Jump to content

Recommended Posts

Posted

SpiceJet has introduced new NON STOP DAILY flight between MUMBAI - VIJAYAWADA - MUMBAI from May 26, 2019

- It is 1st DAILY Flight to Financial Capital of India from VGA

- Overall 2nd Flight b/w VGA-BOM

- Totally 10 Flights /Week b/w VGA-BOM from May 26

- SG Operating B737

https://pbs.twimg.com/media/D7LZ-TjUcAAXecu.jpg

https://pbs.twimg.com/media/D7LZ_IBUYAAQT9q.jpg

Posted
10 minutes ago, Yaswanth526 said:

SpiceJet has introduced new NON STOP DAILY flight between MUMBAI - VIJAYAWADA - MUMBAI from May 26, 2019

- It is 1st DAILY Flight to Financial Capital of India from VGA

- Overall 2nd Flight b/w VGA-BOM

- Totally 10 Flights /Week b/w VGA-BOM from May 26

- SG Operating B737

https://pbs.twimg.com/media/D7LZ-TjUcAAXecu.jpg

https://pbs.twimg.com/media/D7LZ_IBUYAAQT9q.jpg

Business Tycoon Jagan CM avagane vesthunnara Mumbai ki :peepwall:

  • 5 weeks later...
  • 3 weeks later...
Posted

https://www.andhrajyothy.com/artical?SID=846855

రూ.130 కోట్లు ఇవ్వండి
14-07-2019 09:10:51
 
 
  • కలెక్టర్‌, జేసీ చొరవ
  • గన్నవరం రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు 
  • సత్వరం నిధుల విడుదలకు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి నివేదిక
విజయవాడ: నవ్యాంధ్రకు తలమానికంగా నిలుస్తున్న విజయవాడ విమానాశ్రయ విస్తరణకు గన్న వరం ప్రాంత రైతులు 700 ఎకరాలకు పైగా భూములు సమీకరణ విధానంలో అప్పగిం చారు. ప్రభుత్వం ఆ భూములను ఎయిర్‌పోర్టు అథారి టీకి అప్పగించింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆ భూముల్లో రన్‌వే విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు చేపడుతోంది. భూములు ఇచ్చిన రైతుల సమస్యలు మాత్రం ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.
 
 
రైతులు శాంతిస్తే కానీ విజయవాడ విమానాశ్రయ రన్‌వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించని పరిస్థితి ఏర్పడింది. రన్‌వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తేనే విజయవాడ విమా నాశ్రయం బైలేట్రల్‌ ట్రాఫిక్స్‌ రైట్స్‌ సాధించ టానికి దోహదపడు తుంది. అప్పుడే విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు బేషరతుగా రాకపోకలు సాగిస్తాయి.
 
 
ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న గన్నవరం ప్రాంత విమానాశ్రయ విస్తరణ బాధితుల సమ స్యపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కలెక్టర్‌ ఎండి ఇంతియాజ్‌ మొదలు జేసీ మాధ వీలత వరకు అందరూ కొత్తగా వచ్చినప్పటికీ అతి త్వరలోనే సమస్యలను అధ్య యనం చేశారు. ఈ సమస్యలకు సంబంధించి కలెక్టర్‌ ఎన్నికల ముందుగానే రోడ్‌ మ్యాప్‌ ను తయారు చేయటానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశారు. జేసీగా మాధవీలత వచ్చిన తర్వాత భూముల అంశాలపై తనకు ఉన్న అవగాహన ద్వారా కలెక్టర్‌ కోరుకున్న ప్రకారం ఆమె రోడ్‌ మ్యాప్‌ రూపొందించారు. ఆమె పలు దఫాలు గన్నవరం ప్రాంతానికి వచ్చారు. నేరుగా రైతు లతో మాట్లాడారు. గతంలో పనిచేసిన అధికా రులకు భిన్నంగా ఆమె రైతులతో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సార్లు సమావేశ మ య్యారు. విమానాశ్రయ విస్తరణకు భూము లిచ్చిన రైతులతో పాటు, ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, ప్లాట్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం, నిర్మాణాలకు ఆస్కారం లేని భూములుగా మారిపోయిన వారి ఇబ్బం దులు, భూములు ఉండీ ప్రయోజనం లేని ఉన్న వారి ఇబ్బందులను పరిష్కరించటానికి వీలుగా జేసీ ఒక కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు రూ.130 కోట్ల అంచనాలను రూపొందించారు.
 
 
ఈ అంచనాలను పరిశీలిస్తే.. ప్రధానంగా అర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి సింహ భాగం నిధుల అవసరం ఏర్పడింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా బుద్ధవరం, దావా జీగూడెం, అల్లాపురం ప్రాంతాల్లో ఇళ్లు కోల్పో యిన వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇళ్లు కట్టి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం చిన అవుటపల్లి గ్రామంలో 49.5 ఎకరాలను జిల్లా యంత్రాంగం సేకరిం చింది. ఈ భూములను లే అవుట్‌ వేయటం జరిగింది. వాటిలో మౌలిక సదుపాయాల కల్ప న పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఏ పద్ధతితో ఇళ్లను నిర్మించాలన్న దానిపై కొన్ని మోడళ్లు రూపొం దించుకుని ఐ అండ్‌ ఐ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌తో కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలత కొద్ది రోజుల కిందట భేటీ అయ్యారు. దీంతో పాటు విమానాశ్రయ విస్తర ణలో భాగంగా ప్రైవేటు వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారివి కూడా సమీకరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారికి ప్లాట్‌ టు ప్లాట్‌ ఇవ్వటానికి వీలుగా అజ్జంపూడిలో భూ సేకరణ జరిపారు. ఇంత వరకు బాగానే ఉంది. ఈ లే అవుట్‌ను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిం చాల్సి ఉంది. ఈ రెండు సమస్యలు కాకుండా నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌ (ఎన్‌సీజడ్‌) పరిధిలోకి 16 మంది బాధితులు చేరారు. తమ కు ఉన్న భూములకు సంబంధించి వారు ఎలాం టి నిర్మాణాలు చేపట్టకూడదు కాబట్టి ఉప యోగకరం లేని భూములను స్వాధీనం చేస్తా మని, పరిహారం చెల్లించమని కోరుతున్నారు.
 
 
అదే విధంగా విమానాశ్రయ రిస్ర్టిక్ట్‌డ్‌ జోన్‌ పరిధిలో 104 మంది బాధితులు ఉన్నారు. వీరు కూడా తమ భూములను స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఐ అండ్‌ ఐ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సమస్య లను తక్షణం పరిష్కరించటానికి రూ. 130 కోట్ల నిధులు అవసరమౌతాయని ప్రాథమికంగా ప్రతిపాదించారు. ఈ నిధుల విడుదలకు సం బంధించి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభు త్వం నుంచి కలెక్టర్‌, జేసీ సహాయం కోరారు. దీనికి ఐ అండ్‌ ఐ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చింది. బడ్జెట్‌లో కేటాయింపులకు కృషి చేస్తానని ఆయన నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తోంది. బడ్జెట్‌ కేటాయింపులలో నిధుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, ఏదైనా కాంపోనెంట్స్‌ నుంచి నిధుల సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరగా నిధులు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. 
 
 
విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన గన్నవరం రైతుల సమస్య పరిష్కారానికి రూ.130 కోట్ల నిధులు అవసరమని జిల్లా యం త్రాంగం గుర్తించింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌, రిస్ర్టిక్టిడ్‌ జోన్‌ , ప్లాట్‌ టు ప్లాట్‌ లే అవుట్‌ డెవలప్‌మెంట్‌ తదితరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఈ నిధులు అవసరమని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సత్వరం నిధులు విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌కు జిల్లా యంత్రాంగం తన నివేదికలో పేర్కొంది.
Posted (edited)
ఎయిర్‌పోర్టు తాజా పరిస్థితేంటి?
18-07-2019 08:43:05
 
 
636990361843903486.jpg
  • ఏపీ ఏడీసీఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు లేఖ
  • ఐ అండ్‌ ఐ పీఎస్‌ రజిత్‌భార్గవ్‌తో జిల్లా యంత్రాంగం భేటీ తర్వాత కీలక పరిణామం
  • విమానాశ్రయ అభివృద్ధి పనులు, భూములు, అంతర్జాతీయానంపై ఏడీసీఎల్‌ ఆరా
  • నివేదిక పంపాలని లేఖ ద్వారా విమానాశ్ర య అధికారులను కోరిన ఏపీ ఏడీసీఎల్‌
  • సమగ్ర నివేదిక తయారు చేస్తున్న ఎయిర్‌పోర్టు అధికారులు
  • ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్రకు తలమానికంగా భాసిల్లుతున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విమానాశ్రయ తాజా పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌), విమానాశ్రయ అధికారులను వివరాలను కోరింది. ఈ మేరకు ఏపీ ఏడీ సీఎల్‌ నుంచి విమానాశ్రయ ఉన్నతాధికారులకు లేఖ వచ్చినట్టు తెలిసింది. ఈ లేఖలో కోరిన అంశాలకు సంబంధించి విమానాశ్రయ అధికారులు కూడా నివేదికను పంపించినట్టు తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణ పనులు, విమానాశ్రయ విస్తరణ కోసం జరిగిన భూ సమీకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌, అంతర్జాతీయ విమానయాన ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలపై విమానాశ్రయ అధికారులను ఏపీఏడీసీఎల్‌ తాను పంపినలేఖలో నివేదిక కోరినట్టు సమాచారం. ఏపీ ఏడీసీఎల్‌ లేఖకు సంబంధించి పూర్తి వివరాలతో ఎయిర్‌పోర్టు అధికారులు నివేదికను తయారుచేస్తున్నట్టు సమాచారం.
 
 
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రభుత్వం దృష్టిసారించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నవ్యాంధ్రకే తలమానికంగా భాసిల్లుతున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇటీవలే సింగపూర్‌ విమాన సర్వీసుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) నుంచి రాష్ట్రప్రభుత్వం తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వం దృష్టి సారించటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఏపీ ఏడీసీఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు ఒక లేఖ వచ్చినట్టు తెలిసింది. పరిశ్రమలు-పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌తో ఇటీవల కృష్ణా జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలతలు కలిసి విమానాశ్రయ అభివృద్ధి పనులకు సంబంధించి ఇబ్బందులు, ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్న అంశాలపై నివేదించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో పరిశ్రమలు-పెట్టుబడుల శాఖ విమానాశ్రయానికి సంబంధించి పూర్తిస్థాయిలో సమీక్షించి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఏడీసీఎల్‌, ఎయిర్‌పోర్టు అధికారులను సమగ్ర వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణకు సంబంధించి రన్‌వే, ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ వంటి అభివృద్ధి పనులతో పాటు, భూ సేకరణకు సంబంధించి విమానాశ్రయ అవసరాలు ఏమిటి? ఇప్పటివరకు ఎంత కల్పించారు? ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు ఎలా ఉన్నాయి ? అంతర్జాతీయ విమానాలు నడపటానికి ప్రోత్సాహకంగా ఏఏఐ ఎలాంటి చర్యలు చేపట్టింది ? వంటి అంశాలపై లేఖలో ఏపీ ఏడీసీఎల్‌ ప్రధానంగా కోరినట్టు తెలుస్తోంది. ఏపీ ఏడీసీఎల్‌ లేఖకు సంబంధించి ఎయిర్‌పోర్టు వర్గాలు కూడా నివేదికలను సిద్ధంచేస్తున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించి చూస్తే విజయవాడ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం రూ.138 కోట్లతో జరిగింది. అలాగే రూ. 143 కోట్ల వ్యయంతో రన్‌వే (2286 మీటర్ల) కు అదనంగా మరో 1074 మీటర్ల మేర విస్తరించటం, పాత రన్‌వేను బలోపేతం చేయటం వంటివి చేపట్టారు. రన్‌వే పూర్తయినా పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ఎయిర్‌పోర్టుకు అప్పగించిన భూములలో ఇంకా కొంతమంది స్వాధీనంలోనే ఉంది. నిర్మాణాలకు పరిహారం, దేవాలయాలను రీ లోకేట్‌ చేయటం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అమలు చేయటం వల్ల రన్‌వేను కమిషన్‌లోకి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది.
 
 
ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు సంబంధించి ఎన్నికల ముందు హడావిడిగా కేంద్ర ప్రభుత్వం భూమి పూజ అయితే చేసింది కానీ, ఇప్పటివరకు తుది అనుమతులు రాలేదు. దాదాపుగా రూ. 611 కోట్ల వ్యయంతో దానికి అంచనాలు రూపొందించారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)గా కేంద్రం స్టుప్‌ అనే సంస్థను నియమించింది. పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు దగ్గర ప్రస్తుతం దీని భవితవ్యం పెండింగ్‌లో ఉంది.
 
విమానాశ్రయ విస్తరణకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 700 ఎకరాలను గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి, దావాజీగూడెం, అల్లాపురం తదితర గ్రామాల రైతుల నుంచి సమీకరించి ఇచ్చింది.
 
ఆర్‌అండ్‌ఆర్‌ అనేది పూర్తిగా జిల్లా యంత్రాంగం తీర్చవలసిన సమస్య. జిల్లా యంత్రాంగం ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళటానికి ఆర్థిక వెసులుబాటు కావాల్సివుంది. ఆర్‌అండ్‌ఆర్‌తో పాటు అనేక విమానాశ్రయ సంబంధిత సమస్యలను శాశ్వితంగా పరిష్కరించటానికి రూ.130కోట్ల నిధులు అవసరమని జిల్లా యంత్రాంగం ఇంతకు ముందే పరిశ్రమలు - పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి రజితభార్గవ్‌కు నివేదించటం జరిగింది.
అంతర్జాతీయానానికి సంబంధించి విమానాశ్రయ అధికారులు విమానాశ్రయంలో ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను అభివృద్ధి చేశారు. దీంతోపాటు పలు సమ్మిట్‌లలో పాల్గొని విదేశీ విమానయాన సంస్థలకు ఇక్కడి వనరులు, అవకాశాల గురించి విస్తృతంగా తీసుకువెళ్ళటం జరిగింది. దీంతో పాటు అంతర్జాతీయ ప్రయాణీకుల కదలికలకు సంబంధించి పలు అధ్యయనాలను కూడా జరిపింది. 
 
ఈ క్రమంలో ఈ విషయాన్నింటినీ ఏపీ ఏడీసీఎల్‌ దృష్టికి విమానాశ్రయ అధికారులు తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
 
 
Edited by Vulavacharu
Posted
12 minutes ago, Vulavacharu said:
ఎయిర్‌పోర్టు తాజా పరిస్థితేంటి?
18-07-2019 08:43:05
 
 
636990361843903486.jpg
  • ఏపీ ఏడీసీఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు లేఖ
  • ఐ అండ్‌ ఐ పీఎస్‌ రజిత్‌భార్గవ్‌తో జిల్లా యంత్రాంగం భేటీ తర్వాత కీలక పరిణామం
  • విమానాశ్రయ అభివృద్ధి పనులు, భూములు, అంతర్జాతీయానంపై ఏడీసీఎల్‌ ఆరా
  • నివేదిక పంపాలని లేఖ ద్వారా విమానాశ్ర య అధికారులను కోరిన ఏపీ ఏడీసీఎల్‌
  • సమగ్ర నివేదిక తయారు చేస్తున్న ఎయిర్‌పోర్టు అధికారులు
  • ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్రకు తలమానికంగా భాసిల్లుతున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విమానాశ్రయ తాజా పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌), విమానాశ్రయ అధికారులను వివరాలను కోరింది. ఈ మేరకు ఏపీ ఏడీ సీఎల్‌ నుంచి విమానాశ్రయ ఉన్నతాధికారులకు లేఖ వచ్చినట్టు తెలిసింది. ఈ లేఖలో కోరిన అంశాలకు సంబంధించి విమానాశ్రయ అధికారులు కూడా నివేదికను పంపించినట్టు తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణ పనులు, విమానాశ్రయ విస్తరణ కోసం జరిగిన భూ సమీకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌, అంతర్జాతీయ విమానయాన ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలపై విమానాశ్రయ అధికారులను ఏపీఏడీసీఎల్‌ తాను పంపినలేఖలో నివేదిక కోరినట్టు సమాచారం. ఏపీ ఏడీసీఎల్‌ లేఖకు సంబంధించి పూర్తి వివరాలతో ఎయిర్‌పోర్టు అధికారులు నివేదికను తయారుచేస్తున్నట్టు సమాచారం.
 
 
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రభుత్వం దృష్టిసారించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నవ్యాంధ్రకే తలమానికంగా భాసిల్లుతున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇటీవలే సింగపూర్‌ విమాన సర్వీసుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) నుంచి రాష్ట్రప్రభుత్వం తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వం దృష్టి సారించటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఏపీ ఏడీసీఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు ఒక లేఖ వచ్చినట్టు తెలిసింది. పరిశ్రమలు-పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌తో ఇటీవల కృష్ణా జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలతలు కలిసి విమానాశ్రయ అభివృద్ధి పనులకు సంబంధించి ఇబ్బందులు, ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్న అంశాలపై నివేదించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో పరిశ్రమలు-పెట్టుబడుల శాఖ విమానాశ్రయానికి సంబంధించి పూర్తిస్థాయిలో సమీక్షించి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఏడీసీఎల్‌, ఎయిర్‌పోర్టు అధికారులను సమగ్ర వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణకు సంబంధించి రన్‌వే, ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ వంటి అభివృద్ధి పనులతో పాటు, భూ సేకరణకు సంబంధించి విమానాశ్రయ అవసరాలు ఏమిటి? ఇప్పటివరకు ఎంత కల్పించారు? ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు ఎలా ఉన్నాయి ? అంతర్జాతీయ విమానాలు నడపటానికి ప్రోత్సాహకంగా ఏఏఐ ఎలాంటి చర్యలు చేపట్టింది ? వంటి అంశాలపై లేఖలో ఏపీ ఏడీసీఎల్‌ ప్రధానంగా కోరినట్టు తెలుస్తోంది. ఏపీ ఏడీసీఎల్‌ లేఖకు సంబంధించి ఎయిర్‌పోర్టు వర్గాలు కూడా నివేదికలను సిద్ధంచేస్తున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించి చూస్తే విజయవాడ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం రూ.138 కోట్లతో జరిగింది. అలాగే రూ. 143 కోట్ల వ్యయంతో రన్‌వే (2286 మీటర్ల) కు అదనంగా మరో 1074 మీటర్ల మేర విస్తరించటం, పాత రన్‌వేను బలోపేతం చేయటం వంటివి చేపట్టారు. రన్‌వే పూర్తయినా పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ఎయిర్‌పోర్టుకు అప్పగించిన భూములలో ఇంకా కొంతమంది స్వాధీనంలోనే ఉంది. నిర్మాణాలకు పరిహారం, దేవాలయాలను రీ లోకేట్‌ చేయటం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అమలు చేయటం వల్ల రన్‌వేను కమిషన్‌లోకి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది.
 
 
ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు సంబంధించి ఎన్నికల ముందు హడావిడిగా కేంద్ర ప్రభుత్వం భూమి పూజ అయితే చేసింది కానీ, ఇప్పటివరకు తుది అనుమతులు రాలేదు. దాదాపుగా రూ. 611 కోట్ల వ్యయంతో దానికి అంచనాలు రూపొందించారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)గా కేంద్రం స్టుప్‌ అనే సంస్థను నియమించింది. పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు దగ్గర ప్రస్తుతం దీని భవితవ్యం పెండింగ్‌లో ఉంది.
 
విమానాశ్రయ విస్తరణకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 700 ఎకరాలను గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి, దావాజీగూడెం, అల్లాపురం తదితర గ్రామాల రైతుల నుంచి సమీకరించి ఇచ్చింది.
 
ఆర్‌అండ్‌ఆర్‌ అనేది పూర్తిగా జిల్లా యంత్రాంగం తీర్చవలసిన సమస్య. జిల్లా యంత్రాంగం ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళటానికి ఆర్థిక వెసులుబాటు కావాల్సివుంది. ఆర్‌అండ్‌ఆర్‌తో పాటు అనేక విమానాశ్రయ సంబంధిత సమస్యలను శాశ్వితంగా పరిష్కరించటానికి రూ.130కోట్ల నిధులు అవసరమని జిల్లా యంత్రాంగం ఇంతకు ముందే పరిశ్రమలు - పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి రజితభార్గవ్‌కు నివేదించటం జరిగింది.
అంతర్జాతీయానానికి సంబంధించి విమానాశ్రయ అధికారులు విమానాశ్రయంలో ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను అభివృద్ధి చేశారు. దీంతోపాటు పలు సమ్మిట్‌లలో పాల్గొని విదేశీ విమానయాన సంస్థలకు ఇక్కడి వనరులు, అవకాశాల గురించి విస్తృతంగా తీసుకువెళ్ళటం జరిగింది. దీంతో పాటు అంతర్జాతీయ ప్రయాణీకుల కదలికలకు సంబంధించి పలు అధ్యయనాలను కూడా జరిపింది. 
 
ఈ క్రమంలో ఈ విషయాన్నింటినీ ఏపీ ఏడీసీఎల్‌ దృష్టికి విమానాశ్రయ అధికారులు తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
 
 

Final conclusion enti, motham chadivina ardam kala, telusukuni em chestaru lands venakki iche airport back to old status ki testara

 

Friendly state TG lo airport undaga maku ikkada inkoti anavasaram ani

Posted

hey, aa peruni maarchi thenkandi raa ... just like ysr did  

I propose ... RajaReddy (freedom fighter) International Airport ... That sounds about right 

Because it has most respected Reddy surname in the world.

  • 1 month later...
  • 4 years later...
Posted
34 minutes ago, Flash said:

New greenfield airport identification start cheyyali ippude.. 5yrs lopu works modhalu pedithe best

ippude ante kastam emo bro

Posted (edited)
4 hours ago, Flash said:

New greenfield airport identification start cheyyali ippude.. 5yrs lopu works modhalu pedithe best

pedaparimi  daggara lands isthe akkade kavachu annaru kani, ippudu kastam anukutunnanu.

Edited by sonykongara
Posted
7 minutes ago, ravindras said:

dubai, singapore, qatar ki non stop flights veyyaali. international connectivity improve avvudddhi.

UAE dubaj Emirates not possible they already at maxinum seats allocated by government of india

Posted
14 minutes ago, NatuGadu said:

UAE dubaj Emirates not possible they already at maxinum seats allocated by government of india

udan scheme lo indigo ni encourage cheyyaali.

Posted
1 hour ago, PP SIMHA said:

Vijaywada kakunda mala.inko airport ..itta hypes penche santham tenkindi 2019 lo

. Silnt ga pani cheste better..amaravati mundu shaoe kj testhe ade 10k

Totally agree... అరవకుండా చేసుకోవటం vuthamam capital విషయాలు.. 

Gannavaram ni expand chesthe chalu, new airport antu time n money bokkeyyatam kanna atleast fr 10 years... 

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...