఎక్స్ప్రె్సవే కుదరదని తేల్చారు. ఆ తర్వాత రెండు వందల మీటర్ల రహదారి వెడల్పునకు అంగీకరించమన్నారు. అప్పటికీ అనేక అంశాల్లో వెనక్కు తగ్గి 100 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇస్తే...భూసేకరణకు అయ్యే ఖర్చును ఏపీ సర్కారే భరించాలంటూ భరించలేని మెలికపెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చాక కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ ఓ మెట్టు దిగారు. భూసేకరణ వ్యయంలో సగం కేంద్రం భరిస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టు భూసేకరణ కీలక దశకు చేరుకున్న సమయంలో రాష్ట్ర అధికారులు పలు నివేదికలు పంపించారు. అనుమతులు, ఇతర సాంకేక అంశాల మంజూరు వద్దకు వచ్చేసరికి ....రాజకీయ నిర్ణయం తీసుకునే అంశమని, ఎన్నికల తర్వాత చుద్దామంటూ మెలికపెట్టడం గమనార్హం. -
Kanaka Durga Temple Master Plan
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
Kanaka Durga Temple Master Plan
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
ఇంద్రకీలాద్రికి...ఆకుపచ్చసోయగం రూ.1.5 కోట్లతో మూడు దశల్లో పనులు ఘాట్ రోడ్డుకు కాలిబాట మార్గం అనుసంధానం న్యూస్టుడే, ఇంద్రకీలాద్రి రాష్ట్ర రాజధానిలో కీలకమైన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిధిలో పచ్చదనం అభివృద్ధితో పాటు హెడ్వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో కాలిబాట మార్గం రూ.1.5 కోట్లతో అభివృద్ధి చేసే పనుల తొలి దశ పూర్తయ్యింది. మూడు దశల్లో అభివృద్ధి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ)కు అప్పగించింది. ఏడాదిగా హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో మూడు వరుసల్లో చదును చేశారు. దిగువ భాగంలో కొబ్బరి మొక్కలను పెంచారు. చుట్టూ ప్రహరీ నిర్మించి గేటును ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం కనకదుర్గ పైవంతెన నిర్మాణం సందర్భంగా కొండ ప్రాంతంలో ఉన్న ఇళ్లను తొలిగించారు. ఆ సమయంలో అప్పటి కలెక్టర్ అహ్మద్బాబు కాలిబాట నిర్మాణం పనులను దుర్గగుడి అధికారులు చేపట్టాలని సూచించారు. అప్పటి దుర్గగుడి ఈవో సూర్యకుమారి తమ దగ్గర ఉన్న నిధులు రాజగోపురం, పెర్గొల, ఇళ్ల సేకరణ పనులకు ఖర్చు చేశామని, ఇప్పడు కాలిబాట పనులు చేయలేమని చెప్పడంతో ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించింది. పచ్చదనం అభివృద్ధితో పాటు కాలిబాట పనులు కూడా చాలా వరకు తొలి దశలో పూర్తి చేసింది. మిగతా రెండు దశల్లో కాలబాటను దుర్గగుడి ఘాట్ రోడ్డుకు అనుసంధానం చేయడానికి మధ్యలో లోయ ఉంది. దానిని పూడ్చేందుకు అక్కడ వంతెన నిర్మించాలన్న ప్రతిపాదనను అధికారులు తీసుకొచ్చారు. ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో పచ్చదనం అభివృద్ధికి మాత్రమే పనులు పరిమితమయ్యాయి. మూడు దశల్లో అభివృద్ధి హెడ్వాటర్ వర్క్స్ సమీపంలోని కొండ ప్రాంతంలో చేపట్టిన పచ్చదనం అభివృద్ధిపై ఏడీసీ సూపరింటెండెంట్ సూర్యనారాయణను వివరణ కోరగా మూడు దశల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలవడిన తరువాత రెండో దశ పనులను ప్రారంభిస్తామన్నారు. మొదటి దశలో సివిల్ వర్క్స్ పూర్తి చేయడంతో పాటు కొంత మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రెండో దశలో శిఖరాగ్రాన రివర్ వ్యూ సెల్ఫీపాయింట్, విశ్రాంతి తీసుకునేందుకు బల్లలు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ వంటి పనులతో పాటు ఆకర్షణీయంగా పచ్చదనం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. - సూర్యనారాయణ, ఏడీసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ -
-
డెల్టా పండింది.. సీమ మురిసింది కృష్ణాడెల్టా కరవు తీర్చిన పట్టిసీమ లక్షలాది ఎకరాలకు సకాలంలో సాగునీరు రాయలసీమకు అందిన కృష్ణాజలాలు దశాబ్దాలుగా నిండని చెరువులకు పునర్జీవం సీమలో భూగర్భ జలాలూ మెరుగు బొమ్మరాజు దుర్గాప్రసాద్ ఈనాడు - అమరావతి పట్టిసీమా.. అదొక ప్రాజెక్టా..? అన్న వెటకారాలు విన్నాం.. కరెంటు ఖర్చు తప్పితే దక్కేదేముందన్న విమర్శలూ చూశాం.. ఈ వెటకారాలు.. ఎద్దేవాల మధ్యే.. ఒక అద్భుతం పూర్తయింది! చెక్కుచెదరని చంద్రబాబు సంకల్పం ముందర విమర్శలన్నీ వీగిపోయాయి. ఒక్క ఆలోచనతో.. డెల్టా మళ్లీ జలకళ సంతరించుకుంది సీమ చెరువులన్నీ జీవం పుంజుకున్నాయి!! ఇసుక మేటలు వేసిన కృష్ణమ్మ ఒడిలో.. వరద ఉరకలెత్తుతుందని అనుకున్నామా..!! సాగు నీరు లేక ఒట్టిపోయిన డెల్టాలో.. పంట కంకులు వేస్తుందని ఊహించామా..!! సాగరంలో వృథాగా కలిసే గోదారి నీళ్లు.. కృష్ణానదిలో పవిత్రసంగమం అవుతాయని ఆశించామా..!! కరవు కరాళనృత్యం చేసే సీమ బీడు భూముల్లో.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని కలగన్నామా..!! ఒక్క ఆలోచన.. అన్నింటికీ సమాధానం చెప్పింది.. కోస్తాంధ్ర మెరిసేలా.. రాయలసీమ మురిసేలా చేసింది. గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేసిన పథకం పట్టిసీమ. అంతేకాదు శ్రీశైలానికి చేరిన జలాలను రాయలసీమ జిల్లాలకు పరుగులెత్తించే అవకాశం కల్పించింది. ఏటా వృథా అవుతున్న వేల టీఎంసీలు సద్వినియోగం చేసుకునే వీలు కలిగింది. దాదాపు రూ.1600కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినప్పుడు సీఎం చంద్రబాబువి ఉత్తమాటలని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ విమర్శలకు 161రోజుల్లోనే సమాధానం చెప్పింది ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రిలా కాకుండా ముఖ్యఇంజినీర్లా మారి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించి రైతాంగం కళ్లలో ఆనందం నింపారు. గుత్తేదారులకు దోచిపెట్టేందుకు అంటూ విపక్షాలు చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ పట్టిసీమ జలాలు కృష్ణాడెల్టాలో వేల కోట్ల విలువైన పంట సకాలంలో చేతికి అందుతోంది. 229 టీఎంసీల తరలింపు గోదావరి నుంచి ఏటా దాదాపు 2500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి 2015 నుంచి ఇప్పటివరకూ 263 టీఎంసీల నీటిని ఉపయోగించుకోగలిగాం. ఇందులో పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీ (మధ్యలో కొంత నీరు వినియోగించున్నది పోగా) 229 టీఎంసీలు చేరాయి. మూడు జిల్లాల్లో 13.07 లక్షల ఎకరాల్లో సాగు, ఆక్వా రంగానికి నీటిని అందించారు. ఇక్కడ మొదలైంది భగీరథ ప్రయత్నం పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమలో గోదావరి నదిపై 24 పంపులతో భారీ ఎత్తున నిర్మించిన ఎత్తిపోతల పంప్హౌస్ ఇలా పోటెత్తుతోంది ప్రవాహం పంప్హౌస్ ఎత్తిపోసిన గోదావరి జలాలు పైపుల ద్వారా 4 కి.మీ. ప్రవహించి పోలవరం కుడికాలువలోకి పోటెత్తుతున్నాయి. పట్టి సీమ.. ఇది 24 పంపుల ద్వారా రోజుకు 8500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్న బృహత్తర పథకం.మొత్తం రికార్డు సమయంలో 12 నెలల్లోనే పూర్తయింది. దశలుగా.. ప్రాజెక్టు ప్రయోజనాలు ముందే దక్కేందుకు వీలుగా.. * ముందు ఒక్క పంపు పూర్తి చేసి 161 రోజుల్లోనే గోదావరి నీరు ప్రకాశం బ్యారేజికి తెప్పించారు. * 2015 డిసెంబర్ నాటికి 4 పంపులు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు తడులు అందించారు. * 2016 మార్చి చివరికల్లా మొత్తం 24 పంపులూ పూర్తయ్యాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకమే లేకపోతే ప్రకాశం బ్యారేజీ వద్ద నేను నిల్చునే పరిస్థితే ఉండేది కాదు. ఈ రోజు విజయవాడకు తాగునీళ్లు దక్కుతున్నాయంటే అది పట్టిసీమ పుణ్యమే. - ఓ సందర్భంలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి అనుసంధాన ఘట్టం విజయవాడ శివారు పవిత్రసంగమం దగ్గర కృష్ణా నదిలో గోదావరి నీటిని కలుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పట్టి’ తెచ్చావులే పంటల్ని మాకు చంద్రబాబుకు రైతులు వేశారు.. పట్టిసీమ జలాలతో పండిన వరికంకుల హారం బంగారు పంటలే పండినాయి పట్టిసీమ తెచ్చిన నీటితో కృష్ణా డెల్టా పచ్చగా కళకళ లాడింది. ఇది కృష్ణాజిల్లా పెదపులిపాక లోని దృశ్యం రూ.44 వేల కోట్ల ప్రయోజనం కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రకాశం బ్యారేజీ నీటిపై దాదాపు 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2015లో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కేవలం 8.99 టీఎంసీల నీళ్లు తరలించడంతో అఖరి రోజుల్లో తడికి అవసరమైన నీటిని ఇచ్చారు. మరుసటి ఏడాది నుంచి గోదావరి నీటిపై భరోసాతో జూన్లోనే ఖరీఫ్కు నీరిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా గోదావరి నీరు వస్తుండటంతో సారవంతమైన మన్నూ వచ్చి చేరుతోందని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరాకు 40 బస్తాలు పండించిన రైతులూ ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో రూ.20 వేలకోట్ల విలువైన పంట ఉత్పత్తులు సాధించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2016 తర్వాత ఆక్వా రంగానికి నీరివ్వడం ప్రారంభించారు. చేపల ఉత్పత్తితో రూ.19 వేల కోట్లు, రొయ్యల ఉప్పత్తితో దాదాపు రూ.5000 కోట్లు ప్రయోజనం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు. తడారిన భూముల్లో సిరుల పంట పండించింది.. సాగునీటికి రైతన్నల ఎదురుచూపులు తీర్చింది.. సీమను కరవు కోరల నుంచి బయట పడేసింది.. వట్టిపోయిన చెరువులకు కొత్త జీవం తెచ్చింది.. చీనీ తోటల్లో పచ్చదనం చిగురించి ఫలసాయం అందించింది.. వలసజీవులను సొంతూళ్లకు.. అయినవాళ్లకూ దగ్గర చేసింది... పట్టిసీమ! పట్టిసీమతో భరోసా - డి.శ్రీనివాసరావు, రైతు, చల్లపల్లి, కృష్ణాజిల్లా పదేళ్ల నుంచి కాల్వల్లో నీళ్లు రాక ఇబ్బందులు పడ్డాం. బోర్ల కింద, వర్షాధారంతో పంటలు సాగు చేసి సరిగా దిగుబడులు రాక నష్టపోయాం. పట్టిసీమ ఎత్తిపోతల రాకముందు నీళ్లు వస్తాయో.. లేవో తెలియదు. కొన్నాళ్లు వంతుల వారీగా 15 రోజులకోసారి నీళ్లు ఇచ్చేవాళ్లు. ఇంజిన్లు పెట్టి తోడేసరికి ఒక్కో తడికి రూ.500 ఖర్చయ్యేది. పట్టిసీమతో సమస్యలన్నీ తీరాయి. జులై నెలకే కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తారనే నమ్మకం వచ్చింది. నాకు ఘంటసాల మండలం, మోపిదేవి మండలంలో భూములున్నాయి. మొదటి పంట వరి, రెండో పంటగా మినుములు వేశాను. ఎకరానికి 40 బస్తాల దిగుబడి సాధించా. ఏటా పంటకు భరోసా ఏర్పడింది. రెండు పంటలు పండించాం - దేవిశెట్టి సంజీవరాయుడు, బుక్కపట్నం, అనంతపురం జిల్లా పదేళ్ల నుంచి కరవు చూస్తున్నాం. బుక్కపట్నం చెరువుకు నీళ్లు వచ్చిందే లేదు. హంద్రీనీవా పథకంతో చెరువుకు రెండేళ్ల నుంచి నీళ్లు ఇస్తున్నారు. కృష్ణా జలాలు చెరువుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల భూగర్భజలాలూ పెరిగాయి. రెండు పంటలు పండించాం. పదేళ్ల కిందట వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. రాయలసీమ కరవు తీర్చిన కృష్ణమ్మ.. పట్టిసీమ నిర్మాణానికి ముందు కృష్ణనీటిపైనే ఆధారపడి డెల్టాలో పంటలు పండేవి. వరద జలాల ఆధారంగా నిర్మించిన హంద్రీనీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు నీళ్లు తీసుకునే అవకాశం లేదు. అందుకే వీటిని పూర్తి చేసే విషయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పట్టిసీమ కారణంగా కృష్ణాడెల్టాకు నీరివ్వడం ప్రారంభించాక.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తరలించడం సులభమైంది. హంద్రీనీవా ఎత్తిపోతల రెండో దశ పూర్తి చేసుకుంటూ ఒక్కో జలశయాన్ని నింపుతూ.. నీటిని ప్రస్తుతం మదనపల్లిని దాటించారు. అటు పుంగనూరు బ్రాంచి కాలువ, కుప్పం కాలువ వైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. మరోవైపు గాలేరు నగరి తొలిదశ పనులు కొలిక్కి వస్తున్నాయి. అవుకు టన్నెల్ తవ్వకంలో వచ్చిన సమస్యలను చక్కదిద్ది, గోరకల్లు సమస్యలను పరిష్కరించుకుంటూ గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచగలిగారు. పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు. కుప్పం కన్నా ముందుగానే పులివెందులకు నీళ్లు ఇస్తామని తాను ఎప్పుడో చెప్పి మాట నిలబెట్టుకున్నానని చంద్రబాబునాయుడు తరచూ చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని రైతులు సైతం తమ భూముల్లో పచ్చదనం కనిపిస్తోందని చెబుతున్నారు. కుప్పం కాలువ పనులు కొలిక్కి వచ్చాయి. కుప్పం బ్రాంచి కాలువకు ముఖ్యమంత్రి నీళ్లు వదిలారు. 5 ఏళ్లలో 451 టీఎంసీలు పట్టిసీమ ప్రభావం రాయలసీమపై ఎంతో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నాలుగేళ్లలో 314 టీఎంసీలు ఇవ్వగా గడిచిన ఐదేళ్లలో 451 టీఎంసీలు నీళ్లు ఒక్క శ్రీశైలం జలాశయం నుంచే ఇచ్చారు. తుంగభద్ర జలాశయం నుంచి సీమ జిల్లాలకు ఇచ్చిన నీరు అదనం. ఇది 250 టీఎంసీలు ఉందని లెక్కలు కట్టారు. అంతకుముందు ఐదేళ్లలో హంద్రీనీవా నుంచి కేవలం 11.13 టీఎంసీలు ఇవ్వగా ఈ ఐదేళ్లలో 119.97 టీఎంసీలు ఇవ్వగలిగారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 6.66 టీఎంసీలు సరఫరా చేశారు. గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచారు. అక్కడి నుంచి మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం జలాశయాలకు నీటిని అందించారు. కడప జిల్లాలో కొంత ఆయకట్టు స్థిరీకరించారు. మైలవరం జలాశయం కింద ఉత్తరకాల్వ, దక్షిణ కాల్వల పరిధిలో 72 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో 1999 తర్వాత 2018లోనే సాగు చేయగలిగారు. మరోవైపు కుందూ ద్వారా పెన్నాకు అక్కణ్నుంచి సోమశిలకు నీరు తరలించారు. బీడువారిన చెరువుల్లో కొత్త జలం.. జీవం! ‘సీమ’లో సిరుల పంట ‘మా చిన్నతనంలో హంద్రీనీవా కాలువకు సర్వే చేరి రాళ్లు పాతారు. కలలో కూడా ఊహించని విధంగా నీళ్లు మా ఊరికి వచ్చాయి’ అని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు గంగిరెడ్డి ‘ఈనాడు’తో అన్నారు. మదనపల్లి పట్టణానికీ తాగునీటి సమస్య తీరిందని స్థానికులు ఆనందపడుతున్నారు. ‘ఈనాడు ప్రతినిధి’ రాయలసీమ జిల్లాల్లో పర్యటించినప్పుడు కాలువల్లో నీరు చూసిన ఆనందం వారిలో కనిపించింది. కడప జిల్లా సింహాద్రిపురం, లింగాల ప్రాంతాల్లో చీనీ తోటలు పచ్చదనంతో కళకళలాడుతూ ఫలసాయం అందిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం కాలువలోకి నీళ్లు ప్రవహించాయి. చెరువుల్లో నీరు నింపడం, కాలువల్లో నీటి ప్రవాహాలతో భూగర్భజలాలు సుసంపన్నమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. * ఏళ్ల తరబడి సాగుకు దూరమైన పొలాల్లో వరి సిరులు పండాయి. పనులు లేక, వ్యవసాయం సాగక బెంగళూరు వంటి నగరాలకు వలసపోయిన రైతులు సొంతూళ్లకు తిరిగొచ్చి అరకపట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరం చెరువు 1922 ఎకరాల విస్తీర్ణం. వర్షాలు పడక పదేళ్లకోసారి నిండేది. అలాంటిది కృష్ణా జలాలతో చెరువు నింపడంతో 3000 ఎకరాల్లో వరి సాగు చేసి ఎకరానికి 40కుపైగా బస్తాల దిగుబడిని రైతులు సాధించారు. బుక్కపట్నం చెరువు నింపడంతో సమీప బోరు బావుల్లో నీళ్లు సమృద్ధిగా చేరాయి. * గొల్లపల్లి, జీడిపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలకు శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి సాయంతో నీటిని మళ్లించారు. ధర్మవరం, కొత్తచెరువు, రాప్తాడు పెద్ద చెరువులను నింపారు. దాదాపు వందల కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఫొటోలు: ఈనాడు ఫొటోగ్రాఫర్ల యంత్రాంగం
-
5 ఏళ్లు.. ఐటీ 10 రెట్లు ‘లక్ష’ణంగా ఐటీ ఉపాధి! 2012-13లో రూ.1630 కోట్ల టర్నోవర్ 2017-18లో రూ.17,500 కోట్లు ఏపీలో ప్రత్యక్షంగా 50 వేలు, పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి రాబోయే అయిదేళ్లలో మరో లక్ష మందికి ఉద్యోగాలే లక్ష్యం కాకుమాను అమర్కుమార్ ఈనాడు వాణిజ్య విభాగం చంద్రబాబు.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆకర్షించే పేరిది. కంపెనీల స్థాపనకు సానుకూల ప్రభుత్వ విధానాలు అమలు చేస్తూ, భూముల కేటాయింపుతో పాటు విద్యుత్తు, అధికవేగం బ్రాడ్బ్యాండ్ వంటి మౌలిక వసతులు, మెరుగైన సామాజిక వసతులు కల్పించడమే ఇందుకు కారణం. హైదరాబాద్లో ఐటీ రంగంలో దాదాపు 4 లక్షల మంది ఉపాధి పొందుతూ, ఏటా రూ.వేల కోట్ల సంపద సృష్టిస్తున్నారంటే, చంద్రబాబు వేసిన పునాదులే కారణం. 2014లో హైదరాబాద్ లేకుండా నవ్యాంధ్ర ఏర్పడినపుడు, మనకు ఐటీ ఉద్యోగాలు ఎలా అని యువత బెంబేలు పడటం వాస్తవం. వారికి భరోసా ఇస్తూ ‘జాబు రావాలంటే, బాబు రావాలి’ అనే నినాదంతో నాడు ఎన్నికలకు వచ్చిన చంద్రబాబుకు యువత జేజేలు పలికింది. ఈ అయిదేళ్లలో ఐటీ టర్నోవర్ను 10 రెట్లు పెంచడంతో పాటు, ఐటీ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయగలిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే ఏర్పాటైన వసతులు, ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల భరోసాతో తదుపరి అయిదేళ్లలో మరో లక్ష మందికి ఐటీ రంగమే ఉపాధి కల్పించేలా ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటూ చంద్రబాబు ముందుకొస్తున్నారు. ‘సాఫ్ట్వేర్ రంగంలో నవ్యాంధ్ర పాత్ర నామమాత్రం.. అక్కడ కాల్సెంటర్లు మాత్రమే ఉన్నాయ్..’ అంటూ ఎద్దేవా చేస్తున్న వారే ఆశ్చర్యపడేలా గత అయిదేళ్లలో ఐటీ రంగం పురోగమించింది. ఇక్కడి చదువుకున్న యువత ఉద్యోగం కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరాన్ని తప్పిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంది. తక్కువ నైపుణ్యం సరిపోయే ప్రారంభస్థాయి ఉద్యోగాలతో పాటు, అనుభవజ్ఞులకూ ఉపాధి లభించే కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. విశాఖపట్నం, అమరావతి (విజయవాడ-గుంటూరు)తో పాటు కాకినాడ, తిరుపతి వంటి పెట్టుబడిదార్లకు ఆసక్తి ఉన్న మరిన్ని ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు కృత్రిమమేధ, డిజైనింగ్, అనలిటిక్స్, పరిశోధన-అభివృద్ధికి అవసరమైన వారిని ఎక్కువగా నియమించుకుంటున్నందున, గత అయిదేళ్లలో వీటిపైనే దృష్టి కేంద్రీకరించారు. ఏర్పాటవుతున్న సంస్థల్లో 20 శాతం బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ కంపెనీలు కాగా 80 శాతం ప్రాసెసింగ్, విశ్లేషణా విధులు నిర్వహించే కంపెనీలే. ఈ కుటంబాలకు అవసరమైన విద్యా, వైద్య, వినోద సంస్థలతో భారీగా ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశ, విదేశాల్లోని పేరొందిన విద్యా-వైద్యసంస్థలు తరలి వస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, నిపుణుల లభ్యతే ఆంధ్రాకు వరం ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వంటి దిగ్గజాలు రూపొందించిన ‘భారత్ నైపుణ్యాల నివేదిక 2019’ ప్రకారం.. ఇంజినీరింగ్ ఉత్తీర్ణుల్లో ఉద్యోగ సామర్థ్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, సంబంధిత నిపుణులతో 2-3 అంచెల పట్టణాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇప్పించే ‘కాలేజ్ కనెక్ట్’ పథకాన్ని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి ఆధ్వర్యంలో అమలు చేయడం కలిసొచ్చింది. * డిగ్రీ/ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు విదేశాల్లో పీజీ చేసేందుకు ఏటా కాపు కులాల్లోని 1500 మందికి, బీసీల్లో 1500 మంది.. ఒక్కొక్కరికీ.15 లక్షల చొప్పున, ముస్లింలు 500 మందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.. కంపెనీలు స్థాపించే సత్తా కలిగిన యువనిపుణుల ఆవిర్భావానికి ఇది దోహద పడనుంది. * విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల వల్ల సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాలకు నేరుగా విమాన సదుపాయం అందుబాటులోకి రావడంతో విదేశీ ఖాతాదార్ల రాకపోకలు సులువయ్యాయి. ఐదేళ్ల ప్రగతికి ఈ గణాంకాలే సాక్ష్యం 2012-13 * 2012-13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ టర్నోవర్ రూ.64,354 కోట్లు. అందులో విశాఖ-తిరుపతి-కాకినాడ-విజయవాడల్లోని కంపెనీల నుంచి జరిగిన వ్యాపారం రూ.1629 కోట్లే. * అప్పట్లో హైదరాబాద్లో 3.20 లక్షల మంది ఉపాధి పొందుతుంటే, కోస్తా ప్రాంతాల్లో 223 సంస్థల్లో 22,000 మంది ప్రారంభస్థాయి ఉద్యోగాలు చేసేవారు. 2017-18 * 2017-18లో ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ వ్యాపారం రూ.17,500 కోట్లకు పెరిగింది. అంటే అయిదేళ్లలో 10 రెట్లకు పైగా అభివృద్ధి సాధించింది. కొత్తగా ఏర్పాటైన 219 సంస్థల్లో మరో 25,000 మంది ఉద్యోగాలు పొందారు. ఇందువల్ల పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి లభించిందని అంచనా. * కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఎస్టీపీఐ (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్క్ ఆఫ్ ఇండియా) ప్రకారమే చూసినా, 2017-18 ఆర్థిక సంవత్సర ఐటీ ఎగుమతులే రూ.750 కోట్లు దాకా ఉన్నాయి. * రాబోయే 5 ఏళ్లలో మరో లక్షమందికి ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అది సాకారమైతే పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. స్థిర విధానాలతోనే కంపెనీలు వస్తాయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన నిర్విరామ కృషితో 1998లో హైదరాబాద్లో అద్దె కార్యాలయంలో అమెరికా దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు ప్రారంభించింది. చంద్రబాబు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చి, విధానాలు స్థిరంగా ఉంటాయనే నమ్మాకే, 2002లో సొంత యూనిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తదుపరి అనేక ఇతర ఐటీ కంపెనీలు వెల్లువలా తరలి వచ్చాయి. ఇప్పుడు నవ్యాంధ్ర పరిస్థితీ ఇంతే.. చంద్రబాబు తొలి అయిదేళ్ల పాలనలో రూపొందించిన ఐటీ విధానాలు, కల్పిస్తున్న మౌలిక వసతులను కంపెనీలు అధ్యయనం చేశాక, ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతితో పాటు మరిన్ని పట్టణాలు నవీన నగరాలుగా మారే క్రమంలో డిజిటల్ వ్యవస్థలకు ఎంత గిరాకీ ఉంటుందో అంచనా వేసుకున్న సిస్కో వంటి సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. విశాఖలో * విశాఖలో జిరాక్స్ కంపెనీకి చెందిన కాండ్యుయెంట్ (1600 మంది సిబ్బంది), ఫ్రాంక్లిన్ టెంపుల్టన్తో పాటు పేటీఎం వంటి సంస్థలు కొత్తగా ఏర్పాటయ్యాయి. హెచ్ఎస్బీసీ, ఐబీఎం, విప్రో, టెక్ మహీంద్రా వంటి సంస్థలు విస్తరించనున్నాయి. కాకినాడలో సైయెంట్ కూడా వృద్ధి చెందుతోంది. విజయవాడలో * విజయవాడలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ అతిపెద్ద యూనిట్ ప్రారంభించింది. దీని అనుబంధ ఆర్థిక సేవల సంస్థ అయిన స్టేట్స్ట్రీట్ మేధ టవర్స్లో 1600 మందితో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరో 650 సీట్లకు దరఖాస్తు చేశారు. గుంటూరులో * సెమీ కండక్టర్ డిజైన్ సంస్థ ఇన్వీకస్ అత్యంత ప్రధానం కానుంది. హైఎండ్ నిపుణులు 200 మందితో ప్రస్తుతం గుంటూరులో కార్యకలాపాలు సాగిస్తోంది. నీరుకొండలో చిప్ డిజైనింగ్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంటెల్, క్వాల్కామ్, ఏఎండీ, గ్లోబల్ఫౌండ్రీస్ వంటి సంస్థలకూ ఈ పార్క్లో చోటు కల్పించాలన్నది లక్ష్యం. అవగాహనా ఒప్పందాలు జరిగాయి కూడా. * స్పెయిన్కు చెందిన గ్రూపో ఎంటర్లీన్ ఆటోమోటివ్ ఇంటీరియర్ డిజైనింగ్లో ప్రపంచ అగ్రగామి సంస్థ. హైఎండ్ నిపుణులు 150 మందితో శ్రీకారం చుట్టింది. * 3డీ యానిమేషన్, డిజైనింగ్ సంస్థ వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ 500 మందితో సేవలు అందిస్తోంది. మరో 650 మందిని నియమిస్తామని ప్రకటించింది. ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే ఇవన్నీ రవి వేమూరి, ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఛైర్మన్ అమెరికా సహా ప్రపంచంలోని అగ్రగామి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు వారిలో గుంటూరు, కృష్ణా వాసులు ఎక్కువగానే ఉన్నారు. చంద్రబాబు విధానాలపై నమ్మకంతోనే వీరు తమ ప్రాంతంలో కంపెనీలు స్థాపిస్తున్నారు. మా సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి (గుంటూరు-విజయవాడ)లో 65, విశాఖపట్నంలో 25, తిరుపతిలో 5, నెల్లూరులో 2, అనంతపురంలో 1 కంపెనీ ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన మల్టీ సర్వీసెస్ సేవల సంస్థ యూఎస్టీ గ్లోబల్, వర్చువైజేషన్ సాఫ్ట్వేర్ సంస్థ వీఎం వేర్ రానున్నాయి. సోనీ కూడా 50 శాతం వీఎఫ్ఎక్స్ పనిని స్థానికంగా కేటాయించేందుకు అంగీకరించింది. మేధా టవర్స్ రెండోదశలో హ్యూలెట్ ప్యాకార్డ్కు చెందిన ప్రాసెసింగ్ సేవల సంస్థ డీఎక్స్సీ రానుంది. చంద్రబాబు ఈ ఎన్నికలలో విజయం సాధించగానే, వచ్చే ఏడాదిలో దిగ్గజ కంపెనీలన్నీ యూనిట్లు స్థాపిస్తాయ్.
-
HCL Technologies IT SEZ (Special Economic Zone)
sonykongara replied to sonykongara's topic in Politics and Daily News
-
నవయుగ కంటైనర్ టెర్మినల్ రికార్డు 29-03-2019 02:51:51 హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నెల్లూరులోని నవయుగ కంటైనర్ టెర్మినల్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టిఇయుల వస్తురవాణా సాధించి సరికొత్త మైలురాయిని చేరింది. ఎంవీ ఎస్ఎ్సఎస్ కచ్ నౌక ద్వారా ఈ రికార్డును సాధించినట్టు టెర్మినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితేంద్ర నిమ్మగడ్డ తెలిపారు. 2013-14లో 58,577 టిఇయుల వస్తురవాణాతో ప్రారంభమైన ఈ టెర్మినల్ ఐదేళ్ళ కాలంలో 9 రెట్లు వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. ఈ రికార్డును సాధించడం ద్వారా తూర్పు కోస్తాలో ఎన్సీటీ ఒక ట్రాన్షి్పమెంట్ హబ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని కృష్ణపట్లం పోర్టు సీఈఓ, డైరెక్టర్ అనిల్ యెండ్లూరి అభినందించారు.
-
https://www.youtube.com/watch?v=P1N4rNi53Ns
-
-