sonykongara Posted October 11, 2024 Author Posted October 11, 2024 Polavaram: పోలవరానికి ₹ 2,348 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. Updated : 11 Oct 2024 07:40 IST అడ్వాన్సుగా విడుదల అందులో 75% ఖర్చు చేస్తేనే తదుపరి నిధులు నిర్దేశిత పనులకే వాటిని వినియోగించాలి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ధ్రువీకరణ తప్పనిసరి కేంద్ర జల శక్తి శాఖ షరతులు మరో రూ.459 కోట్లు రీయింబర్స్మెంట్ ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాకు సర్దుబాటు చేయాలని సీనియర్ జాయింట్ కమిషనర్ డీసీ భట్ దిల్లీలోని ప్రిన్సిపల్ ఎకౌంట్్్స అధికారికి లేఖ రాశారు. రెండు రోజుల కిందట ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకోగా దానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలిచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లోని కంటింజెన్సీ ఫండ్ నుంచి అడ్వాన్సుగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. నాబార్డు రుణం ద్వారా కాకుండా కేంద్ర బడ్జెట్ నుంచే నిధులిస్తున్నారు. దీంతోపాటు మరో రెండు కేటగిరీల కింద కూడా గతంలో చేసిన ప్రాజెక్టు పనులకు కేంద్ర జల శక్తి శాఖ.. నిధులు రీయింబర్స్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక కేటగిరీలో రూ.383.227 కోట్లు, మరో కేటగిరీలో రూ.76.463 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.2,807 కోట్లు విడుదలయ్యాయి. షరతులు ఇవీ.. పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్సుగా నిధులిచ్చేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దీనికి కొన్ని షరతులు విధించింది. ప్రస్తుతం ఇచ్చిన రూ.2,348 కోట్లలో 75 శాతం నిధులు ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేస్తాం. తదుపరి విడత నిధులు విడుదల చేయాలంటే నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పోలవరం నిర్మాణ పనులు జరగాలి. ఆలస్యమైతే స్పష్టమైన కారణాలు గుర్తించాలి. చక్కదిద్దేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల శక్తి శాఖకు తెలియజేయాలి. పోలవరం పనులు పూర్తి చేసేందుకు సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన నిర్మాణ షెడ్యూల్ను ఒప్పందంలో పొందుపర్చాలి. ఇప్పుడిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులను ఒప్పందంలో పేర్కొన్న పనులకే వెచ్చించాలి. నిర్దేశిత పనులకే ఆ నిధులు వినియోగించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. వాటిని కేంద్ర జలశక్తిశాఖకు పంపాలి. ఈ నిధులకు సంబంధించిన ఖాతాలు కాగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలి. ప్రతి త్రైమాసికంలో ప్రాజెక్టు ఆర్థిక పురోగతిపై కేంద్రానికి అథారిటీ నివేదికలు సమర్పించాలి Mobile GOM 1
sonykongara Posted November 8, 2024 Author Posted November 8, 2024 Polavaram: ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. Published : 08 Nov 2024 05:52 IST డిజైన్లపై లోతైన చర్చ నిర్మాణానికి మరీ 15 నెలలా? ప్రశ్నించిన విదేశీ నిపుణులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న బావర్ నేడు పోలవరం ప్రధాన డ్యాంపై చర్చలు ఈనాడు - అమరావతి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ మధ్యలో ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేందుకు వీలుగా ఆఫ్రి కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించగా గురువారం చర్చల్లో ఈ విషయాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మేధోమథనం రెండోరోజు కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లపై ఉదయం నుంచి సాయంత్రం వరకు, తర్వాత నిర్మాణ షెడ్యూలుపై చర్చించారు. కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరణ్ అధ్యక్షతన విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ, సేన్ డగ్లస్ హించ్బెర్గర్, డేవిడ్ పాల్, డి సిస్కో, పోలవరం అథారిటీ సీఈఓ అతుల్ జైన్, కార్యదర్శి రఘురామ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు నరసింహమూర్తి, ఆఫ్రి సంస్థ ప్రతినిధులు, బావర్, మేఘా ప్రతినిధులు, వివిధ కేంద్రసంస్థల అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీకి చెందిన ప్రధాన డిజైనర్ కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు సిద్ధం చేశారు. ఆయన విదేశాల నుంచి గురువారమే పోలవరం వచ్చారు. కొత్త డయాఫ్రం వాల్ మరింత ప్లాస్టిసిటీ ఉండేలా నిర్మించాలని విదేశీ నిపుణులు సూచించారు. ప్లాస్టిక్ కాంక్రీటుతో ఈ నిర్మాణం ఉంటుంది. డిజైన్లపై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలు కోరారు. వాటిని ఆఫ్రి సంస్థ సమర్పిస్తామని పేర్కొంది. గురువారం రాత్రి ఆ సమాచారమూ విశ్లేషిస్తామని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. డిజైన్లపై ఆఫ్రి ఒక ప్రజంటేషన్ ఇచ్చింది. డ్యాం ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ఠ స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు ఇలా వివిధ కోణాల్లో చేసిన విశ్లేషణలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణంపై సమీక్షిస్తున్న విదేశీ నిపుణులు అంత గడువు ఎందుకు? కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు 15 నెలల సమయం పడుతుందని నిర్మాణ ఏజెన్సీ బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. గతంలో రెండు కట్టర్లనే ఉపయోగించి నిర్మించారు. వరదల సమయంలో మూడు నెలల పాటు నిర్మాణ పనులూ నిలిపివేశారు. అప్పట్లోనే ఇంత సమయం పట్టలేదు. ఇప్పుడు మూడు కట్టర్లతో పనులు చేస్తుంటే అంత గడువెందుకని ప్రశ్నించారు. యంత్రసామగ్రి పెరిగినంత మాత్రాన నిర్మాణ గడువు తగ్గేందుకు ఆస్కారం లేదని వారు పేర్కొన్నారు. షెడ్యూలు 15 నెలలకు ఇచ్చినా ఇంకా ముందే పూర్తిచేస్తామని వారు వివరించారు. నేడు ప్రధాన డ్యాంపై చర్చ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూలుపై శుక్రవారం చర్చ జరగనుంది. ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ సమాంతరంగా నిర్మించుకోవచ్చా? డయాఫ్రం వాల్ నిర్మాణం తర్వాతే ప్రధాన డ్యాం నిర్మించుకోవాల్సి ఉంటుందా అన్న అంశాలు ఈ చర్చలోకి వస్తాయి. ఈ చర్చల అనంతరం విదేశీ నిపుణుల బృందం, ముఖ్యమైన అధికారులు, కేంద్ర జలసంఘం ఛైర్మన్తో విడిగా సమావేశమవుతారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ మూడు రోజుల చర్చల విషయాలు ఆయనకు నివేదించి కీలకాంశాలపై ఆయనతో చర్చిస్తారు. తర్వాత కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ప్రధానంగా నాలుగోరోజు కీలకమైన నాణ్యత నియంత్రణ అంశాలపై చర్చించనున్నారు.
sonykongara Posted November 8, 2024 Author Posted November 8, 2024 Polavaram: ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. Published : 08 Nov 2024 05:52 IST డిజైన్లపై లోతైన చర్చ నిర్మాణానికి మరీ 15 నెలలా? ప్రశ్నించిన విదేశీ నిపుణులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న బావర్ నేడు పోలవరం ప్రధాన డ్యాంపై చర్చలు ఈనాడు - అమరావతి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ మధ్యలో ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేందుకు వీలుగా ఆఫ్రి కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించగా గురువారం చర్చల్లో ఈ విషయాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మేధోమథనం రెండోరోజు కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లపై ఉదయం నుంచి సాయంత్రం వరకు, తర్వాత నిర్మాణ షెడ్యూలుపై చర్చించారు. కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరణ్ అధ్యక్షతన విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ, సేన్ డగ్లస్ హించ్బెర్గర్, డేవిడ్ పాల్, డి సిస్కో, పోలవరం అథారిటీ సీఈఓ అతుల్ జైన్, కార్యదర్శి రఘురామ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు నరసింహమూర్తి, ఆఫ్రి సంస్థ ప్రతినిధులు, బావర్, మేఘా ప్రతినిధులు, వివిధ కేంద్రసంస్థల అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీకి చెందిన ప్రధాన డిజైనర్ కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు సిద్ధం చేశారు. ఆయన విదేశాల నుంచి గురువారమే పోలవరం వచ్చారు. కొత్త డయాఫ్రం వాల్ మరింత ప్లాస్టిసిటీ ఉండేలా నిర్మించాలని విదేశీ నిపుణులు సూచించారు. ప్లాస్టిక్ కాంక్రీటుతో ఈ నిర్మాణం ఉంటుంది. డిజైన్లపై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలు కోరారు. వాటిని ఆఫ్రి సంస్థ సమర్పిస్తామని పేర్కొంది. గురువారం రాత్రి ఆ సమాచారమూ విశ్లేషిస్తామని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. డిజైన్లపై ఆఫ్రి ఒక ప్రజంటేషన్ ఇచ్చింది. డ్యాం ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ఠ స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు ఇలా వివిధ కోణాల్లో చేసిన విశ్లేషణలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణంపై సమీక్షిస్తున్న విదేశీ నిపుణులు అంత గడువు ఎందుకు? కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు 15 నెలల సమయం పడుతుందని నిర్మాణ ఏజెన్సీ బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. గతంలో రెండు కట్టర్లనే ఉపయోగించి నిర్మించారు. వరదల సమయంలో మూడు నెలల పాటు నిర్మాణ పనులూ నిలిపివేశారు. అప్పట్లోనే ఇంత సమయం పట్టలేదు. ఇప్పుడు మూడు కట్టర్లతో పనులు చేస్తుంటే అంత గడువెందుకని ప్రశ్నించారు. యంత్రసామగ్రి పెరిగినంత మాత్రాన నిర్మాణ గడువు తగ్గేందుకు ఆస్కారం లేదని వారు పేర్కొన్నారు. షెడ్యూలు 15 నెలలకు ఇచ్చినా ఇంకా ముందే పూర్తిచేస్తామని వారు వివరించారు. నేడు ప్రధాన డ్యాంపై చర్చ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూలుపై శుక్రవారం చర్చ జరగనుంది. ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ సమాంతరంగా నిర్మించుకోవచ్చా? డయాఫ్రం వాల్ నిర్మాణం తర్వాతే ప్రధాన డ్యాం నిర్మించుకోవాల్సి ఉంటుందా అన్న అంశాలు ఈ చర్చలోకి వస్తాయి. ఈ చర్చల అనంతరం విదేశీ నిపుణుల బృందం, ముఖ్యమైన అధికారులు, కేంద్ర జలసంఘం ఛైర్మన్తో విడిగా సమావేశమవుతారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ మూడు రోజుల చర్చల విషయాలు ఆయనకు నివేదించి కీలకాంశాలపై ఆయనతో చర్చిస్తారు. తర్వాత కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ప్రధానంగా నాలుగోరోజు కీలకమైన నాణ్యత నియంత్రణ అంశాలపై చర్చించనున్నారు.
sonykongara Posted November 8, 2024 Author Posted November 8, 2024 Polavaram: ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. Published : 08 Nov 2024 05:52 IST డిజైన్లపై లోతైన చర్చ నిర్మాణానికి మరీ 15 నెలలా? ప్రశ్నించిన విదేశీ నిపుణులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న బావర్ నేడు పోలవరం ప్రధాన డ్యాంపై చర్చలు ఈనాడు - అమరావతి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ మధ్యలో ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేందుకు వీలుగా ఆఫ్రి కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించగా గురువారం చర్చల్లో ఈ విషయాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మేధోమథనం రెండోరోజు కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లపై ఉదయం నుంచి సాయంత్రం వరకు, తర్వాత నిర్మాణ షెడ్యూలుపై చర్చించారు. కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరణ్ అధ్యక్షతన విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ, సేన్ డగ్లస్ హించ్బెర్గర్, డేవిడ్ పాల్, డి సిస్కో, పోలవరం అథారిటీ సీఈఓ అతుల్ జైన్, కార్యదర్శి రఘురామ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు నరసింహమూర్తి, ఆఫ్రి సంస్థ ప్రతినిధులు, బావర్, మేఘా ప్రతినిధులు, వివిధ కేంద్రసంస్థల అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీకి చెందిన ప్రధాన డిజైనర్ కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు సిద్ధం చేశారు. ఆయన విదేశాల నుంచి గురువారమే పోలవరం వచ్చారు. కొత్త డయాఫ్రం వాల్ మరింత ప్లాస్టిసిటీ ఉండేలా నిర్మించాలని విదేశీ నిపుణులు సూచించారు. ప్లాస్టిక్ కాంక్రీటుతో ఈ నిర్మాణం ఉంటుంది. డిజైన్లపై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలు కోరారు. వాటిని ఆఫ్రి సంస్థ సమర్పిస్తామని పేర్కొంది. గురువారం రాత్రి ఆ సమాచారమూ విశ్లేషిస్తామని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. డిజైన్లపై ఆఫ్రి ఒక ప్రజంటేషన్ ఇచ్చింది. డ్యాం ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ఠ స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు ఇలా వివిధ కోణాల్లో చేసిన విశ్లేషణలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణంపై సమీక్షిస్తున్న విదేశీ నిపుణులు అంత గడువు ఎందుకు? కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు 15 నెలల సమయం పడుతుందని నిర్మాణ ఏజెన్సీ బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. గతంలో రెండు కట్టర్లనే ఉపయోగించి నిర్మించారు. వరదల సమయంలో మూడు నెలల పాటు నిర్మాణ పనులూ నిలిపివేశారు. అప్పట్లోనే ఇంత సమయం పట్టలేదు. ఇప్పుడు మూడు కట్టర్లతో పనులు చేస్తుంటే అంత గడువెందుకని ప్రశ్నించారు. యంత్రసామగ్రి పెరిగినంత మాత్రాన నిర్మాణ గడువు తగ్గేందుకు ఆస్కారం లేదని వారు పేర్కొన్నారు. షెడ్యూలు 15 నెలలకు ఇచ్చినా ఇంకా ముందే పూర్తిచేస్తామని వారు వివరించారు. నేడు ప్రధాన డ్యాంపై చర్చ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూలుపై శుక్రవారం చర్చ జరగనుంది. ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ సమాంతరంగా నిర్మించుకోవచ్చా? డయాఫ్రం వాల్ నిర్మాణం తర్వాతే ప్రధాన డ్యాం నిర్మించుకోవాల్సి ఉంటుందా అన్న అంశాలు ఈ చర్చలోకి వస్తాయి. ఈ చర్చల అనంతరం విదేశీ నిపుణుల బృందం, ముఖ్యమైన అధికారులు, కేంద్ర జలసంఘం ఛైర్మన్తో విడిగా సమావేశమవుతారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ మూడు రోజుల చర్చల విషయాలు ఆయనకు నివేదించి కీలకాంశాలపై ఆయనతో చర్చిస్తారు. తర్వాత కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ప్రధానంగా నాలుగోరోజు కీలకమైన నాణ్యత నియంత్రణ అంశాలపై చర్చించనున్నారు.
sonykongara Posted November 8, 2024 Author Posted November 8, 2024 Polavaram: ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. Published : 08 Nov 2024 05:52 IST డిజైన్లపై లోతైన చర్చ నిర్మాణానికి మరీ 15 నెలలా? ప్రశ్నించిన విదేశీ నిపుణులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న బావర్ నేడు పోలవరం ప్రధాన డ్యాంపై చర్చలు ఈనాడు - అమరావతి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రం వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ మధ్యలో ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేందుకు వీలుగా ఆఫ్రి కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించగా గురువారం చర్చల్లో ఈ విషయాన్ని సూత్రప్రాయంగా ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మేధోమథనం రెండోరోజు కీలకమైన అంశాలపై చర్చలు జరిగాయి. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లపై ఉదయం నుంచి సాయంత్రం వరకు, తర్వాత నిర్మాణ షెడ్యూలుపై చర్చించారు. కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరణ్ అధ్యక్షతన విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ, సేన్ డగ్లస్ హించ్బెర్గర్, డేవిడ్ పాల్, డి సిస్కో, పోలవరం అథారిటీ సీఈఓ అతుల్ జైన్, కార్యదర్శి రఘురామ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు నరసింహమూర్తి, ఆఫ్రి సంస్థ ప్రతినిధులు, బావర్, మేఘా ప్రతినిధులు, వివిధ కేంద్రసంస్థల అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీకి చెందిన ప్రధాన డిజైనర్ కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు సిద్ధం చేశారు. ఆయన విదేశాల నుంచి గురువారమే పోలవరం వచ్చారు. కొత్త డయాఫ్రం వాల్ మరింత ప్లాస్టిసిటీ ఉండేలా నిర్మించాలని విదేశీ నిపుణులు సూచించారు. ప్లాస్టిక్ కాంక్రీటుతో ఈ నిర్మాణం ఉంటుంది. డిజైన్లపై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలు కోరారు. వాటిని ఆఫ్రి సంస్థ సమర్పిస్తామని పేర్కొంది. గురువారం రాత్రి ఆ సమాచారమూ విశ్లేషిస్తామని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. డిజైన్లపై ఆఫ్రి ఒక ప్రజంటేషన్ ఇచ్చింది. డ్యాం ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ఠ స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు ఇలా వివిధ కోణాల్లో చేసిన విశ్లేషణలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణంపై సమీక్షిస్తున్న విదేశీ నిపుణులు అంత గడువు ఎందుకు? కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు 15 నెలల సమయం పడుతుందని నిర్మాణ ఏజెన్సీ బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. గతంలో రెండు కట్టర్లనే ఉపయోగించి నిర్మించారు. వరదల సమయంలో మూడు నెలల పాటు నిర్మాణ పనులూ నిలిపివేశారు. అప్పట్లోనే ఇంత సమయం పట్టలేదు. ఇప్పుడు మూడు కట్టర్లతో పనులు చేస్తుంటే అంత గడువెందుకని ప్రశ్నించారు. యంత్రసామగ్రి పెరిగినంత మాత్రాన నిర్మాణ గడువు తగ్గేందుకు ఆస్కారం లేదని వారు పేర్కొన్నారు. షెడ్యూలు 15 నెలలకు ఇచ్చినా ఇంకా ముందే పూర్తిచేస్తామని వారు వివరించారు. నేడు ప్రధాన డ్యాంపై చర్చ పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూలుపై శుక్రవారం చర్చ జరగనుంది. ప్రధాన డ్యాం, డయాఫ్రం వాల్ సమాంతరంగా నిర్మించుకోవచ్చా? డయాఫ్రం వాల్ నిర్మాణం తర్వాతే ప్రధాన డ్యాం నిర్మించుకోవాల్సి ఉంటుందా అన్న అంశాలు ఈ చర్చలోకి వస్తాయి. ఈ చర్చల అనంతరం విదేశీ నిపుణుల బృందం, ముఖ్యమైన అధికారులు, కేంద్ర జలసంఘం ఛైర్మన్తో విడిగా సమావేశమవుతారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ మూడు రోజుల చర్చల విషయాలు ఆయనకు నివేదించి కీలకాంశాలపై ఆయనతో చర్చిస్తారు. తర్వాత కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ప్రధానంగా నాలుగోరోజు కీలకమైన నాణ్యత నియంత్రణ అంశాలపై చర్చించనున్నారు.
sonykongara Posted December 17, 2024 Author Posted December 17, 2024 olavaram: 2027 డిసెంబరుకు పోలవరం ‘పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబరుకు పూర్తవుతుంది అంటున్నారు. 2026 అక్టోబరు నుంచే నీటిని నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాం. ఒకేసారి కాకుండా దశలవారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. By Andhra Pradesh News DeskUpdated : 17 Dec 2024 06:55 IST 2026 అక్టోబరు నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తాం దశల వారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి కేంద్రంతో చర్చించాక తుది కార్యాచరణ ఖరారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి అమరావతి, పోలవరం రెండు కళ్లు ఆ రెండు కళ్లు పొడిచేసి ఏపీని అంధకారం చేశారు ప్రాజెక్టు రెండో దశ లెక్కలు అంచనా వేసి కేంద్రానికి లేఖ ఆ నిధులూ సాధిస్తాం: సీఎం వ్యాఖ్యలు పోలవరం నుంచి ఈనాడు ప్రతినిధి గ్యాప్-2లోని గైడ్వాల్ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. చిత్రంలో మంత్రి రామానాయుడు ‘పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబరుకు పూర్తవుతుంది అంటున్నారు. 2026 అక్టోబరు నుంచే నీటిని నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాం. ఒకేసారి కాకుండా దశలవారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం కార్యాచరణ ప్రకటించారు. ‘ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశాం. మా మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దిల్లీ వెళ్లి కేంద్రజల్ శక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళిక వివరిస్తారు. విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జలసంఘంతో చర్చిస్తారు. వారి అభిప్రాయాలు తీసుకుంటారు. తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుంది’ అని సీఎం వెల్లడించారు. ఇదీ పోలవరం కార్యాచరణ 2025 డిసెంబరుకు కొత్త డయాఫ్రం వాల్ పూర్తి చేయాలని చెప్పాం. ప్రధాన డ్యాం గ్యాప్ 2 పనులు 2027 డిసెంబరుకు పూర్తవుతాయి. 2026 అక్టోబరు నుంచి నీళ్లు నిల్వ చేయడం ప్రారంభించేలా పనులు పూర్తి చేస్తారు. కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం సమాంతరంగా నిర్మించే అంశం పరిశీలిస్తున్నాం. ఎడమ, కుడి కాలువల అనుసంధాన పనులు ఏడాదిన్నరలో పూర్తి. అప్రోచ్ ఛానల్ 2026 జూన్ లోపు, స్పిల్ ఛానల్ 2027 జులైకి, పైలట్ ఛానల్ 2027 మే నాటికి పూర్తి. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2027 ఫిబ్రవరి, ఎగ్జిట్ ఛానల్ 2027 ఏప్రిల్కు, టన్నెల్ 2027 ఫిబ్రవరికి పూర్తి. ట్విన్ టన్నెల్స్ 2026 చివరికి పూర్తి. భూసేకరణ 16 వేల ఎకరాలకు పైగా ఉంది. 2025 ఏప్రిల్కు పూర్తి చేస్తారు. 901 కొండ నుంచి డ్యాంకు అవసరమైన మెటీరియల్ తెచ్చుకోవాలి. తక్షణమే అనుమతులు తీసుకుని పని ప్రారంభించమన్నాం. హెలిప్యాడ్ వద్ద ఉన్న ఏరియల్ వ్యూ పాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టును వీక్షిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు.. చిత్రంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, అధికారులు విధ్వంసం వల్ల రూ.10 వేల కోట్లపైగా నష్టం ‘జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న విధ్వంసం వల్ల రూ.10 వేల నుంచి 15 వేల కోట్ల నష్టం వాటిల్లింది. కొత్త డయాఫ్రం వాల్కు అదనంగా రూ.900 కోట్లు ఖర్చు, అగాథాలు పడటం వల్ల వైబ్రో కాంపాక్షన్ పనులకు రూ.836కోట్లు, ఇసుక నింపేందుకు రూ.312 కోట్లు, కాఫర్ డ్యాంల సీపేజీతో నీరు నిల్వ వల్ల అది ఎత్తిపోసేందుకు రూ.211 కోట్లు ఖర్చు. ప్రత్యక్షంగా రూ.2,400 కోట్లు అదనపు భారం అయితే పరోక్ష భారం కూడా ఉంది. తెదేపా ప్రభుత్వం ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేది. ప్రాజెక్టు నిర్మాణం కుంటు పడటం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం రాకుండాపోయింది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు నష్టపోయినట్లే. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం రూ.8,242 కోట్లు ఇస్తే అందులో రూ.2,344 కోట్లు మళ్లించేశారు. మరో రూ.2 వేల కోట్ల భారం పెట్టి వెళ్లిపోయారు. రెండుదశలు, 41.15 మీటర్ల ఎత్తుకు లేఖ ఇచ్చింది జగనే పోలవరంలో తొలుత రెండు దశలు లేవు. ఆ రెండు దశలని లేఖ ఇచ్చి 41.15 మీటర్లకు తొలి దశ నిధులు ఇవ్వాలని లేఖ ఇచ్చింది జగనే. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మళ్లీ పూర్తి ప్రాజెక్టుకే నిధులు ఇమ్మంటే ఆలస్యమవుతుందని తొలుత తొలిదశకు నిధులు ఇచ్చేయమన్నాం. జగన్ చేసిన పాపం వల్లే ఈ సమస్య వచ్చింది. గ్యాప్-2లో కొనసాగుతున్న గైడ్వాల్ పనులు ప్రజలే జగన్కు పనిష్మెంట్ ఇచ్చారు ‘ఈ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడ్డా. దిల్లీకి తిరిగా, నీతి ఆయోగ్తో మాట్లాడి రాష్ట్రానికి వచ్చేలా చేశాం. జాతీయ ప్రాజెక్టులు 20, 30 ఏళ్లుగా పూర్తి కాలేదు. నీతి ఆయోగ్ రాష్ట్రానికి ఇమ్మని సిఫార్సు చేస్తే మేం తీసుకున్నామని విమర్శించారు. పునరావాసం నిధుల కోసం అరుణ్ జైట్లీ, గడ్కరీతో వాదించి సాధించాం. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది. బాధ, కోపం కలుగుతున్నాయి. అవగాహన రాహిత్యం, అవినీతి, అసమర్థత, కుట్ర వల్ల జగన్ ప్రభుత్వం దీనిని ఇలా చేసేసింది. మళ్లీ ప్రాజెక్టును గాడిన పెడుతున్నా. అది నా బాధ్యత ’ అని చంద్రబాబు చెప్పారు. ‘పోలవరంలో జరిగిన తప్పులు రాజకీయపరమైనవి. ప్రజలే జగన్కు పనిష్మెంట్ ఇచ్చారు. 11 సీట్లకు తగ్గించారు. ఆ సీట్లూ రావడం కరక్టో కాదో, అది వేరే విషయం.’ అని చంద్రబాబు అన్నారు. రెండు కళ్లూ పొడిచేశారు: బాగా ఆదాయం వచ్చే హైదరాబాద్ రాష్ట్ర విభజనలో తెలంగాణకు వెళ్లింది. అందుకే అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తామని చట్టంలో పెట్టింది. ఇవి రెండూ పూర్తయి ఉంటే ఏపీ, తెలంగాణ కుడి, ఎడమలుగా ఒకే స్థాయిలో వెళ్లేవి. గత 5 ఏళ్ల పాలన వల్ల ఏపీ అథఃపాతాళానికి వెళ్లింది. హైదరాబాద్ వల్ల తెలంగాణ తలసరి ఆదాయమే దేశంలో ఎక్కువ. అమరావతి, పోలవరం రెండూ పూర్తి చేయాలని ఎంతో కష్టపడ్డా. ఆ రెండూ రాష్ట్రానికి రెండు కళ్లు. ఆ రెండు కళ్లను జగన్ పొడిచేసి రాష్ట్రాన్ని అంధకారం చేశారు’ అని సీఎం అన్నారు. పోలవరాన్ని అందరూ సందర్శించవచ్చు. ఇక్కడ ఏం జరుగుతోందో అందరూ తెలుసుకోవాలి. అందరూ దర్శించేలా ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించారు. మరింత ముందుకు పోలవరం కార్యాచరణ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం పోలవరం నుంచి ఈనాడు ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టు కార్యాచరణను మరింత ముందుకు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జలవనరులశాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ప్రతినిధులు కలిసి చర్చించి ఈ ప్రాజెక్టు ఎప్పటికి ఎలా పూర్తి చేయనున్నారో కార్యాచరణ సిద్ధం చేశారు. సీఎం సోమవారం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ షెడ్యూలు ప్రకటించేందుకే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు సాయిప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు నరసింహమూర్తితో పాటు మేఘా నుంచి సుబ్బయ్య తదితరులతో చర్చించారు. ప్రతి పనిని మరింత ముందుగా పూర్తి చేయాలని, అందుకు తగ్గట్టుగా పనుల వేగం పెంచాలని ఆదేశించారు. 2027 డిసెంబరు నాటికి ప్రధాన డ్యాం రెండో భాగం పనులు పూర్తి చేయడంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఎలాగూ ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తున, 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించారు. అందువల్ల 2026 అక్టోబరు నుంచే ప్రధాన డ్యాం కొంత ఎత్తుకు నిర్మాణం అయిన తర్వాత ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. అవసరమయితే కుడి, ఎడమ వైపుల నుంచి నీళ్లు ఇచ్చేలా ప్రయత్నిద్దామన్నారు. అలా చేస్తే వచ్చే సీపేజీ సమస్యలపైనా చర్చ జరిగింది. పునరావాసంపై ప్రత్యేకం.. పోలవరం పునరావాసంపై ప్రత్యేకంగా చర్చించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అవసరమైన, ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని సీఎం చెప్పారు. పునరావాసం కోసం ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తామని వెల్లడించారు. 2026 నాటికి 41.15 మీటర్ల స్థాయికి పునరావాసం పూర్తి చేయాలన్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం పర్యటనలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, ఎంపీ పుట్టా మహేష్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now