Jump to content

Vulavacharu

Members
  • Posts

    1,298
  • Joined

  • Last visited

  • Days Won

    2

Everything posted by Vulavacharu

  1. https://www.telugu360.com/te/did-jagan-caught-in-prohblem-by-giving-report-to-pmo-and-amit-shah/
  2. ఎయిర్‌పోర్టు తాజా పరిస్థితేంటి? 18-07-2019 08:43:05 ఏపీ ఏడీసీఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు లేఖ ఐ అండ్‌ ఐ పీఎస్‌ రజిత్‌భార్గవ్‌తో జిల్లా యంత్రాంగం భేటీ తర్వాత కీలక పరిణామం విమానాశ్రయ అభివృద్ధి పనులు, భూములు, అంతర్జాతీయానంపై ఏడీసీఎల్‌ ఆరా నివేదిక పంపాలని లేఖ ద్వారా విమానాశ్ర య అధికారులను కోరిన ఏపీ ఏడీసీఎల్‌ సమగ్ర నివేదిక తయారు చేస్తున్న ఎయిర్‌పోర్టు అధికారులు ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం (ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్రకు తలమానికంగా భాసిల్లుతున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విమానాశ్రయ తాజా పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌), విమానాశ్రయ అధికారులను వివరాలను కోరింది. ఈ మేరకు ఏపీ ఏడీ సీఎల్‌ నుంచి విమానాశ్రయ ఉన్నతాధికారులకు లేఖ వచ్చినట్టు తెలిసింది. ఈ లేఖలో కోరిన అంశాలకు సంబంధించి విమానాశ్రయ అధికారులు కూడా నివేదికను పంపించినట్టు తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణ పనులు, విమానాశ్రయ విస్తరణ కోసం జరిగిన భూ సమీకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌, అంతర్జాతీయ విమానయాన ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలపై విమానాశ్రయ అధికారులను ఏపీఏడీసీఎల్‌ తాను పంపినలేఖలో నివేదిక కోరినట్టు సమాచారం. ఏపీ ఏడీసీఎల్‌ లేఖకు సంబంధించి పూర్తి వివరాలతో ఎయిర్‌పోర్టు అధికారులు నివేదికను తయారుచేస్తున్నట్టు సమాచారం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రభుత్వం దృష్టిసారించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నవ్యాంధ్రకే తలమానికంగా భాసిల్లుతున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇటీవలే సింగపూర్‌ విమాన సర్వీసుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) నుంచి రాష్ట్రప్రభుత్వం తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుపై ప్రభుత్వం దృష్టి సారించటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఏపీ ఏడీసీఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు ఒక లేఖ వచ్చినట్టు తెలిసింది. పరిశ్రమలు-పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌తో ఇటీవల కృష్ణా జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలతలు కలిసి విమానాశ్రయ అభివృద్ధి పనులకు సంబంధించి ఇబ్బందులు, ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్న అంశాలపై నివేదించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో పరిశ్రమలు-పెట్టుబడుల శాఖ విమానాశ్రయానికి సంబంధించి పూర్తిస్థాయిలో సమీక్షించి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఏడీసీఎల్‌, ఎయిర్‌పోర్టు అధికారులను సమగ్ర వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణకు సంబంధించి రన్‌వే, ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ వంటి అభివృద్ధి పనులతో పాటు, భూ సేకరణకు సంబంధించి విమానాశ్రయ అవసరాలు ఏమిటి? ఇప్పటివరకు ఎంత కల్పించారు? ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు ఎలా ఉన్నాయి ? అంతర్జాతీయ విమానాలు నడపటానికి ప్రోత్సాహకంగా ఏఏఐ ఎలాంటి చర్యలు చేపట్టింది ? వంటి అంశాలపై లేఖలో ఏపీ ఏడీసీఎల్‌ ప్రధానంగా కోరినట్టు తెలుస్తోంది. ఏపీ ఏడీసీఎల్‌ లేఖకు సంబంధించి ఎయిర్‌పోర్టు వర్గాలు కూడా నివేదికలను సిద్ధంచేస్తున్నట్టు తెలుస్తోంది. విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించి చూస్తే విజయవాడ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం రూ.138 కోట్లతో జరిగింది. అలాగే రూ. 143 కోట్ల వ్యయంతో రన్‌వే (2286 మీటర్ల) కు అదనంగా మరో 1074 మీటర్ల మేర విస్తరించటం, పాత రన్‌వేను బలోపేతం చేయటం వంటివి చేపట్టారు. రన్‌వే పూర్తయినా పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ఎయిర్‌పోర్టుకు అప్పగించిన భూములలో ఇంకా కొంతమంది స్వాధీనంలోనే ఉంది. నిర్మాణాలకు పరిహారం, దేవాలయాలను రీ లోకేట్‌ చేయటం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అమలు చేయటం వల్ల రన్‌వేను కమిషన్‌లోకి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు సంబంధించి ఎన్నికల ముందు హడావిడిగా కేంద్ర ప్రభుత్వం భూమి పూజ అయితే చేసింది కానీ, ఇప్పటివరకు తుది అనుమతులు రాలేదు. దాదాపుగా రూ. 611 కోట్ల వ్యయంతో దానికి అంచనాలు రూపొందించారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)గా కేంద్రం స్టుప్‌ అనే సంస్థను నియమించింది. పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు దగ్గర ప్రస్తుతం దీని భవితవ్యం పెండింగ్‌లో ఉంది. విమానాశ్రయ విస్తరణకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 700 ఎకరాలను గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి, దావాజీగూడెం, అల్లాపురం తదితర గ్రామాల రైతుల నుంచి సమీకరించి ఇచ్చింది. ఆర్‌అండ్‌ఆర్‌ అనేది పూర్తిగా జిల్లా యంత్రాంగం తీర్చవలసిన సమస్య. జిల్లా యంత్రాంగం ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళటానికి ఆర్థిక వెసులుబాటు కావాల్సివుంది. ఆర్‌అండ్‌ఆర్‌తో పాటు అనేక విమానాశ్రయ సంబంధిత సమస్యలను శాశ్వితంగా పరిష్కరించటానికి రూ.130కోట్ల నిధులు అవసరమని జిల్లా యంత్రాంగం ఇంతకు ముందే పరిశ్రమలు - పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి రజితభార్గవ్‌కు నివేదించటం జరిగింది. అంతర్జాతీయానానికి సంబంధించి విమానాశ్రయ అధికారులు విమానాశ్రయంలో ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను అభివృద్ధి చేశారు. దీంతోపాటు పలు సమ్మిట్‌లలో పాల్గొని విదేశీ విమానయాన సంస్థలకు ఇక్కడి వనరులు, అవకాశాల గురించి విస్తృతంగా తీసుకువెళ్ళటం జరిగింది. దీంతో పాటు అంతర్జాతీయ ప్రయాణీకుల కదలికలకు సంబంధించి పలు అధ్యయనాలను కూడా జరిపింది. ఈ క్రమంలో ఈ విషయాన్నింటినీ ఏపీ ఏడీసీఎల్‌ దృష్టికి విమానాశ్రయ అధికారులు తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. https://www.andhrajyothy.com/artical?SID=850258
  3. https://www.andhrajyothy.com/artical?SID=846855 రూ.130 కోట్లు ఇవ్వండి 14-07-2019 09:10:51 కలెక్టర్‌, జేసీ చొరవ గన్నవరం రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు సత్వరం నిధుల విడుదలకు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి నివేదిక విజయవాడ: నవ్యాంధ్రకు తలమానికంగా నిలుస్తున్న విజయవాడ విమానాశ్రయ విస్తరణకు గన్న వరం ప్రాంత రైతులు 700 ఎకరాలకు పైగా భూములు సమీకరణ విధానంలో అప్పగిం చారు. ప్రభుత్వం ఆ భూములను ఎయిర్‌పోర్టు అథారి టీకి అప్పగించింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆ భూముల్లో రన్‌వే విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు చేపడుతోంది. భూములు ఇచ్చిన రైతుల సమస్యలు మాత్రం ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. రైతులు శాంతిస్తే కానీ విజయవాడ విమానాశ్రయ రన్‌వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించని పరిస్థితి ఏర్పడింది. రన్‌వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తేనే విజయవాడ విమా నాశ్రయం బైలేట్రల్‌ ట్రాఫిక్స్‌ రైట్స్‌ సాధించ టానికి దోహదపడు తుంది. అప్పుడే విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు బేషరతుగా రాకపోకలు సాగిస్తాయి. ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న గన్నవరం ప్రాంత విమానాశ్రయ విస్తరణ బాధితుల సమ స్యపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కలెక్టర్‌ ఎండి ఇంతియాజ్‌ మొదలు జేసీ మాధ వీలత వరకు అందరూ కొత్తగా వచ్చినప్పటికీ అతి త్వరలోనే సమస్యలను అధ్య యనం చేశారు. ఈ సమస్యలకు సంబంధించి కలెక్టర్‌ ఎన్నికల ముందుగానే రోడ్‌ మ్యాప్‌ ను తయారు చేయటానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశారు. జేసీగా మాధవీలత వచ్చిన తర్వాత భూముల అంశాలపై తనకు ఉన్న అవగాహన ద్వారా కలెక్టర్‌ కోరుకున్న ప్రకారం ఆమె రోడ్‌ మ్యాప్‌ రూపొందించారు. ఆమె పలు దఫాలు గన్నవరం ప్రాంతానికి వచ్చారు. నేరుగా రైతు లతో మాట్లాడారు. గతంలో పనిచేసిన అధికా రులకు భిన్నంగా ఆమె రైతులతో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సార్లు సమావేశ మ య్యారు. విమానాశ్రయ విస్తరణకు భూము లిచ్చిన రైతులతో పాటు, ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, ప్లాట్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం, నిర్మాణాలకు ఆస్కారం లేని భూములుగా మారిపోయిన వారి ఇబ్బం దులు, భూములు ఉండీ ప్రయోజనం లేని ఉన్న వారి ఇబ్బందులను పరిష్కరించటానికి వీలుగా జేసీ ఒక కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు రూ.130 కోట్ల అంచనాలను రూపొందించారు. ఈ అంచనాలను పరిశీలిస్తే.. ప్రధానంగా అర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి సింహ భాగం నిధుల అవసరం ఏర్పడింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా బుద్ధవరం, దావా జీగూడెం, అల్లాపురం ప్రాంతాల్లో ఇళ్లు కోల్పో యిన వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇళ్లు కట్టి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం చిన అవుటపల్లి గ్రామంలో 49.5 ఎకరాలను జిల్లా యంత్రాంగం సేకరిం చింది. ఈ భూములను లే అవుట్‌ వేయటం జరిగింది. వాటిలో మౌలిక సదుపాయాల కల్ప న పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఏ పద్ధతితో ఇళ్లను నిర్మించాలన్న దానిపై కొన్ని మోడళ్లు రూపొం దించుకుని ఐ అండ్‌ ఐ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌తో కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలత కొద్ది రోజుల కిందట భేటీ అయ్యారు. దీంతో పాటు విమానాశ్రయ విస్తర ణలో భాగంగా ప్రైవేటు వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారివి కూడా సమీకరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారికి ప్లాట్‌ టు ప్లాట్‌ ఇవ్వటానికి వీలుగా అజ్జంపూడిలో భూ సేకరణ జరిపారు. ఇంత వరకు బాగానే ఉంది. ఈ లే అవుట్‌ను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిం చాల్సి ఉంది. ఈ రెండు సమస్యలు కాకుండా నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌ (ఎన్‌సీజడ్‌) పరిధిలోకి 16 మంది బాధితులు చేరారు. తమ కు ఉన్న భూములకు సంబంధించి వారు ఎలాం టి నిర్మాణాలు చేపట్టకూడదు కాబట్టి ఉప యోగకరం లేని భూములను స్వాధీనం చేస్తా మని, పరిహారం చెల్లించమని కోరుతున్నారు. అదే విధంగా విమానాశ్రయ రిస్ర్టిక్ట్‌డ్‌ జోన్‌ పరిధిలో 104 మంది బాధితులు ఉన్నారు. వీరు కూడా తమ భూములను స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ ఐ అండ్‌ ఐ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సమస్య లను తక్షణం పరిష్కరించటానికి రూ. 130 కోట్ల నిధులు అవసరమౌతాయని ప్రాథమికంగా ప్రతిపాదించారు. ఈ నిధుల విడుదలకు సం బంధించి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభు త్వం నుంచి కలెక్టర్‌, జేసీ సహాయం కోరారు. దీనికి ఐ అండ్‌ ఐ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చింది. బడ్జెట్‌లో కేటాయింపులకు కృషి చేస్తానని ఆయన నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తోంది. బడ్జెట్‌ కేటాయింపులలో నిధుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, ఏదైనా కాంపోనెంట్స్‌ నుంచి నిధుల సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరగా నిధులు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన గన్నవరం రైతుల సమస్య పరిష్కారానికి రూ.130 కోట్ల నిధులు అవసరమని జిల్లా యం త్రాంగం గుర్తించింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌, రిస్ర్టిక్టిడ్‌ జోన్‌ , ప్లాట్‌ టు ప్లాట్‌ లే అవుట్‌ డెవలప్‌మెంట్‌ తదితరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఈ నిధులు అవసరమని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సత్వరం నిధులు విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌ భార్గవ్‌కు జిల్లా యంత్రాంగం తన నివేదికలో పేర్కొంది.
  4. Lifting water from Polavaram to Brahmaiahlingam cheruvu work was stopped anta. Two days nundi works aapeyamannarani chebutunnaranta.
  5. https://epaper.andhrajyothy.com/m5/2172188/Vijayawada/27-05-2019#page/10/1
  6. Konda paina temple(s) work jarugutondani vinnanu. Cheruvu ku polavaram canal water lift cheyyadaniki kooda work jarugutondani chepparu.
  7. August 2nd week nundi manaku rains vuntai annaruga. Anything changed?
  8. Future expansions, railway line and greenary kosam
  9. Is this the new temple he is talking about instead developing Vaikunthapuram temple? or both in plans?
  10. This year after second week of July heavy rains were predicted for Vijayawada and surrounding areas. Ee lift appatikalla functioning ki vachheste baaguntundi.
  11. July 2nd week nundi full rains antunnaru
  12. అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉండగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు... ఏడాది లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ హోదాను అందుకుంది... అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా పూర్తి చేసుకో కలిగింది... మరో పక్క అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయ్యేలా చూసారు... అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి... ఇమిగ్రేషన్‌ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది... అయితే ఇవన్నీ అశోక్ రాజీనామా చెయ్యకముందు జరిగిన పనులు... రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మారిపోయింది.. ఇన్ని చేసినా, ఇప్పటికీ కేంద్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకి, పర్మిషన్ ఇవ్వటం లేదు.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దుబాయ్ కు అంతర్జాతీయ సర్వీసుల కోసం కసరత్తు చేసి, ఎయిర్ ఇండియా సర్వీసు నడిపేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించారు.. కాని చావు కబురు చల్లగా చెప్పింది ఎయిర్ ఇండియా. విజయవాడ నుంచి దుబాయికి సర్వీసును నడపలేమని చెప్పింది. ఈ తరుణంలో, ఇప్పుడు దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ ఆశలు చిగురింప చేస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి వీలుగా స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అరబ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధంగా ఉన్న ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కోస్తా ప్రజలకు తీపి కబురు అందించింది. ఎయిర్‌ ఇండియా ఇచ్చిన షాక్‌తో స్తబ్దుగా ఉన్న పారిశ్రామికవేత్తలలో కూడా తాజా కబురుతో జోష్‌ వచ్చింది. కిందటి నెల చివర్లో 24, 25 తేదీల్లో చెన్నైలో జరిగిన సదరన్‌ రీజియన్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ వల్ల అనుకోకుండా ఫ్లై దుబాయ్‌ నుంచి ఆసక్తి వ్యక్తమైంది. ఈ సమావేశానికి విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మదుసూదనరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఉన్న అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. దేశీయంగా ఇండిగో, ఎయిర్‌ ఆసియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఫ్లైదుబాయ్‌, ఎయిర్‌ ఇండియా వంటి అనేక ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిథులు పాల్గొన్నారు. విదేశీ అవకాశాలకు సంబంధించి ఏపీడీ ప్రజంటేషన్‌ను అన్ని విమానయాన సంస్థలు ఆసక్తిగా విన్నప్పటికీ, ఫ్లై దుబాయ్‌ సంస్థ తక్షణం స్పందించింది. స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేయటం కూడా వెంటనే జరిగిపోయింది. మరి కేంద్రం, ఎలా స్పందిస్తుందో చూడాలి.. http://www.amaravativoice.com/avnews/news/fly-dubai-airlines
  13. Andhra Pradesh Airports Development Corporation gave a public notice seeking public interest for starting flights from Vijayawada airport to Singapore. The interest is to be expressed by means of WhatsApp message “INTERESTED” to APADCL mobile number of by means of a message “INTERESTED “on the website www.apadcl.com. Please save the number 9868175288 under the name APADCL on your phone AND SEND A WHATSAPP MESSAGE SAYING “INTERESTED”
  14. Ledu brother. Ee madhya koncham busy aiyyanu. News paper choose time kooda dorakadam ledu. Quick ga ikkada meeru post chestunna news choostunnanu. Really appreciate your efforts. Koncham time dorakagane malli post chesta.
  15. Shetty has money. Guessing he will complete quick without waiting for loans etc.
  16. Correct. 460 acres govt land vundi. Koddiga hill area. koncham chadunu cheste 460 acres vaadukovachhu. Chadunu chesetappudu vachhe gravel Amaravati or outerring roads ki baaga paniki vastundi.
  17. HCL panulu fast ga jarugutunnayanta.
  18. Canal diversion aapesaru. Lands teesukovadam ledu. This idea was scrapped.
  19. https://www-m.cnn.com/2018/04/12/world/gulf-stream-global-ocean-conveyor-belt-study-intl/index.html Manaku effect enti?
×
×
  • Create New...