sonykongara 1,618 Posted December 9, 2017 పట్టిసీమ ఫలం... దివిసీమ ఇప్పుడు సిరులసీమ... దివి సీమ... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనే సాగునీటి కషాలే.... దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట కాల్వల పైనే ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలోని అన్నదాతలకు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అందిస్తున్న సాగునీరు వారి పాలిట వరంగా మారింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు కలిగిన దివి ప్రాంతంలో రెండేళ్లుగా ఏర్పడిన తీవ్ర వర్షా భావ పరిస్థితుల్లోనూ రైతులు సిరులు పండించారంటే అందుకు ప్రధాన కారణం పట్టిసీమే. ఈ సంవత్సరం జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో కాల్వ చివరి ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో డిసెంబరు మొదటి వారానికే పంట చేతికొచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదవుతున్నాయి. ఏటా తీవ్ర సాగునీటి ఎద్దడి కారణంగా నాగాయలంక మండలం గుల్లలమొద, సోర్లగొంది, గణపేశ్వరం, నాలి, కమ్మనమోల గ్రామాలు, కోడూరు మండలం రామకృష్ణాపురం, ఇరాలి, బసవ వానిపాలెం, ఊటగుండం, మోపిదేవి మండలం పెదకళేపల్లి, చింతలమడ, చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం చిలకలపూడి, రుద్రవరం ప్రాంతాల్లో రైతులు నష్టాల పాలయ్యే సందర్భాలే ఎక్కువ. పట్టిసీమ పుణ్యమా అని జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో జులె నెలాఖరు నాటికే దాదాపు ఎగువ రైతులంతా నాట్లు పూర్తీ చేసుకోవటంతో చివరి రైతులకు వంతులవారీగా నీటిని విడుదల చేసారు... సాగునీటి ఎద్దడి తలెత్తినా రైతులు మొక్కవోని ధైర్యంతో సాగు కొనసాగించటంతో కాల్వ చివరి గ్రామాల్లో ప్రస్తుతం వరి పైరు పొట్ట, ఈనిక దశల్లో ఉంది. ఎగువ పొలాల్లో వరి పైరు దాదాపగా గింజ గట్టిపడే దశకు చేరుకుని కోతకు సిద్ధమైంది. దివిసీమ అంతా మొత్తం వరి పచ్చగా దర్శనమిస్తూ రైతుకు కనువిందు చేస్తోంది. పట్టిసీమ ద్వారా సకాలంలో నీరు అందడంతో పాటు కొండకోనల నుంచి పోషకాలతో కూడిన ఒండ్రును మోసుకురావటంతో పంటపొలాల్లో వరి పైరు బంగారు వర్ణంతో కనుల పండుగ చేస్తుంది. ఇప్పటికే కోతకు వచ్చిన ఏ పోలాలని పరిశీలించినా, బంగారు వర్ణంలో మిల మిల లాడుతూ దర్శనమిచ్చే వారి పైరును చుస్తే ఎకరాకు 35 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వచ్చే అవకాసం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు... 2 Anne and APDevFreak reacted to this Share this post Link to post Share on other sites
Hello26 370 Posted December 9, 2017 CBN the visionary...Completing Pattiseema and giving water to farmers is a big achievement in entire AP history Share this post Link to post Share on other sites
Anne 936 Posted December 9, 2017 5 hours ago, sonykongara said: పట్టిసీమ ఫలం... దివిసీమ ఇప్పుడు సిరులసీమ... దివి సీమ... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనే సాగునీటి కషాలే.... దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట కాల్వల పైనే ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలోని అన్నదాతలకు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అందిస్తున్న సాగునీరు వారి పాలిట వరంగా మారింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు కలిగిన దివి ప్రాంతంలో రెండేళ్లుగా ఏర్పడిన తీవ్ర వర్షా భావ పరిస్థితుల్లోనూ రైతులు సిరులు పండించారంటే అందుకు ప్రధాన కారణం పట్టిసీమే. ఈ సంవత్సరం జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో కాల్వ చివరి ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో డిసెంబరు మొదటి వారానికే పంట చేతికొచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదవుతున్నాయి. ఏటా తీవ్ర సాగునీటి ఎద్దడి కారణంగా నాగాయలంక మండలం గుల్లలమొద, సోర్లగొంది, గణపేశ్వరం, నాలి, కమ్మనమోల గ్రామాలు, కోడూరు మండలం రామకృష్ణాపురం, ఇరాలి, బసవ వానిపాలెం, ఊటగుండం, మోపిదేవి మండలం పెదకళేపల్లి, చింతలమడ, చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం చిలకలపూడి, రుద్రవరం ప్రాంతాల్లో రైతులు నష్టాల పాలయ్యే సందర్భాలే ఎక్కువ. పట్టిసీమ పుణ్యమా అని జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో జులె నెలాఖరు నాటికే దాదాపు ఎగువ రైతులంతా నాట్లు పూర్తీ చేసుకోవటంతో చివరి రైతులకు వంతులవారీగా నీటిని విడుదల చేసారు... సాగునీటి ఎద్దడి తలెత్తినా రైతులు మొక్కవోని ధైర్యంతో సాగు కొనసాగించటంతో కాల్వ చివరి గ్రామాల్లో ప్రస్తుతం వరి పైరు పొట్ట, ఈనిక దశల్లో ఉంది. ఎగువ పొలాల్లో వరి పైరు దాదాపగా గింజ గట్టిపడే దశకు చేరుకుని కోతకు సిద్ధమైంది. దివిసీమ అంతా మొత్తం వరి పచ్చగా దర్శనమిస్తూ రైతుకు కనువిందు చేస్తోంది. పట్టిసీమ ద్వారా సకాలంలో నీరు అందడంతో పాటు కొండకోనల నుంచి పోషకాలతో కూడిన ఒండ్రును మోసుకురావటంతో పంటపొలాల్లో వరి పైరు బంగారు వర్ణంతో కనుల పండుగ చేస్తుంది. ఇప్పటికే కోతకు వచ్చిన ఏ పోలాలని పరిశీలించినా, బంగారు వర్ణంలో మిల మిల లాడుతూ దర్శనమిచ్చే వారి పైరును చుస్తే ఎకరాకు 35 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వచ్చే అవకాసం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు... Inka padaledu full pledged ga... Polavaram aitae gani.. Each and every polanaki nillu vastay.. More yielding ki godavari water oka reason aitae... Inko reason aruthadulu...... Working super anatu.. Share this post Link to post Share on other sites
Anne 936 Posted December 9, 2017 37 minutes ago, Hello26 said: CBN the visionary...Completing Pattiseema and giving water to farmers is a big achievement in entire AP history Oka 5% ysr ki kuda istae potadi Dabbul venakeyachu ano edoka reason tho first canal works started.. It helped us. Share this post Link to post Share on other sites
Hello26 370 Posted December 9, 2017 (edited) 53 minutes ago, Anne said: Oka 5% ysr ki kuda istae potadi Dabbul venakeyachu ano edoka reason tho first canal works started.. It helped us. unnecessary. YSR thought was to continue constructing Polavaram and the idea of Polavaram started 2-3 decades ago. But, Polavaram late avuthundi ...ventane water ivvali ani Pattiseema idea vachindi CBN administration lo. So, court cases clear chesi, land compensation farmers ku release chesi, bridges, lining, aquadects complete chesi, canals complete chesi...PATTISEEMA construction start chesi complete chesindi CBN. So, Though Polavaram is not completed still we are seeing water and result ante....the reason is Pattiseema. Anduke credit goes to CBN. You can continue with your opinion. Nice chatting with you Brother Edited December 9, 2017 by Hello26 Share this post Link to post Share on other sites
APDevFreak 61 Posted December 14, 2017 1 seenu454 reacted to this Share this post Link to post Share on other sites
APDevFreak 61 Posted December 14, 2017 15 వేల హెక్టార్లలో అదనంగా వరి సాగు అందుబాటులో రాయితీ విత్తనాలు ఈతేరు (బాపట్ల), న్యూస్టుడే: పట్టిసీమ నుంచి అందిన సాగునీటితో.. జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో ఈ ఏడాది ఖరీప్లో అదనంగా 15 వేల హెక్టార్లలో వరి సాగు చేసినట్లు జేడీఏ విజయభారతి అన్నారు. మండల పరిధిలో ఈతేరులో నిర్వహించిన వరి కోత ప్రయోగాన్ని జేడీఏ బుధవారం పరిశీలించారు. రైతు కుంచాల సాంబయ్య పొలంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఎకరాకు 41 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్వహించిన పంటకోత ప్రయోగాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల గతేడాది కన్నా సగటు దిగుబడి ఓ బస్తా తగ్గినట్లు తేలిందన్నారు. గతేడాది ఖరీప్లో వరి సాగు విస్తీర్ణం 1.69 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 1.84 లక్షల హెక్టార్లలో వరి పండించారని వివరించారు. సాగు ధ్రువీకరణ, ఎల్ఈసీ పత్రాలు ఉన్న కౌలు రైతులకు టార్పాలిన్ పట్టాలు, రాయితీ పరికరాలను అందజేస్తామన్నారు. పల్లాకు తెగులు సోకని మినుము టీబీజీ-104 రకం విత్తనాలు, పెసరలో ఐపీఎం 2-14 విత్తనాలను రాయితీపై రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేసుకోవాలని, ఇతర ప్రాంతాల్లో అపరాలు, శనగ సాగు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పత్తి పంట విస్తీర్ణం పెరగగా మిర్చి విస్తీర్ణం మాత్రం తగ్గిందన్నారు. కార్యక్రమంలో డీడీ ఎం.రామలింగయ్య, ఏఎస్వోలు టి.మధుసూదనరావు, డి.శేషగిరిరావు, ఏడీఏ ఏవీఎస్ శాస్త్రి, ఏవో ధనరాజ్, ఏఈవోలు భాగ్యలక్ష్మి, శ్రావణబిందు, ఎంపీఈవోలు నరేంద్ర, పృథ్వీ, సీపీడబ్ల్యూ మాధవరావు, అభ్యుదయ రైతులు మార్పు నాగేశ్వరరావు, మన్నె సాంబశివరావు పాల్గొన్నారు. Share this post Link to post Share on other sites
Yaswanth.M 95 Posted December 22, 2017 Chinthamaneni pattiseema katteppudu baaga active ga work cheyincharani local ga unnavallu chepparu Share this post Link to post Share on other sites
APDevFreak 61 Posted December 22, 2017 Pattiseema has shown the taste of good yield and continuous supply of water. This year there was constant flow until November. Next year expectations will be high, Govt should be very careful as there are many factors like enough rains and rush for early crops. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted December 30, 2017 పట్టిసీమ లేకుంటే జనం రాళ్లేసేవాళ్లు పోలవరం పూర్తయ్యేవరకు నిద్రపోను నీళ్లుంటే ప్రాజెక్టులు కట్టుకోవడమే ముఖ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు, అమరావతి: ‘పోలవరం పూర్తయ్యేవరకు నిద్రపోను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే నా జీవితాశయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ‘ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తోంది.. బిల్లులు సకాలంలో చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 2018 నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నా. కాంక్రీటు పనులు వేగం పుంజుకోవాల్సి ఉంద’ని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మించి 60 ఏళ్లయిన సందర్భంగా విజయవాడలోని బ్యారేజీ సమీపంలో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాడు బ్యారేజీ నిర్మాణ పనుల్లో భాగస్వాములైన సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. గోదావరి, ప్రకాశం ఆనకట్ట, బ్యారేజీల నిర్మాణం, కాటన్దొర, ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, ఓర్ తదితరుల పాత్రను, చరిత్రను స్మరించుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక నాడే కర్నూలు కాకుండా విజయవాడ రాజధాని అయి ఉంటే ఇప్పటికే రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండేదని వ్యాఖ్యానించారు. నేటి పరిస్థితుల్లో పట్టిసీమ నిర్మించుకుని ఉండకపోతే ఈ రోజు ఇక్కడ ఇలా ఘనంగా కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇక్కడ నిలబడితే జనం రాళ్లు వేసే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ ప్రాజెక్టులు కట్టుకోవడమే ముఖ్యమని, సాధ్యత ఉందా లేదా అనుకుంటే కుదరదని చంద్రబాబు అన్నారు. జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీకి సీఎం 2018లోనే శంకుస్థాపన చేయనున్నారన్నారు. దిగువన చోడవరం వద్ద రెండున్నర టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజి ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర జల సంఘానికి పంపినట్లు చెప్పారు. దిగువన అవనిగడ్డ సమీపంలో శ్రీకాకుళం వద్ద జీవావరణ సమతౌల్యం కోసం మరో కట్టడం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. నాడు ఆంధ్రరాష్ట్రం విడిపోయి ప్రకాశం బ్యారేజీ నిర్మాణ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, నేడు అవే పరిస్థితులు ఉన్నాయని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ అన్నారు. నాడు ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ఆర్థిక మంత్రి తెన్నేటి విశ్వనాథాన్ని ప్రకాశం బ్యారేజీ నిర్మాణ నిధుల కోసం ప్రణాళికాసంఘం వద్దకు పంపితే కేంద్ర సహకారం లభించలేదని అన్నారు. సొంత నిధులతోనే నిర్మించుకుందామని ప్రకాశం పంతులు పని ప్రారంభించారని వివరించారు. పోలవరం విషయంలో అలా ఉండకూడదని కేంద్రాన్ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జలవనరుల నిపుణులు చెరుకూరి వీరయ్యచౌదరి, రోశయ్య, ఐఎస్ఎన్రాజు, రెహ్మాన్, ఉన్నతాధికారులు శశిభూషణ్కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Share this post Link to post Share on other sites
rk09 44 Posted January 14, 2018 14 Jan 18 డెల్టాలో సిరుల సంక్రాంతి వరికి మద్దతుకు మించిన ధరతో గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండటంతో ఆదాయం ఈనాడు-అమరావతి కృష్ణా డెల్టాలో వరిసాగు చేసిన రైతులు సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకుంటున్నారు. పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాల రాకతో సకాలంలో వరి సాగుచేయడంతో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. ఎన్నడూ లేనివిధంగా ధాన్యం ధరలు మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతుండటం రైతులకు కలసివస్తోంది. ఇంటివద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండటం, ధర గిట్టుబాటు కావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. కౌలురైతులకు కూడా కౌలుమొత్తం, ఖర్చులు పోనూ ఎకరాకు రూ.10వేల వరకు సొమ్ము మిగులుతోంది. పంటకోత సమయంలో వ్యాపారులు పొలంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. డెల్టాలో సింహభాగం రైతులు బీపీటీ-5204 రకం సాగుచేశారు. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడి ధాన్యాన్ని తీసుకెళ్తున్నారు. ఎకరాకు సగటున 37 బస్తాల దిగుబడి వస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల పంటకోత ప్రయోగాల ద్వారా తేల్చారు. కోసిన వెంటనే 75కిలోల ధాన్యం బస్తా రూ.1300లు, కుప్ప వేసి నూర్పిడి చేసిన ధాన్యం బస్తా రూ.1500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అవసరాల మేరకు ధాన్యం విక్రయించి మిగిలిన ధాన్యాన్ని నిల్వచేయడానికి మొగ్గుచూపుతున్నారు. కృష్ణా డెల్టాలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వాతావరణం అనుకూలించడం, సాగునీరు సకాలంలో అందడంతో ఎకరాకు 35బస్తాల నుంచి 43 బస్తాల వరకు ధాన్యం దిగుబడులు వచ్చాయి. పట్టిసీమ పథకంతో సాగునీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో గత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగడంతో జలాశయాలకు వరదనీరు చేరలేదు. ఈ క్రమంలో గోదావరి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా జూన్ నెలలోనే నీటిని ప్రకాశం బ్యారేజీకి పంపింగ్ చేసి కృష్ణా డెల్టాకు సాగునీరు అందించారు. జూలై నెల ప్రారంభం నుంచి నారుమళ్లు, నాట్లు ప్రారంభించిన రైతులు సకాలంలో నాట్లు పూర్తిచేశారు. స్థానిక వాగుల ద్వారా బ్యారేజీకి చేరిన నీరు, పులిచింతలకు వచ్చిన వర్షపునీరు, పట్టిసీమ ద్వారా పంపింగ్ చేసిన నీటితో డెల్టాలో క్రమం తప్పకుండా సాగునీరు అందించారు. వారాబందీ విధానం అనుసరించడం, వాతావరణం అనుకూలించడంతో ధాన్యం దిగుబడులు పెరిగాయి. పంటకు నిరంతరం నీరు పెట్టకుండా తడుల వారీగా అందించడంతో దిగుబడులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. పంట చివరి దశలో కొన్ని ప్రాంతాల్లో పంటకు దోమ ఆశించి ఎకరాకు 2 నుంచి 3 బస్తాల ధాన్యం తగ్గింది. ఎకరాకు రైతులు సాగు విధానం అనుసరించి 35 బస్తాల నుంచి 43బస్తాల వరకు దిగుబడులు వచ్చాయి. తుపానుల ముప్పు కూడా లేకపోవడంతో రైతులు నూర్పిడి సమయంలో ధాన్యం నాణ్యతగా ఇంటికి చేరింది. ఏటా పంటకోత సమయంలో తుపానులతో డెల్టా రైతులు అష్టకష్టాలు పడేవారు. ఈఏడాది కోత సమయంలో వాతావరణం అనుకూలించడం కర్షకులకు కలసివచ్చింది. గతంలో రైతు గడప దాటాక ధాన్యానికి మార్కెట్లో మంచి ధర వచ్చేది. ఇందుకు భిన్నంగా ఈసారి రైతు ఇంట ధాన్యం ఉన్నప్పుడే ధరలు పెరగడంతో రైతులకు ఆశించిన ధర లభించింది. గుంటూరు జిల్లాలో బీపీటీ ధాన్యం సింహభాగం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. డెల్టాలో కౌలు ఎకరాకు సగటున రూ.22 వేల నుంచి రూ.25వేల వరకు నడుస్తోంది. ఎకరాకు సగటున 37బస్తాల దిగుబడి వస్తే బస్తా ధాన్యం రూ.1450లు చొప్పున ఎకరాకు రూ.53,650 వరకు లభిస్తోంది. ఇందులో కౌలుసొమ్ము రూ.25వేలు, పెట్టుబడి ఖర్చు రూ.20వేలు పోగా కనీసం ఎకరాకు రూ.8650లు మిగులుతోంది. చాలామంది 40బస్తాల దాకా దిగుబడి రావడంతో మిగులుసొమ్ము ఆమేరకు పెరుగుతోంది. సొంతదారుకు అయితే ఎకరాకు రూ.35వేల వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎల్ఆర్ రకాలు సాగుచేసిన రైతులు బస్తా ధాన్యం రూ.1200ల నుంచి రూ.1250 వరకు విక్రయిస్తున్నారు. కౌలుదారులు రెండోపంటగా జొన్న, మొక్కజొన్న, అపరాలు సాగుచేశారు. రబీ పంట కలసివస్తే ఈసారి సాగు లాభదాయకమేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఊహించని విధంగా ధర వంద ఎకరాల్లో వరి సాగు చేశాను. ఈ ఏడాది సాగునీరు సకాలంలో రావడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి. దీనికితోడు ఊహించని విధంగా పంట కోత సమయంలోనే ధాన్యం ధర పెరగడం బాగా కలిసొచ్చింది. దిగుబడులు, ధర ఆశాజనకంగా ఉండటంతో ఆదాయం వచ్చింది. - కోగంటి లవ్కుమార్, రైతు Share this post Link to post Share on other sites
rk09 44 Posted January 14, 2018 డెల్టాలో కౌలు ఎకరాకు సగటున రూ.22 వేల నుంచి రూ.25వేల వరకు నడుస్తోంది. ఎకరాకు సగటున 37బస్తాల దిగుబడి వస్తే బస్తా ధాన్యం రూ.1450లు చొప్పున ఎకరాకు రూ.53,650 వరకు లభిస్తోంది. ఇందులో కౌలుసొమ్ము రూ.25వేలు, పెట్టుబడి ఖర్చు రూ.20వేలు పోగా కనీసం ఎకరాకు రూ.8650లు మిగులుతోంది. చాలామంది 40బస్తాల దాకా దిగుబడి రావడంతో మిగులుసొమ్ము ఆమేరకు పెరుగుతోంది. సొంతదారుకు అయితే ఎకరాకు రూ.35వేల వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎల్ఆర్ రకాలు సాగుచేసిన రైతులు బస్తా ధాన్యం రూ.1200ల నుంచి రూ.1250 వరకు విక్రయిస్తున్నారు. కౌలుదారులు రెండోపంటగా జొన్న, మొక్కజొన్న, అపరాలు సాగుచేశారు. రబీ పంట కలసివస్తే ఈసారి సాగు లాభదాయకమేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Share this post Link to post Share on other sites
rk09 44 Posted January 15, 2018 sontha polam vunna raithu ki, per acre - 35k to 50K earnings (karchula taruvatha) koulu raithulaki, per acre, 10K to 20K earnings (again after karchulu) super anthe idhi pattiseema benefits idi AP state kuda indirect ga benefit ye - in terms of taxes/stimulates economy Share this post Link to post Share on other sites
RKumar 804 Posted January 16, 2018 Pattiseema pumps stop chesara? how much water released from Pattiseema till now to West Godavari, Krishna, Guntur, Prakasam in TMCs? Share this post Link to post Share on other sites
Nfan from 1982 164 Posted January 16, 2018 57 minutes ago, RKumar said: Pattiseema pumps stop chesara? how much water released from Pattiseema till now to West Godavari, Krishna, Guntur, Prakasam in TMCs? Almost one month back ae aapesaaru brother. I think 110 TMC pumped in this season Share this post Link to post Share on other sites
surapaneni1 171 Posted January 16, 2018 10 minutes ago, Nfan from 1982 said: Almost one month back ae aapesaaru brother. I think 110 TMC pumped in this season 105 Share this post Link to post Share on other sites
rk09 44 Posted January 17, 2018 (edited) Pattiseema waste anna medhavulu By Loksatta JP: http://www.thehindu.com/news/national/andhra-pradesh/pattiseema-lift-scheme-of-no-use-says-jp/article7576735.ece CAG kuda aa kovalonidhe - https://www.thenewsminute.com/article/cag-says-andhras-pattiseema-project-waste-public-money-damning-report-59632 http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/cag-raps-government-on-pattiseema-project/article17761598.ece Ap Opposition. Leader: annitiki minchi opp. leader super - reservoir ledu kabatti - waste anta - oppose annadu ippudu adagali - 2017 lo 105 tmc lu ekkadiki poyayai ani Some highlights from CAG report: The CAG also said that the state government didn't even identify the beneficiaries of the project, before its completion. “When the details of intended use of water under the scheme were called for, the Chief Engineer of the project replied (May 2016) that the list of industries had not been prepared and that the villages for domestic supply could not be identified since the distributary system for Polavaram Right Main Canal had not been finalised. The reply confirms that the project was taken up without identifying the users," the CAG was quoted as saying. The CAG also noted that the life of the project was taken as 20 years in the DPR and depreciation was allowed accordingly. However, the project was contemplated to run only till the completion of the Polavaram project in 2019. “Thus, the life of the PLIS would be only three years,” the CAG observed. Due to lack of canal system of adequate carrying capacity, only 11 of the 24 pumps of the PLIS were operated during the flood in July - September 2016. Thus, due to improper planning, the targeted objectives could not be achieved despite completion of the scheme. Edited January 17, 2018 by rk09 Share this post Link to post Share on other sites
nivas_hyd 207 Posted January 19, 2018 4 hours ago, Yaswanth526 said: Good info.... Share this post Link to post Share on other sites
Uravakonda 245 Posted January 19, 2018 7 hours ago, Yaswanth526 said: Varshalu baaga help ayyayi eesari. Share this post Link to post Share on other sites
APDevFreak 61 Posted January 23, 2018 అరుపులు, కేకలతో దద్దరిల్లిన పీఏసీ.. వాడీ వేడీగా చర్చ 23-01-2018 20:09:58 అమరావతి: అరుపులు, కేకలతో పీఏసీ దద్దరిల్లింది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన పీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పట్టిసీమపై వాడీ వేడీగా చర్చ సాగింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగా పట్టిసీమ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున అదనపు ఖర్చు పెట్టారంటూ అధికారులపై పీఏసీ చైర్మన్ బుగ్గన, వైసీపీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ విరుచుకుపడ్డారు. అయితే పట్టిసీమ వల్లే ఈ ఏడాది వంద టీఎంసీల నీటిని ఇచ్చామంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఎదురు దాడికి దిగారు. గతంలో ఏదైనా ప్రాజెక్టు ఏడాది కాలంలో పూర్తై.. నీళ్లు ఇచ్చిన సందర్భాలున్నాయా అంటూ ఇరిగేషన్ సెక్రటరీ శశిభూషణ్ను బీదా ప్రశ్నించారు. దేశంలో మరెక్కడా ఈ తరహాలో త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోలేదని ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన మర్నాడే నీళ్లందించామని శశిభూషణ్ స్పష్టం చేశారు. కేంద్రం దయ తలిస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని లేకుంటే పట్టిసీమే ప్రాణాధారమన్న బీదా వ్యాఖ్యానించారు. ఎక్సెజ్ డ్యూటీ, లేబర్ సెస్సులలో అధిక చెల్లింపులు జరిపారని ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సమావేశం ముందుంచాలని బీజేపీ సభ్యుడు విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. వచ్చే సమావేశంలో సమావేశంలో రికార్డులను ప్రవేశపెడతామని అధికారులు విష్ణుకు సమాధానమిచ్చారు. అసలు పట్టిసీమ కాంట్రాక్టర్కు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని విష్ణుకుమార్ రాజు సూటి ప్రశ్న సంధించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో సంప్రదాయ పద్దతిలో కాకుండా డయాఫ్రం వాల్ ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల్లో టెండర్ల ఖరారులోని లోపాలను సమావేశంలో బీదా ప్రస్తావించారు. గంట, అరగంట ముందు కూడా టెండర్ నిబంధనలు మార్చిన సందర్భాలు లేవా..? అంటూ అధికారులను టీడీపీ సభ్యుడు బీదా ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎన్నో ఉపయోగాలుంటే ప్రతిపక్షం పని గట్టుకుని విమర్శలు చేస్తోందని బీదా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Share this post Link to post Share on other sites
APDevFreak 61 Posted January 23, 2018 EE Vishnukumar Raju assembly lo aha oho annadu. malli ikkada elaga... Share this post Link to post Share on other sites
Urban Legend 2,946 Posted January 23, 2018 23 minutes ago, Jeevgorantla said: EE Vishnukumar Raju assembly lo aha oho annadu. malli ikkada elaga... aayana anthey rojuko maata Share this post Link to post Share on other sites
AnnaGaru 1,178 Posted January 23, 2018 (edited) 32 minutes ago, Jeevgorantla said: EE Vishnukumar Raju assembly lo aha oho annadu. malli ikkada elaga... eyana drama and why behaves like that gurinchi mottam teliste me mind pelipotundi.....edo allies ani calm ga untunnamu manam kooda Edited January 23, 2018 by AnnaGaru Share this post Link to post Share on other sites