Jump to content

Uttarandhra MASS


Recommended Posts

Posted
49 minutes ago, Mobile GOM said:

Votelu veyyali gaa AP janalu. 2019 campaign ki kuda ilage vachharu AP janalu. Maaku nammakamu AP janalu meeda Dora 

If you notice keenly, youth are participating actively which is a very good sign. 2019 lo jagan gadiki vachina response vastundi ippudu manaki.

Posted
5 minutes ago, Telugunadu said:

If you notice keenly, youth are participating actively which is a very good sign. 2019 lo jagan gadiki vachina response vastundi ippudu manaki.

Votelu veste manchi de kada bro chuddamu.

Posted
1 hour ago, Mobile GOM said:

Votelu veyyali gaa AP janalu. 2019 campaign ki kuda ilage vachharu AP janalu. Maaku nammakamu AP janalu meeda Dora 

TDP..ycp..trs.. ఇలాంటి పార్టీ కి..మీటింగ్ అంటే crowd pulling mandatory..so నిజం చెప్పాలి అంటే 2019 లో మీటింగ్స్ కి ..పసుపు కుంకుమ .. reason..ycp meetings ayuthey 100% money ఇచ్చేవాళ్ళు. జఫ్ఫా గానీ కాన్వాయ్ కి ప్రకాశం నుండి రెగ్యులర్ గా ఒక బ్యాచ్ వుండేది.. still 2019 lo landslide victory..

Tv news..paper news .. ఇలాంటి crowd పుల్లిన్ chusi.votes పడే రోజుకు పోయాయి..

PK గాని టీమ్ reach mamuli ga ledu.. continuously evaluated and reached the people..

Good sign is youth attending now days for TDP meetings and leaders also not completely rely on crowd pulling..

 

Posted
7 hours ago, ravindras said:

2019 election mundhu sakshi trp baagaa perigindhi. Jagga emi chepthaado ani janaalu sakshi news choosevaaru. ippudu TV5, ABN trp perigindhi

Data please

Posted

It’s common that people stay opposite to the ruling party and move with opposition party 

Now , TDP has to play dominated role just like YCP did when they were in opposition 

Local leaders are very important from now on 

Posted

GA gaadi article....

విశాఖ జిల్లాలో ప్రమాద ఘంటికలు
GREATANDHRA | JUN 18, 2022
    
స్వంత సర్వేలు ఎంతయినా చెప్పొచ్చు. పార్టీ నాయకులు ఎన్ని గాంభీర్యపు పోకడలు పోయినా పోవచ్చు. పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా వుంటే వుండొచ్చు.
ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా..ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకున్నా అనుకోవచ్చు.

కానీ..గ్రౌండ్ లెవెల్ వాస్తవం అలా లేదు. విశాఖ జిల్లాలో వైకాపా కు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక సుస్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు సమావేశాలకు జనం భారీగా తరలివచ్చిన తీరు చూస్తుంటే రాజకీయ వర్గాలే విస్తుపోతున్నాయి. జనంలో అధికార పక్షం మీద ఇంతటి వ్యతిరేకత వచ్చిందా? అని ఆశ్చర్యపోతున్నాయి. దీంతో అధికార పక్షంలోంచి తెలుగుదేశంలోకి జంప్ చేయాలని ఆలోచించే వారు మొదలైపోయారు. ఇది సత్యం.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మీద ఆయన అనుచర గణం వత్తడి మొదలైపోయింది. అర్జంట్ గా చంద్రబాబును కలవమని ఆయనను అనుచరులు వత్తిడి చేస్తున్నారు. గతంలో జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు గంటా శ్రీనివాసరావు ప్రమేయం లేకుండానే చంద్రబాబు సభలు విజయవంతం కావడం విశేషం. గ్రామానికి కనీసం ముగ్గురిని అయినా తీసుకురండి అని పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులకు చెబితే పది పదిహేను మంది వంతున రావడం పెద్ద ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా కనీసం మంచి నీళ్ల పాకెట్లు కూడా ఇవ్వకుండా.

చూస్తుంటే జగన్ యాంటీ మీడియా కథనాలు ప్రజల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని సెంటిమెంట్ వుంటుంది అనుకుంటే జనాలు ఇలా భయంకరంగా రావడం చూస్తుంటే వైకాపా పట్ల జనం వ్యతిరేకత పెంచుకుంటున్నారా? లేదా చంద్రబాబు మీద ప్రేమ పెంచుకుంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


అనకాపల్లి సభ విజయవంతం కావడం గమ్మత్తయిన విషయం. ఎందుకంటే ఇక్కడ కాపులకు ప్రాధాన్యత ఇచ్చి, గుడివాడకు మంత్రి పదవి ఇచ్చారు. గవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. పదవులు ఇచ్చారు. అన్నింటికి మించి అనకాపల్లిని జిల్లా కేంద్రం చేసారు. అయినా జనం ఇలా రావడం వెనుక ఏముంది? అన్నది పాయింట్. వెలమలను పక్కన పెట్టడం అన్నది గట్టిగా ప్రభావం కనబరుస్తోందని లోకల్ రాజకీయనాయకులు అంచనా వేస్తున్నారు. నిజానికి వెలమలకు కూడా ఇటీవలే మంత్రి పదవి దక్కింది. కానీ దాని ప్రభావం మాత్రం కనిపిస్తున్నట్లు లేదు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ వెలమలకు పెద్ద పీట వేస్తూ వస్తోంది. బండారు, అయ్యన్న తరచు వైకాపాను గట్టిగా ఢీ కొంటున్నారు.

ఇక చోడవరం లాంటి చిన్న సెంటర్ లో జనం వేలాదిగా తరలి రావడం చూసి వైకాపా చోటా నాయకులు కిందా మీదా అయిపోతున్నారు. చోడవరం సభ అంత భారీ సక్సెస్ కావడానికి రీజన్ ఏమిటి అని కారణాలు లెక్కిస్తున్నారు.

విజయనగరం అన్నది అటు బొత్సా, ఇటు కొలగట్ల లాంటి వైకాపా నాయకులు వున్న ప్రాంతం. అక్కడ సభ ఏ రేంజ్ లో జరిగిందో తెలుస్తూనే వుంది. అలా అని దేశం నాయకుడు అశోక్ గజపతి డబ్బులు ఖర్చు చేసే నాయకుడు కారు. నిజానికి ఇటు విశాఖ, అటు విజయనగరం ప్రాంత దేశం జనాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు సభలకు ఎవ్వరూ డబ్బులు తీయలేదు. ఎందుకంటే ఇంకా టికెట్ అన్నది ఎవ్వరికీ ఖరారు కాలేదు. అలా అని ఆశావహులు ఎవ్వరూ డబ్బులు తీయలేదు. కాస్త డబ్బులు తీయడం ఇప్పటి నుంచీ మొదలుపెట్టాలని సభలకు వెళ్లి వచ్చిన కార్యకర్తలే చెబుతుండడం విశేషం.

చంద్రబాబు కూడా ప్రతి సభలో గంట సేపు ఉపన్యాసాలు ఇచ్చారు. కదలకుండా, కూర్చోకుండా అలా నిల్చుని గంట సేపు అనర్గళంగా మాట్లాడడం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది అన్నది వాస్తవం. ఈ వయస్సులో ఆ స్టామినా ఏమిటి అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మరోపక్కన జనసేన పొత్తుకూడా వుండాలనే తెలుగుదేశం కింది స్థాయి నాయకులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపులు గణనీయ సంఖ్యలో వున్నారు. వీళ్లు అన్ని పార్టీల్లోనూ వున్నారు. జనసేన..దేశం ఒకటైతే మూడు వంతుల ఓట్లు ఒకవైపే పడతాయని లెక్కలు కడుతున్నారు.

మొత్తం మీద ఉత్తరాంధ్రలో వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కానీ ఇది ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక మాత్రమే కావచ్చు. పదవులు పొందిన నాయకులు ధీమా పడిపోయినా, పదవులు పోయిన వారు పట్టించుకోకుండా వదిలేసినా, ఫలితం దారుణంగా వుండే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో స్కూళ్ల పనులు తప్ప మరో పని జరగలేదు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్ని గ్రామాలకు వుండవు. రోడ్లు అయితే అన్ని గ్రామాలకు వస్తాయి. కేంద్రం ఇస్తున్న రోడ్ల నిధులు కిందకు రావడం లేదు. దాని ప్రభావం గట్టిగా వుంది.

పైగా వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పనులకు బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. తెలుగుదేశం హయాంలో బిల్లులు కూడా పెండింగ్ లోనే పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ బిల్లులు అన్నీ వస్తాయని కింది స్థాయి చోటా కాంట్రాక్టర్లు నమ్ముతున్నారు. ఒకటి ఒకటి కలిస్తే రెండు అన్నట్లు..వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగడానికి ఇలా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దీనికి గమనించి ప్రణాళికలు మార్చుకోవాల్సి వుంది.

Posted
11 hours ago, fan no 1 said:

PK daggara chala tactics vunnai, elections ayyi results vachevarku careful ga vundali.

Manam clueless ga vunnantha kalam vadi daggara tactics vuntayi..... 

Prathi pichi paniki immediate ga counter ready chese core team vundali... Additional ga eppatikappudu pressure build chese tactics vundali mana daggara as a opposition.. 

Posted
17 hours ago, Siddhugwotham said:

GA gaadi article....

విశాఖ జిల్లాలో ప్రమాద ఘంటికలు
GREATANDHRA | JUN 18, 2022
    
స్వంత సర్వేలు ఎంతయినా చెప్పొచ్చు. పార్టీ నాయకులు ఎన్ని గాంభీర్యపు పోకడలు పోయినా పోవచ్చు. పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా వుంటే వుండొచ్చు.
ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా..ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకున్నా అనుకోవచ్చు.

కానీ..గ్రౌండ్ లెవెల్ వాస్తవం అలా లేదు. విశాఖ జిల్లాలో వైకాపా కు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక సుస్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు సమావేశాలకు జనం భారీగా తరలివచ్చిన తీరు చూస్తుంటే రాజకీయ వర్గాలే విస్తుపోతున్నాయి. జనంలో అధికార పక్షం మీద ఇంతటి వ్యతిరేకత వచ్చిందా? అని ఆశ్చర్యపోతున్నాయి. దీంతో అధికార పక్షంలోంచి తెలుగుదేశంలోకి జంప్ చేయాలని ఆలోచించే వారు మొదలైపోయారు. ఇది సత్యం.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మీద ఆయన అనుచర గణం వత్తడి మొదలైపోయింది. అర్జంట్ గా చంద్రబాబును కలవమని ఆయనను అనుచరులు వత్తిడి చేస్తున్నారు. గతంలో జిల్లాలో చక్రం తిప్పిన నాయకుడు గంటా శ్రీనివాసరావు ప్రమేయం లేకుండానే చంద్రబాబు సభలు విజయవంతం కావడం విశేషం. గ్రామానికి కనీసం ముగ్గురిని అయినా తీసుకురండి అని పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులకు చెబితే పది పదిహేను మంది వంతున రావడం పెద్ద ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా కనీసం మంచి నీళ్ల పాకెట్లు కూడా ఇవ్వకుండా.

చూస్తుంటే జగన్ యాంటీ మీడియా కథనాలు ప్రజల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని సెంటిమెంట్ వుంటుంది అనుకుంటే జనాలు ఇలా భయంకరంగా రావడం చూస్తుంటే వైకాపా పట్ల జనం వ్యతిరేకత పెంచుకుంటున్నారా? లేదా చంద్రబాబు మీద ప్రేమ పెంచుకుంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


అనకాపల్లి సభ విజయవంతం కావడం గమ్మత్తయిన విషయం. ఎందుకంటే ఇక్కడ కాపులకు ప్రాధాన్యత ఇచ్చి, గుడివాడకు మంత్రి పదవి ఇచ్చారు. గవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. పదవులు ఇచ్చారు. అన్నింటికి మించి అనకాపల్లిని జిల్లా కేంద్రం చేసారు. అయినా జనం ఇలా రావడం వెనుక ఏముంది? అన్నది పాయింట్. వెలమలను పక్కన పెట్టడం అన్నది గట్టిగా ప్రభావం కనబరుస్తోందని లోకల్ రాజకీయనాయకులు అంచనా వేస్తున్నారు. నిజానికి వెలమలకు కూడా ఇటీవలే మంత్రి పదవి దక్కింది. కానీ దాని ప్రభావం మాత్రం కనిపిస్తున్నట్లు లేదు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ వెలమలకు పెద్ద పీట వేస్తూ వస్తోంది. బండారు, అయ్యన్న తరచు వైకాపాను గట్టిగా ఢీ కొంటున్నారు.

ఇక చోడవరం లాంటి చిన్న సెంటర్ లో జనం వేలాదిగా తరలి రావడం చూసి వైకాపా చోటా నాయకులు కిందా మీదా అయిపోతున్నారు. చోడవరం సభ అంత భారీ సక్సెస్ కావడానికి రీజన్ ఏమిటి అని కారణాలు లెక్కిస్తున్నారు.

విజయనగరం అన్నది అటు బొత్సా, ఇటు కొలగట్ల లాంటి వైకాపా నాయకులు వున్న ప్రాంతం. అక్కడ సభ ఏ రేంజ్ లో జరిగిందో తెలుస్తూనే వుంది. అలా అని దేశం నాయకుడు అశోక్ గజపతి డబ్బులు ఖర్చు చేసే నాయకుడు కారు. నిజానికి ఇటు విశాఖ, అటు విజయనగరం ప్రాంత దేశం జనాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు సభలకు ఎవ్వరూ డబ్బులు తీయలేదు. ఎందుకంటే ఇంకా టికెట్ అన్నది ఎవ్వరికీ ఖరారు కాలేదు. అలా అని ఆశావహులు ఎవ్వరూ డబ్బులు తీయలేదు. కాస్త డబ్బులు తీయడం ఇప్పటి నుంచీ మొదలుపెట్టాలని సభలకు వెళ్లి వచ్చిన కార్యకర్తలే చెబుతుండడం విశేషం.

చంద్రబాబు కూడా ప్రతి సభలో గంట సేపు ఉపన్యాసాలు ఇచ్చారు. కదలకుండా, కూర్చోకుండా అలా నిల్చుని గంట సేపు అనర్గళంగా మాట్లాడడం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది అన్నది వాస్తవం. ఈ వయస్సులో ఆ స్టామినా ఏమిటి అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మరోపక్కన జనసేన పొత్తుకూడా వుండాలనే తెలుగుదేశం కింది స్థాయి నాయకులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపులు గణనీయ సంఖ్యలో వున్నారు. వీళ్లు అన్ని పార్టీల్లోనూ వున్నారు. జనసేన..దేశం ఒకటైతే మూడు వంతుల ఓట్లు ఒకవైపే పడతాయని లెక్కలు కడుతున్నారు.

మొత్తం మీద ఉత్తరాంధ్రలో వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కానీ ఇది ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక మాత్రమే కావచ్చు. పదవులు పొందిన నాయకులు ధీమా పడిపోయినా, పదవులు పోయిన వారు పట్టించుకోకుండా వదిలేసినా, ఫలితం దారుణంగా వుండే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో స్కూళ్ల పనులు తప్ప మరో పని జరగలేదు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్ని గ్రామాలకు వుండవు. రోడ్లు అయితే అన్ని గ్రామాలకు వస్తాయి. కేంద్రం ఇస్తున్న రోడ్ల నిధులు కిందకు రావడం లేదు. దాని ప్రభావం గట్టిగా వుంది.

పైగా వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పనులకు బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. తెలుగుదేశం హయాంలో బిల్లులు కూడా పెండింగ్ లోనే పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ బిల్లులు అన్నీ వస్తాయని కింది స్థాయి చోటా కాంట్రాక్టర్లు నమ్ముతున్నారు. ఒకటి ఒకటి కలిస్తే రెండు అన్నట్లు..వైకాపా కు ప్రమాద ఘంటికలు మోగడానికి ఇలా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దీనికి గమనించి ప్రణాళికలు మార్చుకోవాల్సి వుంది.

Ilanti opposite batch vi promote cheyyakunda vunte better emo..... Aa Maha vamsi kuda ga article ani cheppi, ekkada leni publicity isthunnadu, mee observation ga cheppakunda vadu kuda itta rasadu ani publicity isthe manakoche labham endi.... 

Posted
41 minutes ago, ramntr said:

Ilanti opposite batch vi promote cheyyakunda vunte better emo..... Aa Maha vamsi kuda ga article ani cheppi, ekkada leni publicity isthunnadu, mee observation ga cheppakunda vadu kuda itta rasadu ani publicity isthe manakoche labham endi.... 

Mahaa vamsi gave publicity to JS not for TDP....

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...