Jump to content

Recommended Posts

Posted
పర్యాటక కేంద్రానికి నాలుగు వరుసల రోడ్డు
 
636110719388666922.jpg
గుంటూరు, బాపట్ల : ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరానికి వెళ్ళే రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి సీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.8 కోట్లు మంజూరయ్యా యి. రాకపోకలతో రద్దీగా ఉండే సూర్యలంక రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటా యి. దీనిని నివారించేందుకు రోడ్డు విస్తరణకు ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ప్రభాకర్‌ కృషితో నిధులు మంజూరు కావటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్యలంక పర్యాటక కేంద్రంతో పాటు ఎయిర్‌ఫోర్స్‌స్టేషన్‌, కేంద్రీయ విద్యాలయం, ఆక్వా పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు సూర్యలంక కేంద్రంగా ఉంది. ఎంతో కాలంగా సింగిల్‌రోడ్డుగా ఉన్న దీనిని గత ప్రభుత్వ హయంలో అప్పటి ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి డబల్‌ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దీనిని నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే డివైడర్‌లు , సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేశారు. పట్టణ శివారు ఇండేన్‌గ్యాస్‌ గోదాముల దగ్గర నుంచి ముత్తాయపాలెం ఊరి బయట వరకు, ఊరు చివర నుంచి ఎయిర్‌ఫోర్స్‌స్టేషన్‌ వరకు 8 కిలోమీటర్ల పొడువున నాలుగు వరుసల రోడ్డు వేయనున్నారు. ఇప్పటికే కుందేరు వాగుపై చప్టాను విస్తరించారు. అయితే నాలుగు వరుసల రోడ్డుగా విస్తరిస్తే కుం దేరువాగుపై చప్టా మరింత విస్తరించాల్సి ఉం టుంది. సూర్యలంక పర్యాటకేంద్రం అభివృద్దిలో భాగంగా తొలుత రహదారి అభివృద్ధి చేసి తదుపరి ప్రణాళిక ప్రకారం అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీసతీష్‌ ప్రభాకర్‌ తెలిపారుప్రయాణికుల సంక్షేమం పేరిట ఆర్టీసీ ప్రత్యేక దోపిడీకి తెర లేపింది. సెస్‌ల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతోంది. సంస్థ నష్టాల్లో కొట్టు మిట్టాడుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రయాణికుల నుంచి సేవా రుసుం వసూలు చేయడానికి మాత్రం అనుమతి ఇచ్చారు. దీంతో సర్వీసుల వారీగా టికెట్‌పై సెస్‌ వసూలు చేస్తున్నారు.
  • 4 weeks later...
Posted

Maa freshers, C meet and farewell anni jarigina place  :youth:

 

Aa rojullo share auto lo single road meeduga poyetollam :P

 

BEC alumni na uncle meru........... :no1:

  • 4 weeks later...
  • 2 weeks later...
Posted

సూర్యలకం అభివృద్ధికి కృషి
బాపట్ల : సూర్యలంక సముద్రతీరాన్ని టూరిజం కార్పొరేషన్‌ ద్వారా అభివృద్ధి చేస్తానని చైౖర్మన్‌ వి.జయరామిరెడ్డి తెలిపారు. సూర్యలంక సముద్రతీరంలో పర్యాటకకేంద్రానికి కేటాయించిన 8ఎకరాల స్థలాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ప్రభాకర్‌, ఇండ స్ర్టియల్‌ ఇన్‌ప్రాస్టక్చర్స్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పి.కృ ష్ణయ్య, కల్లుగీత కార్పొరేషన్‌ చైౖర్మన్‌ జయప్రకాష్‌నారాయణలతో కలిసి ఆయన పరిశీలించారు. భూమి వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అన్నంసతీష్‌ప్రభాకర్‌ మాట్లాడుతూ రాజధాని సమీపంలో ఉన్న సూర్యలంక పర్యాటక కేంద్రానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. నిధులు కేటాయిస్తే సూర్యలంకను అభివృద్ధి చేస్తానని తెలిపారు. దీనిపై స్పందించిన జయరామిరెడ్డి సూర్యలంక పర్యాటకకేంద్రం అభివృద్ధ్దితో పనిచేస్తానన్నారు. గతంలో రూ.5కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశారని.. అభివృద్ధి మాత్రం చేయలేదని ఎమ్మెల్సీ వివరించారు. ఎంపీపీ మానంవిజేత, మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ, పార్టీ మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాసరెడ్డి, నక్కావీరారెడ్డి, పమిడి భాస్కరరావు పాల్గొన్నారు.

  • 3 months later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 5 months later...
  • 3 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...