https://m.facebook.com/story.php?story_fbid=521059571563671&id=418219205181042
పక్క రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి కాకముందే ఇక్కడ లక్ష ఇళ్లలో విజయ దశమికి గృహ ప్రవేశాలు. లక్ష పేద కుటుంబాలకు నిజమైన పండుగరోజు. వారి జీవితాలకు శాశ్వత నివాసం దొరికిన రోజు. తమది చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి మరోసారి నిరూపిస్తున్నారు.
రూ. 16 వేల కోట్లతో 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఇళ్లు నిర్మిస్తోంది. గృహ ప్రవేశాల సందర్భంగా ప్రతి ఇంటి వద్ద రెండు మొక్కల చొప్పున రెండు లక్షల మొక్కలు నాటుతున్నారు. లబ్దిదారులు ఏ మొక్కలు కోరితే ఆ మొక్కలను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 వందలకు పైగా గ్రామ పంచాయతీలకు, 30 మున్సిపాల్టీలలోని వార్డులకు మొదటి దశలో ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 9,835 గ్రామ పంచాయతీల్లో, 884 వార్డుల్లో లక్షకు పైగా గృహాల నిర్మాణం పూర్తి అయింది.
ఇళ్ల ప్రారంభోత్సవాల సందర్భంగా పండుగ వాతావరణ నెలకొనే విధంగా మామిడి ఆకుల తోరణాలు కట్టించడంతోపాటు అందుబాటులో ఉన్న చోట అరటి బాదులు ఏర్పాటు చేసి పేదల ఇళ్ళ వద్ద ప్రభుత్వమే పండుగ జరుపుతోంది. ఏఈల ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ గృహ ప్రవేశ ఫొటోలు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఈ గృహప్రవేశాలు సీఎం డ్యాష్బోర్డులో అనుసంధానమై ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడి నుంచి పర్యవేక్షిస్తారు.