Jump to content

For Dhoni haters


sskmaestro

Recommended Posts

దిల్లీ: విరాట్‌కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. ఫార్మాట్‌ ఏదైనా క్రీజులో అడుగు పెట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. మ్యాచ్‌ గెలిచి తీరాల్సిందే. ఇప్పుడు అందరి నోటా ‘శభాష్‌ విరాట్‌’ అనిపించుకొంటున్న అతడి టెస్టు కెరీర్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని కాపాడినట్లు చెప్పాడు ఒకప్పటి డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.

ప్రస్తుతం టీమిండియా టెస్టు సారథి విరాట్‌కోహ్లీ తన తొలి ఆరు టెస్టుల్లో పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో స్థానం కోల్పోయే స్థితికి చేరుకొన్నాడు. అతడి స్థానంలో రోహిత్‌శర్మను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు నిర్ణయించారు. అయితే ధోని యువకుడైన విరాట్‌కు వెన్నుదన్నుగా నిలిచి మరో అవకాశం ఇచ్చాడని ఇంగ్లాండ్‌ టెస్టుకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెహ్వాగ్‌ తెలిపాడు.

కోహ్లీ 2011లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి ఆరు మ్యాచుల్లో అతడిది పేలవ ప్రదర్శనే. వరుసగా 4, 15, 0, 27, 30, 52, 63, 11, 0, 23, ఒక ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేయలేదు. దీంతో 2012లో జరిగిన పెర్త్‌ టెస్టులో కోహ్లీ స్థానంలో రోహిత్‌శర్మను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. దీంతో కోహ్లీ కి అండగా నిలవాలని కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, వైస్‌ కెప్టెన్‌ అయిన సెహ్వాగ్‌ నిర్ణయించుకున్నారట. కెరీర్‌లో కీలకమైన పెర్త్‌ టెస్టులో కోహ్లీ 44, 75 పరుగులు చేశాడు. ఆ తర్వాత అడిలైడ్‌ మ్యాచ్‌లో తొలి శతకం నమోదు చేశాడని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. తన కెరీర్‌ను కాపాడిన ధోని నుంచి కోహ్లీ 2014లో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి టీమిండియాను వరుస విజయాల బాట పట్టించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...