Jump to content

Recommended Posts

Posted
6 hours ago, rk09 said:

pandatam ayithe bagane pandayi kani - saraina rate ledu especially minumulu


 

write a letter to modi through connect to  pm . ask him to stop importing blackgram and other pulses.

Posted
3 minutes ago, ravindras said:

write a letter to modi through connect to  pm . ask him to stop importing blackgram and other pulses.

really, we are importing black gram? it is a shame.

  • 3 weeks later...
Posted
డెల్టాకు గోదావరి జలాలు
ఈ నెల 10 తర్వాత వదిలేందుకు సన్నాహాలు  ‌
కసరత్తు పూర్తి చేసిన జలవనరుల శాఖ
ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన అధికారులు
రెండు జిల్లాల రైతుల్లో మొలకెత్తిన ఆశలు
ఈనాడు - అమరావతి
kri-brk1a.jpg

నైరుతి రుతుపవనాల ప్రభావం అప్పుడే కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. ఈ సీజన్‌లో మంచి వానలు పడతాయన్న వాతావరణ విభాగం ప్రకటన కృష్ణా డెల్టా రైతుల మదిలో ఆశలు రేకెత్తించింది. దీనికి తోడు ఈనెల 8న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఆ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఆర్టీజీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్సులో ఆదేశించారు. ఈ మేరకు జలవనరుల శాఖ సంసిద్ధమైంది. అల్పపీడనం కారణంగా భారీవర్షాలు పడతాయని, గోదావరి నదికి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 10వ తేదీ తర్వాత ఎప్పుడైనా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ వదిలితే జిల్లాకు వచ్చే సరికి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షాలే పడినా.. పరివాహక ప్రాంతంలో ఎక్కడా పెద్దగా నీరు లేకపోయినా కృష్ణా డెల్టాలోని రైతాంగాన్ని పట్టిసీమ జలాలు ఆదుకున్నాయి. రికార్డు స్థాయిలో 100 శాతం మేర నాట్లు పూర్తి అయ్యాయి. డెల్టా పరిధిలోని నాలుగు జిల్లాల్లో వరి దిగుబడులు భారీగా వచ్చాయి. నాట్లు వేసిన నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోయింది. దీంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరింది.

వరుసగా రెండేళ్లు జూన్‌లోనే..
గత ఏడాది జూన్‌లోనే తూర్పు, పశ్చిమ కాలువలకు నీటిని వదిలారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. వరుసగా రెండు ఏడాది కూడా జూన్‌ నెలలోనే డెల్టాకు సాగునీటిని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే వేసవిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నీరు - చెట్టు కింద కాలువల్లో పనులు చేశారు. నీటిని వదిలినా ఇబ్బంది లేకుండా సిద్ధం చేశారు. ప్రధాన కాలువల్లో అడ్డంకులను సిబ్బంది తొలగించారు. కనకదుర్గ పైవంతెన పనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బ్యారేజిలో స్తంభాలు వేశారు. పనుల కోసం నీటి ప్రవాహానికి ఇసుకతో అడ్డుకట్ట వేశారు. పదో తేదీ పైన నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రవాహానికి అడ్డం లేకుండా ఇసుకను తొలగించాలని ఇప్పటికే గుత్తేదారుకు చెప్పారు. ప్రకాశం బ్యారేజిలో ప్రస్తుతం 2.86 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని తీసుకోనున్నారు. కానీ తొలుత పెద్దగా నీరు అవసవరం లేనందున 2వేల క్యూసెక్కులు ఇచ్చి, ఆతర్వాత రైతుల అవసరాలను బట్టి పెంచనున్నారు. బ్యారేజిలో నీటి మట్టాన్ని పెంచి ఆతర్వాత కాలువలకు వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గత ఏడాది వలె మొదట తూర్పు కాలువ పరిధిలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు ఇస్తారు. రెండు రోజుల వ్యవధిలో పశ్చిమ కాలువకు విడుదల చేస్తారు.

నాలుగు జిల్లాలకు మేలు
కృష్ణా డెల్టా కింద పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తూర్పు కాలువ పరిధిలో 7.36 లక్షల ఎకరాలు, పశ్చిమ కాలువ కింద 5.71 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 11.12 లక్షల ఎకరాలలో వరి, చెరకు.. 24,213.8 ఎకరాలలో వేస్తారు. గత ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 140 టీఎంసీలు పైగా ఆయకట్టుకు విడుదల చేశారు. దీంతో మంచి దిగుబడులు వచ్చాయి. గత సీజన్‌లో జులై ప్రారంభం నుంచే నాట్లు ప్రారంభం అయ్యాయి. నిలకడగా సాగునీటిని వదిలారు. ఆరు నెలల పాటు నిరాటంకంగా నీటిని అందించారు. చివరి భూములకూ సకాలంలో నీరు అందడంతో రైతులు గట్టెక్కారు. జలవనరుల శాఖ ప్రణాళికాబద్ధంగా ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసింది. పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి నీటికి స్వల్పంగా కృష్ణా జలాలు తోడు అయ్యాయి. చివరి భూములకు నీటి భరోసా లభించింది. డెల్టా ప్రాంతంలో అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్లు వస్తాయి. ఆ సమయాలలో వరి పొలాల్లో నీరు నిలిచి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు ప్రభుత్వం గత ఏడాది జూన్‌లోనే విడుదల చేశారు. ముందే విడుదల చేయడం వల్ల దిగుబడులు కూడా పెరిగాయి. దీనిపై రైతుల్లో సానుకూలత వ్యక్తమైంది. ఈ సంవత్సరం కూడా ఇలాగే సాగునీటిని వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టులో దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది కూడా రైతుల్లో భరోసా నింపేందుకు ఇంకా ముందే విడుదల చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...