Jump to content

Recommended Posts

  • 3 weeks later...
  • 2 weeks later...
Posted
గంగా నదిపై ఇన్‌లాండ్ వాటర్‌వేస్ టెర్మినల్ జాతికి అంకితం
12-11-2018 18:23:51
 
636776438320239146.jpg
వారణాసి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం గంగా నదిపై ఇన్‌లాండ్ వాటర్‌వేస్ టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. గంగా నదిపై జాతీయ జలమార్గాలు -1లో నిర్మిస్తున్న నాలుగు మల్టీ మోడల్ టెర్మినల్స్‌లో ఇదొకటి. ప్రపంచ బ్యాంకు సహాయంతో, జల మార్గాల అభివృద్ధి పథకంలో భాగంగా దీనిని నిర్మించారు.
 
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా వరకు గంగా నదిపై జల మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 1,500 నుంచి 2,000 టన్నుల బరువుగల భారీ నౌకల ప్రయాణానికి అనువుగా ఈ టెర్మినల్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సరకు రవాణా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. పర్యావరణ హితకరమైన రవాణా మార్గంగా తీర్చిదిద్దాలన్న ఆశయం పెట్టుకున్నారు.
Posted
జాతీయ జల మార్గాల్లో సరుకు రవాణా షురూ
13-11-2018 00:49:16
 
636776669566468336.jpg
  • వారణాసిలో గంగా నదిపై నిర్మించిన తొలి మల్టీ మోడల్‌ టెర్మినల్‌ జాతికి అంకితం
వారణాసి: దేశంలో తొలిసారిగా జాతీయ జలమార్గాల ద్వారా సరుకు రావాణా ప్రారంభమైంది. కోల్‌కతా నుంచి వారణాసికి తొలి కంటైనర్‌ సోమవారం చేరుకుంది. దేశంలో తొలిసారిగా వారణాసిలోని గంగా నదిపై నిర్మించిన మల్టీ మోడల్‌ టెర్మినల్‌ను ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. కోల్‌కతా నుంచి నదీ మార్గంలో వచ్చిన తొలి కంటైనర్‌ను అందుకున్నారు. అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ పెప్సికోకు చెందిన ఆహార, పానీయాల ఉత్పత్తులతో కూడిన ఈ కంటైనర్‌ గతనెల చివరి వారంలో కోల్‌కతా నుంచి బయలు దేరింది.
 
హల్దియా నుంచి అలహాబాద్‌ (1,620 కిలోమీటర్లు) మధ్య గంగా-భగీరథీ-హూగ్లీ నదుల అనుసంధాన వ్యవస్థను ఒకటో నంబరు జాతీయ జలమార్గంగా 1986లో ప్రకటించారు. అప్పటి నుంచి భారత జలమార్గాల మండలి (ఐడబ్ల్యూఏఐ) లోతట్టు నదీ మార్గాల్లో రవాణా కోసం పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. జల్‌ మార్గ్‌ వికాస్‌ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5,369.18 కోట్లు. ఇందులో సగం నిధులను ప్రపంచ బ్యాంక్‌ సమకూరుస్తుండగా.. మిగతా సగం కేంద్రం భరిస్తున్నది. వారణాసిలో నిర్మించిన మల్టీ మోడల్‌ టర్మినల్‌.. జాతీయ జలమార్గం నెంబర్‌ 1పై తలపెట్టిన నాలుగు టెర్మినళ్లలో మొదటిది.
Posted
15 hours ago, swarnandhra said:

This canal was built specially for goods transport. deeniki funds ivvakunda endi eedu peekundi. akkadekkado button nokkadani ikkada sankalu guddukuntunnaru :wall:

evaru sankalu guddu kunnaru brother

  • 2 months later...
Posted
అడుగు పడదేం?
 

రూ.3500 కోట్లతో జాతీయ జల రవాణా మార్గం-4కు ఆమోదం
రెండేళ్లుగా నిధులు కేటాయించని కేంద్రం

gnt-gen1a_44.jpg

కొమ్మమూరు కాల్వలో జల రవాణా పునరుద్ధరణకు తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు 112 కి.మీ. మేర జాతీయ జల రవాణా మార్గం-4 నిర్మాణానికి 2016లో రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించగా వాటికి సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు సాకారమైతే సరుకు రవాణా ఖర్చు బాగా తగ్గడంతోపాటు అభివృద్ధికి వేగంగా బాటలు పడతాయని భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నేటికీ పనులు ప్రారంభం కాలేదు.

న్యూస్‌టుడే, బాపట్ల

బిట్రీషర్ల హయాంలో కొమ్మమూరు కాల్వలో జల రవాణా ప్రారంభమైంది. పడవల రాకపోకలకు అనుకూలంగా వంతెనలు నిర్మించారు. ప్రత్యేక కాల్వల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో విజయవాడ నుంచి పెదగంజాం వరకు సరుకులు, ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులు రవాణా చేసేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1960 దశకం వరకు  జల రవాణా కొనసాగింది. ప్రజలు సైతం ఈ పడవల్లో రాకపోకలు సాగించేవారు. 1968 తర్వాత రహదారులు అభివృద్ధి చెందడంతో క్రమేపీ జల రవాణా నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయింది. కొమ్మమూరులో జల రవాణాను పునరుద్ధరించాలని పధ్నాలుగేళ్ల కిత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఓ ప్రైవేటు సంస్థ ద్వారా ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయించినా అది  కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్ర ఉపరితల జల రవాణా సంస్థ ఆధ్వర్యాన విజయవాడలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2014 మేలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జల రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి కేంద్ర ఉపరితల జలరవాణా సంస్థ నిపుణులు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి కాల్వను పరిశీలించారు. జల రవాణా సవివర ప్రాజెక్టు నివేదికను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో తయారు చేయించి కేంద్ర జల రవాణా సంస్థకు పంపారు. అది దానిని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌కు పంపగా ఆమోద ముద్రా పడింది. అయినా పనుల జాడ లేకపోయింది.

ఆకృతులు ఇలా...
పడవలు రాకపోకలు సాగించాలంటే కాల్వ ఇరుకట్టలను కలుపుకుని మొత్తం వెడల్పు 120 మీటర్లు ఉండాలి. కింద వెడల్పు(బెడ్‌ విడ్త్‌) 40 మీటర్లు ఉండాలి. ఈ ప్రాజెక్టు కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమి, 650 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సివుంది. జల రవాణాను పునరుద్ధరిస్తే 10 మీ. వెడల్పు, 60 మీ. పొడవు, వెయ్యి టన్నుల సామర్థ్యం కలిగిన మరపడవలు తిరుగుతాయి. వాటి రాకపోకల కోసం కాల్వలో ఎప్పుడూ రెండున్నర మీటర్ల లోతున నీరు తప్పనిసరిగా ఉండాలి. రెండు పడవలు ఎదురుగా వచ్చినా తిరగటానికి ఇబ్బంది లేకుండా కాల్వను తీర్చిదిద్దేలా ఆకృతులు రూపొందించారు. కాల్వ వంపు బాగా ఉన్న ప్రాంతాల్లో దీనిని తగ్గించి 700 మీటర్ల వ్యాసార్థం ఉండేలా విస్తరణ నిమిత్తం భూమి కావాల్సివుంది. సీతానగరం నుంచి  దుగ్గిరాల వరకు కాల్వ 120 మీటర్ల వెడల్పు ఉండగా ఈ ప్రాంతంలో విస్తరణ చేపట్టాల్సిన అవసరం లేదు. దుగ్గిరాల నుంచి సంగంజాగర్లమూడి, చేబ్రోలు, కొల్లిమర్ల లాకుల వరకు కాల్వ కింద వెడల్పు 40 మీటర్లు ఉండగా ఆయా ప్రాంతాల్లో కట్టలను మాత్రమే వెడల్పు చేయాల్సివుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కొల్లిమర్ల లాకుల నుంచి కాల్వ వెడల్పు తగ్గుతూ వస్తోంది. నరసాయపాలెం వద్ద బెడ్‌ విడ్త్‌ 15 మీటర్లు కాగా పెదగంజాం వద్ద ఆరు మీటర్లు మాత్రమే ఉంది. దీనిని 40 మీటర్లకు పెంచాల్సివుంది. చీరాల వద్ద లోతు 1.25 మీటర్లు మాత్రమే ఉండగా దీనిని 2.50 మీటర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భూసేకరణ ఎక్కువగా చేపట్టాల్సివుండగా కాల్వకు ఇరువైపులా మురుగునీటి కాల్వలు(క్యాచ్‌ డ్రెయిన్లు) తవ్వుతారు. ప్రస్తుతం ఇవి ఉన్న చోట పూడిక తీస్తారు. కాల్వకు ఇరువైపులా కాంక్రీటు గోడలు లేదా రాతి రివిట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. సీతానగరం, వడ్డేశ్వరం, దుగ్గిరాల, చేబ్రోలు, కొల్లిమర్ల, నల్లమడ లాకులు, సంతరావూరు, పెదగంజాం వద్ద సరుకు పడవలు ఆగటానికి ప్లాట్‌ఫారాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి సరుకులను రవాణా చేయటానికి సమీప జాతీయ, రాష్ట్ర రహదారులను కలుపుతూ అప్రోచ్‌లు వేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. రహదారి రవాణాతో పోలిస్తే కేవలం 40 శాతం వ్యయంతో జలరవాణా ద్వారా సరుకులను చేరవేయవచ్చని నిపుణులు అంటున్నారు. దశలవారీగా ప్రాజెక్టు చేపట్టాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ 2018లో తొలి విడత పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియనే ప్రారంభించలేదు. నిధులపరంగా రెండేళ్లకుపైగా రూపాయీ కేటాయించలేదు. దాంతో తాజాగా పెరిగిన ధరల ప్రకారం రూ.4 వేల కోట్లకుపైగా మంజూరు చేయాల్సిన అగత్యం ఏర్పడింది.

ప్రతిపాదనలు పంపాం
కొమ్మమూరు కాల్వలో జల రవాణా పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి అందజేశాం. దీనిని జాతీయ జల రవాణా మార్గం-4గా నామకరణం చేశారు. కేంద్ర జలరవాణా సంస్థ పర్యవేక్షణలో జల వనరుల శాఖ ఆధ్వర్యాన పనులు చేపట్టాలని నిర్ణయించినా నిధులివ్వకపోవడంతో పనులకు శ్రీకారం చుట్టలేదు. ఆ సంస్థ పరిధిలోకి కాల్వ వెళ్లడంతో మూడేళ్లుగా రైతులకు సాగునీటిపరంగా ఇబ్బంది లేకుండా చూడటానికి తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం. భూసేకరణ ప్రక్రియ ఆరంభించాల్సివుంది. కేంద్రం నిధులు విడుదల చేస్తేనే పనుల్లో కదలిక వస్తుంది.

- పి.వెంకటరత్నం, ఈఈ, కృష్ణ పశ్చిమ డెల్టా, జల వనరుల శాఖ
  • 5 years later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 1 month later...
Posted

లాహిరి.. లాహిరి.. ఎప్పుడో మరి!

బకింగ్‌హాం కాలువ.. బ్రిటిష్‌ పాలకుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. బంగాళాఖాతం వెంబడి జిల్లాకు మణిహారంగా విరాజిల్లింది. లాంచీలు, బోట్లు, పడవల రాకపోకలతో కళకళలాడింది.

Updated : 02 Oct 2024 06:14 IST
 
 
 
 
 
 

పునరుద్ధరణకు నోచని బకింగ్‌హామ్‌ కాలువ
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో మళ్లీ కదలిక
ఈనాడు, ఒంగోలు

pks-Dkr1102410-.jpg

కింగ్‌హాం కాలువ.. బ్రిటిష్‌ పాలకుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. బంగాళాఖాతం వెంబడి జిల్లాకు మణిహారంగా విరాజిల్లింది. లాంచీలు, బోట్లు, పడవల రాకపోకలతో కళకళలాడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చినగంజాం నుంచి రామయపట్నం వరకు సుమారు వంద కిలో మీటర్లకు పైగా పొడవుతో.. సముద్రానికి కొన్నిచోట్ల అర కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గతంలో ఈ కాలువ వెంట వ్యాపారం జోరుగా సాగేది. చినగంజాం, కొత్తపట్నం, పాకల, ఊళ్లపాలెం, కరేడు, రామాయపట్నం పరిధిలో చేపల వేట చేస్తూ మత్స్యకారులు ఉపాధి పొందేవారు. దివిసీమ ఉప్పెన సమయంలో కాలువ అక్కడక్కడా దెబ్బతినడంతో జల రవాణా ఆగిపోయింది. ఆ తర్వాత అక్రమార్కుల కళ్లు కాలువపై పడ్డాయి. చేపలు, రొయ్యల చెరువులు ఏర్పాటయ్యాయి. కొన్నిచోట్ల నిర్వహణ లేక పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు పెరిగాయి. 

ఆచరణ రూపం దాల్చని ప్రతిపాదనలు...: యూపీఏ-2 పాలనలో జల రవాణా అభివృద్ధి పథకంలో భాగంగా బకింగ్‌హామ్‌ కాలువ పునరుద్ధరణకు ప్రతిపాదనలు చేసింది. నిపుణుల కమిటీ పరిశీలించి సుమారు రూ.1,500 కోట్ల వరకు వ్యయమవుతుందని నివేదిక ఇచ్చింది. ఆక్రమణలు తొలగించాలని సూచించింది. అవేమీ కార్యరూపం దాల్చలేదు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం సాగరమాల పథకం తెచ్చింది. అందులో భాగంగా కాలువను జల రవాణాకు అనువుగా తీర్చిదిద్దుతామని ప్రకటించినప్పటికీ చర్యలు లేవు. 

సర్వేలు.. నోటీసులు...: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాలువ పనులపై కదలిక మొదలైంది. జల రవాణాకు అనుగుణంగా కాలువను విస్తరించే విషయాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా అధికారులు కూడా కాలువపై పెద్ద పడవలు వెళ్లేలా రీ డిజైన్‌ చేయడానికి వీలుగా సర్వే చేశారు. కాలువ 700 మీటర్ల పొడవు, వెడల్పుతో ఉండేలా ప్రతిపాదనలు పంపించారు. ఆ మేరకు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. 

pks-Dkr1102410b.jpg

  • 3 months later...
  • 1 month later...
Posted

Amaravati: రాజధానికి జల రవాణా?

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:49 AM

 

ఈ క్రమంలో ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) గతంలో కృష్ణా నదిలో చేపట్టిన అంతర్గత జల రవాణా-4 తాలూకు కార్యాచరణను వినియోగించుకోవాలని భావిస్తోంది.

Amaravati: రాజధానికి జల రవాణా?

 

నిర్మాణ పనులకు సామగ్రి తరలింపుపై ప్రభుత్వం దృష్టి.. రోడ్డు మార్గం కంటే ఖర్చు తక్కువ

  • 2017లోనే కృష్ణా నదిలో జల రవాణా మార్గం అభివృద్ధి పనులకు శ్రీకారం

  • ముక్త్యాల నుంచి హరిశ్చంద్రాపురం వరకు జీఎన్‌టీ కేసులతో అంతరాయం

  • ఇప్పుడు మళ్లీ కూటమి సర్కారు దృష్టి

  • నదీ తీరంలో 3 కార్గో, 4 టూరిజం టెర్మినల్స్‌

  • ఏర్పాటుకు ఐడబ్ల్యూఏఐ సుముఖత

(ఆంధ్రజ్యోతి-మంగళగిరి)

రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అంతర్గత జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ పనుల్లో వినియోగించాల్సిన సిమెంటు, ఇసుక, ఇనుము, కంకర, ఫ్లైయాష్‌ వంటి పలు ముడి సరుకులను తక్కువ ఖర్చుతో రాజధాని ప్రాంతానికి తరలించడానికి జల రవాణా చాలా అనుకూలమైందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) గతంలో కృష్ణా నదిలో చేపట్టిన అంతర్గత జల రవాణా-4 తాలూకు కార్యాచరణను వినియోగించుకోవాలని భావిస్తోంది. రోడ్డు రవాణా ఖర్చులతో పోల్చుకుంటే జల రవాణాకు అయ్యే ఖర్చు సగంలో సగం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు... టన్ను బరువున్న సరుకును కిలోమీటరు దూరం రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకు రూ.2.50 ఖర్చు అయితే, రైలు ద్వారా రూ.1.36, జల రవాణాలో రూ.1.06 మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జల రవాణాకు ప్రాధాన్యం ఇచ్చి సాగరమాల పేరుతో దేశవ్యాప్తంగా జల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లోనే ఊపందుకోనున్న నేపథ్యంలో నిర్మాణ సామగ్రి, ఇతరత్రా ముడి సరుకులను తేలికగా తరలించడంపై చర్చ మొదలైంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు, ఇటుక, కంకర వంటి మెటీరియల్‌ అంతా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల పరిసర ప్రాంతాల నుంచే తరలించాల్సి ఉంటుంది. ముక్త్యాల-అమరావతి మధ్య కృష్ణా నదీ మార్గాన్ని వినియోగించుకుని ముడి సరుకును జల రవాణా చేయడం.. రోడ్డు మార్గం కంటే అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. నదీమార్గంలో తక్కువ దూరంతో పాటు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. జల రవాణా కోసం కార్గో వెస్సెల్స్‌ను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

 
ABN ఛానల్ ఫాలో అవ్వండి
 
 

జాతీయ జల రవాణా-4

వాస్తవానికి 2008 నవంబరులో కేంద్ర ప్రభుత్వం... ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు వర్తింపజేస్తూ జాతీయ జల రవాణా-4ను ప్రకటించింది. అప్పట్లో భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదిలో 171 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఏలూరు కాలువలో 139 కి.మీ, కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కాకినాడ కాలువలో 50 కి.మీ, విజయవాడ నుంచి పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువలో 113 కి.మీ, పెదగంజాం నుంచి చెన్నై వరకు ఉత్తర బకింగ్‌హమ్‌ కాలువలో 316 కి.మీ, చెన్నై నుంచి మరక్కోణం వరకు దక్షిణ బకింగ్‌హమ్‌ కాలువలో 110 కి.మీ, నల్గొండ జిల్లా వజీరాబాద్‌ నుంచి విజయవాడ వరకు కృష్ణా నదిలో 157 కి.మీ. వంతున మొత్తం 1078 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాన్ని జాతీయ అంతర్గత జల రవాణా-4 కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. 2016లో దీనిని సవరిస్తూ కృష్ణా నదిలో వజీరాబాద్‌ నుంచి కర్ణాటక రాష్ట్రం గలగలి వరకు మరో 628 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌ వరకు గోదావరి నదిలో 1184 కి.మీ. వరకు విస్తరించడం ద్వారా జాతీయ జల రవాణా-4 ప్రతిపాదనను మొత్తం 2890 కి.మీ.కు పెంచింది.

2017లో పనులకు శ్రీకారం

జాతీయ జల రవాణా-4 ప్రాజెక్టు ఆచరణ విషయానికొస్తే... 2016లో తొలిదశ కింద ముక్త్యాల నుంచి విజయవాడ వరకు కృష్ణా నదిలో 82 కిలోమీటర్ల వరకు జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.96 కోట్లను మంజూరు చేశారు. ప్రధానంగా కార్గో ఓడలు లేదా క్రూయిజ్‌ షిఫ్‌లు ప్రయాణించేందుకు వీలుగా నదీ మార్గంలో సుమారు యాభై మీటర్ల నిడివిలో రెండేసి మీటర్ల లోతున పూడికతీత పనులను చేపట్టాలి. ఇందుకోసం మొదటగా ముక్త్యాల నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు వరకు 29 కిలోమీటర్ల పొడవున డ్రెడ్జింగ్‌ చేసేందుకు రూ.33.85 కోట్ల వ్యయంతో, చామర్రు నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం వరకు 37 కి.మీ. పొడవున డ్రెడ్జింగ్‌ చేసేందుకు మరో రూ.35.91 కోట్ల వ్యయంతో 2016 ఏప్రిల్‌లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేందుకు ఏడాదిన్నర పట్టింది. 2017 అక్టోబరు 3న ఈ పనులకు శ్రీకారం చుట్టారు. 2019 జూన్‌ నాటికి డ్రెడ్జింగ్‌ పనులు పూర్తి కావల్సివుంది. కానీ, నదీ అంతర్భాగంలో కొన్ని చోట్ల గట్టి రాయి తగలడం, కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసులు వేయడంతో పనులకు అంతరాయం కలిగింది. డ్రెడ్జింగ్‌ పనులు 70 శాతం వరకు పూర్తి చేయగలిగినా, ఆ తర్వాత ముందడుగు పడలేదు. జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్‌ తీసిన ప్రాంతాల్లో తరచుగా నిర్వహణ కూడా చేయాలి. ఐడబ్ల్యూఏఐ నిర్వహణను పట్టించుకోలేదు. ఇటీవల కృష్ణా నదికి 11.5 లక్షల క్యూసెక్కుల మేర భారీ వరద రావడంతో డ్రెడ్జింగ్‌ తాలూకు లీడ్స్‌ మళ్లీ ఇసుక మేటలతో నిండి ఉండవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి నిర్మాణ పనుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో సమన్వయం చేసుకుని కార్గో వెస్సెల్స్‌ ముక్త్యాల-హరిశ్చంద్రాపురం మధ్య నడిచేలా నదీ జలమార్గాన్ని అభివృద్ధి చేస్తే రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి.

 
 

3 కార్గో టెర్మినల్స్‌

కృష్ణా నదిలో అంతర్గత జల రవాణా మార్గం సానుకూలమైతే మూడు కార్గో టెర్మినల్స్‌ను కూడా నదీ తీరప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఐడబ్ల్యూఏఐ నిర్ణయించింది. వీటిని ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టెర్నినల్స్‌ సరుకు ఎగుమతులు, దిగుమతులకు ఉపకరిస్తాయి. టెర్మినల్స్‌ ఏర్పాటుకు ముక్త్యాల వద్ద 8.57 ఎకరాలు, ఇబ్రహీంపట్నం (ఫెర్రీ) వద్ద 3.63 ఎకరాలు, హరిశ్చంద్రాపురం వద్ద 3.80 ఎకరాలు అవసరమవుతాయని ఐడబ్ల్యూఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ భూసేకరణకు అయ్యే ఖర్చును కూడా ఐడబ్ల్యూఏఐ సంబంధిత అధికారుల వద్ద డిపాజిట్‌ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని భూసేకరణ చేసి ఐడబ్ల్యూఏఐకి స్వాధీనం చేసింది. త్వరలోనే ఈ మూడు ప్రాంతాల్లో కార్గో టెర్మినల్స్‌ నిర్మాణ పనులను ఐడబ్ల్యూఏఐ చేపట్టబోతుంది.

టూరిజం టెర్మినల్స్‌

రాజధాని అమరావతి నిర్మాణ పనుల నేపఽథ్యంలో కృష్ణా నదిలో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు ఐడబ్ల్యూఏఐ కూడా సంసిద్ధంగానే ఉంది. పర్యాటకంగా కూడా జల రవాణాను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే సలహా ఇవ్వడంతో ఓ టూరిజం సర్క్యూట్‌ను కూడా ఇందులో చేర్చాలని ఐడబ్ల్యూఏఐ నిర్ణయించింది. విజయవాడలోని దుర్గాఘాట్‌, భవానీ ఐలాండ్‌, వేదాద్రి, అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద టూరిజం టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఐడబ్ల్యూఏఐ సంసిద్ధత వ్యక్తం చేసింది.

 

 
Updated Date - Mar 14 , 2025 | 04:49 AM
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...