August 29, 20241 yr Author విశాఖ, విజయవాడ మెట్రోలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విజయవాడ మెట్రో ఫేజ్-1 కోసం రూ.11వేల కోట్లు, ఫేజ్-2 కోసం రూ.14వేల కోట్లు అవసరం. కొమ్మాది జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు విశాఖ మెట్రో ఫేజ్-1 కోసం రూ.11,400 కోట్లు అవసరం. కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు విశాఖ మెట్రో ఫేజ్-2 కోసం రూ.5,700 కోట్లు కావాలి. ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే మెట్రో వల్లే సాధ్యం.
August 30, 20241 yr Author Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల్లో కదలిక జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. Updated : 30 Aug 2024 07:10 IST తొలిదశ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం విజయవాడ-అమరావతి మెట్రోరైలు కారిడార్లు ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విజయవాడ-అమరావతి, విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు గురువారం ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. రెండు మెట్రోలకు తొలిదశలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్లు వెంటనే కేంద్రానికి పంపాలని ఆయన ఆదేశించారు. సవరించిన డీపీఆర్ల ప్రకారం... రెండు దశలకు కలిపి విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.25,130 కోట్లు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండు దశల్లో విజయవాడ-అమరావతి మెట్రో. మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లు. తొలి దశలో: 38.40 కి.మీ. నిర్మాణ వ్యయం: రూ.11,009 కోట్లు. విజయవాడలోని పండిట్నెహ్రూ బస్స్టేషన్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కి.మీ., బస్స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ. రెండో దశలో: 27.80 కి.మీ. నిర్మాణ వ్యయం: రూ.14,121 కోట్లు. పండిట్నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజధాని అమరావతికి 27.80 కి.మీ. మొత్తం ఖర్చు కేంద్రం భరించాలని కోరుతున్నాం: నారాయణ విశాఖ, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టులు విభజన చట్టంలో ఉన్నాయి కాబట్టి వాటి నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నట్లు పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ విలేకర్లకు తెలిపారు. ‘‘ఆ రెండు ప్రాజెక్టులపై 2019కి ముందు చాలా కసరత్తు చేసి కేంద్రం ఆమోదానికి పంపాం. కొత్త పాలసీ తెస్తున్నామని, దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సవరించిన అంచనాల్ని, డీపీఆర్లను కేంద్రానికి పంపిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనుల్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు పేర్కొన్నారు. సీఎంతో జరిగిన సమావేశంలో మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టును రెండుదశల్లో నాలుగు కారిడార్లుగా చేపట్టాలన్నది ప్రతిపాదన. నాలుగూ కలిపి 76.90 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మిస్తారు. 54 స్టేషన్లు ఉంటాయి. ఆయా కారిడార్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తొలిదశలో చేపట్టే మూడు కారిడార్ల మొత్తం పొడవు: 46.23 కి.మీ. నిర్మాణవ్యయం: రూ.11,498 కోట్లు కారిడార్ 1: విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది. పొడవు: 34.40 కి.మీ. స్టేషన్లు: 29 కారిడార్ 2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు. పొడవు: 5.07 కి.మీ. స్టేషన్లు: 6 కారిడార్ 3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు. పొడవు: 6.75 కి.మీ. స్టేషన్లు: 7 రెండో దశలో: ఒకటే కారిడార్. నిర్మాణ వ్యయం: రూ.5,734 కోట్లు కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం. పొడవు: 30.67 కి.మీ. స్టేషన్లు: 12 విశాఖ మెట్రోరైలు మార్గాలు ఇలా..
October 22, 20241 yr Author AP News: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ఢిల్లీలో కీలక చర్చలు.. ABN , Publish Date - Oct 22 , 2024 | 02:21 PM ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్ మూడ్రోజులుగా బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులు సహా ఆయా శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అందివ్వనున్న రూ.15వేల కోట్లపై చర్చలు సాగుతున్నాయి. అలాగే సోమవారం నాడు హడ్కో అధికారులతో ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి రుణంతోపాటు ఏపీ మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపుపై మంత్రి చర్చించారు. ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులపై ఇరువురూ కీలకంగా చర్చించారు. మెట్రో ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రిని నారాయణ కోరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వీటిని ప్రతిపాదించామని, రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మనోహర్కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలూ ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. అమృత్-2 పథకం ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని చెప్పారు. దీంతో ఆ పథకం అమలుకు ఉన్న మార్గాలపై ఇరువురు చర్చించారు. మెట్రో ప్రాజెక్టుల విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు. Updated Date - Oct 22 , 2024 | 02:21 PM
October 22, 20241 yr Author విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానించాలి: మంత్రి నారాయణ కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో భేటీ అయ్యారు. Published : 22 Oct 2024 16:18 IST దిల్లీ: కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ మంగళవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రోపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను అమరావతికి అనుసంధానం చేయాలని మంత్రి నారాయణ ప్రతిపాదించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్రమంత్రి ఖట్టర్ దృష్టికి తెచ్చారు. అమృత్ పథకం అమలుపై కూడా కీలక చర్చ జరిగింది. మెట్రో ప్రాజెక్టులపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఖట్టర్ చెప్పినట్టు సమాచారం. గత తెదేపా ప్రభుత్వంలో విజయవాడ మెట్రో ప్రాజెక్టు టెండర్ల వరకు వెళ్లింది. తర్వాత ప్రభుత్వం మారడంతో మెట్రో ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. భూసేకరణనూ గత ప్రభుత్వం ఉపసంహరించింది. తాజాగా కూటమి ప్రభుత్వ రాకతో మెట్రో ఎండీగా ఎన్పీ రామకృష్ణారెడ్డిని నియమించారు. విజయవాడలో లైట్ మెట్రోకు మళ్లీ ప్రతిపాదిస్తున్నారు. పీఎన్బీఎస్ నుంచి ఒక కారిడార్ ఏలూరు రోడ్డులో, మరో కారిడార్ బందరు రోడ్డులో రానుంది. ప్రస్తుతం సుదీర్ఘ పైవంతెన ఎన్హెచ్ఏఐ నిర్మించనుంది. మెట్రో లైనుకు ఆటంకం లేకుండా ఆదిలోనే చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
October 23, 20241 yr Author ఏపీలో పెట్టుబడులకు కొరియా సంస్థల ఆసక్తి రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు. Updated : 23 Oct 2024 19:57 IST అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ ముందుకు సాగుతున్నారు. సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యన్తో పాటు కొరియన్ ఎగ్జిమ్ (KEXIM) బ్యాంక్ ఈడీసీఎఫ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్-2 డైరెక్టర్ జనరల్ కెవిన్ చోయ్, ఎగ్జిమ్ బ్యాంక్ ఎన్డీఆర్వో ముఖ్యప్రతినిధి జంగ్ వాన్ రియా, కొరియా ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (KOICA) డైరెక్టర్ చాంగ్ వూ చాన్ సచివాలయంలో మంత్రి లోకేశ్తో సమావేశమయ్యారు. పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. 2014- 2019 time lo vizag metro ki loan ivvataniki vacharu villu రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు ఎగ్జిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి లోకేష్ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామన్నారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.
November 2, 20241 yr 1 hour ago, chanti149 said: Vij ki metto deniki comedy Even vizag ki kuda anavsaram ne but after 10 years it's impossible to construct, mana AP people ni chusthe next term yevvarni gelipistharo kuda cheppalemu
November 2, 20241 yr 3 hours ago, sonykongara said: idhi kadhatara kaedram dabbu antha isthundha kevalam prathi paadhana aena?
November 2, 20241 yr Good to get ready for the future needs instead of waiting until the need arises Edited November 3, 20241 yr by Hello26
November 2, 20241 yr 3 hours ago, chanti149 said: Vij ki metto deniki comedy Jus ala pedatharu req, inko 5yrs atleast varaku jarigedi kadu le... Ippudu pedithe appatiki oka form loki vachiddi.. Complete ayyeki total ga 5 to 10 yrs ayyiddemo.... కూటమి లో benifit avvalante ఇదే గా time...
November 2, 20241 yr These kinds of long-term projects are risky for states like AP since we have volatile voters. These projects need gov. support for at least 10-15 yrs. If Jaggad comes to power in the meanwhile, then it's a gone case. KCR and co. delayed Hyd metro to milk Land T out of it.
November 3, 20241 yr 11 hours ago, AndhraBullodu said: idhi kadhatara kaedram dabbu antha isthundha kevalam prathi paadhana aena? New metro policy: Central government provide upto 10% of project cost as viability gap funding.
December 3, 20241 yr Metro waste vijayawada vizag ki even after 15 years ayina it will be cost failure, better regional transport like Delhi- Meerut RRTS , it will become instant hit
December 3, 20241 yr 4 hours ago, satya said: Metro waste vijayawada vizag ki even after 15 years ayina it will be cost failure, better regional transport like Delhi- Meerut RRTS , it will become instant hit 20 years ki ayina panikostundi le bro...hyd lo kuda starting waste annaru...
December 4, 20241 yr 12 hours ago, ChiefMinister said: 20 years ki ayina panikostundi le bro...hyd lo kuda starting waste annaru... Rrts ayithe anakapalli tuni varaku veyachu transportation easy avuddi vizag ki, city varaku hybrid busses and electic Busses use cheyachu frequently, vijayawada tisukuna eluru to amaravathi rrts will cover metro valla adi avadu, vyuru to amravathi, nuzvid to amravathi, peta to amravathi rrts will be fast travel commute
January 3, 20251 yr Author విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. By Andhra Pradesh News DeskUpdated : 03 Jan 2025 06:42 IST హైవేలో ఫ్లైఓవర్లు వచ్చే చోట 18 మీటర్ల ఎత్తులో నిర్మాణం మిగిలిన ప్రాంతాల్లో 10 మీటర్ల ఎత్తులోనే.. మెట్రో ప్రాజెక్టులకు కేంద్రమే 100% నిధులివ్వాలి ఆ మేరకు సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం ఆదేశం డబుల్ డెక్కర్ నాలుగు లైన్ల ఫ్లైఓవర్, మెట్రో రైల్ నిర్మాణ నమూనా ఈనాడు, అమరావతి: మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కి.మీ. పొడవున, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.70 కి.మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులపై గురువారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ఆమోదించారు. రెండు ప్రాజెక్టులపైనా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2017 మెట్రో రైల్ విధానం ప్రకారం విశాఖ, విజయవాడలో మొత్తం 142.90 కి.మీ. పొడవునా చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులు కేంద్రం సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదే విధానంలో కోల్కతాలో 16 కి.మీ. మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.8,565 కోట్లు కేంద్రమే సమకూర్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో రైల్ ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఆ చట్టప్రకారమైనా.. 2017 మెట్రో విధానంలోనైనా కేంద్రం సాయం చేయాలని, ఈ మేరకు సంప్రదింపులు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెండు నగరాల్లోనూ నాలుగేళ్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించి, కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. డబుల్ డెక్కర్ మోడల్ అంటే? కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్ (పైవంతెన), ఆపైన మెట్రో ట్రాక్ రానుంది. మొత్తంగా 18 మీటర్ల ఎత్తులో కొన్ని చోట్ల మెట్రో రైల్ నడవనుంది. రోడ్డుపై 10 మీటర్ల ఎత్తున మెట్రో రైల్ నడిచేలా తొలుత ప్రతిపాదించారు. జాతీయ రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు చోట్ల కేంద్రం పైవంతెనలు ప్రతిపాదించింది. విజయవాడ, విశాఖ నగరాల మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారిలోనూ కొన్ని చోట్ల పైవంతెనలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి ప్రాంతాల్లో మారిన కొత్త డిజైన్ ప్రకారం మెట్రో రైల్ 18 మీటర్ల ఎత్తులో వెళ్లనుంది. దీని ప్రకారం కింద రోడ్డుకు 10 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్, దానిపై మరో 8 మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ రానుంది. పైవంతెన దాటాక మళ్లీ 10 మీటర్ల ఎత్తులోనే మెట్రో రైలు నడవనుంది. ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
January 30, 20251 yr Author విజయవాడ, విశాఖ మెట్రోలకు 199 ఎకరాల భూ సేకరణ విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. By Andhra Pradesh News DeskUpdated : 30 Jan 2025 06:45 IST Ee Font size కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు
January 30, 20251 yr Vizag lo metro project valla road flyovers project hold ayyindhi Twaraga thelchaali
Create an account or sign in to comment