ఇప్పటి నుంచి చూస్తే పోలింగ్ కు ఇంకా రెండు నెలల గడువు ఉంది. ఈ సమయంలో ప్రభుత్వంపై అసంతృప్తి మరింత పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. ఇప్పటికే బటన్ నొక్కిన డబ్బుల్ని అకౌంట్లలో జమ చేయలేకపోతున్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నందున బ్యాంకులు ఆర్థిక సంస్థలు అప్పులు కూడా ఇవ్వవు. ఆర్బీఐ కూడా ఇవ్వకపోవచ్చు. ఈ క్రమంలో .. వచ్చే రెండు నెలలు ప్రభుత్వానికి పెను సవాల్ లాంటిదే అనుకోవచ్చు.