Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

24 గంటల్లో 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి ప్రపంచరికార్డు నెలకొల్పిన పోలవరం ప్రాజెక్టు...???? సీబీఎన్ గారు చెప్పినట్లు ఈ రోజు సోమవారం కాదు విశ్వమంతటికీ పోలవారమే...✌️✌️✌️#Polavaram #AndhraPradesh #APwithCBN #AmazingAndhra #BangaloreTDP . .

DwSXZTYUwAMgn8n.jpg
DwSXZyZV4AAsPZ4.jpg
Link to comment
Share on other sites

పోలవరంలో మరో చరిత్ర
07-01-2019 02:28:49
 
636824249277846077.jpg
  • రికార్డు బద్దలు.. కాంక్రీట్‌ మహాయజ్ఞం దిగ్విజయం
  • గిన్నిస్‌ రికార్డు కైవసం.. దుబాయ్‌ కాంక్రీటు రికార్డును అధిగమించిన నవయుగ
  • అర్ధరాత్రి 12 గంటలకే 22వేల క్యూబిక్‌ మీటర్లు.. తెల్లవారేసరికి 32 వేలకు పైనే
  • పాత రికార్డు 35 గంటల్లో 21,580 క్యూ. మీ..16 గంటల్లోనే దాటిన పోలవరం
  • ఆదివారం ఉదయం 8కి మొదలైన మహాయజ్ఞం.. ఆరు జోన్లుగా పనుల విభజన
  • ప్రతి పావు గంటకూ పరిమాణం నమోదు.. 24 మంది ప్రొఫెసర్ల పరిశీలన
  • 2 గంటలకోసారి ‘గిన్నిస్‌’ ప్రతినిధి పర్యవేక్షణ.. ఇంత వేగంలోనూ నాణ్యత తనిఖీ
  • నేటి ఉదయం 8 గంటలకు ముగింపు.. రికార్డు సర్టిఫికెట్‌ అందుకోనున్న సీఎం
పోలవరం/ఏలూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో సరికొత్త చరిత్ర. ఇన్నాళ్లు దుబాయ్‌ పేరిట ఉన్న 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనుల రికార్డు బద్దలైంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకల్లా 22,045 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేసి నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు సాధించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం ప్రకటించారు. నవయుగ ఎండీ చింతా శ్రీధర్‌ను అభినందించారు. గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా ప్రాజెక్టులో కాంక్రీటు మహా యజ్ఞానికి ఆదివారం ఉదయం తెర లేచింది. నవయుగ సంస్థ ఉదయం ఎనిమిది గంటలకు శుభ ముహూర్తాన ఈ పనులకు శ్రీకారం చుట్టింది. ఎండీ శ్రీధర్‌, గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి రుషినాథ్‌ రిమోట్‌ ఆన్‌ చేసి కాంక్రీటు పనులు ప్రారంభించారు. రుషినాథ్‌ ఆధ్వర్యంలో 24 మంది ప్రొఫెసర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక్కసారి కాంక్రీటు పరిమాణం నమోదు చేస్తున్నారు. ప్రతి రెండు గంటలకు నేరుగా రుషినాథ్‌ ఆ పనులు పర్యవేక్షిస్తున్నారు.
 
మహాక్రతువుకు నెల క్రితమే సిద్ధం
దుబాయ్‌ మున్సిపా లిటీ 2017లో ఈ రికార్డు సాధించింది. ‘రాల్స్‌ కాంట్రాక్టింగ్‌ అండ్‌ ఆల్ఫా ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌’ఆ ఏడాది మే 18 నుంచి 20వ తేదీ లోపు 35 గంటలా 19 నిమిషాల్లో 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోసి రికార్డు సాధించగా.. ఇప్పుడు నవయుగ ఉదయం 8 గంటలకు పనులు ప్రారంభించి.. అర్ధరాత్రి 12 గంటలకల్లా.. అంటే 16 గంటల్లోనే దానిని అధిగమించింది. ఇది ఊరకే సాధ్యం కాలేదు. నవయుగ మహాక్రతువునే నిర్వహించింది. ఎంతో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 24 గంటల్లో 28 నుంచి 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేసే లక్ష్యంతో నెల క్రితమే సర్వ సన్నాహాలూ పూర్తిచేసింది. స్పిల్‌ చానల్‌లో 280 బ్లాకులను సిద్ధం చేసింది.
 
ఒక్కొక్క బ్లాక్‌లో వంద క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేస్తున్నారు. ఆ పనులను ఆరు జోన్లుగా విభజించి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పలువురు ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. పది బ్లాచింగ్‌ ప్లాంట్ల వద్ద కాంక్రీటు లోడు చేసుకున్న వాహనాలు.. నిర్దేశించిన జోన్‌లో అన్‌లోడ్‌ చేసి.. ఎలాంటి అడ్డంకులు లేకుండా తిరిగి మళ్లీ వెనక్కి వచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆరు జోన్లకు ఆరు రంగులు కేటాయించారు. గందరగోళానికి అవకాశం లేకుండా ఆ వాహనాలు ఆ జోన్లలోని బ్లాకులకు వెళ్లి కాంక్రీటు వేస్తున్నాయి.
 
నాణ్యతలో రాజీ లేకుండా..
గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించాలంటే ఎంతో వేగంతో పనిచేయాలి. అంత వేగంలోను ఎక్కడా నాణ్యతలో రాజీపడకుండా కాంక్రీటు పనులు కొనసాగుతున్నాయి. ప్రతి బ్లాకులోనూ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు నాణ్యతను తనిఖీ చేస్తున్నారు. ప్రతి బ్లాకులో 100 క్యూబిక్‌ మీటర్లకు మూడు సెట్లుగా మొత్తం తొమ్మిది శాంపుల్స్‌ తీసి నాణ్యత పరిశీలిస్తున్నారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం వస్తున్నారు. ఉదయం నిడదవోలులో జరిగే జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఉదయం 10 గంటలకు నిడదవోలు చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటల వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. 2.30కి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. తదుపరి గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్‌ను ఆయనే అందుకుంటారు. పోలవరం కాంక్రీటు పనుల్లో అరుదైన రికార్డు నెలకొల్పిన సందర్భంలో రైతులు, ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4.30కి అమరావతికి బయల్దేరతారు.
 
స్ర్కీన్‌పై చూపుతూ యాంకరింగ్‌
స్పిల్‌ చానల్‌లో కాంక్రీటు ఎంత పరిమాణంలో వేస్తున్నారో ఒకపక్క గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు నమోదు చేస్తుండగా.. మరోపక్క నవయుగ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కూడా నమోదు చేస్తున్నారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు డీజీ స్ర్కీన్‌పై వెల్లడిస్తూ యాంకర్‌ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. (తెల్లవారేసరికి అవలీలగా 32 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయగలమని నవయుగ ప్రతినిధులు ధీమాగా చెప్పారు)
 
డ్యాం డిజైన్ల కమిటీ పరిశీలన
పోలవరం ప్రాజెక్టు పనులను ఆదివారం డ్యాం డిజైన్ల సమీక్ష కమిటీ (డీడీఆర్‌సీ) సభ్యులు పరిశీలించారు. కమిటీ చైర్మన్‌, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్యా ఆధ్వర్యంలో 10 మంది సభ్యులు ఢిల్లీ నుంచి వచ్చారు. గోదావరి గర్భంలో నిర్మిస్తున్న ఎగువ కాఫర్‌ డ్యాం, జెట్‌ గ్రౌటింగ్‌, స్పిల్‌ చానల్‌ కాంక్రీటు పనులను పరిశీలించారు. అనంతరం డిజైన్ల ఆమోదంపై సుదీర్ఘంగా చర్చించారు. తొమ్మిది అంశాలకు సంబంధించి డిజైన్లపై చర్చించామని.. ఢిల్లీ వెళ్లాక అనుమతులు మంజూరు చేస్తారని ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావు తెలిపారు. వీరి వెంట డిజైన్‌ కమిటీ సభ్యుడు వైకే హాండా, డీపీ భార్గవ, పోలవరం చీఫ్‌ ఇంజనీరు వెంకటేశ్వరరావు, గేట్ల నిపుణుడు ఎన్‌.కన్నయ్యనాయుడు, ప్రాజెక్టు సలహాదారు వీఎస్‌ రమేశ్‌బాబు, పలువురు ఇంజనీర్లు ఉన్నారు.
 
నిర్మాణంలో 4,100 మంది
కాంక్రీటు మహాక్రతువులో 3,600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది పనిచేశారు. 2 లక్షల బస్తాల సిమెంటు, 40 క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక, కాంక్రీటులో కలపడానికి 200 టన్నుల యార్డ్‌ మిక్చరు ఉపయోగించారు. ప్రతి క్యూబిక్‌ మీటరుకు 4 కిలోల చొప్పున యార్డ్‌ మిక్చరు కలిపారు. కాంక్రీటును స్పిల్‌ చానల్‌కు తరలించడానికి 70 ట్రాన్సిక్‌ మిల్లర్లు, 20 ఎడిటర్లు, 20 డంపర్లు, 5 టెలిబెల్టులు ఉపయోగించారు.
 
అందరికీ ధన్యవాదాలు నవయుగ ఎండీ శ్రీధర్‌
2sridhar41.jpgరికార్డు సాధనకు ఎంతగానో శ్రమించిన కార్మికులకు, సిబ్బందికి, ఇంజనీర్లకు, పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నవయుగ ఎండీ శ్రీధర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. కాంక్రీటు పనుల్లో రికార్డు స్ఫూర్తితో కాఫర్‌ డ్యాం పనులు, ప్రధాన డ్యాం పనులు కూడా శరవేగంగా పూర్తిచేయగలమన్న ధీమా వ్యక్తంచేశారు.
 
నవయుగ ఎండీకి సీఎం అభినందన
 పోలవరం కాంక్రీటు పనుల్లో రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి ఆయన నవయుగ ఎండీ శ్రీధర్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, జల వనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌, జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులకూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఒక మహాయజ్ఞం, భగీరథ ప్రయత్నమని అభివర్ణించారు. వేల మంది ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు రాత్రింబవళ్లూ చెమటోడ్చి పనిచేస్తున్నారని తెలిపారు. పనుల్లో పాల్గొన్నవారంతా చరిత్రలో నిలిచిపోతారన్నారు.
 
1htytutyjyh.jpg 
Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

avunu villani slow cheyytaniki ela chesaru..

Siggupadaali BJP and their silly supporters in this DB! Vendetta politics ki support ento.... if they are personally targeting CBN I don’t mind. But they are trying to injure the state and put that on CBN which is nothing but criminal mindset and these buffa thugs blindly support the idiotic nature of MoSha

Link to comment
Share on other sites

పోలవరం ప్రపంచ రికార్డు సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు
07-01-2019 16:41:20
 
636824762076534529.jpg
పోలవరం: పోలవరం ప్రపంచ రికార్డు సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబును నవయుగ కంపెనీ ఎండీ శ్రీదర్ సత్కరించారు. ప్రపంచ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి రిషినాథ్‌ ప్రకటించారు. ప్రపంచ రికార్డును చంద్రబాబు అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో సరికొత్త చరిత్ర నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు దుబాయ్‌ పేరిట ఉన్న 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనుల రికార్డు బద్దలైంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకల్లా 22,045 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేసి నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు సాధించింది. దీనిపై చంద్రబాబు హర్షం ప్రకటించారు. నవయుగ ఎండీ చింతా శ్రీధర్‌ను అభినందించారు. గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా ప్రాజెక్టులో కాంక్రీటు మహా యజ్ఞానికి ఆదివారం ఉదయం తెర లేచింది. నవయుగ సంస్థ ఉదయం ఎనిమిది గంటలకు శుభ ముహూర్తాన ఈ పనులకు శ్రీకారం చుట్టింది. ఎండీ శ్రీధర్‌, గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి రుషినాథ్‌ రిమోట్‌ ఆన్‌ చేసి కాంక్రీటు పనులు ప్రారంభించారు.
Link to comment
Share on other sites

గిన్నిస్‌ బుక్‌లో పోలవరం

7brk112-polavaram.jpg

పోలవరం: ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో సోమవారం రెండు ప్రపంచ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి. గతంలో చేపట్టిన 21,580 క్యూబిక్‌ మీటర్ల పనులను 16 గంటల్లోనే నవయుగ సంస్థ అధిగమించింది. 24 గంటల్లో 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ప్రపంచ రికార్డు స్థాయిలో కాంక్రీట్‌ను నవయుగ సిబ్బంది డంప్‌ చేశారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8గంటల వరకు నిరంతరాయంగా కాంక్రీట్‌ పోసి రికార్డు సృష్టించారు. దీంతో పోలవరం పనుల్లో రికార్డు నమోదైనట్టు గిన్నిస్‌ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దే ప్రతినిధులు గిన్నిస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని సీఎం చంద్రబాబుకు  అందజేశారు.

7brk112-polavaram1.jpg

Link to comment
Share on other sites

Polavaram project enters Guinness World Records

https://cdn.ncbn.in/ncbn/feed/ncbnBanner1546868962653.jpeg

Marking a golden day in the history of Polavaram project, the lifeline of Andhra Pradesh, the concrete works of spillway have successfully entered the Guinness Book of World Records by pouring 32,315.5 cubic meters of concrete non-stop in 24 hours. The record for largest and continuous concrete pouring was also broken.

Receiving the Guinness Book of World Records certificate from adjudicator Mr. Rishi Nath, Chief Minister Chandrababu Naidu expressed happiness over the breaking of two world records by Polavaram project:

  • The most concrete continuously poured in 24 hours
  • Largest continuous concrete poured

The Navayuga company used 20 agitator trucks and 70 transit mixers to deliver concrete from 10 batching plants with a capacity of 1,560 cubic meters per hour. Overall 900 men worked together to achieve this remarkable feat.

“The Polavaram project will be completed by June 2019 and water will be released through the right and left canals by gravity,” said the Chief Minister. He also appealed to the central government to clear the revised DPRs of the project immediately, setting aside political differences, as Polavaram is a national project.

Polavaram irrigation project, a multipurpose terminal reservoir will irrigate 38.78 Lac acres of land upon completion. Through Pattiseema Lift Irrigation, 80 tmc of Godavari water will be diverted to Krishna. 23.44 tmc of water will be diverted to the industries along the coastal corridor and Visakhapatnam city. It will also facilitate the setting up of 960 mw hydro power plant which will provide drinking water to 540 villages with a population of 28.5 Lac.

The project has won 19 Skoch Platinum Golden awards, CBIP ward for Godavari delta water management, Global Water Conservation award, CBIP award for Polavaram and so on.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...