Jump to content

Recommended Posts

Posted (edited)
23 minutes ago, rk09 said:

aa dredging chesina isukani gatlaki dooranga poyandra - lekapothe varshalaki malli venakki vasthundi

its a good step -  water storage peruguthundi - future lifts ki paniki vasthundi on guntur dt side

and more over - due to conditions, ee dredging periodically life long chesthu vundalisindhe

e project meeda kooda Amaravati meeda case vesina batch NGT lo case vestundi ani talk....dredging chesi sand bed taggitunaru anta...

 

asalu emi batch dorikaru le....KVP&Jaffa cases meda nadipistunaru anni....

Edited by AnnaGaru
Posted
55 minutes ago, AnnaGaru said:

e project meeda kooda Amaravati meeda case vesina batch NGT lo case vestundi ani talk....dredging chesi sand bed taggitunaru anta...

 

asalu emi batch dorikaru le....KVP&Jaffa cases meda nadipistunaru anni....

avi isuka metalu ani teliyadu emo - yesukonivvandi

emi pikaleru ee vishayamlo 

Posted

case lu vese valla kante pedda jaffas la ga vunnaru aa NGT judges. 

flood control cheyyataaniki, kondaveeti vagu steep curves ni straighten+widening cheddamani plan cheste reject chesaru.

  • 1 month later...
  • 1 month later...
Posted
జలరవాణాకు మార్గం సుగుమం
08-03-2018 07:45:18
 
636560919198138040.jpg
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జలరవాణాకు ప్రాధాన్యం కల్పించి కృష్ణానదిలో అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి విజయవాడ వరకు జలరవాణా ఏర్పాటుకు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. నదిలో పడవల రాకపోకలకు సంబంధించి మార్గాన్ని సుగమం చేస్తూ విజయవాడ వైపు నుంచి నదిలో ఇసుక తోడే యంత్రాల ద్వారా ఇసుకను తొలగిస్తూ కాలువలను సిద్ధంచేస్తున్నారు. తొలుతగా వెంకటపాలెం సమీపం నుంచి పనులు ప్రారంభించి ఎగువవైపు కాలువను తీసుకొస్తున్నారు. రెండవ ఫేజ్‌ కింద హరిశ్చంద్రపురం నుంచి పనులు ప్రారంభించి వైకుంఠపురం వరకు కాలువ పనులు జరిగాయి. నదిలో నీటి మట్టాన్ని బట్టి 15అడుగుల నుంచి 20 అడుగుల వరకు లోతుతో సుమారు 15మీటర్ల వెడల్పుతో కాలువను ఏర్పాటు చేస్తూ అడ్డుగా ఉన్న ఇసుకను పైపులద్వారా బయటకు పంపిస్తున్నారు. రోజుకు ఒక్కో యంత్రం ద్వారా ఇసుక లోతును బట్టి 10 నుంచి 15 మీటర్ల ముందుకు సాగుతున్నారు. నేలమట్టం తగిలే వరకు ఇసుకను తోడి దూరంగా పోస్తున్నారు. ఈ కాలువ పనులు పూర్తి అయితే గతంలో మాదిరిగా మాదిపాడు నుంచి విజయవాడకు సరుకుల రవాణాతో పాటు పర్యాటకంగా నదీతీరం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
Posted (edited)
On 1/19/2018 at 4:08 AM, Jeevgorantla said:

Ee  level lo expect cheyocha

 

 

they transferred 44.8 billion cubic metres ie roughly 1580 tmc water transferred .

india wants to link brahmaputra ganga through bangladesh with 1 lakh cusecs link canal in 1972 . but bangladesh did not agree to this proposal. it requires lift of 15m. if china is in place of india it could occupy the bangladesh to complete interlinking project.

advantage of china government is there is only one party . no elections . they don't have to worry about to impress people through free bee  to win elections. no land rights for people . atmost they can occupy the property for 70 years. after 70 years it will go back to government. 

 

Edited by ravindras
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
Posted
ఏబీఎన్ ఎఫెక్ట్: లాంచీలు.. రైట్‌ రైట్‌..
04-05-2018 08:23:56
 
636610190402160638.jpg
  • ఫెర్రి, రాయపూడి రేవుల్లో ప్రయాణికుల సందడి
 
ఇబ్రహీంపట్నం/ అమరావతి: అనుమతులు సకాలంలో మంజూరు కాకపోవటంతో గత పదిరోజులుగా కృష్ణానదిలో లాంచీలు తిరగకుండా ఆగిపోయాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు నదిలో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. నదిలో వివిధ రేవుల ద్వారా మొత్తం ఎనిమిది లాంచీలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇరిగేషన్‌ శాఖ నుంచి కాకినాడ పోర్టుకు అనుమతులు బదలాయించడంలో తిరిగి అనుమతులు పొందేందుకు యజమానులకు కష్టతరంగా మారింది.
 
 
ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి’ పరిశీలన చేసి కథనంను రెండురోజుల క్రితం ప్రచురించింది. దీంతో స్పందించిన కాకినాడ పోర్టు అధికారులు ఫెర్రి టూ రాయపూడి తిరిగే లాంచీలకు అనుమతులు మంజూరు చేయటంతో గురువారం రాకపోకలు సాగించాయి. రాయపూడి, ఫెర్రి రేవుల్లో ప్రయాణికులతో సందడి నెలకొంది. రోజూ రాయపూడి నుంచి ఫెర్రి కి సుమారు 700 నుంచి వెయ్యి మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పదిరోజులుగా విజయవాడ వైపు నుంచి తిరిగి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి లాంచీలు ప్రారంభమవటంతో ఊపిరి పీల్చుకున్నారు.
Posted
కృష్ణా నదిలో భారీ రవాణా
04-05-2018 08:15:28
 
636610185322319005.jpg
  • రాష్ట్రంలో తొలిసారిగా రోరో కార్గో
  • ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి జలరవాణా
  • ఇప్పటికే పూర్తయిన ట్రయల్‌ రన్‌
  • 500 టన్నుల బరువు గల వాహనాలను తరలించే అవకాశం
  • ఫెర్రీలో ర్యాంపులు, స్టీలు బార్జి సిద్ధం
ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి మధ్య దూరం సుమారు 60 కిలోమీటర్లు. ఇక్కడి ఫెర్రీ నుంచి అక్కడికి ఇసుక లారీ వెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ పరిస్థితుల్లో రెండు, మూడు గంటలు పడుతుంది. ఈ దూరాన్ని, కాలుష్యాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎక్కువ సరుకును జల రవాణా చేయడానికి రోరో కార్గో (రోల్‌ ఆన్‌ - రోల్‌ ఆఫ్‌) రవాణా విధానం విజయవాడలో త్వరలో రాబోతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా రవాణాను ఆరంభించడానికి సర్కారు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోరో కార్గో రవాణా మనదేశంలో కోల్‌కతా, పట్నా, కేరళ రాష్ట్రల్లో నడుస్తోంది. అంతర్గత జలరవాణా అభివృద్ధిలో భాగంగా దీనికి విజయవాడ నుంచి శ్రీకారం చుట్టబోతోంది.
 
 
విజయవాడ: తక్కువ సమయంలో ఎక్కువ సరుకును రవాణా చేయడానికి రోరో కార్గో (రోల్‌ ఆన్‌ - రోల్‌ ఆఫ్‌) రవాణా విధానం త్వరలో రాబోతోంది. ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి మధ్య సుమారు 60 కిలోమీటర్లు దీనిని అమలు చేయనున్నారు. అంతర్గత జలరవాణా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా జల రవాణాకు వంతెనలు లేని చోట్ల పంట్లును నడుపుతుంటారు. నదికి ఓ వైపున ఉన్న వాళ్లు రెండో వైపునకు దీనిపైనే వెళ్తారు. ఈ పంట్లను కర్రల సహాయంతో నలుగురైదుగురు వ్యక్తులు ముందుకు తోసుకెళ్లారు. వీటిపై వివిధ రకాల వస్తువులతోపాటు ప్రజలను తీసుకెళ్లేవారు. రోరో కార్గో రవాణా విధానం పంట్లు మాదిరిగానే ఉంటుంది. పూర్తిగా యంత్రాల సహాయంతో నడుస్తోంది.
 
 
రోరో విధానంలో పూర్తిగా సరుకును మాత్రమే రవాణా చేస్తారు. ఇది నదులు, సముద్రలపై సాగుతోంది. ట్రక్‌లు, లారీలను తీసుకెళ్లే సామర్థ్యంతో స్టీలు బార్జిలను తయారు ఉపయోగిస్తారు. ఇది పంటి మాదిరిగా ఉంటుంది. ఉదాహరణకు అమరావతిలో ఉన్న ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి 15 టిప్పర్ల ఇసుక అవసరమైతే, ఆ మొత్తాన్ని రోరో విధానం ఒకేసారి తక్కువ సమయంలో తీసుకెళ్లవచ్చు. విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి గడచిన నెలలో ఈ బార్జిపై 15 టిప్పర్లను ఎక్కించి ట్రయల్‌ రన్‌ను నిర్వహించారు. ఒక్కో టిప్పర్‌ బరువు 15 టన్నులు. ఈ బార్జి మొత్తం 225 టన్నుల బరువు గల వాహనాలను లింగాయపాలెం రేవుకు తీసుకెళ్లగలిగింది.
 
ఇబ్రహీంపట్నం నుంచి లింగాయపాలెం ఉన్న రెండు కి.మీ దూరాన్ని ఈ బార్జి అరగంటలో చేరుకుంది. టన్నును బట్టి సరుకుకు ధర నిర్ణయిస్తారు. ఈ రోరో కార్గో రవాణాను ఎక్కువగా రైళ్లు, రహదారులపై తీసుకెళ్లడానికి వీల్లేని ఓడీసీ(ఓవర్‌ డైమెన్షనల్‌ కార్గో)ని తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. ధర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమయ్యే భారీ యంత్ర సామగ్రిని కార్గో ఓడల్లో సముద్ర మార్గాన తరలిస్తారు. కోల్‌కతాలో ఈ తరహా కార్గోను తరలిస్తుంటారు. రోరో రవాణాను నదులపై అమలు చేయాలంటే నీటి అడుగున లోతు రెండు మీటర్లు ఉండాలి. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నది లోతు రెండు మీటర్లకు పైబడి ఉండడంతో అంతర్గత జలరవాణా శాఖ అధికారులు రోరో కార్గో రవాణాకు అనుమతి ఇచ్చారు.
 
 
ఇలా పనిచేస్తుంది..
పెద్ద పరిమాణంలో ఉండే స్టీలు బార్జి నది ఒడ్డున ఉన్న ర్యాంపు వద్ద ఆగి ఉంటుంది. ఇటుక, ఇటుక, కంకర వంటి లోడ్‌తో ఉన్న ట్రక్‌లు గానీ, ఇతర సరుకులు ఉన్న లారీలు గానీ నేరుగా ఈ బార్జిపైకి తీసుకెళ్లారు. ఇవన్నీ బార్జిపై వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి. ఇబ్రహీంపట్నంలో కొత్తగా తయారు చేయించిన బార్జిపై ఒకేసారి 15 టిప్పర్లను తీసుకెళ్లవచ్చు. బార్జికి కుడి, ఎడమ వైపున రెండు టగ్‌లు ఉంటాయి. ఈ రెండూ బార్జిను తోసుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న ర్యాంపు దగ్గరకు చేర్చుతాయు. అక్కడి నుంచి డ్రైవర్లను నేరుగా బార్జిపై నుంచి టిప్పర్లను కిందికి దింపుకోవచ్చు. ఈ రోరో రవాణా వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. దీనితోపాటు వాహన, ధ్వని కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది.
roro-cargo-issue.jpg 
  • 2 weeks later...
Posted
ప్రభుత్వ ఆధీనంలోనే జల రవాణా!
18-05-2018 03:10:47
 
636622098486325374.jpg
  • బోట్లు, పడవల ఇష్టా రాజ్యానికి అడ్డుకట్ట
  • ఆర్టీసీ మాదిరే జల రవాణా నిర్వహించాలి
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు 5 నుంచి 10 వేల మంది జల మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. కోట్లు విలువ చేసే సరుకు రవాణా జలమార్గం ద్వారానే జరుగుతుంది. ఈ మొత్తం రవాణా అంతా గాలిలో దీపం చందంగానే తయారైంది. ఏ బోటు ఎప్పుడు మునుగుతుందో... ఎంత మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో చెప్పలేని దుస్థితి. ఆరు నెలల క్రితం విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద పర్యాటక బోటు మునిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల క్రితం గోదావరి నదిలో ఒక బోటు ఆకస్మాత్తుగా కాలి పోయింది. అదృష్టవసాత్తూ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. అదే గోదావరి నదిపై మంగళవారం ప్రయాణికుల బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది అమాయకులు విగతజీవులయ్యారు. ఇవి కాకుండా రోజూ ఏదో ఒక చోట చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులపై వందల సంఖ్యలో బోట్లు తిరుతున్నాయి. వీటిలో కేవలం ఒకటి లేదా రెండు శాతం బోట్లకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. మిగిలిన 98 శాతం బోట్లు అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. రాష్ట్రంలో జల రవాణా వ్యవస్థకు ప్రభుత్వం ఎలాంటి విధానాలూ రూపొందించకపోవడమే దీనికి ప్రధాన కారణం. బోట్లలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జల రవాణా మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటే తప్ప అక్రమ బోట్ల కట్టడి సాధ్యం కాదు.
 
ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ
దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ, రాష్ట్రంలోని ఆర్టీసీ కూడా మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఆర్టీసీలో చాలా తక్కువ. రైల్వే, ఆర్టీసీ మాదిరే జల రవాణాకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జల రవాణ వ్యవస్థను మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ప్రత్యేక కార్పొరేషన్‌, యంత్రాంగం ఏర్పాటు చేస్తే తప్ప ప్రమాదాలు నివారణ సాధ్యపడదు. సముద్రంలో నౌకను నడపాలంటే మన దేశంలో పోర్టు డిపార్ట్‌మెంట్‌ అనుమతి తప్పనిసరి. పోర్టు డిపార్ట్‌మెంట్‌ నౌకలకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రయాణికుల రక్షణకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రయాణికులకు అవసరమైన సెఫ్టీ పరికరాలు మొత్తం నౌకలో ఉంటే తప్ప అనుమతులు లభించవు. ఇటువంటి కఠినమైన నిబంధనలతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ మాదిరిగానే జల రవాణాకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి... బోట్లు కూడా ప్రభుత్వమే నడిపే విధంగా ఏర్పాటు చేయాలి. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు పర్యాటక పరంగా కూడా ప్రయోజనకరం. కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి సమీపంలో ప్రత్యేక బోట్లు ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు హౌరా బ్రిడ్జి వద్ద రైలు దిగిపోయి... బోటులో కోల్‌కత్తా వైపుకు వెళ్తుంటారు. ప్రయాణికులు సౌకర్యార్థం, రక్షణ కోసం ఈ బోట్లను ప్రభుత్వమే నడిపిస్తుంది. ఇదే విధానం ఏపీలోనూ అమలు చేస్తే ప్రయోజనకరం. ఇక, జల రవాణాను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పర్యాటకశాఖ పరిధిలో ఒక బోటింగ్‌ విభాగం పని చేస్తుంది. ఇది కేవలం పర్యాటక శాఖకు సంబంధించిన బోట్లను మాత్రమే పర్యవేక్షిస్తుంది. ఈ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, స్వతంత్ర వ్యవస్థగా మారిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఏపీటీడీసీ పరిధిలో ఉన్న ఈ విభాగాన్ని ఏపీటీఏ పరిధిలోకి తీసుకుని, ప్రత్యేక అధికారాలు అప్పగించాల్సిన అవసరం ఉంది. దీని వల్ల రాష్ట్రంలో ఒకవైపు పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతూనే, జల రవాణా పటిష్టం పడుతుంది. జల రవాణా ద్వారా ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. దీని వల్ల బోటులో పని చేసే సిబ్బంది, డ్రైవర్‌ దగ్గర నుంచి అందరూ శిక్షణ పొంది ఉంటారు. దీనివల్ల ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుంది.
Posted
జలరవాణాకు క్రమబద్ధీకరణ సంస్థ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో జల రవాణా కోసం ప్రత్యేక క్రమబద్ధీకరణ సంస్థను(రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఇందుకోసం తక్షణమే విధివిధానాలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో వరుస పడవ ప్రమాదాల నేపథ్యంలో ఆయన శుక్రవారం వెలగపూడిలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం పోర్టు ఆధ్వర్యంలో ఒక చట్టం, కాలువల నిర్వహణకు మరో చట్టం ఉన్నందున నియంత్రణ వ్యవస్థపై ఆ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక ముందు ఎలాంటి వైఖరి అనుసరించాలనేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద సమీక్షలో నిర్ణయించారు. పోర్టుల డైరెక్టర్‌ ఆధ్వర్యంలోనే ఆరునెలల్లోగా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత మొత్తం వ్యవహారాన్ని పోర్టుల విభాగమే పర్యవేక్షించాల్సి ఉంటుంది. వారికి అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు ఏర్పడేవరకు ఆరునెలల పాటు జలవనరుల శాఖ కృష్ణా, ధవళేశ్వరం కార్యాలయాల్లో పోర్టు అధికారులు సయితం కొందరు జత చేరతారు. ఈ రెండు శాఖల సమన్వయంతోనే వచ్చే ఆరు నెలలు జలరవాణాను పర్యవేక్షించాలని నిర్ణయించారు. పోర్టుల కార్యదర్శి అజయ్‌జైన్‌ నేతృత్వంలో పర్యవేక్షణకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధమవుతాయి. అథారిటీ ఏర్పాటుపై ముసాయిదా సిద్ధం చేసి రాష్ట్ర మంత్రిమండలిలో ఆమోదం పొందాలని నిర్ణయించారు. పడవలు, లాంచీల ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా సంచార బృందాలతో తనిఖీలు చేయిస్తారు. భవానీద్వీపం, పాపికొండల పర్యాటకం వంటి చోట శాశ్వత కార్యాలయాలు ఏర్పాటుచేసి సిబ్బంది ద్వారా తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ప్రయాణికుల పడవలకు పోర్టు అధికారులే అనుమతివ్వాలని దినేష్‌కుమార్‌ ఆదేశించారు.

  • 1 month later...
  • 3 weeks later...
Posted

కాకినాడ-ఎన్నూర్‌ జల రవాణా మార్గానికి సర్వే పూర్తి.. 
కాకినాడ నుంచి ఎన్నూర్‌ జల రవాణా మార్గానికి హైడ్రోగ్రాఫిక్‌ సర్వే పూర్తయిందని నౌకాయాన శాఖ సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దీనిని మూడు దశల్లో చేపడతామని.. మొదటి దశలో విజయవాడ నుంచి ముక్త్యాల పనులకు రూ.96 కోట్లు కేటాయించామని.. ఇందులో ఇప్పటికే రూ.18 కోట్లు వినియోగించామని తెలిపారు. రెండో దశలో విజయవాడ-కాకినాడ-రాజమహేంద్రవరం-పోలవరం వరకు టెండర్ల ప్రక్రియకు సంబంధించిన సర్వే కొనసాగుతోందన్నారు. ఇవి రెండు పూర్తయ్యాక మూడో దశ చేపడతామన్నారు. ఇందులో కాకినాడ నుంచి పుదుచ్చేరి మార్గం అభివృద్ధికి నిధులు కేటాయించలేదని చెప్పారు.

  • 2 months later...
Posted (edited)
16 minutes ago, ravindras said:

currently dredging going on for vijayawada muktyala routewhich is urgent for amaravathi capital. vijayawada muktyala route doesn't require any land acquisition. 

edi old news ga bro

Edited by sonykongara

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...