Jump to content


Kiran

Recommended Posts

చెన్నై: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి చెన్నై నగరానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మహీ చెన్నై సూపర్‌కింగ్స్‌కు నాయకత్వం వహించాడు. ఆ జట్టును రెండుసార్లు విజేతగా నిలిపాడు. అందుకే తమిళులకు ఎంఎస్‌ అంటే విపరీతమైన అభిమానం!

మ్యాచ్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కుంభకోణాల వల్ల చెన్నై సూపర్‌ కింగ్స్‌పై రెండేళ్లు నిషేధం విధించడంతో ధోనీ చెన్నైలో క్రికెట్‌ ఆడలేకపోయాడు. 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచే చివరిది. ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా చాలా కాలం తర్వాత అతడు చెపాక్‌లో కాలుమోపాడు. రోహిత్‌ శర్మ ఔట్‌ కాగానే బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో అతడు డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి క్రీజులో అడుగుపెట్టే వరకు మైదానమంతా అభిమానుల కేరింతలతో మార్మోగింది. బ్యాటింగ్‌ చేసేంత వరకూ అరుస్తూ కోలాహలం సృష్టించారు. వారి అభిమానానికి తగినట్టే మ్యాచ్‌లో ధోనీ (79; 88 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తన కెరీర్‌లో వందో అర్ధశతకం బాది అలరించాడు.

Link to comment
Share on other sites

ఇది అతడి కెరీర్‌లో (అన్ని ఫార్మాట్లలో) 100వ అర్ధశతకం కావడం ప్రత్యేకం. దీంతో భారత్‌ తరఫున అత్యధిక అర్ధశతకాలు బాదిన నాలుగో ఆటగాడిగా సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...