Jump to content

Recommended Posts

  • 2 weeks later...
Posted

#ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ AMTZ LTD విశాఖపట్నంలో భారతదేశపు మొట్టమొదటి 'గ్లోబల్ మెడ్‌టెక్ యూనివర్సిటీ' ని ప్రారంభించనుంది ! ఇండస్ట్రీ ప్లేయర్‌ల సహకారంతో మెడికల్ టెక్నాలజీ & రెగ్యులేటరీ వ్యవహారాల్లో MBA, MTech, PhD కోర్సులను అందించనుంది. కాగా 250 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ 2025-26 విద్యాసంవత్సరం నుండి ప్రారంభమవుతుంది !!

Posted

MedTech: ‘మెడ్‌టెక్‌’లో మరో మణిహారం

వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విశాఖలోని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ (మెడ్‌టెక్‌) జోన్‌ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది.

Updated : 11 Sep 2024 07:06 IST
 
 
 
 
 
 

ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం నిర్మాణం ఆరంభం
2025-26 విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం

ap100924main3a.jpg

నిర్మాణంలో ఉన్న మెడ్‌టెక్‌ విశ్వవిద్యాలయం

వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విశాఖలోని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ (మెడ్‌టెక్‌) జోన్‌ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. మెడికల్‌ టెక్నాలజీలో పరిశోధన, శిక్షణ కోసం ప్రపంచస్థాయి మెడ్‌టెక్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుంది. దీని భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే దేశంలోనే తొలి మెడ్‌టెక్‌ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతుంది. పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో దీన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

జులైలో ఆకృతి ఆవిష్కరించిన సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో 2018లో ఏర్పాటైన మెడ్‌టెక్‌ జోన్‌... సీఈఓ జితేంద్రశర్మ కృషితో వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. వైద్య పరిజ్ఞానంలో తగిన విద్యావనరులు, పరిశోధన లేకపోవడంతో ఇప్పటికీ కొన్ని పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి పరిష్కారంగా ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం నెలకొల్పాలని నిర్ణయించారు. జులైలో ఏఎంటీజడ్‌ సందర్శనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. వర్సిటీ ఆకృతిని ఆవిష్కరించారు. దీనికి అనుసంధానంగా స్థానిక ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లతో మరిన్ని ప్రాజెక్టులను సిద్ధం చేయొచ్చని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహకారం అందిస్తాయని అప్పట్లో చంద్రబాబు పేర్కొన్నారు. 

ap100924main3b.jpg

విశ్వవిద్యాలయం నమూనా

పారిశ్రామిక నిపుణులే బోధకులు విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. మెడికల్‌ టెక్నాలజీ, నియంత్రణ వ్యవహారాలు (రెగ్యులేటరీ ఎఫైర్స్‌)లో ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. తొలుత 250 మంది విద్యార్థులతో ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మెడ్‌టెక్‌ జోన్‌లో 140కి పైగా సంస్థలున్నాయి. విద్యార్థులు వాటిలో శిక్షణ తీసుకుని, ఉద్యోగాలు పొందేందుకు అవకాశముంది. పారిశ్రామిక నిపుణులు పాఠాలు బోధించి, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు శిక్షణ ఇస్తారు. ప్రవేశాల పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.

  • 1 month later...
  • 1 month later...
  • 3 weeks later...
Posted

A.P. MedTech Zone poised to become a global manufacturing centre of medical equipment

Many ‘Made in India’ hospitals will be set up across the country and the equipment required for these hospitals will be produced at AMTZ, says its MD and founder CEO Jitendar Sharma

Published - December 31, 2024 08:59 am IST - VISAKHAPATNAM

READ LATER
PRINT
More than 150 companies have set up their production units in Andhra Pradesh MedTech Zone in Viskahapatnam.

More than 150 companies have set up their production units in Andhra Pradesh MedTech Zone in Viskahapatnam. | Photo Credit: File Photo

Having played a key role in the supply of critical medical equipment across the country during the coronavirus pandemic, the Andhra Pradesh MedTech Zone (AMTZ) is flourishing as a centre of a global eco-system for medical technology, its MD and founder CEO Jitendar Sharma has said.

At the height of the COVID-19 pandemic when frantic searches for oxygen concentrators, ventilators and RT PCR kits were the order of the day, the AMTZ, India’s first medical technology park in Visakhapatnam, rose to the occasion.

 

The AMTZ was manufacturing 250 ventilators, 500 oxygen concentrators and 10 lakh COVID RT PCR kits daily at the Nadupuru facilities and these equipment helped save lakhs of lives across the country, said Mr. Sharma.

 
 
 
Play
Unmute
 
 
Loaded: 1.34%
 
 
Fullscreen
 
 
 
 
 

Established on a 270-acre site in a record 342 days in 2018, the AMTZ has all the required manufacturing facilities and 18 high-end scientific facilities which support the production of medical technology and equipment.

“For the first time in the country, all common facilities such as testing centres, labs and other facilities required to manufacture medical devices were being set up at one place. Manufacturers can simply set up units and start production. We expect around 240 units would come up in the park in phases. The Centre and the State government would approximately spend ₹300 crore on common facilities,” Mr. Sharma had told this correspondent in an interview in July 2017, when the AMTZ was still at the conceptual stage.

Seven years later, 152 companies have already set up their production units in AMTZ, producing a diverse range of medical devices. Several units were set up this year and more are expected in 2025.

On July 11 this year, Chief Minister N. Chandrababu Naidu, during his visit to the AMTZ, recalled the genesis of the project and the contribution of Mr. Sharma.

Mr. Sharma was Adviser to the Chandrababu Naidu’s government on Medical and Health in 2017.

“I gave him (Mr. Sharma) the idea and he brought it to fruition. A small initiative has created history. Today, I have satisfaction as a policy maker that AMTZ contributed to saving lives of lakhs of people across the country during the COVID-19 pandemic,” Mr. Naidu had said.

 

“Mr. Sharma, as an Adviser to our government, came up with several initiatives. I realised that he had a lot of talent and wanted him to create a medical equipment manufacturing hub in Vizag. Today, the AMTZ provides employment to 6,000 people,” he said.

Pointing out that the AMTZ is the largest medical devices manufacturing hub in the world, Mr. Sharma said the centre produced everything— from masks to MRI machines, CT scans, heart valves and pacemakers. “Cyclotrons, which produce radioisotopes for cancer care, is also being manufactured in AMTZ. Many ‘Made in India’ hospitals would be set up across the country and the medical equipment required for these hospitals would be produced here (AMTZ),” said Dr. Sharma.

“The PM Cares supplies also depend upon AMTZ. Many innovations from AMTZ such as mobile container hospitals, mobile RTCPR vehicles and oxygen plants have been sent to the remotest parts of the country,” he said.

Mr. Sharma said that the AMTZ is flourishing as a global eco-system for medical technology. “With the WHO Centre for Health Innovations, World Trade Centre, ICMR Centre, Ministry of Electronics Centre for Medical Electronics and Additive Materials, Ministry of Textiles Centre for Medical Textiles, Ministry of Science & Technology Centre for Biosciences, AMTZ is flourishing as a global centre for medical technology,” he said.

Many firsts

The AMTZ has set up many key facilities for the first time in the State.

The AMTZ has brought Andhra Pradesh’s first World Trade Centre, first Prime Minister Science and Technology Cluster, first electronic waste processing facility, first ‘Gamma irradiation centre, first Cancer Radioisotope Production Centre-Cyclotron to Visakhapatnam.

India’s first silicon medical detector facility, silicon medical detector facility, Superconducting Magnet facility, heart valve production facility and the world’s first WHO Centre for Health Innovations were also set up in AMTZ, Dr. Sharma added.

 

Published - December 31, 2024 08:59 am IST

 Read Comments
READ LATER
PRINT
 
 
  • 2 weeks later...
  • 2 weeks later...
Posted

మెడ్‌టెక్‌ జోన్‌లో ‘స్పెల్‌మన్‌’ భూమిపూజ

ఎక్స్‌రే యంత్రాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘స్పెల్‌మన్‌’ విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌లోకి అడుగుపెట్టింది. దేశంలోనే మొదటి అత్యాధునిక ఎక్స్‌రే జనరేటర్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించనుంది.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 26 Jan 2025 04:37 IST
Ee
Font size
 
 
 
 
 
 

AP250125main9a.webp

భూమిపూజలో పాల్గొన్న మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో డా.జితేంద్ర శర్మ, సంస్థ ప్రతినిధులు

ఈనాడు, విశాఖపట్నం: ఎక్స్‌రే యంత్రాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘స్పెల్‌మన్‌’ విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌లోకి అడుగుపెట్టింది. దేశంలోనే మొదటి అత్యాధునిక ఎక్స్‌రే జనరేటర్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు రాబర్ట్‌ జె ఫ్రాంక్‌లండ్, స్టెఫనీ, ఆరిందమ్‌ బోస్‌లతో కలసి మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో డా.జితేంద్ర శర్మ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డా.జితేంద్ర శర్మ మాట్లాడుతూ.. భారత మెడ్‌టెక్‌ రంగంలో ఇది కీలక పరిణామమని పేర్కొన్నారు.

Posted

రాష్ట్రంలో రేడియో ఐసోటోప్‌ల ఉత్పత్తి

క్యాన్సర్‌ నిర్ధారణలో ఉపయోగపడే రేడియో ఐసోటోప్‌ (18ఎఫ్‌)లను ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ సిద్ధమవుతోంది.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 01 Feb 2025 04:39 IST
Ee
Font size
 
 
 
 
 
 

క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో ఉపయోగం
మెడ్‌టెక్‌ జోన్‌లో తయారీకి అనుమతులు 
తక్కువ ధరలో ఆసుపత్రులకు అందించేందుకు సన్నాహాలు

ap310125main7a.webp

సైక్లోట్రాన్‌ యంత్రం

ఈనాడు, విశాఖపట్నం: క్యాన్సర్‌ నిర్ధారణలో ఉపయోగపడే రేడియో ఐసోటోప్‌ (18ఎఫ్‌)లను ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ సిద్ధమవుతోంది. అక్కడి ‘సైక్లోట్రాన్‌’ యంత్రం ద్వారా వాణిజ్య అవసరాలకు ఐసోటోప్‌లను ఉత్పత్తి చేసేందుకు ఇటీవల అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు నుంచి అనుమతి లభించింది. ఈ కేంద్రాన్ని 2024 జులైలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని క్యాన్సర్‌ ఆసుపత్రులకు తక్కువ ధరలో ఉత్పత్తులు సరఫరా చేయాలని జోన్‌ అధికారులు భావిస్తున్నారు. 18ఎఫ్‌ ఉత్పత్తి ప్రక్రియ, ఇతర వివరాలను కేంద్రం ముఖ్య నిర్వహణాధికారి (సీఓఓ) సలీల్‌ చంద్ర (దిల్లీ), లొకేషన్‌ హెడ్, రేడియో సేఫ్టీ ఆఫీసర్‌ (ఆర్‌ఎస్‌ఓ) సూర్యప్రకాశ్‌ వివరించారు.

ఇక్కడే ఎందుకు.? 

రాష్ట్రంలో పెట్‌-సీటీ స్కానింగ్‌కు అవసరమైన 18ఎఫ్‌-ఎఫ్‌డీజీని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి తదితర నగరాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు ఎక్కువవుతోంది. దీంతో విశాఖలో ఉత్పత్తి చేసేందుకు 2021 నుంచి మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ డా.జితేంద్రశర్మ కృషిచేస్తున్నారు. దిల్లీకి చెందిన ‘ఎస్‌డీఎస్‌ లైఫ్‌సైన్సెస్‌’ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించింది. 

ap310125main7b.webp

రేడియేషన్‌ స్థాయి తెలిసేలా ఏర్పాటుచేసిన డిటెక్టర్‌ 

ప్రక్రియ ఇలా 

సైక్లోట్రాన్‌ ద్వారా ఉత్పత్తి చేసిన 18ఎఫ్‌ (ఫ్లోరిన్‌)కు గ్లూకోజ్‌ను కలిపి ఎఫ్‌డీజీ (ఫ్లోరో   డీఆక్సీ గ్లూకోజ్‌)గా మారుస్తారు. దీన్ని శుద్ధి చేసి, స్టెరైల్‌ ఫిల్టర్‌ ద్వారా వడపోస్తారు. ద్రవరూపంలో ఉండే ‘18ఎఫ్‌-ఎఫ్‌డీజీ’ని చిన్నపాటి వయల్స్‌లో నింపుతారు. ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు చేస్తారు. ఇప్పటికే నగరంలోని పలు ఆసుపత్రులకు నమూనాలు పంపించారు. ఈ కేంద్రంలో ఆరుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు రేడియేషన్‌ స్థాయిలు గుర్తిస్తారు. 

సరఫరా ప్రారంభిస్తే.. 

18ఎఫ్‌-ఎఫ్‌డీజీని నిల్వ చేయడం కుదరదు. ఆసుపత్రులు దీన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటాయి. ఇటీవల పొగమంచు కారణంగా విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో ఉత్పత్తులు సకాలంలో అందక రోగులు ఇబ్బంది పడ్డారు. మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి సరఫరా మొదలైతే అలాంటి సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, ఒడిశాలోని భువనేశ్వర్, కటక్‌ వరకు రోడ్డుమార్గంలో సరఫరా చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు పంపించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 


ap310125main7c.webp

ఈ కంటెయినర్‌ బరువు దాదాపు 22 కిలోలు. కేంద్రంలో తయారైన ఉత్పత్తి నేరుగా నీలం రంగు డబ్బా (టంగ్‌స్టన్‌ కంటెయినర్‌)లోకి వెళ్లిపోతుంది. తర్వాత దాన్ని మూసేసి, పక్కనున్న కంటెయినర్‌లో పెడతారు. ‘హైప్రెజర్‌ ల్యామినేటెడ్‌ బాక్స్‌’గా పిలిచే దీన్ని ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ డిజైన్‌ ప్రకారం తయారుచేశారు.


ఇవీ ప్రత్యేకతలు..

  • ఇది రాష్ట్రంలోనే తొలి సైక్లోట్రాన్‌. తెలుగు రాష్ట్రాల పరంగా మూడోది. హైదరాబాద్‌లోని రెండు ఆసుపత్రుల్లో ఈ యంత్రాలు ఉన్నాయి.
  • దేశంలోని తొలి ఇంపోర్టెడ్‌ సైక్లోట్రాన్‌. ఏకకాలంలో 30 క్యూరీల ఎఫ్‌18 ఉత్పత్తి చేయగల సామర్థ్యముంది. 
  • కేంద్రంలో న్యూక్లియర్‌ రియాక్షన్‌ జరిగే రేడియేషన్‌ బయటకు రాకుండా సైక్లోట్రాన్‌ను రెండున్నర మీటర్ల మందమున్న కాంక్రీట్‌ గోడ లోపల షీల్డ్‌ చేశారు. ఆ గదిలోకి నిర్వహణ పనులకు మినహా మిగిలిన సమయంలో వెళ్లరు.
 
  • 3 weeks later...
  • 2 weeks later...
Posted

Artificial Limbs: చౌకగా.. వేగంగా.. సౌఖ్యంగా కృత్రిమ అవయవాలు

ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులు కోల్పోయిన బాధితులు కృత్రిమ అవయవాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దైన్యం. ఎటు కదలాలన్నా, దైనందిన పనులు చేసుకోవాలన్నా ఇతరుల తోడు అనివార్యం.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 04 Mar 2025 07:49 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

దివ్యాంగులకు భవ్యమైన జీవితం
విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ సహకారం
ఏటీసీలో 80కి పైగా పరికరాల రూపకల్పన
ఈనాడు - విశాఖపట్నం

030325apmain-6a.webp

ఇది బయోనిక్‌ హ్యాండ్‌. ప్రమాదవశాత్తూ చేతిని కోల్పోయిన వ్యక్తికి దీన్ని అమర్చితే 18 కిలోల వరకు బరువు ఎత్తగలరు. ఇందులో నాలుగు మోటార్లు పనిచేస్తాయి. భుజం కండరాల కదలికల ఆధారంగా బ్యాటరీ, సెన్సర్‌ పనిచేస్తాయి.

ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులు కోల్పోయిన బాధితులు కృత్రిమ అవయవాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దైన్యం. ఎటు కదలాలన్నా, దైనందిన పనులు చేసుకోవాలన్నా ఇతరుల తోడు అనివార్యం. ఈ కష్టాలు వీడేలా, విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లోని అసిస్టివ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను నవీన వైద్య సాంకేతికతతో వేగంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటితో పోల్చితే ఇవి తేలికగా, మరింత ఉపయుక్తంగా ఉంటున్నాయి. దివ్యాంగులకు సాంకేతికంగా అత్యాధునిక ఆర్థోటిక్, ప్రోస్థటిక్‌ సంరక్షణ అందించడానికి 2021లో ఏటీసీని ఏర్పాటుచేశారు. ఇందులోని ఆర్టిఫిషియల్‌ లింబ్‌ సెంటర్‌ (ఏఎల్‌సీ) విభాగానికి వచ్చే దివ్యాంగులను వైద్యులు, నిపుణులు పరీక్షించి, వారి అవసరాల మేరకు పరికరాలు రూపొందిస్తున్నారు. రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదంతో 80కి పైగా పరికరాలు తయారుచేస్తున్నారు. దివ్యాంగులు నేరుగా alc.amtz.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆయా పరికరాలను లాభాపేక్ష లేకుండా తయారీ ధరకే అందిస్తున్నారు. అదీ చెల్లించలేకపోతే కేంద్ర ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 22 వేల పరికరాలను అందజేయగా, వాటిలో 80 శాతం ఉచితంగా ఇచ్చినవే. 

030325apmain-6b.webp

ఏటీసీలో అవయవాల తయారీలో నిమగ్నమైన నిపుణులు, సిబ్బంది

వైకల్యాన్ని బట్టి పరికరాల తయారీ

పుట్టుకతోనే చెవులు, ముక్కు లోపాలున్నా, ప్రమాదంలో కాలు, చేతి వేళ్లు కోల్పోయినా ‘కాస్మెటిక్‌ రీస్టోరేషన్‌’ విధానంలో సిలికాన్‌ తొడుగులు అమరుస్తున్నారు. 

  • మోకాలు, చీలమండ, కాలి పాదంలో నొప్పుల నివారణకు ‘కస్టమ్‌ ఇన్‌సోల్స్‌’, మధుమేహ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేకంగా బూట్లు తయారుచేశారు. దొడ్డి కాళ్ల (బౌ లెగ్స్‌) లక్షణాలతో పుట్టిన పిల్లలకు మూణ్నెల్ల వయసు నుంచే వినియోగించేలా పరికరాలు రూపొందిస్తున్నారు.
  • క్లినిక్‌లోని పరికరాలన్నింటినీ ‘మొబైల్‌ ఆర్టిఫిషియల్‌ లింబ్‌ కేర్‌’ వాహనంలో ఉంచారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విజ్ఞప్తి మేరకు ఆయన నియోజకవర్గాని(నాగ్‌పుర్‌)కి ఇటీవల ఒక వాహనాన్ని అందించారు. ఇలాంటివి మున్ముందు దేశవ్యాప్తంగా నడపాలని యోచిస్తున్నారు.
  • పారాలింపిక్స్‌ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటీవల జాతీయస్థాయి ‘బోషియా’ క్రీడలు నిర్వహించారు. దివ్యాంగులు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్నారు. ఏటీసీ సహకారంతో ఇటీవల రాష్ట్రం తరఫున వీల్‌ఛైర్‌ బాస్కెట్‌బాల్‌ జట్టును ఏర్పాటు చేశారు.

030325apmain-6c.webp

చేతి వేళ్ల మాదిరి సిలికాన్‌ తొడుగులు


030325apmain-6d.webp

పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి సేవా సంస్థకు ఒక ‘మొబైల్‌ ఆర్టిఫిషియల్‌ లింబ్‌ కేర్‌’ వాహనాన్ని అందజేశారు. గతంలో 80 కృత్రిమ కాళ్లను పుట్టపర్తికి పంపగా, తాజాగా మరో 250 పరికరాలను సిద్ధం చేశారు.


వివిధ సంస్థలతో ఒప్పందం

-అమిత్‌కుమార్‌శర్మ, హెడ్, ఏటీసీ

030325apmain-6e.webp

వైకల్య సమస్యలపై పనిచేస్తున్న జాతీయ సంస్థలతోపాటు విశాఖకు చెందిన భగవతుల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (బీసీటీ), సత్యసాయి సేవా సమితి, ఆర్‌ఐఎన్‌ఎల్‌ తదితర స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఏటీసీ, కొన్ని అంకుర సంస్థలు వివిధ శారీరక లోపాలకు అత్యాధునిక పరికరాలు తయారుచేయడంపై కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో దృష్టి లోపం, మేధో సంబంధిత సమస్యల పరిష్కారానికి కూడా పరికరాలు అందిస్తాం.

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...