April 23, 201610 yr Truejet no.1 in complaints and flight cancellations last year 3/10 flights will fly and 7/10 will gets cancelled
May 14, 201610 yr Srisailam kuda airport ready cheyandi it will boost rayalaseema more. Kurnool ki airport vastundi Kadapa already have Ananthapur is having less scope because bangalore very near Nellore ki elago vastundi airport Chittur already there 5 dsts lo 4 airports Main ga cargo ki use chesthe better. Near by countries ki supply chesthe it will boost airports income easily. Srisailam ki manchi scope undi airport ki because every day hyd nunche 1000's of passengers will go there and hyd airports nunchi elago flights padutayi with package aptdc rooms ki kalipithe chalu we can expect 100+ in few months and slowly if rates are less then it will boost to 1000's of passengers in few years. Even small helicopters petti near by areas ki kuda nadapochu and nagarjuna sagar airport ki connect cheyochu to vijayawada/vizag vizag, rajahmundry, vijayawada 3 airports for andhra
May 24, 201610 yr Author ఏలూరు కాల్వ మళ్లింపు రైతులకు వారం రోజుల డెడ్లైన్(ఆంధ్రజ్యోతి, వి జయవాడ): ఏలూరు కాల్వ మళ్లింపు భూముల రైతులకు రెవెన్యూ యంత్రాంగం చివరి అవకాశం ఇస్తోంది. భూ సమీకరణ నోటిఫికేషన్ గడువు దగ్గర పడుతుండటంతో వారం రోజుల గడువు ఇచ్చింది. అప్పటికీ రైతుల దృక్పథంలో మార్పు రాకపోతే భూ సేకరణకు వెళ్లటానికి రెవెన్యూ యంత్రాంగ ం సిద్ధమవుతోంది. నూజివీడ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ షా మంగళవారం నుంచి రైతులతో సంప్రదింపులు జరపనున్నారు. గ్రామాల వారీగా రైతులందరినీ సమావేశపరిచి ల్యాండ్ పూలింగ్పై అపోహలను తొలగించనున్నారు. వాస్తవాలను వివరించి భూ సమీకరణకు సహకరించేలా వారి అంగీకారం తీసుకోనున్నారు. మరో వైపు రాజధాని ప్రాంతంలో కూడా అక్కడి రైతులకు ప్లాట్లు ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ జాప్యం జరిగితే విలువైన రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాలను కోల్పోయే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ చెబుతున్నారు. ఎయిర్పోర్టుకు కావాల్సిన భూముల్లో సోమవారం వరకు 631 ఎకరాలను సమీకరించామని తెలిపారు. ఇంకా 400 ఎకరాలను సమీకరించాల్సి ఉందని చెప్పారు. ఈ 400 ఎకరాలలో 90 శాతం పైగా ఏలూరు కాల్వ మళ్లింపునకు సంబంధించిన భూములు ఉన్నాయని తెలిపారు. డిజైనపై రైతుల పట్టు ఏలూరు కాల్వ మళ్లింపు డిజైన విషయంలో రైతులు పట్టుబట్టారు. ఒక్క ఎకరా కూడా ఇవ్వమని ముక్త కంఠంతో తెగేసి చెప్పారు. దీంతో భూ సమీకరణ కష్టమేమోనని రెవెన్యూ యంత్రాంగం కూడా భావించింది. అధికారులు భూ సమీకరణ ప్రయోజనాలను పదే పదే వివరించి 5.62 ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం పొందారు. కేసరపల్లికి చెందిన ఏడుగురు , వీఎన పురానికి చెందిన ముగ్గురు, పురుషోత్తపట్నం నుంచి ఒకరు, గన్నవరం నుంచి ఏడుగురు, ఆత్కూరు నుంచి ఇద్దరు రైతులు కలిపి మొత్తం 20 మంది రైతులు 5.61 ఎకరాలను ఇవ్వటానికి ముందుకు వచ్చారు. నూజివీడు సబ్ కలెక్టర్ గ్రామాల్లో సమావేశాల నిర్వహించిన తర్వాత మార్పు రాకుంటే భూ సేకరణకే వెళ్లాలని అధికారులు కూడా బలంగా ఉన్నారు. భూ సేకరణ పరిహారం విషయంలో కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా నిర్ణయించేందుకు సమాయత్తమవుతున్నారు. వారం రోజుల తర్వాత ఎంత వరకు వస్తే అంత తీసుకుని, మిగిలిన వాటికి సంబంధించి భూ సేకరణ నోటిఫికేషన జారీ చేస్తారు.
May 26, 201610 yr Author Immigration and Customs Desk for Gannavaram Airport by Pushkarams The immigration and customs desk would be ready in Gannavaram Airport by Krishna Pushkarams. Once the interim terminal building is ready, the immigration and customs desk would come into operational in that building. The Interim terminal building is going on under construction. Thought according to the plan it has to be completed by October, Chief Minister instructed to complete this by August, before the commencement of Krishna Pushkarams. The interim terminal building was spread over 13,000 square meters and once the constructions is done, Immigration and customs desk will be setup at the airport. This will clear the route for international operations and the connectivity to other countries would be there from Gannvaram Airport. Gannavaram airport traffic has increased significantly in terms of passenger traffic growth. It has increased by 64% compared to last year.
May 27, 201610 yr Thirupathi ki international services start ayithey Hyd assamey inka.... US-->Dubai-->Thirupathi-->Gannavaram.... US-->Dubai-->Thirupathi-->Vizag.... abbo ..suferu
May 27, 201610 yr Author గన్నవరం ఎయిర్పోర్టులో కార్గో బిల్డింగ్కు టెండర్లు భారీ కోల్డ్ స్టోరేజీ రూమ్ స్థలం లీజుకు.. రానున్న రోజుల్లో పెరగనున్న ఎగుమతి, దిగుమతులు ప్రయాణికుల సదుపాయాల కోసం పలు టెండర్లు (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కార్గో సేవలు ప్రారంభించటానికి రంగం సిద్ధం అయింది. కార్గో బిల్డింగ్ నిర్మాణానికి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విజయవాడ అధికారులు టెండర్లు పిలిచారు. రూ.39.74 లక్షల వ్యయంతో కేవలం మూడు నెలల్లోనే నిర్మించే ప్రాతిపదికన టెండర్లు పిలవటం గమనార్హం. పుష్కరాల నాటికి కార్గో బిల్డింగ్ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్గో సేవలు కూడా ఇక అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పిలిచిన టెండర్లు ఇంటీరియమ్ కార్గో టెర్మినల్ బిల్డింగ్కు మాత్రమే. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నడుస్తున్న ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విశాఖ, హైదరాబాద్, కడప, తిరుపతికి నడిచే ఆయా ప్యాసింజర్ విమానాల్లోని కార్గో బ్లాక్లలో కార్గో పార్శిల్స్ రవాణా చేయటానికి వీలుగా ఈ ఇంటీరియమ్ కార్గో టెర్మినల్ బిల్డింగ్ను ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం ఎయిర్పోర్టులో అత్యాధునిక టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ టెర్మినల్ బిల్దింగ్ కూడా పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన టెర్మినల్ బిల్డింగ్లోకి ప్రవేశించగానే ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెర్మినల్ బిల్డింగ్ను పూర్తిస్థాయిలో కార్గో బిల్డింగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కార్గో ఎగుమతి, దిగుమతులు ఎక్కువుగా ఉంటే రానున్న రోజుల్లో ప్రత్యేకంగా కార్గో విమానాలు సైతం తిరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు ఆనలైన మార్కెటింగ్ సంస్థలు విమానాల ద్వారా పార్శిల్ ్స రవాణా చేయటానికి వీలుగా గోడౌన్ల సముదాయం కల్పించాల్సిందిగా ఏఏఐను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏఏఐ కూడా గోడౌన్ల ఏర్పాటు విషయమై ఆలోచిస్తున్నాయి.కోల్డ్స్టోరేజ్ రూమ్కు స్థలం లీజు భవిష్యత్తులో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కార్గోకు భారీగా డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో ముందస్తుగా ఎయిర్పోర్టు ఆవరణలో కోల్డ్స్టోరేజ్ రూమ్ ఏర్పాటు చేయాలన్న భావనలో ఏఏఐ అధికారులు ఉన్నారు. కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఏర్పాటు చేయటానికి ఎయిర్పోర్టులోని కొంత స్థలాన్ని లీజుకు ఇవ్వాలని భావిస్తోంది. ఎవరైనా ముందుకు వస్తే ఆ స్థలంలో భవన నిర్మాణం చేయించాలన్న ఆలోచనతో ఉంది. ఆహార పదార్థాలు, పానీయాలు, కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి వీటిని విమానాలలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.పలు విభాగాలకు టెండర్లు.. ప్రస్తుతం ఆధునికీకరించిన కార్గో బిల్డింగ్లో ప్రయాణికుల సదుపాయాల కోసం అనేక టెండర్లు పలిచారు. వీటిలో మొదటిది బీర్ ప్రొవిజన. చల్లటి బీర్ను ఆస్వాదించటానికి వీలుగా అనేక స్వదేశీ, విదేశీ బ్రాండ్స్తో కూడిన షాప్కు అవకాశం ఇవ్వాలని ఏఏఐ నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి ఏఏఐ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న నేపథ్యంలో భాగంగా బీర్ ప్రొవిజన ఏర్పాటు చేయటానికి టెండర్లు పిలిచింది. అరైవల్ బ్లాక్లో రెండు హోటల్స్ ఏర్పాటుకు కూడా ఏఏఐ టెండర్లు పిలిచింది. స్టాఫ్ కిచెన, స్నాక్ బార్ షాపులకు కూడా ఏఏఐ టెండర్లు పిలిచింది. ప్రయాణికులకు నవల్స్, పుస్తకాలు తదితరాలను అందుబాటులో ఉంచటానికి వీలుగా బుక్ - నావెల్స్ - గిఫ్ట్స్ షాప్కు కూడా టెండర్లు పిలిచారు. ముత్యాలు, ముత్యాల ఆభరణాల షాపునకు కూడా ఇటీవలే టెండర్లు పిలిచారు.
May 27, 201610 yr గన్నవరం ఎయిర్పోర్టులో కార్గో బిల్డింగ్కు టెండర్లు భారీ కోల్డ్ స్టోరేజీ రూమ్ స్థలం లీజుకు.. రానున్న రోజుల్లో పెరగనున్న ఎగుమతి, దిగుమతులు ప్రయాణికుల సదుపాయాల కోసం పలు టెండర్లు (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కార్గో సేవలు ప్రారంభించటానికి రంగం సిద్ధం అయింది. కార్గో బిల్డింగ్ నిర్మాణానికి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విజయవాడ అధికారులు టెండర్లు పిలిచారు. రూ.39.74 లక్షల వ్యయంతో కేవలం మూడు నెలల్లోనే నిర్మించే ప్రాతిపదికన టెండర్లు పిలవటం గమనార్హం. పుష్కరాల నాటికి కార్గో బిల్డింగ్ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కార్గో సేవలు కూడా ఇక అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పిలిచిన టెండర్లు ఇంటీరియమ్ కార్గో టెర్మినల్ బిల్డింగ్కు మాత్రమే. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నడుస్తున్న ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విశాఖ, హైదరాబాద్, కడప, తిరుపతికి నడిచే ఆయా ప్యాసింజర్ విమానాల్లోని కార్గో బ్లాక్లలో కార్గో పార్శిల్స్ రవాణా చేయటానికి వీలుగా ఈ ఇంటీరియమ్ కార్గో టెర్మినల్ బిల్డింగ్ను ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం ఎయిర్పోర్టులో అత్యాధునిక టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ టెర్మినల్ బిల్దింగ్ కూడా పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన టెర్మినల్ బిల్డింగ్లోకి ప్రవేశించగానే ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెర్మినల్ బిల్డింగ్ను పూర్తిస్థాయిలో కార్గో బిల్డింగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కార్గో ఎగుమతి, దిగుమతులు ఎక్కువుగా ఉంటే రానున్న రోజుల్లో ప్రత్యేకంగా కార్గో విమానాలు సైతం తిరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు ఆనలైన మార్కెటింగ్ సంస్థలు విమానాల ద్వారా పార్శిల్ ్స రవాణా చేయటానికి వీలుగా గోడౌన్ల సముదాయం కల్పించాల్సిందిగా ఏఏఐను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏఏఐ కూడా గోడౌన్ల ఏర్పాటు విషయమై ఆలోచిస్తున్నాయి.కోల్డ్స్టోరేజ్ రూమ్కు స్థలం లీజు భవిష్యత్తులో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కార్గోకు భారీగా డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో ముందస్తుగా ఎయిర్పోర్టు ఆవరణలో కోల్డ్స్టోరేజ్ రూమ్ ఏర్పాటు చేయాలన్న భావనలో ఏఏఐ అధికారులు ఉన్నారు. కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఏర్పాటు చేయటానికి ఎయిర్పోర్టులోని కొంత స్థలాన్ని లీజుకు ఇవ్వాలని భావిస్తోంది. ఎవరైనా ముందుకు వస్తే ఆ స్థలంలో భవన నిర్మాణం చేయించాలన్న ఆలోచనతో ఉంది. ఆహార పదార్థాలు, పానీయాలు, కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి వీటిని విమానాలలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పలు విభాగాలకు టెండర్లు.. ప్రస్తుతం ఆధునికీకరించిన కార్గో బిల్డింగ్లో ప్రయాణికుల సదుపాయాల కోసం అనేక టెండర్లు పలిచారు. వీటిలో మొదటిది బీర్ ప్రొవిజన. చల్లటి బీర్ను ఆస్వాదించటానికి వీలుగా అనేక స్వదేశీ, విదేశీ బ్రాండ్స్తో కూడిన షాప్కు అవకాశం ఇవ్వాలని ఏఏఐ నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి ఏఏఐ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న నేపథ్యంలో భాగంగా బీర్ ప్రొవిజన ఏర్పాటు చేయటానికి టెండర్లు పిలిచింది. అరైవల్ బ్లాక్లో రెండు హోటల్స్ ఏర్పాటుకు కూడా ఏఏఐ టెండర్లు పిలిచింది. స్టాఫ్ కిచెన, స్నాక్ బార్ షాపులకు కూడా ఏఏఐ టెండర్లు పిలిచింది. ప్రయాణికులకు నవల్స్, పుస్తకాలు తదితరాలను అందుబాటులో ఉంచటానికి వీలుగా బుక్ - నావెల్స్ - గిఫ్ట్స్ షాప్కు కూడా టెండర్లు పిలిచారు. ముత్యాలు, ముత్యాల ఆభరణాల షాపునకు కూడా ఇటీవలే టెండర్లు పిలిచారు. Good
May 31, 201610 yr Author Very Soon Direct Flight from Gannavaram to Puttaparthi The Andhra Pradesh Chambers of Commerce and Industry Federation, wrote a letter to Airports Authority of India for a direct flight service between Vijayawada and Puttaparthi. Puttaparthi is a very big tourist spot for its association with Sri Sathya Sai Baba. Also it is famous for its health care and education purpose with the existence of premier Sathya Sai institutions. Also Anantapur road connectivity with Vijayawada is not well connected. It would take approximately 9-10 hrs to reach by road. Having a direct flight to Puttaparthi would increase the air traffic between these two places. Instead of using Bangalore, people can directly use Puttaparthi. If Airports Authority of India approves, this would be the second connectivity to Rayalaseema from Gannavaram.
June 11, 201610 yr Author విజయవాడ విమానాశ్రయాన్ని త్వరగా విస్తరించండి అశోక్ గజపతిరాజుకు వెంకయ్య సూచన న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): విజయవాడ విమానాశ్ర యాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబేలకు కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. పౌరవిమానయాన రంగ నూతన విధానంపై చర్చించేందుకు శుక్రవారం ఆ శాఖ మంత్రి, కార్యదర్శులు వెంకయ్యతో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి, విమానయాన రంగాలకు సంబంధించి చర్చలు జరిపారు. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను మరింతగా పెంచాలని, ప్రాంతీయ, ఉపప్రాంతీయ విమానాశ్రయాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వెంకయ్య సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధి గురించి వెంకయ్య ప్రస్తావించారు. ముఖ్యంగా విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని కోరారు. విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రధాన సమస్యగా పరిగణించిందని, దానిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. విమానాశ్రయం రాజధాని ప్రాంత పరిధిలోకి వస్తున్నందున దాని అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఇందుకు పౌర విమానయాన శాఖ కార్యదర్శి చౌబే స్పందిస్తూ.. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి తాను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. భూసేకరణ సమస్య పరిష్కారానికి తాను చర్యలు చేపడతానని తెలిపారు.
Create an account or sign in to comment