Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vijayawada ki Light Metro!

Featured Replies

  • Author
7 minutes ago, Dravidict said:

Yaak thupuk

Road meedha metro na, adhi kuda central divider lepesi :wall:

Vijayawada ni gabbu leputhunnaru vedhava idea lu icchi

 

 

  • Replies 451
  • Views 39.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • unnecessary project Vijayawada ki hanta avasarlaa..mundu kavalsindi metro to vizag adi tesuku randi chalu

  • ravindras
    ravindras

    hyderabad metro rail loss lo nadusthunte vizag, vijayawada discussion waste. mundhu polavaram ki funds thechukunte chaaalu. 

  • sonykongara
    sonykongara

    Budget ki vetiki peddga emi sambandam emi undadu bro, ivvalai anukunte istharu, EAP krinda chestharu evi max esari istaru anukunta.

Posted Images

41 minutes ago, Dravidict said:

Yaak thupuk

Road meedha metro na, adhi kuda central divider lepesi :wall:

Vijayawada ni gabbu leputhunnaru vedhava idea lu icchi

 

road madyalo at grade "light" metro lu anni major cities lo vunnayi. kani opposite direction lo velle bikers, ekkada padith akkada road cross chese pedestrians vunde mana daggara ila pedithe anthe sangatulu.

asalu vijaywada ki metro endi. state lo intha kante important panulu emi leva?

avvani em jaragavu le kaani lite teeuskondi ..they r looking at all possible options andhulo idhokati ..just a proposal 

 

dugarajapatnam port ki alternative chupinchamani center 6 months nunchi adugutunte, intha varaku response ledu. agriculture university ki funds icchina, ippati varaku naaku telisinanta varaku designs marche phase lo ne vundi. 

 machilipatnam daggara 30000, 40000 acres ani 4 years ga saga deesi, intha varaki land acquisition ki kavalsina loan kuda finalize avvaledu.  inni talanoppulu vunte, asali metro patti vyaparam enduku.

  • Author
5 minutes ago, swarnandhra said:

 

dugarajapatnam port ki alternative chupinchamani center 6 months nunchi adugutunte, intha varaku response ledu. agriculture university ki funds icchina, ippati varaku naaku telisinanta varaku designs marche phase lo ne vundi. 

 machilipatnam daggara 30000, 40000 acres ani 4 years ga saga deesi, intha varaki land acquisition ki kavalsina loan kuda finalize avvaledu.  inni talanoppulu vunte, asali metro patti vyaparam enduku.

dugarajapatnam port issue veru bro

  • Author
6 minutes ago, swarnandhra said:

 

dugarajapatnam port ki alternative chupinchamani center 6 months nunchi adugutunte, intha varaku response ledu. agriculture university ki funds icchina, ippati varaku naaku telisinanta varaku designs marche phase lo ne vundi. 

 machilipatnam daggara 30000, 40000 acres ani 4 years ga saga deesi, intha varaki land acquisition ki kavalsina loan kuda finalize avvaledu.  inni talanoppulu vunte, asali metro patti vyaparam enduku.

machilipatnam daggara 30000, 40000 acres  anedi apesaru

3 minutes ago, sonykongara said:

machilipatnam daggara 30000, 40000 acres  anedi apesaru

yes, after wasting 3 years on pipe dreams. mana DB lo ne evaro dani background rasaru aamadhya. adda diddam ga land acquire chese YSR valla kaledu 6000 acres acquire cheyyataaniki akakda. vellu 35000 acres ani cheppi start chesaru. oka vela land pooling ki oppukuni vunna, antha land develope cheyyataaniki enni decades padutundi?  1 acre vunte danni padi rakaluga ela vaadalo baaga telisina public akkada. asalu ilanti ideas evaru istunnaro kani...

  • Author
4 minutes ago, swarnandhra said:

yes, after wasting 3 years on pipe dreams. mana DB lo ne evaro dani background rasaru aamadhya. adda diddam ga land acquire chese YSR valla kaledu 6000 acres acquire cheyyataaniki akakda. vellu 35000 acres ani cheppi start chesaru. oka vela land pooling ki oppukuni vunna, antha land develope cheyyataaniki enni decades padutundi?  1 acre vunte danni padi rakaluga ela vaadalo baaga telisina public akkada. asalu ilanti ideas evaru istunnaro kani...

SG7k53Y.jpgD8bi54D.jpg

  • Author
6 minutes ago, swarnandhra said:

yes, after wasting 3 years on pipe dreams. mana DB lo ne evaro dani background rasaru aamadhya. adda diddam ga land acquire chese YSR valla kaledu 6000 acres acquire cheyyataaniki akakda. vellu 35000 acres ani cheppi start chesaru. oka vela land pooling ki oppukuni vunna, antha land develope cheyyataaniki enni decades padutundi?  1 acre vunte danni padi rakaluga ela vaadalo baaga telisina public akkada. asalu ilanti ideas evaru istunnaro kani...

zzAtfi2.jpgLFvczF9.jpg

  • Author
31 minutes ago, Urban Legend said:

avvani em jaragavu le kaani lite teeuskondi ..they r looking at all possible options andhulo idhokati ..just a proposal 

 

32 minutes ago, Urban Legend said:

avvani em jaragavu le kaani lite teeuskondi ..they r looking at all possible options andhulo idhokati ..just a proposal 

బందరు రోడ్డు మీదనే మెట్రో రైలు..!
రహదారి వెడల్పు ఉండటంతో కొత్తగా తెరమీదకు
మరోసారి మారిన ప్రతిపాదనలు
మూడు నెలల్లో డీపీఆర్‌
ఈనాడు, విజయవాడ
amr-top1a.jpg
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన విజయవాడ మెట్రో ప్రాజెక్టు రోజుకో రూపు సంతరించుకుంటుంది. కేంద్ర సహాయ నిరాకరణ చేసిన తర్వాత మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. భిన్న అధ్యయనాల తర్వాత తేలికపాటి మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీని కోసం తయారవుతున్న సవివర నివేదిక (డీపీఆర్‌) రోజుకో రూపు సంతరించుకుంటుంది. సవివర నివేదిక తయారు చేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ ఇటీవల మధ్యంతర నివేదికను అందించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం వద్ద సమీక్ష జరిగింది. తాజాగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం జర్మనీకి చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థతో కలిసి డీపీఆర్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ప్రతిపాదించిన రెండు కారిడార్లు కాకుండా పరిధిని విస్తృతం చేసింది. నాలుగు కారిడార్లు చేపట్టాల్సి ఉంది. తాజాగా బందరు రోడ్డులోనూ ఎర్త్‌గ్రేడ్‌ (భూమ్మీద ట్రాక్‌) కారిడార్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదించింది.

గతంలో బస్టాండు నుంచి నిడమానూరు, బస్టాండు నుంచి పెనమలూరు వరకు రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని దిల్లీమెట్రోరైలు కార్పొరేషన్‌ ప్రతిపాదించింది. దీని ఎలివేటెడ్‌ సివిల్‌ నిర్మాణాలకు టెండర్లను కూడా పిలిచింది. కొంతకాలం తర్వాత వాటిని రద్దు చేసింది. అయితే ప్రస్తుతం తయారవుతున్న డీపీఆర్‌లో ఏలూరు రోడ్డులో మెట్రో ఎలివేటెడ్‌ కారిడార్‌పై తిరుగుతుంది. కానీ బందరు రోడ్డులో మాత్రం భూమ్మీదనే తిరుగుతుంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కిలోమీటరుకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. భూమ్మీద ఈ ఖర్చు ఉండదు. కేవలం ట్రాక్‌ నిర్మాణం చేస్తారు. ఈ ట్రాక్‌పై సరికొత్త మెట్రో కోచ్‌లు తిరుగుతాయి. స్టేషన్ల ఏర్పాటు అనుకూలంగా ఉంటుంది.
* బందరు రోడ్డులో ప్రస్తుతం పెనమలూరు వరకు కారిడార్‌ ప్రతిపాదించారు. దాదాపు 14 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది.
* బెంజి సర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ వరకు రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో రహదారి వెడల్పు 32 మీటర్లు పైగా ఉందని గుర్తించారు. దీనిపై రోడ్డు మీద మెట్రో కారిడార్‌ నిర్మాణం చేయవచ్చని చెప్పారు.
* మెట్రో కారిడార్‌కు రెండు వరసల ట్రాక్‌ నిర్మాణానికి 6.4 మీటర్ల వెడల్పు సరిపోతుంది. ఒక ట్రాక్‌ కోసం 3.2 మీటర్ల వెడల్పు సరిపోతుంది. అంటే బందరు రహదారి 32 మీటర్ల వెడల్పు ఉన్నందున ఎలివేటెడ్‌ అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. బెంజిసర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ గేట్‌ వరకు మాత్రం ఎలివేటెడ్‌ నిర్మాణం చేయాల్సి ఉంటుందని ఎండీ అభిప్రాయపడుతున్నారు.
* దీని వల్ల కనీసం రూ. వెయ్యి కోట్ల వరకు ఆదా కానుందని అంచనా. దీంతో ఎర్త్‌గ్రేడ్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టనున్నారు.‌
* ఏలూరు రహదారిలో కేవలం 15 మీటర్లు, 20 మీటర్ల వెడల్పుతోనే రహదారి ఉంది. దీంతో ఈప్రాంతంలో ఎర్త్‌గ్రేడ్‌ నిర్మాణం చేయడానికి అవకాశం లేదు. దీంతో తప్పనిసరిగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేయనున్నారు. నిడమానూరు వరకు ఇదే ఉంటుంది. అక్కడి నుంచి గన్నవరం వరకు ఎర్త్‌గ్రేడ్‌ నిర్మాణం చేయాలా లేక ఎలివేటెడ్‌ అనేది నిర్ణయించాల్సి ఉంటుంది.

జక్కంపూడి రెండో దశలోనే..!
జక్కంపూడి కారిడార్‌కు ప్రస్తుతం ట్రాఫిక్‌ సరిపోయే అవకాశం లేదని భావిస్తున్నారు. దీన్ని రెండో దశలో చేపట్టాలని నిర్ణయించినట్లు మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మొదటి దశలో గన్నవరం నుంచి నేరుగా అమరావతికి నిర్మాణం చేయాలనేది ప్రతిపాదన. కేసీ జంక్షన్‌ వరకు నిర్మాణం చేసి అక్కడి నుంచి ఎర్త్‌గ్రేడ్‌ ద్వారా అమరావతికి ట్రాక్‌ నిర్మాణం చేయనున్నారు.

 
 
  • 3 weeks later...
  • Author
విజయవాడకు ‘న్యూ మెట్రో పాలసీ’ లింకు
30-07-2018 08:05:20
 
636685347214312578.jpg
  • ఈ విధానంతో అంతులేని తాత్సారం
  • కేంద్ర ప్రభుత్వం నిజస్వరూపం బట్టబయలు
  • తుది అనుమతులకు చాలా సమయం
 
మెట్రో ప్రాజెక్టుకు ఎంతెంత దూరం అంటే.. చాలాచాలా దూరం అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇన్నాళ్లూ ప్రతిపాదనలతో సరిపెట్టి తాజాగా న్యూ మెట్రో పాలసీని తెరపైకి తేవడంతో బెజవాడ మెట్రో ప్రాజెక్టు మరోసారి సందిగ్ధంలో పడింది. అనుమతుల గడువు పొడిగిస్తూ పోతూ ప్రాజెక్టును తాత్సారం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న విషయం స్పష్టమైంది.
 
 
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా విజయవాడ నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో ప్రాజెక్టు కేటాయింపుపై కేంద్రం హామీలు మాటలకే పరిమితమయ్యాయి. అధికారికంగా తుది అనుమతులివ్వకుండా నాలుగేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసి ఇప్పుడు ‘న్యూ మెట్రో పాలసీ’ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడ నగరానికి ఇచ్చిన ఒక్కగానొక్క హామీ మెట్రో ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టును నగర ప్రజలు స్వాగతించారు. అయితే ఆది నుంచి మెట్రో విషయంలో కేంద్రం నుంచి సహాయనిరాకరణే ఎదురవుతోంది.
 
విజయవాడ: కేంద్రం తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసినట్టయింది. సుప్రీం కోర్టుకు కేంద్రం తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో విజయవాడ మెట్రో ప్రాజెక్టు విషయంలో న్యూ మెట్రో పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పి రాజధాని వాసుల మనోభావాలను దెబ్బతీసింది. న్యూ మెట్రో పాలసీలో చేస్తామని చెబుతూ కాలహరణం చేస్తోంది.
 
విజయవాడలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విభజనచట్టంలో భాగంగా హా మీ ఇచ్చింది. విభజన చట్టం హామీ మేర కు ప్రాజెక్టు మంజూరైంది. ఏపీ రీ అర్గనైజేషన్‌ యాక్ట్‌ పదమూడవ షెడ్యూల్‌ సెక్షన్‌ 93లో ఐటం పన్నెండవదిగా ఫీజిబిలిటీని బట్టి కేం ద్రం విజయవాడ మెట్రో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని చెప్పింది. అలాగే సెక్షన్‌ 94(1) ప్రకారం పారిశ్రామికీకరణ, ఆర్థికపురోభివృద్ధికి టాక్స్‌ ఇన్సెంటివ్‌లు ఇస్తామని పేర్కొంది.
 
కేంద్రం సహాయ నిరాకరణ
మెట్రో ప్రాజెక్టు సాకారం విషయంలో కేంద్రం నుంచి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రాజెక్టును వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అప్పట్లో మెట్రో ప్రాజెక్టులు ఎంఓయూడీ పరిధిలో నిర్ణయాలు జరిగేవి. మౌఖికంగా ప్రక్రియ ప్రారంభించమని ఆదేశించటం జరిగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ కాబట్టి కేంద్రమే ఈ ప్రాజెక్టు పూర్తి ఖర్చు భరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా కేంద్రానికి ఒక లేఖ రాశారు. ముఖ్యమంత్రి లేఖను కేంద్రం తిరస్కరించింది. ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టుకు పన్నుల మినహాయింపు కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖకు కూడా కేంద్రం నుంచి నిరాశాజనకమైన సమాధానం వచ్చింది. సెంట్రల్‌ ఎక్సైజ్‌, సర్వీసు ట్యాక్స్‌ వంటివి విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఇవ్వలేమని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ లేఖ రూపంలో తెలియపరచటం గమనార్హం.
 
విజయవాడ మెట్రో ప్రాజెక్టును పునర్విభజన చట్టం పరిధిలోకి తీసుకువచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఈ రెండింటిలో దేనిని కేంద్రం అమలు చేసినా మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తి సహాయం వచ్చి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండేది కాదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఫీజిబిలిటీ ఉంటే కేంద్రం నుంచి పూర్తి సహకారం వచ్చేది. ప్రత్యేక హోదా ప్రకారం చూసినా నూటికి 90శాతం నిధులను కేంద్రం ఖర్చుచేసి ఉండేది. పోనీ ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం చూసిందనుకుందాం! మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం మొత్తం 40 శాతం వాటా పోను మిగిలిన 60 శాతం నిధులను విదేశీ సంస్థల దగ్గర తీసుకుంటే ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల కింద ఆ మొత్తాన్ని కూడా కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఈ రెండింటి నుంచి కేంద్రం తప్పుకోవటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై గుదిబండ మోపే విధంగా కేంద్రం న్యూ మెట్రో పాలసీ అంశాన్ని ఉదహరిస్తోంది.
 
 
న్యూ మెట్రో పాలసీ.. గుదిబండ
న్యూ మెట్రో పాలసీ పరిధిలోకి బెజవాడను తీసుకోవటంతోనే రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కినట్టయింది. న్యూ మెట్రో పాలసీ రావటానికి మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చింది. తీరా పాలసీ వచ్చిన తర్వాత దాని విధానాలు చూస్తే విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు గుదిబండగా మారాయి. వీటిలో కేంద్ర ఈక్విటీతో పాటు పీపీపీ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.10వేల ప్రాజెక్టులో కొంతమేర పీపీపీకి అప్పగించాల్సి ఉంటుంది. కేంద్రం ప్రాయోజిత ప్రాజెక్టులోకి పీపీపీని తీసుకురావటం ఇబ్బందికరమైన అంశమే అవుతోంది. అలాగే థర్డ్‌ పార్టీ అప్రైజల్‌ కమిటీ అనుమతి తప్పనిసరి చేసింది. పాత విధానంలో అయితే నేరుగా కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ(ఎంఓయూడీ) అనుమతి ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఎంఓయూడీ కంటే థర్డ్‌పార్టీ అప్రైజల్‌ కమిటీ అనుమతే ప్రధానంగా మారుతుంది.
 
థర్డ్‌పార్టీ అప్రైజల్‌ కమిటీ ఇష్టముంటే ఎస్‌ అంటుంది. లేకపోతే నో అంటుంది. నో అన్నదని ఆ నెపాన్ని కేంద్రం అప్రైజల్‌ కమిటీ మీద తోసి వేసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ట్రాన్సిట్‌ ఓరియంట్‌ డెవల్‌పమెంట్‌ (టీఓడీ) ప్లాన్‌ తప్పనిసరి అని కూడా కేంద్రం మెలిక పెట్టింది. ట్రాన్సిట్‌ ఓరియంట్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ చేయటానికి ఇబ్బంది లేకపోయినా.. ఒక ఏడాది సమయం దీనిని చేయించటం కోసం కాల హరణం జరుగుతుంది. ప్రధానంగా ఆల్టర్‌నేటివ్‌ అనాలసిస్‌ను కోరటం జరుగుతోంది. ఇందులో భాగంగా మెట్రోతో పాటు బీఆర్‌టీఎస్‌, మోనో రైల్‌, ఎంఎంటీఎస్‌ వంటి ప్రాజెక్టులకు కూడా రిపోర్టు ఇవ్వాలి. మెట్రోకు ఫీజిబిలిటీ లేదని వీటిలో ఏదో ఒకటి చేపట్టమని దానికి సంబంధించి మరింత సమగ్రంగా డీపీఆర్‌ పొందు పరచమని కేంద్రం కోరే అవకాశం కూడా ఉంది. చివరగా మరో విషయాన్ని ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన మీదట మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవచ్చని ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఇస్తే సంతోషమే.. కానీ, బీజేపీ పాలిత రాష్ర్టాలకు దీనిని ఒక ఆయుఽధంగా చేసుకుని తేలిగ్గా అనుమతులు ఇచ్చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి అనేకరకమైన షరతులు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో నిర్దేశించిన మేరకు ఇచ్చిన హామీ ప్రాజెక్టుకు ఇంత వ్యయ ప్రయాసలు అవసరమా అన్నది ఆలోచించాల్సిన విషయం.
 
 
మౌఖికంగానే అనుమతులు..
విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు కార్యాచరణ ప్రారంభమైంది. డీఎంఆర్‌సీ, డీపీఆర్‌ను తయారు చేసింది. నగరంలో మెట్రో ఏర్పాటుకు ఫీజిబిలిటీ ఉందని సంస్థ నివేదిక ఇవ్వటంతో బెజవాడవాసులు హర్షించారు. రూ.7,500 కోట్ల వ్యయంతో 26 కిలోమీటర్ల నిడివిలో బందరు, ఏలూరు రోడ్డు కారిడార్లకు డీపీఆర్‌ తయారైంది. డీపీఆర్‌కు సంబంధించి.. ప్రక్రియను ప్రారంభించమని కేంద్రం మౌఖికంగా ఆదేశించింది. దీంతో టెండర్లను పిలిచారు. మొదటిసారి టెండర్లు పిలిచినపుడు పలుసంస్థలు ముందుకువచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపోను మిగిలిన నిధులను రుణంగా సమకూర్చటానికి జైకా వంటి సంస్థ ముందుకు వచ్చి వెనక్కివెళ్ళిపోయినా ఆ తర్వాత ఏఎఫ్‌డీ, కేఎ్‌ఫడబ్ల్యూ వంటి సంస్థలు ఆసక్తి చూపాయి. రుణం మంజూరుకు కేంద్రం అనేక ఇబ్బందులే పెట్టింది. డీపీఆర్‌లో పొందు పరిచిన విషయాలకు క్లారిఫికేషన్స్‌ పేరుతో కాలయాపన చేసింది. తగినంత జనాభా లేదని, తగినంత ఎఫ్‌ఐఆర్‌ఆర్‌ (ఫైనాన్షియల్‌ ఇంటర్నర్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌) రాదని ఇలా అనేక కారణాలతో తాత్సారం చేసింది. దీంతో తొలిసారి పిలిచిన టెండర్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు (పీఐబీ) దగ్గర విపరీతమైన కాలాతీతం జరిగింది. ఈ క్రమంలో నూతన మెట్రో పాలసీ వస్తోందని, దాని ప్రకారం తుది అనుమతులు ఇస్తామని కేంద్రం నమ్మబలికింది.
 
 
ద్వంద నీతి..
బెజ వాడకు మెట్రో ప్రాజెక్టును కాదని, ఇతర రాష్ర్టాల్లోని నగరాలకు మూడు మెట్రో ప్రాజెక్టులను కేటాయించటం గమనార్హం. నూతన మెట్రో పాలసీ వస్తుందని కేంద్రం మనకు చెప్పిన తర్వాత.. లక్నో, పూనే, గ్రేటర్‌ నోయిడాలకు పాత పాలసీ కింద మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. విజయవాడకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి నూతన మెట్రో పాలసీ ప్రకారం ఇస్తామని చెప్పటం గమనార్హం.
  • Author
మూడడగులు వెనక్కేస్తున్న కేంద్రం.. ఆరడుగులు ముందుకెళ్తున్న ఏపీ సర్కార్
31-07-2018 09:13:35
 
636686252159915491.jpg
  • వారంలో మధ్యంతర డీపీఆర్‌ సమర్పించనున్న శిస్ట్రా
  • అనంతరం అధికారులతో కీలక సమావేశం
  • కేంద్ర ప్రభుత్వ తాత్సారానికి బ్రేక్‌
  • అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ చొరవ
  • గన్నవరం టు అమరావతి..
  • క్యాపిటల్‌ సిటీ వరకు స్వరూపమిదే..
అమరావతి లైట్‌మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం మూడడుగులు వెనక్కి వేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆరడుగులు ముందుకు పోతోంది. న్యూ మెట్రో పాలసీ లింకుతో ఎలాగైనా ఈ ప్రాజెక్టును తాత్సారం చేయాలన్న కేంద్రం కుట్రను పటాపంచలు చేస్తూ అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) త్వరగా పూర్తిచేసే సన్నాహాల్లో పడింది. ఈ నేపథ్యంలోనే కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టా వారంలో మధ్యంతర డీపీఆర్‌ను అధికారులకు సమర్పించనుంది. అత్యున్నతమైన స్టీరింగ్‌ కమిటీ భేటీ అనంతరం దీనికి తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి లైట్‌ మెట్రో ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై ప్రత్యేక కథనం.
 
 
అమరావతి: ప్రతిష్టాత్మక లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు విశ్వరూపం కొద్దిరోజుల్లో ఆవిష్కృతం కానుంది. మీడియం మెట్రో ప్రాజెక్టు కంటే రెండురెట్ల నిడివితో మహా లైట్‌ మెట్రోకు మధ్యంతర (ఇంటీరియం) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారైంది. వారంలో మధ్యంతర డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ శిస్ర్టా.. అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కి అందించనుంది. మధ్యంతర నివేదిక రాగానే అత్యున్నతమైన స్టీరింగ్‌ కమిటీ దీనిపై భేటీ అవుతుంది. మధ్యంతర రిపోర్టుపై చర్చించి మార్పులకు సంబంధించి సూచనలు చేస్తారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఫైనల్‌ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ ఏఎంఆర్‌సీకి అప్పగిస్తుంది. ఈ ప్రక్రియ అంతా రెండు నెలల్లోనే పూర్తవుతుంది. కేంద్రప్రభుత్వం న్యూ మెట్రో పాలసీ లింకుతో తాత్సారం జరుపుతున్నా ఏఎంఆర్‌సీ అవేమీ పట్టించుకోకుండా ప్రాజెక్టు త్వరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఈ డీపీఆర్‌ సిద్ధమైంది. దీనికి సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’కి అందిన సమాచార సమగ్ర స్వరూపం ఇది.
 
 
73 కిలోమీటర్ల కారిడార్‌
లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టును తొలిదశలోనే అమరావతి రాజధానికి అనుసంధానించేలా డీపీఆర్‌లో కారిడార్‌లను రూపొందించారు. గతంలో మీడియం మెట్రో ప్రాజెక్టు నిడివి కంటే ఈసారి లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిడివి రెండు రెట్లు పెరిగింది. మీడియం మెట్రో ప్రాజెక్టు నిడివి రెండు కారిడార్లలో (బందరు, ఏలూరు రోడ్లలో ) 27 కిలోమీటర్లు ఉంటే, ప్రస్తుత లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు నడివి 73 కిలోమీటర్లుగా ఉంది. దాదాపుగా రెండు రెట్ల మేర అదనంగా కారిడార్‌ల నిడివి పెరిగింది. మొత్తం మూడు కారిడార్లుగా మధ్యంతర డీపీఆర్‌ సిద్ధమైంది.
 
 
కారిడార్‌-1 : విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు (గన్నవరం) నుంచి నిడమానూరు, ఏలూరు రోడ్డు, రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌ వయా కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ (కారిడార్‌-1) వరకు 53.5 కిలోమీటర్ల నిడివి ఉంది. పాత డీపీఆర్‌లో పీఎన్‌బీఎస్‌ నుంచి నిడమానూరు వరకు 13 కిలోమీటర్ల నిడివే ఉంది. నూతన మధ్యంతర డీపీఆర్‌లో నిడమానూరు నుంచి ఎయిర్‌పోర్టు వరకు అదనంగా 12.5 కిలోమీటర్ల నిడివి పెరుగుతోంది. అలాగే, పీఎన్‌బీఎస్‌ నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు 4 కిలోమీటర్ల నిడివి, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ నుంచి అమరావతి క్యాపిటల్‌ సిటీ వరకు 24 కిలోమీటర్ల నిడివి పెరుగుతోంది. ఈ మొత్తం కలిపి ఒకే కారిడార్‌గా సూచించారు.
 
కారిడార్‌-2 : బందరు రోడ్డు కారిడార్‌ యథాతథంగానే ఉంది. పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు సెంటర్‌ వరకు 12 కిలోమీటర్ల నిడివి ఉంది.
 
కారిడార్‌-3 : పీఎన్‌బీఎస్‌ నుంచి జక్కంపూడి వరకు 7.5 కిలోమీటర్ల నిడివి ఉంది.
 
భూమిపైనా, ఫ్లై ఓవర్‌ మీద కారిడార్‌ లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని తగ్గించటానికి శిస్ర్టా సంస్థ కొంతమేర భూమి మీద, మరికొంత ఫ్లై ఓవర్‌ మీద ఉండాలని నిర్దేశించింది. మొత్తంగా 73 కిలోమీటర్ల కారిడార్‌ నిడివిలో 32 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌ పోర్షన్‌ ఉంది. 34 కిలోమీటర్ల నిడివి రోడ్డు మీదనే ఉంటుంది. ఏడు కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ మెట్రో ఉంటుంది. మధ్యంతర డీపీఆర్‌లో పొందుపరిచిన ప్రకారం కారిడార్‌-2 బందరు రోడ్డులో తాడిగడప దాటాక పెనమలూరు సెంటర్‌ వరకు భూమి మీద మెట్రో కారిడార్‌ ఉంటుంది.
 
ఇక్కడ నాలుగు వరసలుగా విస్తరించటం జరిగింది కాబట్టి భూమిపై అనువుగా ఉంటుందని నిర్ణయించారు. కారిడార్‌-1లో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నిడమానూరు వరకు హైవే - 16 మీదనే ట్రాక్‌ వేయాలని ప్రతిపాదించటం జరిగింది. నిడమానూరు నుంచి మళ్లీ ఏలూరురోడ్డు, రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌ వరకు ఫ్లై ఓవర్‌ పోర్షన్‌ ఉంటుంది. పీఎన్‌బీఎస్‌ నుంచి కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వరకు కూడా ఫ్లై ఓవర్‌ పోర్షన్‌ ఉంటుంది. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ నుంచి ఉద్దండరాయునిపాలెం సమీపం వరకు ఫ్లై ఓవర్‌ పార్టు ఉంటుంది. కారిడార్‌ -3లో పీఎన్‌బీఎస్‌ - రైల్వేస్టేషన్‌ - జక్కంపూడి కాలనీ దాటే వరకు ఫ్లై ఓవర్‌ పోర్షన్‌ ఉంటుంది. అక్కడి నుంచి జక్కంపూడి ఎకనమిక్‌ సిటీ వరకు రోడ్డు పోర్షన్‌లో మెట్రో మార్గం ఉంటుంది.
 
 
కమిటీలో కీలక సిఫారసులు
మహా లైట్‌ మెట్రోకు సంబంధించి శిస్ర్టా సంస్థ మధ్యంతర డీపీఆర్‌ను అందించనున్న నేపథ్యంలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) అధికారులు హై లెవల్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కమిటీలో మొత్తం 17 మంది సభ్యులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ) కరికాల వలవన్‌తో పాటు ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డి, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, సీఆర్‌డీఏ కమిషనర్‌, పోలీస్‌ కమిషనర్‌, మునిసిపల్‌ కమిషనర్‌తో పాటు ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, విద్యుత్‌, టెలికాం, నేషనల్‌ హైవే తదితర శాఖలకు చెందిన అధికారులు సమావేశంలో చర్చిస్తారు. డీపీఆర్‌లో ఉన్న అంశాలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పరిశీలన అనంతరం పలు సూచనలు చేస్తారు. మార్పులు కూడా సూచించవచ్చు. అనంతరం డీపీఆర్‌ తయారీకి కృషిచేస్తున్న ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిధులతో కూడా దీనిపై చర్చించి శిస్ట్రాకు సూచనలు చేసే అవకాశం ఉంది.
 
 
 
ఎలాంటి సాయం చేస్తారో చెప్పండి.. కేంద్రానికి ఏఎంఆర్‌సీ లేఖాస్త్రం
 
మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఎలాంటి సహాయం చేస్తారో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) లేఖాస్త్రం సంధించింది. కేంద్రం ఇచ్చిన హామీల మేరకు మూడు ఆప్షన్స్‌ ఇచ్చి వీటిలో దేని ప్రకారం విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సహకారం అందిస్తారో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ లేఖను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించింది. లేఖలోని సారాంశం ప్రకారం ఏఎంఆర్‌సీ మూడు ఆప్షన్లను ప్రస్తావించింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనేక లేఖలు రాయటం, ఉభయుల నడుమ జరిగిన లావాదేవీలను క్లుప్తంగా వివరించింది.
 
అయితే, ఏఎంఆర్‌సీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్రం నుంచి సమాధానమేమీ రాలేదు. కాంగ్రెస్‌ నాయకుడు సుధాకర్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం నూతన మెట్రో పాలసీ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇటీవల సమాధానం ఇచ్చింది. దీనిప్రకారం విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్టే అవుతుంది. దయతలిచి అరకొర సహాయం తప్పితే ఎలాంటి సహకారం ఉండదు. దీంతో మెట్రో వర్గాలు కేంద్రం తీరుపై రగిలిపోతున్నాయి.
 
 
అండర్‌ గ్రౌండ్‌ పోర్షన్‌ ఇదీ..
అమరావతి క్యాపిటల్‌ సిటీలో అండర్‌ గ్రౌండ్‌ పోర్షన్‌ ఉంటుంది. ఉద్దండ్రాయుని పాలెం మీదుగా క్యాపిటల్‌ సిటీ వరకు పూర్తిగా అండర్‌ గ్రౌండ్‌ విధానంలోనే మెట్రో ఉంటుంది. గతంలో విజయవాడ ఎయిర్‌పోర్టులో కూడా అండర్‌ గ్రౌండ్‌ విధానంలో అనుకున్నా.. నేలపైనే మెట్రో లైన్‌ వెళ్లేలా అలైన్‌మెంట్‌ చేశారు.
 
 
మెట్రో స్టేషన్లు ఇలాలైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు పరిధి పెరగటంతో దీనికి అనుగుణంగా మెట్రో స్టేషన్లు కూడా పెరిగాయి. మెట్రో స్టేషన్ల విషయానికి వస్తే మొత్తం 150 ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్‌కు ఒక మెట్రో స్టేషన్‌ చొప్పున రెండువైపులా ఏర్పాటు చేస్తే.. ఎన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే సెంట్రల్‌ పాయింట్‌లో ఒకచోట మాత్రమే ఏర్పాటుచేస్తే 75 వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
 
 
ప్రధాన మెట్రోస్టేషన్‌ పీఎన్‌బీఎస్‌ దగ్గరలైట్‌ మెట్రోరైల్‌ ప్రధాన స్టేషన్‌ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) దగ్గర ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జాతీయ రహదారి 65పై ప్రధాన స్టేషన్‌ ఉంటుంది. జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లేలా గ్రౌండ్‌ను వదిలేస్తారు. ఫ్లై ఓవర్‌పై వెళ్లే రైళ్ల కోసం ఫస్ట్‌ ఫ్లోర్‌లో స్టేషన్‌, దీని పైఅంతస్తులో కమర్షియల్‌గా ఇస్తారు. జీప్లస్‌5 విధానంలో మెట్రోస్టేషన్‌ ఉంటుంది. పీఎన్‌బీఎస్‌, రైల్వేస్టేషన్ల దగ్గర స్కైవాక్‌లను ఏర్పాటు చేస్తారు. పీఎన్‌బీఎస్‌ దగ్గర మల్టీకార్‌ పార్కింగ్‌ ప్లేస్‌ ఏర్పాటు చేస్తారు.
 
కకోచ్‌ డిపోలు రెండుకారిడార్‌ నిడివి పెరగటంతో రెండు కోచ్‌ డిపోలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కేసరపల్లి దగ్గర మొదటి కోచ్‌ డిపోను నిర్మించాల్సి ఉంటుంది. దీనికి 40 ఎకరాల భూమి అవసరం. రెండవ కోచ్‌ డిపోకు రాజధాని ప్రాంతంలో 30 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత ఇంకా ఇవ్వలేదు. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ దగ్గర ఇవ్వొచ్చని సమాచారం.
metro-amaravathi.jpg 
 
Tags : amaravathi, metro, AP capital, ap govt, Central Govt
  • Author
On 7/7/2018 at 11:13 AM, Urban Legend said:

avvani em jaragavu le kaani lite teeuskondi ..they r looking at all possible options andhulo idhokati ..just a proposal 

vijayawada lo land meda antunadu gabbu lesthundi inka thuuu

41 minutes ago, sonykongara said:

vare daridrulara land meda tiyyandi raa babuu

land meedane unchuthunnaru. deeniki reason scientific and fissibility and commercial viability study. vallu chesedi nijame. nenu kuda aa study chusi land meeda pettadam corrrect anipisthondi.

they studied Hyd Metro, BLR metro and various international cities. All of them are in continuous losses. occupancy is also not there much. Even Mumbai metro whith 100% occupancy is in losses. The reason commercially they spent a lot to build on elevated corridors and daily operation is expensive. with that add less occupancy and causing even more losses.

So they studied Houston, san fransisco etc cities. akkada land meede undi. they are really successful as they spend less for construction and daily operation. on top of that land meeda unte 100% occupancy untadi. adi reason.

Vijayawada ki land meede correct anipisthondi as land aquisition cost is sky high price. 

  • 3 weeks later...
  • Author
విజయవాడ వాసుల కల నెరవేరబోతోంది..
16-08-2018 10:35:21
 
636700125223074484.jpg
  • రెండు వారాల్లో 26న మధ్యంతర డీపీఆర్‌ రిపోర్టు
  • హై లెవల్‌ కమిటీ అధ్యయనం
విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌ మధ్యంతర డీపీఆర్‌ మరో రెండు వారాల్లో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)కి అందబోతోంది. లైట్‌ మెట్రోరైల్‌ మధ్యంతర డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ ఇప్పటికే రూపొందించింది. ఈనెల 26న శిస్ర్టా అందించే మధ్యంతర డీపీఆర్‌పై ఏఎంఆర్‌సీ అధ్యయనం చేసిన తర్వాత అత్యున్నతమైన స్టీరింగ్‌ కమిటీ అధ్యయనం చేస్తుంది. స్టీరింగ్‌ కమిటీలో మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణతో పాటు, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌తో పాటు జిల్లా, నగర ఉన్నతాధికారులంతా అందులోనే కమిటీ సభ్యులుగా ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని శిస్ర్టా సంస్థ కూడా పకడ్బందీగా డీపీఆర్‌కు రూపకల్పన చేస్తోంది.
 
 
ఇంటీరియం డీపీఆర్‌కు సంబంధించిన విషయాలను సేకరించిన ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఒక్క అంశంలో కూడా లోపంలేకుండా చూసుకోగలిగితే తుది డీపీఆర్‌ను అందించటం సులభమవుతుందని ‘శిస్ర్టా’ భావిస్తోంది. కారిడార్లలో ప్రధానంగా భూమిపై ఎక్కడ నిర్మించాలి? ఫ్లై ఓవర్‌ మార్గం ఎక్కడ ఉండాలన్నది ఏవిధంగా ఉంటుందన్నది కీలకం. హైలెవల్‌ కమిటీ కూడా దీనిపై చర్చిస్తుంది. హైలెవల్‌ కమిటీని ఈ విషయంలో శిస్ర్టా తన నివేదికలో మెప్పించాల్సి ఉంటుంది. ఏఎంఆర్‌సీ కోరుకుంటున్న దానికి, శిస్ర్టా నివేదికకు సంబంధించి కొన్ని కారిడార్లలో వైరుధ్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై హైలెవల్‌ కమిటీలో ఉన్నతాఽధికారులను శిస్ర్టా సంస్థ ఏవిధంగా మెప్పిస్తుందన్నది వేచి చూడాల్సిందే!
 
Tags : Vijayawada, light metro rail, amaravathi
  • 2 weeks later...
  • Author
జక్కంపూడికి మెట్రో మార్గం!
31-08-2018 08:23:36
 
636713006179049234.jpg
  • పీఎన్‌బీఎస్‌ నుంచి సర్క్యులర్‌ లైట్‌ మెట్రో కారిడార్‌!
  • ఈ కారిడార్‌లో మోనో రైల్‌ నడపాలన్న ఆలోచన
  • రాకపోకలకు వేర్వేరు కారిడార్లు
  • మధ్యంతర డీపీఆర్‌లో మార్పులు
 
రాజధాని ప్రాంతంలో విజయవాడ నగర వాయువ్య దిశన ర్యాపిడ్‌ గ్రోత్‌ఉన్న ప్రాంతంలో ఎకనమిక్‌ సిటీకి అడుగులు పడుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలపై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే జక్కంపూడికి సర్క్యులర్‌ మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. లైట్‌ మైట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ‘శిస్ర్టా’ సంస్థ రూపొందిస్తున్న మధ్యంతర డీపీఆర్‌లో ఈ మేరకు సవరణలు చేస్తున్నట్టు తెలిసింది.
 
 
విజయవాడ: ఆర్థిక రాజధాని జక్కంపూడి కేంద్రంగా లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు స్వరూపం కొత్త పుంతలు తొక్కుతోంది. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి జక్కంపూడికి ప్రతిపాదించిన కారిడార్‌ను సర్క్యులర్‌ కారిడార్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ఆలోచనను తాజాగా అమరావతి మెట్రో రైల్‌ కార్పొ రేషన్‌(ఏఎంఆర్‌సీ) అధికారులు చేస్తున్నారు. లైట్‌ మైట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ‘శిస్ర్టా’ సంస్థ రూపొందిస్తున్న మధ్యంతర డీపీ ఆర్‌లో ఈ మేరకు సవరణలు చేస్తున్నట్టు తెలిసింది. సర్కుల్యర్‌ కారిడార్‌ కోసం సమాంతరంగా రెండు కారిడార్‌ మార్గాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. సర్క్యులర్‌ కారిడార్‌లో జక్కంపూడి నుంచి పీఎన్‌బీఎస్‌కు తిరిగి పీఎన్‌బీఎస్‌ నుంచి జక్కంపూడికి నిరంతరాయంగా తిరిగేలా లైట్‌ మెట్రో రైల్‌ను నడపాలన్న భావనలో ఉన్నారు. సర్క్యులర్‌ కారిడార్‌ను నిర్దేశిస్తున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా ఉండటానికి మోనోరైల్‌ను ఈ మార్గంలో నడిపితే ఎలా ఉంటుందన్న అంశంపైనా అధికారులు దృష్టిసారించారు. మోనోరైల్‌కు అయినా కారిడార్‌ ఒకేలా ఉంటుంది. కోచ్‌ మాత్రమే కొద్ది మార్పుగా ఉంటుంది. మోనోరైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఏఎంఆర్‌సీ అధికారులు భావిస్తున్నారు.
 
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందిస్తున్న ‘శిస్ర్టా’ సంస్థ విజయవాడ, అమరావతి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేసేలా, అంతర్గతంగానూ మొత్తం 68 - 70 కిలోమీటర్ల నిడివితో కూడిన ప్రత్యేక కారిడార్లకు రూపకల్పన చేసింది. వీటిలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నిడమానూరు వరకు 12.5 కిలోమీటర్లు, తిరిగి నిడమానూరు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌కు 13 కిలోమీటర్ల మార్గంలో కారిడార్‌ను ప్రతిపాదించింది. పెనమలూరు సెంటర్‌ నుంచి పీఎన్‌బీఎస్‌కు బందరు రోడ్డు మీదుగా 12 కిలోమీటర్ల నిడివి కారిడార్‌ను ప్రతిపాదించింది. పీఎన్‌బీఎస్‌ నుంచి అమరావతి రాజధానికి 28కి.మీటర్ల నిడివితో కారిడార్‌ను రూపొందించింది. ఆర్థికనగరం జక్కంపూడికి 6 కిలోమీటర్ల నిడివితో కారిడార్‌ రూపొందించింది. వీటి అన్నింటిలో జక్కంపూడి కారిడార్‌ మాత్రమే సర్క్యులర్‌ కారిడార్‌గా ఉండటం గమనార్హం. దీనినిబట్టి చూస్తే ఆర్థిక నగరానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారన్నది గమనించాల్సిన విషయం.
 
మధ్యంతర నివేదికలో అలైన్‌మెంట్‌
ఆర్థిక నగరం జక్కంపూడికి ప్రతిపాదించిన రెండు కారిడార్లు పీఎన్‌బీఎస్‌ నుంచి వెళ్ళే రూట్‌మ్యాప్‌ వివరాలను ఏఎంఆర్‌సీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు ఒక కారిడార్‌ నిడివి 6 కిలోమీటర్లు, మరో కారి డార్‌ నిడివి 4.5 కిలోమీటర్లు ఉండటం విశేషం. అలైన్‌మెంట్‌ ఏ విధంగా ఉంటుందన్నది డీపీఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ ’శిస్ర్టా’ మధ్యంతర నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
 
 
ట్రాఫిక్‌ ప్రధాన కారణం
జక్కంపూడికి సర్కులర్‌ కారిడార్‌ ప్రతిపాదన వెనుక ఈ రూట్‌లో ఉన్న ట్రాఫిక్‌ ప్రధాన కారణం అని తెలుస్తోంది. ప్రతి కారిడార్‌లో ట్రాఫిక్‌, పాసెంజర్‌ సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా జక్కంపూడికి భారీగా రాకపోకలు జరుగుతున్నాయన్నది తేలింది. రద్దీ సమయాలలో నాలుగు వేల మంది రాకపోకలు సాగిస్తున్నారన్నది తమ సర్వేలో శిస్ర్టా సంస్థ గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ చిన్న మార్గంలో సర్క్యులర్‌ కారిడార్‌ వేస్తే లాభదాయకతగా ఉంటుందన్నది భావనగా ఉంది.
On 7/31/2018 at 10:08 AM, sonykongara said:

DkJ28rq.jpg

underground metro cost in delhi is 552 crore/km .

elevated metro cost 221 crore/km

avoid underground metro 

as per iisc bangalore study, suburban rail cost 18.5 crore/km

https://timesofindia.indiatimes.com/city/delhi/Built-at-552-crore-per-km-Ph-III-a-costly-affair/articleshow/49511400.cms

https://timesofindia.indiatimes.com/city/bengaluru/Suburban-rail-20-times-cheaper-than-Metro-IISc/articleshow/45420402.cms

cbn needs to focus on suburban rail and on ground metro for reducing cost of construction.

in suburban rail also we can use aircondition coaches. suburban rail can carry more passengers compare to metro as it runs on broad-gauge. ticket prices are less. 

amaravathi is green field capital. there are more possibilities for building suburban rail . 

Edited by ravindras

  • Author
లైట్‌ మెట్రోకు.. కేంద్రం కొర్రీ!
05-09-2018 07:13:57
 
636717284372328317.jpg
  • సహాయం నుంచి పూర్తిగా తప్పుకొనే కుట్ర
  • మేక్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో స్వదేశీ భాగస్వామ్యం ఉండాలని మెలిక
  • తుది దశలో లైట్‌ మెట్రో రైల్‌ డీపీఆర్‌
 
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలు విజయవాడ లైట్‌ మెట్రో కొంప కూల్చబోతున్నాయి. మెట్రో ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలంటే తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనట...! దేశవ్యాప్తంగా మేక్‌ ఇన్‌ఇండియా కాన్సెప్ట్‌తో స్వదేశీ సాంకేతిక సహకారంతో ఉంటేనే కేంద్ర సహాయం లభిస్తుంది. దీనికి కేంద్రం పెట్టిన ముద్దు పేరు ‘యూనీక్‌ టెక్నికల్‌ కాన్సెప్ట్‌’. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో ప్రాజెక్టులు విధిగా దీనిని అమలు చేయాలని మెలిక పెట్టడంతో విజయవాడ లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు కూడా ఇదే కోవలోకి వెళ్లబోతోంది. కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌పై ఉరమని పిడుగులా పడింది.
 
 
విజయవాడ: రాష్ట్ర విభజన హక్కు చట్టం ప్రకారం బెజవాడకు ఇచ్చిన ఒక్కగానొక్క హామీని అమలు చే యడానికి కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులతో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే! విభజన చట్టం పదమూడో షెడ్యూల్‌ ప్రకారం విజయవాడకు మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఫీజుబిలిటీ ఉంటే నూటికి నూరుశాతం కేంద్రం సహకారం అందించాల్సి ఉంటుంది. ఫీజుబిలిటీ వచ్చిన ఈ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే నూటికి 90 శాతం గ్రాంటుగా కేంద్ర ం ఇవ్వాల్సి ఉండేది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తెగేసి చెప్పిన తర్వాత.. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం చూసినా విదేశీ సంస్థల దగ్గర ఈ ప్రాజెక్టు మొత్తం రూ.7 వేల కోట్ల వ్యయంలో 60 శాతం మేర తీసుకునే రుణం (దాదాపుగా రూ.4,,500 కోట్లు ) ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులుగా కేంద్రం భరించాల్సి ఉంది. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాల్సిన తరుణంలో సరిగ్గా మెట్రో పాలసీని తీసుకువచ్చింది. విజయవాడ డీపీఆర్‌ తర్వాత వచ్చిన గ్రేటర్‌ నోయిడా, పూణె వంటి నగరాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన కేంద్రం ఆ తర్వాత విజయవాడకు మొండి చేయిచూపింది.
 
న్యూ మెట్రో పాలసీ..
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చూసినా, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏ రకంగా తీసుకున్నా విజయవాడ మెట్రో ప్రాజెక్టును ప్రత్యేకంగా తీసుకుని సాయం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం న్యూ మెట్రో పాలసీ పరిధిలోకి విజయవాడను కూడా తీసుకు వచ్చింది. కేంద్ర సాయం కావాలంటే ఈ విధానం ప్రకారం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
 
దీనిని దృష్టిలో ఉంచుకుని మీడియం మెట్రో ప్రాజెక్టును కాదనుకుని లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు వైపుగా అడుగులు వేయడం జరిగింది. విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు విదేశీ సంస్థలు సహకారం అందించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. విజయవాడ లైట్‌ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఉచితంగా తయారు చేసి ఇస్తోంది. ఏఎంఆర్‌సీ కూడా ఈ సంస్థ భాగస్వామ్యంతో డీపీఆర్‌ కోసం టెండర్లు పిలిచింది. శిస్ర్టా సంస్థను ఎంపిక చేశారు. ఆ సంస్థ దాదాపుగా డీపీఆర్‌ పూర్తి చేసింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు భూ సేకరణ, పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1000 కోట్లకు పైగా భారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విదేశీ సంస్థల సహకారంతో ముందుకు తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై చాలా వరకు భారం తగ్గుతుంది.
 
మేకిన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో..
ఈ దశలో కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు మేకిన్‌ ఇండియా కాన్సెప్ట్‌తో ఉన్నాయి. మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ఎలక్ర్టికల్‌, మెకానికల్‌, ట్రాక్షన్‌, కోచ్‌లు తదితరాలన్నీ స్వదేశీ తయారీతో ఉండాలి. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో విజయవాడకు కూడా ఇది మినహాయింపు కాదన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం. విజయవాడ లైట్‌ మెట్రో ప్రాజెక్టును విదేశీ సంస్థల సహకారంతో ముందుకు తీసుకు వెళ్లాలని చూడటం వల్ల తప్పనిసరిగా రుణాన్ని అందించే సంస్థలు కొన్ని షరతులు విధిస్తాయి. ఈ షరతుల ప్రకారం ఎలక్ర్టికల్‌, కోచ్‌లు తదితరాలకు సంబంధించి తమ దేశాలలో తయారైన వాటిని కొనుగోలు చేయాలన్న షరతులు విధిస్తాయి. విదేశీ రుణ సంస్థలు అప్పులు ఇవ్వాలంటే ఆ దేశానికి సంబంధించి కొంత వ్యాపారాన్ని కలిగించే సంప్రదాయాన్ని ఆయా సంస్థలు విధిగా పాటిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని చూస్తే విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ముందుకు తీసుకు వెళ్లాలనుకుంటున్న లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు భవితవ్యంపై మరోమారు కేంద్రం పరోక్షంగా దెబ్బతీసినట్టు అవుతోంది.
 
 
ఇదీ పరిస్థితి
విదేశీ సంస్థల సహకారం పేరుతో కేంద్ర ప్రభుత్వం విజయవాడ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు నయా పైసా కూడా సహాయం చేసే పరిస్థితి ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చూస్తే విజయవాడ లైట్‌ మెట్రో ప్రాజెక్టు భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. మరికొద్ది రోజులలో డీపీఆర్‌ అందుకుంటున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈవిధంగా ఆదేశాలు జారీ చేయడం ఏఎంఆర్‌సీ అధికారులను నివ్వెరపరుస్తోంది. ఏతా వాతా రాష్ట్ర ప్రభుత ్వంపై భారం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
  • 4 weeks later...
  • Author
విజయవాడ వాసులకు మెట్రో కష్టం..!!
02-10-2018 10:17:07
 
636740744912244463.jpg
  • మీడియం మెట్రో కోసం భూసేకరణ నోటిఫికేషన్‌
  • ఆ ప్రాజెక్టు రద్దయినా సడలించని ఆంక్షలు
  • మూడేళ్లుగా భూములపై కొనసాగుతున్న ఆంక్షలు
  • లైట్‌ మెట్రో కోసమేనంటున్న అధికారులు
 
మీడియం మెట్రో వచ్చేసిందన్నారు. భూసేకరణకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. అది కాస్తా రద్దయింది. లైట్‌ మెట్రో అన్నారు. దీనికి డీపీఆర్‌ సిద్ధమవుతోందంటున్నారు. మధ్యలో మూడేళ్లు గడిచిపోయాయి. మీడియం మెట్రో కోసం సేకరించాలని ప్రతిపాదించిన భూములపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బందరు, ఏలూరు రోడ్లలో ఖరీదైన స్థలాల, భవనాల యజమానులు వాటిని అమ్ముకోలేక, నిర్మాణాలను చేపట్టలేక ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
 
‘విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు మా భూములు ఇస్తాం తీసుకోండి’ అని మొరపెట్టుకుంటున్నా వినరు. ‘మీరు తీసుకోకుంటే తీసుకోక పోయారు. మా స్థలంలో ఏదైనా నిర్మాణం చేసుకుంటాం అనుమతి ఇవ్వండి’ అని వేడుకున్నా పెడచెవిన పెడతారు. విజయవాడకు మెట్రో రైలు వచ్చే సంగతి దేవుడెరుగు, మేము మాత్రం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బందరు, ఏలూరు రోడ్డులోని పలువురు భవన, ఖాళీ స్థలాల యజమానులు. మూడేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా తాము కోట్లాది రూపాయల విలువైన భూములుండీ నిరుపేదలుగా మిగిలిపోవాల్సి వస్తోందని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 
విజయవాడ: రాజధాని ప్రాంతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయ వాడకు మెట్రో రైలును తీసుకురావాలన్నది సీఎం చంద్రబాబు కల. సీఎం ఆలోచనలకు అనుగుణంగా విజయవాడతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) ఏర్పడింది. విజయవాడలో తొలుత మీడియం మెట్రో ప్రాజెక్టును చేపట్టారు. పండిట్‌ నెహ్రు బస్‌స్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు ఒక లైను, పండిట్‌ నెహ్రు బస్‌స్టేషన్‌ నుంచి నిడమనూరు వరకు మరో లైను వేయాలని నిర్ణయించారు. దీనికోసం భూసేకరణ చేపట్టేందుకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. టెండర్ల దశలో ఇది రద్దయింది. అనంతరం లైట్‌ మెట్రో తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం లైట్‌ మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌ సిద్ధమవుతోంది.
 
 
2016లో భూసేకరణ నోటిఫికేషన్‌
మీడియం మెట్రో ప్రాజెక్టు కోసం 2016 చివరిలో భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చారు. బందరు, ఏలూరు రెండు రోడ్లలో మొత్తం 25 చోట్ల మెట్రో స్టేషన్ల నిర్మాణం కోసం 10 ఎకరాల భూములను ప్రతిపాదించారు. ఈ భూముల్లో కొన్ని ఖాళీ స్థలాలు ఉండగా.. భవన నిర్మాణాలు ఉన్నాయి. అలాగే నిడమానూరులో కోచ్‌డిపో కోసం 70 ఎకరాలను ప్రతిపాదించారు. ఈ క్రమంలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డుతో పాటు నిడమానూరు రైతుల భూములకు సంబంధించి అమ్మకాలు, కొనుగోలు జరపకుండా, ప్లాన్లు వంటివి మంజూరు కాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భూ సేకరణ నోటిఫికేషన్‌ వెలువరించిన తర్వాత వారితో జరిపిన చర్చల సందర్భంగా ఒక్క నిడమానూరు రైతులు తప్పించి బందరు, ఏలూరు రోడ్డు బాధితులు దాదాపు సానుకూలంగానే స్పందించారు. మెరుగైన పరిహారం విషయంలోనే పట్టుబట్టే ప్రయత్నాలు చేశారు. భూసేకరణ జరగాల్సిన సమయంలో.. అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీడియం మెట్రో ప్రాజెక్టు రద్దు అయింది. విభజన చట్టం మేరకు విజయవాడ మెట్రోకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించకపోవటంతో విధిలేని పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవాలని నిర్ణయించిది. మీడియం మెట్రో స్థానంలో ప్రత్యామ్నాయ రవాణాపై అధ్యయనం చేయాల్సిందిగా ఏఎంఆర్‌సీని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత ప్రస్తుత కారిడార్లలోనే ఎలివేటెడ్‌ మార్గంలో ఎలక్ర్టికల్‌ బస్సులు నడపాలని, లైట్‌ మెట్రో కూడా ప్రత్యా మ్నాయమని ఏంఎఆర్‌సీ తన నివేదికను అందించింది. ప్రభుత్వం లైట్‌ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
 
 
కొనసాగుతున్న కష్టాలు
మీడియం మెట్రో ప్రాజెక్టు రద్దు కావటంతో .. నిడమానూరు రైతులు తమ భూములకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లైట్‌మెట్రో ప్రాజెక్టులో భాగంగా కారిడార్‌ నిడివి పెరుగుతుండటం, నిడమానూరులో నిర్మించాల్సిన కోచ్‌ఫ్యాక్టరీని ఇక్కడ కాకుండా కేసరపల్లి దగ్గర నిర్మించాలని భావించటంతో అక్కడ భూముల అవసరం లేకపోయింది. దీంతో ప్రభుత్వం ఆ భూములకు ఆంక్షలు సడలింపు ఇచ్చింది. బందరు, ఏలూరు రోడ్డు విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు.
 
 
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా కారిడార్‌ నిడివి పెరిగినా... ఇవే రోడ్ల మీదుగా వె ళ్లాల్సి ఉంది కాబట్టి ఈ రెండు రోడ్ల విషయంలో గతంలో విధించిన ఆంక్షలను ప్రభుత్వం సడలించలేదు. ఫలితంగా ఖాళీ స్థలాలు కలిగిన వారు అమ్ముకోవటానికి వీలు లేదు. అలా అని భవనం నిర్మించుకుందామన్నా అనుమతులు రాని పరిస్థితి. ఏఎంఆర్‌సీ నుంచి ఎన్‌ఓసి తీసుకువస్తేనే వీఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తోంది. ఏఎంఆర్‌సీ తమ ప్లాన్‌ ప్రకారం అలైన్‌మెంట్‌ను పరిశీలించి ఇబ్బందులు లేదనుకుంటేనే భవన నిర్మాణాలకు ఎన్‌ఓసీ ఇస్తోంది. ఇది ఒక రకంగా ఇబ్బందికరంగా మారింది. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రస్తుతం రూపకల్పన దశలో ఉంది. దీని అలైన్‌మెంట్‌, డి జైన్స్‌ ఎలా ఉంటాయో నివేదిక వచ్చే వరకు తెలియదు. బందరు రోడ్డులో విక్టోరియా జూబిలీ మ్యూజియం, ఐజీఎంసీ, టిక్కిల్‌ రోడ్డు, బెంజిసర్కిల్‌, ఆటోనగర్‌ గేటు, అశోక్‌ నగర్‌ సెంటర్‌, కృష్ణానగర్‌ - కానూరు,. తాడిగడప, పోరంకి, పెనమలూరు సెంటర్లలో మెట్రో స్టేషన్ల నిర్మాణానికి నిర్ణయించారు. ఏలూరు రోడ్డులో బీసెంట్‌ రోడ్డు, సీతారామపురం, మాచవరం డౌన్‌, పడవల రేవు, గుణదల, రామవరప్పాడు రింగ్‌, ప్రసాదంపాడు, ఎంబీటీ సెంటర్‌, ఎనికేపాడు, నిడమానూరు ప్రాంతాలలో మెట్రో స్టేషన్లు అవసరమని నిర్ణయించి భూప్రతిపాదనలు చేశారు.
 
 
మెట్రో స్టేషన్లు ఈ ప్రాంతాలలో కాస్త అటు, ఇటుగా అలైన్‌మెంట్‌ మారే అవకాశం ఉండటంతో కొంత రేడియస్‌ వరకు ప్లాన్లు, రిజిస్ర్టేషన్లకు అనుమతులు ఇచ్చే విషయంలో కార్పొరేషన్‌, రిజిస్ర్టేషన్‌ శాఖలు ఏఎంఆర్‌సీ నుంచి ఎన్‌ఓసీ కోరుతున్నాయి. నిర్దిష్టంగా మార్కింగ్‌ చేయకపోవటం కూడా ఏఎంఆర్‌సీ రేడియస్‌లో ఉన్న భవనాలకు, స్థలాలకు ఎన్‌ఓసీ ఇవ్వటం లేదు. ఫలితంగా బాధితులు ఆందోళన చెందుతున్నారు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఎలాగూ భూ సేకరణ చేయాలి కాబట్టి దీనిపై ప్రభుత్వం ముందుగా ఒక నిర్ణయం తీసుకుని బాధితులకు సాంత్వన కల్పించాల్సిన అవసరం ఉంది.
 
 
మూడేళ్లుగా నరకం
టెండర్ల దశలో రద్దయిన మీడియం మెట్రోకు, డీపీఆర్‌ దశలో ఉన్న లైట్‌ మెట్రోకు నడుమ మూడేళ్లుగా బందరు, ఏలూరు రోడ్డులోని పలు భవన, ఖాళీ స్థలాల యజమానులు నలిగిపోతున్నారు. మీడియం మెట్రో రద్దయినా ఆ ప్రాజెక్టు కోసం సేకరించాలని ప్రతిపాదించిన భూములపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో బందరు, ఏలూరు రోడ్డు వెంబడి స్థలాలు, భవనాలు కలిగిన వారు వాటిని అమ్ముకోవటానికి, కొనుగోలు చేయటానికి వీల్లేకుండా పోయింది. పైగా ఆ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలను చేపట్టడానికి అనుమతులు ఇవ్వడం లేదు. వీఎంసీ అధికారుల వద్దకు ప్లాన్‌తో వెళితే సీఆర్డీయే నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలని సూచిస్తున్నారు. అక్కడికి వెళితే ఏఎంఆర్‌సీ నుంచి ఎన్‌ఓసీ తీసుకుంటే తప్ప తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. అసలు మొదలే పెట్టని ప్రాజెక్టు కోసం మమ్మల్ని వేధించటం ఎందుకని బందరు, ఏలూరు రోడ్డు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 
లైట్‌ మెట్రోలోనూ అవే స్టేషన్లు వస్తాయి..
మీడి యం ప్రాజెక్టులో భాగంగా బందరు, ఏలూరు రోడ్డులో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్ల ప్రాంతాలేవైతో ఉన్నాయో.. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా కూడా అవే స్టేషన్లు ఉంటాయి. కారిడార్‌ పెరుగుతుంది. అది వేరే విషయం. ఇంతకు ముందు మీడియం మెట్రో ప్రాజెక్టులో ప్రతిపాదించిన భూములకు సంబంధించి మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అనుమతులు ఇచ్చే విషయంలో కార్పొరేషన్‌ ఎన్‌ఓసీ కోరితే మేము అలైన్‌మెంట్‌ పరిశీలించి అనుమతులు ఇస్తున్నాం. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు లేకపోతే మినహాయింపు ఇవ్వవచ్చు. దీనికి సంబంధించి డీపీఆర్‌ తయారౌతోంది. అందులోనూ ఇవే స్టేషన్లు ఉంటాయి కాబట్టి మినహాయింపులు ఇస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. - ఎన్‌వీ రామకృష్ణారెడ్డి, ఏఎంఆర్‌సీ ఎండీ

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.