Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
రోడ్డు విస్తరణకు యజమానుల సమ్మతి
09-11-2018 08:32:24
 
636773491461106132.jpg
 
(ఆంధ్రజ్యోతి, అమరావతి): విజయవాడలో కీలకమైన రోడ్లలో ఒకటైన బందరు రోడ్డు విస్తరణకు అవసరమైన భూములను ఇచ్చేందుకు అంగీకరించిన వారి సంఖ్య గురువారానికి మరింత పెరిగింది. ఈ విస్తరణ కారణంగా మొత్తం 193 ఆస్తులు ప్రభావితం కానుండగా, వాటి యజమానుల్లో ఇప్పటికి 106 మంది సీఆర్డీయేకు అంగీకార పత్రాలను అందజేశారు. వీరందరికీ ఆయా స్థలాల్లోని కట్టడాలను తొలగించాల్సిందిగా సూచించిన సీఆర్డీయే అధికారులు అలా చేసిన వాటిని క్రమంగా జాతీయ రహదారుల విభాగాధికారులకు స్వాధీనం చేస్తూ, విస్తరణకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఇప్పటికీ తమ స్థలాలను ఇవ్వాల్సి ఉన్న 87 మందికి వారంలోగా తమ డాక్యుమెంట్లు, అప్రూవ్డ్‌ ప్లాన్‌ కాపీలను సమర్పించాలని అధికారులు నోటీసులను జారీ చేస్తున్నారు.
 
విజయవాడ లోని మరొక ప్రధాన రహదారి అయిన మహానాడు రోడ్డు విస్తరణ వల్ల 103 మందికి చెందిన ఆస్తులు ప్రభావితమవుతుండగా వారిలో ఇప్పటి వరకు 83 మంది అంగీకార పత్రాలను ఇచ్చారు. మిగిలిన 20 మంది నుంచి పొందేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బందరు రోడ్డు, మహానాడు రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాలనిచ్చేందుకు అంగీకారపత్రాలను సమర్పించిన వారికి నిబంధనల ప్రకారం 1:4 నిష్పత్తిలో జారీ చేసే టీడీఆర్‌ బాండ్లను గురువారం సీఆర్డీయే డైరెక్టర్‌ కె.నాగసుందరి అందజేశారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంతో బందరు రోడ్డు విస్తరణ ప్రభావితులకు తొలి విడత, మహా నాడు రోడ్డు విస్తరణ బాధితులకు 2వ విడత బాండ్ల పంపిణీ ప్రారంభమైనట్లయింది. సీఆర్డీయే జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.ధనుంజయరెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుమ్మడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. విస్తరణకు అవసరమైన అంగీకారపత్రాల స్వీకరణ, నోటీసుల జారీ, ప్రభావితులను ఒప్పించే కార్యక్రమంలో జాతీయ రహదారుల విభాగం అధికారులతోపాటు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీలేఖ, కరుణకుమారి, వేంకటేశ్వర్లు, రుషేఖరరావు పాల్గొంటున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...