Jump to content

Recommended Posts

మందుల ఖర్చు సర్కారే చెల్లిస్తుంది

బీపీ, షుగర్‌ రోగులందరికీ వర్తింపు

లక్షలాది మంది బాధితులకు ఊరట

గుంటూరు: జిల్లాలో మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే వారికి ఇది శుభవార్తే. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్తగా ‘ఉచిత మందుల పథకం’ ప్రకటించింది. నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్‌ మెడికల్‌ షాపులోనైనా రోగులు ఈ మందులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్‌ రోగులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఈ తరహా పథకం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

ఐసీఎంఆర్‌, కలామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంస్థలు ఇటీవల సంయుక్తంగా ఏపీలో సర్వే నిర్వహించాయి. ప్రైవేటు వైద్యరంగంలో నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్‌ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్ధిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదించింది.

 

రోగుల ఎంపిక ఇలా...

ఉచిత మందుల పథకంలో లబ్ధిదారులుగా చేరదలచిన రోగులు తొలుత తమకు ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాలి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (ఈ-యూహెచ్‌సీలు), ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు గ్లైకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ పరీక్షలు (షుగర్‌కు) చేయించుకోవాలి.

 

షుగర్‌ బాధితులు ఫాస్టింగ్‌, పోస్ట్‌ ప్రాండియల్‌ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్‌ రోగి పరీక్ష ఫలితాలను AP -e RX APP ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. వెంటనే రోగి సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, కోడ్‌ వస్తుంది. అంతే... రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లే. ఈ కోడ్‌ను చూపి రిటైల్‌ మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు తీసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు. రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్‌ నంబర్‌, ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కాని వారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో సంప్రదించాలి.

 

మందుల దుకాణాలు ఇలా చేయాలి...

ఇక ఈ పథకం కింద రోగులకు మందులు విక్రయించాల్సిన రిటైల్‌ మెడికల్‌ దుకాణాల వారు మొదట అదే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం తాము విక్రయించే మందులను బిల్లు, రోగి కోడ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ప్రభుత్వం వారానికి ఒకసారి ద్వారా మందుల దుకాణాలకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఎస్‌డీఈసీ) బిల్లులను, చెల్లింపులను పర్యవేక్షిస్తుంది.

 

యాప్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

జిల్లాలో రిటైల్‌ మందుల దుకాణదారులు షుగర్‌, బీపీ మందులు విక్రయించేందుకు తొలుత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందు కోసం ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌ను ఓపెన్‌ చేయాలి. దానిలో AP-eRX for pharmacy అని టైప్‌ చేయాలి. వెంటనే ఇన్‌స్టాల్‌ బటన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే ఇన్‌స్టాల్‌ అయ్యి నెంబర్‌, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. నంబర్‌, పాస్‌వర్డ్‌ ఇచ్చి రిజిస్టర్‌ అనే పదాన్ని క్లిక్‌ చేస్తే పూర్తి చేయాల్సిన దరఖాస్తు వస్తుంది.

 

ఈ దరఖాస్తును పూర్తి చేయాలి. అనంతరం సబ్మిట్‌ బటన్‌ నొక్కితే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సెండ్‌/ఓకే చేయాలి. వెంటనే రిటైల్‌ షాపు రిజిస్టర్‌ అవుతుంది. ఇకపై వ్యాపారులు AP -e RX APP ద్వారా రోగులకు ఈ పథకం కింద బీపీ, షుగర్‌ మందుల విక్రయాలు జరపవచ్చు.

 

అందించే మందులు ఇవే...

బీపీ, షుగర్‌ రోగులకు అందించే మందుల వివరాలను, ఆయా మందులకు ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు ప్రభుత్వం చెల్లించే ధరలను ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసేందుకు ఏపీ ఎంఎస్‌ఐడీసీ సంస్థ చెల్లించే రేటును ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌లో ఈ-ఔషధి కింద అందించే నిధులతో ఈ పథకంలో చెల్లింపులు జరుపుతామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

షుగర్‌ మందులు ...

1. గ్లిమిప్రైడ్‌ ట్యాబ్లెట్లు 5 ఎంజీ- రూ.9.90

2. గ్లిమిప్రైడ్‌ ట్యాబ్లెట్లు 1 ఎంజీ- రూ.11.09

3. గ్లిమిప్రైడ్‌ ట్యాబ్లెట్లు 2 ఎంజీ- రూ.14.70

4. మెట్‌ఫార్మిన్‌ 500ఎంజీ- రూ.21.19

 

బీపీ మందులు ...

1. ఎమ్లోపిడిన్‌ ట్యాబ్లెట్లు 5 ఎంజీ- రూ.8.60

2. ఎటెన్‌లాల్‌ ట్యాబ్లెట్లు 50 ఎంజీ- రూ.23.45

3. ఎనలాప్రిల్‌ మ్యాలియేట్‌ 5ఎంజీ- రూ.16.61

4. ఎనలాప్రిల్‌ ట్యాబ్లెట్లు 1 ఎంజీ- రూ.33.59

5. లోసర్టన్‌ పోటాషియం 50ఎంజీ- రూ.25.00

6. మెట్రోప్రొలాల్‌ 25ఎంజీ- రూ.19.98

7. మెట్రోప్రొలాల్‌ టార్టేట్‌ 40 ఎంజీ- రూ.43.43

8. ప్రొపనలాల్‌ హెచ్‌సీఎల్‌ 40ఎంజీ- రూ.18.81

9. ర్యామిప్రిల్‌ ట్యాబ్లెట్లు 5 ఎంజీ- రూ.44.79

10. టెల్మిసార్టన్‌ ట్యాబ్లెట్లు 40 ఎంజీ- రూ.39.39

Link to comment
Share on other sites

@kishbab

6 hours ago, Dr.Koneru said:

మందుల ఖర్చు సర్కారే చెల్లిస్తుంది

బీపీ, షుగర్‌ రోగులందరికీ వర్తింపు

లక్షలాది మంది బాధితులకు ఊరట

గుంటూరు: జిల్లాలో మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే వారికి ఇది శుభవార్తే. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్తగా ‘ఉచిత మందుల పథకం’ ప్రకటించింది. నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్‌ మెడికల్‌ షాపులోనైనా రోగులు ఈ మందులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్‌ రోగులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఈ తరహా పథకం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

ఐసీఎంఆర్‌, కలామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంస్థలు ఇటీవల సంయుక్తంగా ఏపీలో సర్వే నిర్వహించాయి. ప్రైవేటు వైద్యరంగంలో నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్‌ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్ధిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదించింది.

 

రోగుల ఎంపిక ఇలా...

ఉచిత మందుల పథకంలో లబ్ధిదారులుగా చేరదలచిన రోగులు తొలుత తమకు ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాలి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (ఈ-యూహెచ్‌సీలు), ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు గ్లైకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ పరీక్షలు (షుగర్‌కు) చేయించుకోవాలి.

 

షుగర్‌ బాధితులు ఫాస్టింగ్‌, పోస్ట్‌ ప్రాండియల్‌ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్‌ రోగి పరీక్ష ఫలితాలను AP -e RX APP ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. వెంటనే రోగి సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, కోడ్‌ వస్తుంది. అంతే... రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లే. ఈ కోడ్‌ను చూపి రిటైల్‌ మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు తీసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు. రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్‌ నంబర్‌, ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కాని వారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో సంప్రదించాలి.

 

మందుల దుకాణాలు ఇలా చేయాలి...

ఇక ఈ పథకం కింద రోగులకు మందులు విక్రయించాల్సిన రిటైల్‌ మెడికల్‌ దుకాణాల వారు మొదట అదే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం తాము విక్రయించే మందులను బిల్లు, రోగి కోడ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ప్రభుత్వం వారానికి ఒకసారి ద్వారా మందుల దుకాణాలకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఎస్‌డీఈసీ) బిల్లులను, చెల్లింపులను పర్యవేక్షిస్తుంది.

 

యాప్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

జిల్లాలో రిటైల్‌ మందుల దుకాణదారులు షుగర్‌, బీపీ మందులు విక్రయించేందుకు తొలుత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇందు కోసం ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌ను ఓపెన్‌ చేయాలి. దానిలో AP-eRX for pharmacy అని టైప్‌ చేయాలి. వెంటనే ఇన్‌స్టాల్‌ బటన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే ఇన్‌స్టాల్‌ అయ్యి నెంబర్‌, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. నంబర్‌, పాస్‌వర్డ్‌ ఇచ్చి రిజిస్టర్‌ అనే పదాన్ని క్లిక్‌ చేస్తే పూర్తి చేయాల్సిన దరఖాస్తు వస్తుంది.

 

ఈ దరఖాస్తును పూర్తి చేయాలి. అనంతరం సబ్మిట్‌ బటన్‌ నొక్కితే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సెండ్‌/ఓకే చేయాలి. వెంటనే రిటైల్‌ షాపు రిజిస్టర్‌ అవుతుంది. ఇకపై వ్యాపారులు AP -e RX APP ద్వారా రోగులకు ఈ పథకం కింద బీపీ, షుగర్‌ మందుల విక్రయాలు జరపవచ్చు.

 

అందించే మందులు ఇవే...

బీపీ, షుగర్‌ రోగులకు అందించే మందుల వివరాలను, ఆయా మందులకు ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు ప్రభుత్వం చెల్లించే ధరలను ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసేందుకు ఏపీ ఎంఎస్‌ఐడీసీ సంస్థ చెల్లించే రేటును ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌లో ఈ-ఔషధి కింద అందించే నిధులతో ఈ పథకంలో చెల్లింపులు జరుపుతామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

షుగర్‌ మందులు ...

1. గ్లిమిప్రైడ్‌ ట్యాబ్లెట్లు 5 ఎంజీ- రూ.9.90

2. గ్లిమిప్రైడ్‌ ట్యాబ్లెట్లు 1 ఎంజీ- రూ.11.09

3. గ్లిమిప్రైడ్‌ ట్యాబ్లెట్లు 2 ఎంజీ- రూ.14.70

4. మెట్‌ఫార్మిన్‌ 500ఎంజీ- రూ.21.19

 

బీపీ మందులు ...

1. ఎమ్లోపిడిన్‌ ట్యాబ్లెట్లు 5 ఎంజీ- రూ.8.60

2. ఎటెన్‌లాల్‌ ట్యాబ్లెట్లు 50 ఎంజీ- రూ.23.45

3. ఎనలాప్రిల్‌ మ్యాలియేట్‌ 5ఎంజీ- రూ.16.61

4. ఎనలాప్రిల్‌ ట్యాబ్లెట్లు 1 ఎంజీ- రూ.33.59

5. లోసర్టన్‌ పోటాషియం 50ఎంజీ- రూ.25.00

6. మెట్రోప్రొలాల్‌ 25ఎంజీ- రూ.19.98

7. మెట్రోప్రొలాల్‌ టార్టేట్‌ 40 ఎంజీ- రూ.43.43

8. ప్రొపనలాల్‌ హెచ్‌సీఎల్‌ 40ఎంజీ- రూ.18.81

9. ర్యామిప్రిల్‌ ట్యాబ్లెట్లు 5 ఎంజీ- రూ.44.79

10. టెల్మిసార్టన్‌ ట్యాబ్లెట్లు 40 ఎంజీ- రూ.39.39

 

Link to comment
Share on other sites

18 hours ago, akhil ch said:

Asala ilanti scheme elections mundu pettadam endo EP planning. Minimum 6 months Mundu dinchunte netthi nelakesi kodithe purre bayata padedi pawan kalyan gadiki

6 months mundu pedithe marchipothunnaru bro..oka vidamaga correct oka vidamga wrong...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...