-
Posts
69,420 -
Joined
-
Last visited
-
Days Won
94
Reputation Activity
-
-
-
-
-
-
sonykongara got a reaction from Lokanadham in AP e-Pragati
http://www.nandamurifans.com/forum/index.php?/topic/403828-mee-seva-lo-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E2%80%8C/?hl=seva
-
-
sonykongara got a reaction from TGR in visakapatanam Fintech
ఫిన్టెక్ రాజధానిగా విశాఖ
నేడు మాస్టర్ కార్డుతో ఎంఒయు
రవాణా, రెవెన్యూ శాఖల్లో ప్రయోగం
9-10 తేదీల్లో బ్లాక్చెయిన్ టెక్నాలజీపై సదస్సు
ఐటి సలహాదారు జెఎ చౌదరి
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సాంకేతిక పరిజ్ఞాన (ఫిన్టెక్) కేంద్రంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి సలహాదారు జెఎ చౌదరి తెలిపారు. ఈ నెల 9-10 తేదీల్లో విశాఖలో బ్లాక్చెయిన్ టెక్నాలజీపై అంతర్జాతీయసదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రశ్న: బ్లాక్చెయిన్ టెక్నాలజీ అంటే..?
జవాబు: సర్వర్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో భద్రపరిచిన సమాచారానికి రక్షణ కల్పించే వ్యవస్థే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. సైబర్ దాడులు జరిగినా డాటా పోకుండా, కరప్ట్ కాకుండా ఈ టెక్నాలజీ కాపాడుతుంది. డాటాలో మార్పులు, చేర్పులు జరగకుండా అడ్టుకుంటుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ అనుసంధానమని, వివిధ సర్వేల పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం పూర్తిస్థాయిలో సేకరించి పెట్టుకుంటున్నాయి. ఈ సమాచారం ఇతరుల చేతికి వెళితే మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. వాటన్నింటికీ సమాధానమే ఈ బ్లాక్చెయిన్ టెక్నాలజీ.
ఎలా పనిచేస్తుంది?
ఈ విధానంలో డాటాను ఒక్క దగ్గర కాకుండా వివిఽ ద ప్రాంతాల్లో, వివిధ పరికరాల్లో, వివిధ రూపాల్లో నిక్షి ప్తం చేస్తారు. ఊహించని అగ్నిప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్లు జరిగి డాటా పోయినా, సైబర్ నేరగాళ్లు సర్వర్లోకి చొచ్చుకొని పోయి తస్కరించినా ఆ డాటా మరో ప్రాంతంలో భద్రంగా ఉంటుంది. దానికి అనధికారిక మార్పులు చేయకుండా బ్లాక్చెయిన్ నిరోధిస్తుంది.
దేశంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తొలి సారిగా భారతదేశానికి ఈ బ్లాక్చెయిన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. జపాన్లో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని అమెరికా విస్తృతంగా ఉపయోగిస్తోంది. దుబాయ్లో ప్రతి సంస్థ ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోంది.
రాష్ట్రం ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటోంది?
రెవెన్యూ, రవాణా శాఖల్లో పైలట్ ప్రాజెక్ట్గా నాలుగు అంశాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. భూ వివరాలు నమోదుచేసే రికార్డులకు, యాజమాన్య హక్కులు నిర్ధారిస్తూ ఇచ్చే టైటిల్ డీడ్ పుస్తకాలకు రెవెన్యూ శాఖలో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. అంటే ఆ రికార్డులను ఇకపై ట్యాంపరింగ్ చేయడం కుదరదు. పూర్తి భద్రత లభిస్తుంది. అదేవిధంగా రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్స్ల జారీ రికార్డులకు, వాహనాల రిజిస్ట్రేషన్ రికార్డులకు దీనిని ఉపయోగిస్తున్నారు. వీటి ఫలితాలను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకువచ్చి ఈ టెక్నాలజీని పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తామని ఆసక్తి వ్యక్తం చేస్తోంది.
రాష్ట్రంలో ఎవరైనా ముందుకు వచ్చారా?
ఈ టెక్నాలజీ గురించి తెలుసుకున్న వెంటనే భాగస్వామ్యం కల్పించాలంటూ ఐసిఐసిఐ, హెచ్డిఎ్ఫసి, టాటా క్యాపిటల్ వంటి 20 కంపెనీలు ముందుకు వచ్చాయి. వారి డాటాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. వీటికి ఈ నెల 9-10 తేదీల్లో జరిగే సదస్సులో ఇతర దేశాల నుంచి వచ్చే స్టార్ట్పలు పరిష్కారాలు చూపిస్తాయి.
ఫిన్టెక్ వ్యాలీ పాత్ర ఏమిటి?
ఫిన్టెక్లో బ్లాక్చెయిన్ టెక్నాలజీ కూడా ఒకటి. ఇందుకోసం 500 కోట్ల నిధులు కేటాయించాం. తిరుపతిలోని ఐఐడీటీలో నిపుణులను తయారుచేస్తున్నాం. మార్కెట్ క్రియేట్ చేస్తున్నాము. మెంటారింగ్ చేస్తున్నాము. ఇవన్నీ ఫిన్టెక్ ద్వారానే జరుగుతున్నాయి.
ఫిన్టెక్ పురోగతి ఏమిటి?
ప్రస్తుతం ఎనిమిది స్టార్టప్ కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పటికే వీసా కంపెనీతో కలిసి పనిచేస్తున్నాం. ఢిల్లీలో గురువారం జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో మాస్టర్ కార్డు కంపెనీతో ఎంఒయు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు.
ఈ రంగాల్లో పరిశోధనలు ఏమైనా జరుగుతున్నాయా?
ఐటిలో నూతన సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా ఎపిని ముందువరుసలో నిలపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్నాం. సైబర్ సెక్యూరిటీకి 42 42 అనే ఇజ్రాయిల్ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. బ్లాక్చెయిన్ టెక్నాలజీలో బ్రాడ్రీచ్ కంపెనీతో, ఫిన్టెక్కు శ్యామ్సన్ రైటర్స్తో, క్రిప్టాలజీలో జేసీ బోస్తో కలిసి పరిశోధనలు చేస్తున్నాం.
విశాఖ సదస్సు నిర్వహణ ఉద్దేశం ఏమిటి?
ఇది అధునాతన టెక్నాలజీ. ఫలితాలపై విశ్వాసం కలిగితేనే అంతా వినియోగించడానికి ముందుకువస్తారు. అందుకే ఏయే దేశాల్లో బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి మంచి ఫలితాలు సాధించారో వారందరినీ విశాఖపట్నం సదస్సుకు ఆహ్వానించాం. ఏయే రంగాల్లో ఈ టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారో వారు వివరిస్తారు. దాంతో దానిపై ఇక్కడి వారికి అవగాహన వస్తుంది. ఇది వ్యాపారాభివృద్ధికి, నూతన ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడుతుంది.
-
sonykongara got a reaction from 3mar in Andhra Pradesh Govt Introduces Electric Bus In Vijayawada City .
విశాఖలో ఎలక్ట్రిక్ కార్లు... ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకి సన్నాహాలు....
విశాఖలో ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం ప్రవేశపెట్ట బోతోంది. కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)సహకారంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులకు ఈ వాహనాలను సమకూర్చనున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 230 అద్దె వాహనాలు ప్రభుత్వ శాఖల్లో వినియోగంలో ఉన్నాయి. ఇప్పడు వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నారు. వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఈఈఎస్ఎల్ ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని నగరాలకు ఈఈఎస్ఎల్ ఈ వాహనాలను సమకూరు స్తోంది. విశాఖను ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
ఈఈఎస్ఎల్ సంస్థ నుంచి ఈ వాహనాలను సమకూర్చే కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థ దక్కించుకుంది. 500 వాహనాలను నవంబర్లో ఈఈఎస్ఎల్ కి టాటా మోటార్స్ అందించనుంది.
ఈ కార్లు విశాఖ నగరానికి డిసెంబర్, జనవరిల్లో వచ్చే అవకాశముందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఈఈఎస్ఎల్ సంస్థే అందజేస్తుంది.
ఒక్కో కారు ధర రూ.11.20లక్షల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. అయిదేళ్ళ వారంటీతో ఈ కార్లను టాటా మోటార్స్ సరఫరా చేయనుంది.
-
sonykongara got a reaction from Venkatpaladugu in pattiseema
పట్టిసీమ సంపూర్ణం! !
హైదరాబాద్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసేందుకు దోహదపడ్డ పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది. వాస్తవానికి.. గత ఏడాది ఖరీ్ఫలోనే.. కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగు నీటిని అందించడంలో ఈపథకం దోహదపడింది. ఇప్పటి వరకు.. మొత్తం 24 పంపులను స్విచ్చాన్ చేయకుండా.. ఒకదాని తర్వాత ఒకటి ఆన్ చేస్తూ వచ్చిన జల వనరుల శాఖ.. బుధవారం నాటికి 23 పంపులు పనిచేసేలాచర్యలు తీసుకుంది. దీంతో..8500 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పట్టిసీమ ద్వారా 8142 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేందుకు వీలైంది. శుక్రవారానికి మిగిలిన ఒక్క పంపునూ స్విచ్ ఆన్ చేస్తే.. ఈ పథకం సంపూర్ణంగా పనిచేసినట్లు అవుతుందని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 44 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. పట్టిసమీ ఎత్తిపోతల ఇదే తరహాలో నిరాటంకంగా పని చేస్తే.. వచ్చే ఖరీఫ్ నుంచి.. పూర్తి స్థాయిలో.. 45 టీఎంసీలను రాయలసీమ జిల్లాలకు అందించే అవకాశం లభిస్తుందని జల వనరుల శాఖ అధికారులు వివరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కృష్ణా డెల్టా ఆయకట్టు భూములు చివరిలో ఉండడం వల్ల ఎప్పుడూ ఎగువ ప్రాంతానికి నీరు వచ్చే వీలుండేది కాదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పట్టిసీమ నుంచి నీరు పోలవరం కుడి ప్రధాన కాలువకు ఎత్తిపోస్తుండడంతో.. ఈ ఎగువ ప్రాంతాలన్నీ ముందు వరుసలోకి వచ్చేశాయి. ఫలితంగా.. కాలువకు సమీపంలోని గ్రామాల్లో రైతులు పంపుల ద్వారా సాగునీటిని తీసుకుంటున్నారు. ఇదే సమయంలో.. చెరువులన్నింటినీ నింపుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో రైతులు తమ చెరువులను నింపుకునేందుకు వీలు కలిగింది. పశ్చిమ గోదావరి జిల్లా లోని ఎగువ ప్రాంతాలకు.. 600 నుంచి 800 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. మిగిలిన జలాలన్నీ కృష్ణా డెల్టాలోకే వెళ్తున్నాయి. పట్టిసీమ పథకం ద్వారా ఇప్పటికి 116 రోజుల పాటు పంపింగ్ చేశారు. డిసెంబరు నెలాఖరు వరకు నీటిని ఎత్తిపోసే వీలుంది. భారీ వర్షాలు, తుఫాను కారణంగా పులిచింతలకు నీరు చేరడం కారణాలతో ఏడు రోజులు మాత్రం పంపింగ్ ఆగింది. -
sonykongara got a reaction from TGR in PEOPLE FIRST 1100 AP's “Parishkara Vedika”
monna mother ma inti daggara pani chese musllama ki Old Age Pension ravtam ledu ani 1100 number call cheyamani adgindi,nenu mire chesi cheppa manna, chesaru anta. taruvatha call center vallu malli phone chesi ame details adigi tisukunnaru 15 days lo pani avuthundi annaru anta.
-
-
-
-
-
-
-
-
sonykongara got a reaction from akhill in Buckingham Canal inland waterways
ముక్త్యాల-విజయవాడ మార్గంలో పనులు ప్రారంభం
తొలిదశలో 90 కిలోమీటర్ల పొడవైన నావిగేషన్ ఛానల్ ekkada oka 90km vasthundimanaku
-
-
-
-
-
-