Jump to content

Recommended Posts

Posted

ee title ki meaning enti annai.. Philanter Pagidis (ఫిలంతర్ పగిఢి లు) deeniki artham telika entole ani inni rojulu fun miss ayya ? 

Posted
5 hours ago, John said:

ee title ki meaning enti annai.. Philanter Pagidis (ఫిలంతర్ పగిఢి లు) deeniki artham telika entole ani inni rojulu fun miss ayya ? 

low level keyboard dogs ani indirect ga adedo cinemalo antaru ga. ala annamaata.

Posted

దేబుడు-ఆత్మకథ 
------------------------

మా తాత ఇది.....మా నాన్న ఇది ...నేను ఇది అవుదాం అనుకున్నాను ....కానీ అది అయ్యే సరికే ఎదో అయ్యింది ....ఇంకా అదే అవ్వకపోతే ఇది ఏమి అవుతుంది అని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా

ఈ లోగా మా అమ్మ చెంబు ఇచ్చి విజయా డైరీ లో పాలు తెమ్మంది, విజయడైరీ నే దేనికి అంటే ఇంకో పదేళ్లలో చంద్రబాబు డైరీ పెట్టి విజయ డైరీ మూసి వేస్తారు అని చెప్పింది

సరే అని పాలు తీసుకుని రావటానికి వెళ్తే అక్కడ పాల మీద వాలే ఈగలను ఒకతను మానవత్వం లేకుండా విసురుతున్నాడు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను

అయినా తమాయించుకుని అక్కడ నుంచి వస్తుంటే గేదె తోక ఎత్తి పేడ వేసింది వెనుకాలే ఒకతను వచ్చి గంపకి ఎత్తుకుంటున్నాడు.....గేదె పేడని కూడా దోచుకునే వారిని చూసి మల్లి ఆవేశం వచ్చింది..మళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా

ఇంటికి వచ్చా.....అమ్మ ఖాళీ చెంబు తెచ్చాను అని తిట్టింది.....అప్పుడు అర్ధం అయ్యింది నేను పోయించుకున్న పాలు ఆవేశంగా ఊగిపోతున్నప్పుడు పోయాయని. ....మళ్ళి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను

.ఈ లోగ ఆర్ట్స్ కాలేజీ లో లా చదువుతున్న నా రెండో అన్నయ్య విరాట్ కోహ్లీ బయోగ్రఫీ తెచ్చి ఇచ్చాడు....ఎవరు అన్నయ్య అన్నాను....వీడు ఇంకో పాతికేళ్లలో ఇండియా కి క్రికెట్ ఆడతాడు.....ఇండియాన్ క్రికెట్ ఐకాన్ అవుతాడు....అన్నాడు అతని బయోగ్రఫీ చదివాను..

ఆ పుస్తకం చదివి బయటకి వచ్చే సరికి రైతులు ఉన్నారు....ఏంటి అన్నాను.....మా పొలాలు లాక్కుని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ఇచ్చారు అన్నారు ....ఇది జరిగింది ఎప్పుడు అంటే 30 సంవత్సరాల తర్వాత 2014 లో చంద్రబాబు మూడో సారి సీఎం అయ్యాక అన్నారు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను

కానీ నా మూడవ భార్య కి పుట్టిన నా నాలుగవ సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను..... షిరిడి సాయి బాబా గారికి ఆశీస్సులు ఇచ్చినట్టే పుట్టపర్తి సత్య సాయి బాబా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాను....అంతే కాదు వ్యవస్థీకృత సరళీకృత ఆర్ధిక విధానాలకు కారణమ్ అయినా టైగర్ ష్రాఫ్ ని, కరణ్ జోహార్ ని, బోనీ కపూర్ తమ్ముడు షాహిద్ కపూర్ ని తల్చుకుని సరికి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను

కానీ నా నాలుగవ భార్య వల్ల కలగబోయే నా ఐదో సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను...స్నానం కి బాత్రూమ్ లోకి వెళ్తే పసుపు పచ్చగా నీళ్లు వచ్చాయి....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను.....ఈ సారి ఎవరు గుర్తుకు వచ్చేలా లేరు....:D:roflmao:

Posted

PK ఉపన్యాసాలు ఎలా ఉంటాయి అంటే.....

-------------------------------------------------------

వల్లకాట్లో పిల్లి కూతలు..

గోడపై గబ్బిలం తింగరి చూపులు..

పిచ్చి కుక్క గావు కేకలు..

యదైన గేద అరుపులు..

చెరువులో కప్ప బెకబెకలు..

ఏడుపు తెచ్చుకున్నే అరువు సినిమా డైలాగులు..

మురుగ్గుంటలో పంది పిల్లలా..

వివరం లేని మూల్గులు..

అర్ధం లేని అక్షరాలూ..

భావం లేని వెర్రి గావుకేకలు..

:D:roflmao:

Posted

CBN నా వల్లే గెలిచాడు లేకుంటే Retire అయ్యేవాడు అని అంటే ఎలా ఉంది అంటే........

------------------------------------------------

ఒకాయన నేను లేకపోతే ఆయన రిటైర్ అయ్యేవాడు అని అంటుంటే..చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పిన ఒక కథ గుర్తుకోచ్చింది.

ఎండాకాలంలో ఒక రైతు బావి వద్ద ఉన్న గడ్డిని తన ఎడ్ల బండిలో వేసుకోని ఇంటికి వస్తున్నాడు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ్నుంచో ఆ దారిలో వచ్చిన ఓ కుక్క.. ఎండ వేడిమి తట్టుకోలేక ఆయాసం వచ్చి బండి కింద నీడలో నడుస్తూ ఇంటి వరకు వచ్చింది. ఇంటికి వచ్చాక బండి కింది నుంచి బయటకు వచ్చి ‘అబ్బ! ఇంత పెద్ద బండిని అక్కడ్నుంచి లాక్కొచ్చిన’ అని అనుకుందంట. బయటకు వచ్చి అదే బండిని లాక్కొచ్చిన ఎద్దు వైపు చూసింది. అప్పుడు ఎద్దు కొంత ఆయాస పడుతోంది.

‘నేను సునాయాసంగా లాక్కొచ్చాను.. నీవు ఇంత లావువున్నావు.. నీవెందుకు ఆయాస పడుతున్నావు..’ అని కుక్క ఆ ఎద్దును అడిగిందట. అప్పుడు ఎద్దు కుక్క వైపు చూసి.. పాపం ఈ కుక్కకు ఏమి తెలియదని సెలైంట్‌గా ఉందట. కానీ ఆ కుక్క ఎద్దును ఎక్కిరిస్తూ పోయిందట. ‘హా.. అది ఎంతైనా కుక్కే కదా!’ అని ఎద్దు అనుకుందట..’’

:roflmao::D

Posted

పేద పార్టీ అధినేత ....!?
*********************
పాపం ఇంకో పేద పార్టీ అధినేత. EMI లు కట్టలేక కార్ అమ్ముకొని స్పెషల్ జెట్ ఫ్లైట్స్ లో తిరుగుతూ ప్రజా సేవ చేస్తున్నాడు.

పాపమ్ ఆయన కష్టం చూస్తేనే కడుపు తరుక్కు పోయి ఇంకోసారి సార్ పెట్టె టీ మీటింగ్ కి పోయి అప్పు చేసైనా సరే పది లక్షలు వదిలికిన్చుకోవాలని తుత్తర ఉన్న కులం అడ్డు వస్తుంది.

నేను సారు కులం కాకపోతిని నన్ను లోపలకి రాణిస్తారో లేదో అని బెంగ. సార్ ఈ సారి పెట్టె టీ మీటింగ్ లో సమర్పించుకునే అవకాశం అన్ని కులాలకు ఇవ్వండి సార్ మీ పేదరికం చూడలేక మా కడుపు తరుక్కుపోతుంది.....??

 

  • 2 weeks later...
Posted

PK new house in jubilee hills constructed with cost of 30 Cr. Gruha pravesam did on 9 Nov 2018.

--------------------------------------

ఎవరిది ఈ ఇల్లు అనేకదా అనుమానం...

అదేనండి ఈ మధ్య EMI కట్టలేక కారు అమ్ముకున్నాడు చూడు ఆయనదేనండి...

మరి 40 కోట్ల పైచిలుకు తో ఇల్లేలా కట్టాడు అనేకదా అనుమానం.. మోడీ మీద ఒట్టు నాకైతే తెల్వదు...

ప్లాట్ no 627...జూబ్లీహిల్స్...ఆదనమాట సంగతి....

pk1.jpg


pk2.jpg


pk3.jpg

 

  • 2 weeks later...
Posted
2 సెంట్ల పొలంలో వరి పండించా.. మట్టి శక్తి నాకు తెలుసు: పవన్
26-11-2018 20:09:39
 
636788598660700212.jpg
 
 
 
రాజమండ్రి: 2 సెంట్ల పొలంలో వరి పండించానని, మట్టి శక్తి తనకు తెలుసని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమలాపురంలో రైతులతో భేటీ అయిన ఆయన ప్రపంచీకరణ పేరుతో వ్యవసాయ రంగంలో విధ్వంసం జరుగుతోందన్నారు. సెజ్ పేరుతో వైఎస్ హయాంలో రైతుల భూములు కాజేశారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపారని తెలిపారు. అందరి కళ్ళు పడిన కోనసీమ పచ్చదనమే తెలంగాణ విభజనకు కారణం అయ్యిందని వ్యాఖ్యానించారు. కోనసీమలో కొబ్బరి చెట్టు పోయి మొత్తం ఆక్వా చెరువులుగా మారిపోవడం బాధాకరమన్నారు. తాను అధికార, ప్రతిపక్షంకాదని.. ప్రజలపక్షమని పవన్ స్పష్టం చేశారు. 
Posted

అవినీతి నేతలు మన పార్టీలోకి వచ్చి నీతిగా మారతారు.

జగన్‌ తప్పించుకోలేరు 
అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ఎంతో బలమైనది 

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం బలమైనదని..రాజ్యాంగం నుంచి ప్రతిపక్ష నేత జగన్‌ తప్పించుకోలేరని చెప్పారు. ‘చాలామంది అవినీతిపరులు జనసేనలో చేరుతున్నారు. వాళ్లను ఎందుకు చేర్చుకుంటున్నారని ఓ కార్యకర్త నన్ను ప్రశ్నించాడు.. అవినీతి నేతలు మన పార్టీలోకి వచ్చి నీతిగా మారతారని నేను అతనికి చెప్పా’నని పవన్‌ వివరించారు. రేపు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలుగానీ, నేనుగానీ తప్పుచేస్తే చొక్కా పట్టుకుని ప్రశ్నించే హక్కు మీకు ఉందని ప్రజలను ఉద్దేశించి పవన్‌ అన్నారు.

ఎమ్మెల్యేలు జీవితాంతం పింఛన్లు తీసుకుంటున్నారు 
సీపీఎస్‌ విధానం గురించి పవన్‌ మాట్లాడుతూ ఒక్కసారి శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవితాంతం పింఛను తీసుకుంటారు.. అదే ప్రజల కోసం కష్టపడి దాదాపు 30 ఏళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం కోసం అధిక బడ్జెట్‌ను కేటాయిస్తామన్నారు. తన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్థాయిలో వాటిని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌ ఆ సంస్థలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపించారు.

రెల్లికులం స్వీకరించా 
నా మతం.. ధర్మం. నా కులం.. రెల్లికులం అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రెల్లి కులస్థులు రోడ్లను శుభ్రం చేస్తారని ఈ జాతికి పట్టిన అవినీతి, అధర్మాన్ని తుడిచేయడానికి రెల్లికులం స్వీకరించానని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి ఏటా రూ.2,500 కోట్లు 
తాము అధికారంలోకి వస్తే అర్చకుల ఆత్మగౌరవాన్ని కాపాడతానని జనసేన అధినేత అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఉదయం బ్రాహ్మణ సంఘాలతో ఆయన భేటీ అయ్యారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏటా రూ.1500 కోట్లు కేటాయించాలని పలువురు కోరగా.. దానికి పవన్‌ స్పందిస్తూ రూ.2,500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సమావేశంలో నేతలు నాదెండ్ల మనోహర్‌, ముత్తా గోపాలకృష్ణ, కందుల దుర్గేష్‌, ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

veedi pichi pizza hut oven lo petti bake seyyali..:roflmao:

Posted
34 minutes ago, Narendra1 said:

Oreedi comedy.. 2 cents lo pandey paavu basta rice ki gittu baatu dhara vachindo ledo :roflmao:

Vachindi danithone mangalagiri sthalam konukkunnadu eee peda raithu

Posted
3 hours ago, LuvNTR said:

అందరి కళ్ళు పడిన కోనసీమ పచ్చదనమే తెలంగాణ విభజనకు కారణం అయ్యిందని వ్యాఖ్యానించారు.

Gidendra bhai gitlundi :wacko:

Posted

? చాలా భారీ ఎత్తున 2 సెంట్ల పొలంలో వరి పండించారట .. అప్పుడే రైతుల కష్టాలు తెలిశాయట

? తాను కొనుగోలు చేసిన పుస్తకాల్లో చదివి గ్రహించిన జ్ఞాపకాల నుంచి కొన్ని గుళికలను.. రైతులకు ప్రసాదింప చేశారు

రెండు సెంట్లలో వరి వృక్షముల సాగు..! ఆదర్శ రైతు పవన్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతులతో సమవేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో.. రైతులతో సమవేశమై.. తాను కోనుగోలు చేసిన పుస్తకాల్లో చదివి గ్రహించిన జ్ఞపకాల నుంచి కొన్ని గుళికలను.. రైతులకు ప్రసాదింప చేశారు. పవన్‌కల్యాణ్ ది సహజంగా.. వామపక్ష భావజాలం కాబట్టి.. ఎర్ర అట్ట ఉండే పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. అలాంటి పుస్తకాల్లో చాలా చోట్ల బూర్జువా ప్రభుత్వాల గురించి.. ప్రపంచీకరణ గురించి.. ప్రపంచీకరణ వల్ల రైతులు ఎలా సాగుకు దూరమవుతున్నారనే అంశాలపై విస్తృతంగా తెలుసుకున్నారు.

ప్రపంచీకరణ వల్ల సాగు విధ్వంసమంటే ఏమిటో..?

చదవేస్తే వచ్చిన జ్ఞానాన్నంతా.. పవన్ కల్యాణ్ అమలాపురంలో రైతులకు అప్పజెప్పారు. ప్రపంచీకరణ పేరుతో వ్యవసాయ రంగంలో విధ్వంసం జరుగుతోందన్నారు. బహుశా పవన్ కల్యాణ్ ఉద్దేశంలో.. చైనా నుంచి వచ్చిన వరికోత యంత్రాలతో.. విరివిగా.. కోసేస్తున్న పంటను..విధ్వంసం అనుకుని ఉంటారు. ప్రపంచీకరణ వల్లే ఆ యంత్రం అమలాపురం వరకూ వచ్చింది. అదే లేకపోతే.. ఇప్పటికీ.. సినిమాల్లో చూపించినట్లుగా.. ఆడుతూ.. పాడుతూ పని చేస్తూ ఉంటే.. అని పాడుకుంటూ… రైతు కూలీలు.. కోసుకుంటూ ఉండేవారు. అప్పుడు విధ్వంసం ఉండేది కాదు. అంతేనా… సెజ్ పేరుతో వైఎస్ హయాంలో రైతుల భూములు కాజేశారని తీర్పిచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపారని గుర్తు చేశారు.

రెండు సెంట్లలో వరి పండించిన రైతు ఎవరైనా ఉంటారా.. ఒక్క పవన్ తప్ప..!

ఈ క్రమంలో… తనకు మట్టి శక్తి నాకు తెలుసని చెప్పారు. ఎలా తెలుసు..అని అప్పటికప్పుడు పవన్ కల్యాణ్ తనను తాను ప్రశ్నించుకుని… తన ఫార్మ్ హౌస్‌లో సాగు చేసిన పంట గురించి చెప్పుకొచ్చారు. తన ఫార్మ్‌హౌస్‌లో మాగాణి ఉందో లేదో కానీ.. అలాంటి దానితో పని లేకుండానే… వరి సాగు చేశారు. అదీ కూడా… ఆషామాషీగా కాదు.. చాలా భారీ ఎత్తున. 2సెంట్ల పొలంలో వరి పండించారట. అప్పుడే.. రైతుల కష్టాలు తెలిశాయట. మరి ఆదర్శ రైతు అవార్డు వచ్చిందో రాలేదో మరి. రాకపోతే… ఇప్పటికైనా తన గొప్పతనాన్ని ప్రభుత్వానికి తెలియజేయగలిగితే..ఇచ్చే అవకాశం ఉంది.

కోనసీమ పచ్చదనం వల్లే ఏపీ విభజన జరిగిందా..?

ఇదే కాకుండా.. ఇప్పటివరకూ.. రాష్ట్ర విభజనకు అనేక కారణాలను అందరూ .. విశ్లేషించి ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ ఆలోచన మాత్రం వేరే ఉంది. అసలు.. విబజన కారణం..కోనసిమ పచ్చదనమట. అందరి కళ్ళు పడిన ఈ కోనసీమ పచ్చదనమే విభజనకు కారణం అయ్యింది. ఇది పవన్ కల్యాణ్ చదివిన ఏ పుస్తకంలో ఉందో కానీ.. దీనిపై… ఎవరైనా పీహెచ్‌డీ చేసి థీసిస్ సమర్పించవచ్చు.”కోససిన పచ్చదనం వల్లే సమైక్యాంధ్ర విభజన.. ” డిస్కవర్డ్ బై పవన్ కల్యాణ్.. అని హైలెట్ చేయవచ్చుకూడా. జనవరి లో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలోని రైతు సమస్యలపై జిల్లాల వారి సదస్సులు పెడతామని భరోసా కూడా ఇచ్చారు. కోనసీమ గ్యాస్ గురించి..మరో అంశం గురించి..చాలా సేపు మాట్లాడారు కానీ.. .. అన్నీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన గుళికలే. కానీ.. ఇప్పటికీ.. ఆదర్శ రైతుతో ముగిస్తే ..బెటరేమో..?

https://www.telugu360.com/te/pawan-kalyan-interaction-with-amalapuram-farmers/

Posted

అందరి దిష్టి తగిలి, తగిలి, తగిలి తెలంగాణ విడిపోవడానికి కూడా మన కోనసీమ పచ్చదనం కారణం అయింది - PK on 25 Nov 2018

Posted

కళ్యాణ్ అన్నయ్య దెబ్బకి బయపడి మోడీ దగ్గరకి లగెత్తిన పలనిశామి !!! ఆయన ఒక్క చిన్న ప్రెస్ మీట్ పెడితే సీఎం వెళ్లి పీఎం ను కలిశాడు అది ఆయన రేంజ్ ~ PK Fan PSPK tweet on palani meeting modi.

Posted

కళ్యాణ్ అన్నయ్య కి కమల్ హాసన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటున్న వారికి సమాధానం కమల్ హాసన్ గారు కళ్యాణ్ అన్నయ్యకి కాల్ చేసి మీరు చెన్నై రావడం ఎందుకు ఒక్క కబురు పంపితే నేనే హైదరాబాద్ వచ్చే వాడిని కదా అన్నారు... నేనే వచ్చి కలిస్తే మర్యాద వచ్చి కలుస్తాను అంటే ఈరోజు కేన్సిల్ అయ్యింది ~  PK Fan PSPK tweet on PK not getting kamal appointment.

Posted

బాండ్లు అమ్మి చంద్రబాబు 2000 కోట్లు తీసుకుంటే లేవని నోళ్ళు కేవలం 10 లక్షలు తీసుకుంటే లేస్తున్నాయి ఎందుకు ? కళ్యాణ్ అన్నయ్య అంటే అంత భయమా ?  ~ PK fan PSPK tweet on PK collecting 10 lacs fee in radisson hotel in secretely organized kapu meeting...:roflmao:

Posted

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత గా విఫలం.

జగన్ మోహన్ రెడ్డి గారు పాపం. పాదయాత్రలు, బుగ్గలు నిమరడం, తల నిమరడం ఇలాంటివి చేస్తూ తిరుగుతున్నాడు. ప్రశ్నించడు, Assembly కి పోడు. జగన్ మోహన్ రెడ్డి గారికి నేను ఇదే చెప్తున్న.
నేను ఉప్పు కారం తినే వాడినే. నేను రాయల సీమ లో పుట్ట లేదు కానీ నేను కూడా జొన్న సంగతి రాగి సంగతి తిన్న. నాకు పౌరుషం ఉంది. నీ లాగా కులాల తో మతాల తో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేయడానికి రాలేదు. మీరు 9 months జైలు కి వెళ్ళి వొచీ ఏమీ సందేశం ఇద్దము అనుకుంటున్నారు. ఏమీ దిశ నిర్దేశం సేయగలరు మీరు. మీరు ప్రతిపక్షం గా నిష్ఫలం అయ్యారు. మీకు డబ్బు పిచ్చి తప్ప ప్రజా సేవ అనే తలంపు లేదు.

టీడీపీ నేతలు నన్ను హింసించారు, జేసీ రౌడీయిజం మానుకో

అధికారులపై దాడులు చెయ్యడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యడం జేసీకి తగదన్నారు. జేసీ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు
హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారని, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నా స్వప్రయోజనాల కోసం అమరావతి రావడం దురదృష్టకరమన్నారు. ఆంధ్రులు దోపిడీ దారులంటూ తెలంగాణ నేతలే రాష్ట్రాన్ని చీల్చారని వ్యాఖ్యానించారు. తనకు సీఎం కావాలన్న ఆశ లేదని పవన్ స్పష్టం చేశారు. 

అమరావతిలో బలవంతపు భూసేకరణ చేయనని చంద్రబాబు తనకు మాట ఇచ్చారని ఇచ్చినట్టే ఇచ్చి మాట తప్పారంటూ పవన్ ఆరోపించారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అని, ఒక్కో నియోజకవర్గంలో టీడీపీ నేతలు రూ.1000 నుంచి రూ.3500 కోట్లు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. పంచాయతీకి పోటీ చేయలేని నారా లోకేష్‌ పంచాయతీ రాజ్‌శాఖకు మంత్రికావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

~~ అనంతపురం రైతు కవాతు సభ లో PK ఉవాచ.

Posted
6eRfzaSK_bigger.jpgJanaSena Shatagni | 9394022222 @JSPShatagniTeam
FollowFollow @JSPShatagniTeam
More

నాతో చాలామంది విదేశీ పారిశ్రామికవేత్తలు చెప్పారు, జగన్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు, టీడీపీ అసలే రాదు, వచ్చేది జనసేన ప్రభుత్వం కాబట్టి మేము పెట్టుబడులు పెడతాం అని చెప్పారు - అనంతపురంలో  శ్రీ @PawanKalyan గారు. JANASENA KAVATHU ANANTAPUR

Posted
yCr7ABF5_bigger.jpgMirchi9 @Mirchi9
FollowFollow @Mirchi9
More

KIA తెచ్చి ఎదో సాధించినట్టు చెప్పుకుంటున్నారు అదే జనసేన వస్తే అలాంటివి పరిగెత్తుకు వస్తాయ్. #PawanKalyan #JanaSenaKavathuAtAnanthapur

 

 

hAe3x_7R_bigger.jpgSrinivas T @tsr_tweets
FollowFollow @tsr_tweets
More
Replying to @Mirchi9

కియా ఒక్కటి తెచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు, నేను సీఎం అయితే కౌర్నికోవా, షరపోవా, ఆకోవా, ఈకోవా, పాలకోవా అన్నీ పరిగెత్తుకుని వస్తాయ్. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...