sonykongara Posted January 3, 2019 Author Posted January 3, 2019 కాకినాడ ఓడరేవుకు రాచబాట సామర్లకోట-రాజానగరం రహదారి విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన ఈనాడు, అమరావతి: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ)లో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట-రాజానగరం రహదారి విస్తరణ పనులకు ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో జిల్లాలో చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపైనున్న రాజానగరం నుంచి కాకినాడ ఓడరేవుకు అనుసంధానం పెరుగుతుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న 29.6 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 30 నెలల్లో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. అంచనా వ్యయం రూ.300.28 కోట్లు కాగా.. అందులో 21.5% నిధులను ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇవ్వనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. narens 1
Flash Posted June 10, 2024 Posted June 10, 2024 NTPC Green Energy to invest 70,000 crores for sustainable fuel and green hydrogen project NTPC Sets Sights on Sustainable Aviation Fuel with Annual capacity of 1,00,000 tonnes per annum at Pudimadaka, Andhra Pradesh https://www.indiainfoline.com/news/companies/ntpc-sets-sights-on-sustainable-aviation-fuel
narens Posted July 24, 2024 Posted July 24, 2024 2 hours ago, sonykongara said: Edo okati maa rayalaseema ki help ayithe good,people will remember ..though all the CM's are from rayalaseema from 90's in AP, no development in districts specially in Kadapa.....mare naayallu YSR and Jagan ayithe min develop cheyakunda rule chesaaru in kadapa chetha batch.. AndhraBullodu 1
sonykongara Posted November 21, 2024 Author Posted November 21, 2024 https://x.com/AndhraNexus/status/18595222184113399
sonykongara Posted January 6 Author Posted January 6 రెండేళ్లలో పూర్తయ్యే పనులనే చేపడదాం! విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ) రెండోదశలో భాగంగా వచ్చే రెండేళ్లలో పూర్తిచేయగల పనులనే చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. By Andhra Pradesh News DeskPublished : 06 Jan 2025 04:10 IST విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాపై ప్రభుత్వం నిర్ణయం రూ. 160 కోట్ల విడుదల కోసం ఏడీబీకి ప్రతిపాదన గడువులోగా అన్ని ప్యాకేజీలు సాధ్యం కాదు జగన్ సర్కార్ కాలయాపన ఫలితమే ఈనాడు, అమరావతి: విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ) రెండోదశలో భాగంగా వచ్చే రెండేళ్లలో పూర్తిచేయగల పనులనే చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. వీటిని ప్రారంభించేందుకు ముందస్తుగా రూ.160 కోట్లు విడుదల చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకును (ఏడీబీ) కోరింది. ఏడీబీ.. ఎకౌంటింగ్ ప్రక్రియను క్యాలెండర్ సంవత్సరం ప్రకారం నిర్వహిస్తుంది. ఖాతాల ముగింపు నిల్వలు తేల్చేందుకు వీలుగా 2024 డిసెంబరు 15 వరకు అందిన రుణ ప్రతిపాదనలనే ఆమోదిస్తుంది. తర్వాత అందిన వాటిని 2025 ఎకౌంటింగ్ సంవత్సరంలో చూసి.. మార్చి/ ఏప్రిల్లో నిధులు విడుదల చేస్తుంది. అలాగైతే పనుల ప్రారంభం ఆలస్యమవుతుంది. ఏడీబీతో ఒప్పందం ప్రకారం 2026 డిసెంబరులోగా ఈ పనులన్నీ పూర్తిచేయాలి. ప్రాజెక్టు గడువు ముగిశాక వచ్చే బిల్లులను ఏడీబీ పరిగణనలోకి తీసుకోదు. రెండోదశలో రూ.1,758.99 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజిలను ఆమోదించిన ఏడీబీ.. రూ.1,155.63 కోట్లు రుణంగా అందిస్తుంది. రూ.603.36 కోట్లు రాష్ట్రప్రభుత్వ వాటాగా భరించాలి. ఈ నెలలో నిధుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ చేసిన పాపాల ఫలితం ఏడీబీతో ఒప్పందం ప్రకారం రెండోదశ పనులు 2019లో ప్రారంభం కావాలి. జగన్ ప్రభుత్వం ఈ ప్యాకేజిలో తీవ్ర జాప్యం చేసింది. ఏడీబీ నుంచి ప్యాకేజిలకు ఆమోదం పొంది, ఒప్పందాన్ని అమలులోకి తెచ్చేందుకు 2023 మే వరకు కాలయాపన చేసింది. తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ప్రాజెక్టు మరుగున పడింది. ఫలితంగా ప్రాజెక్టు రెండోదశ సందిగ్ధంలో పడింది. ఈ పనులపై ముందుకెళ్తే గడువులోగా పూర్తి చేయగలమా? కొన్ని ప్యాకేజిలను పక్కనపెట్టి, రెండేళ్లలో చేయగలిగిన వాటిపైనే దృష్టిపెట్టాలా? అసలు పూర్తిగా రెండోదశను వదులుకోవాలా? అన్న ప్రశ్నలు కూటమి ప్రభుత్వం ముందు వచ్చాయి. దాంతో 2026లోగా ఎన్ని ప్యాకేజిలు పూర్తిచేయడానికి అవకాశం ఉందన్న దానిపై పునరాలోచన చేస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దుచేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కొద్దిరోజుల కిందట సీఎం చంద్రబాబు సమీక్షించి.. కొన్ని ప్యాకేజిలపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండోదశలో ప్రతిపాదించిన పనులివే.. చిత్తూరు సౌత్ క్లస్టర్ పరిధిలోని స్టార్టప్ ఏరియా 2,770 ఎకరాల్లో రూ.650 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు అభివృద్ధికి రూ.172 కోట్లతో ప్రతిపాదన. దీనికి భూసేకరణ కోసం రూ.130 కోట్లు అదనంగా రాష్ట్రప్రభుత్వం భరించాలని అంచనా. భూసేకరణ పూర్తిచేసి నిర్దేశిత వ్యవధిలో పనులు పూర్తిచేయడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ దృష్ట్యా పనులను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నక్కపల్లి క్లస్టర్ స్టార్టప్ ఏరియా 1,120 ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.376 కోట్లతో ప్రతిపాదించిన పనులనూ ఉపసంహరించనున్నారు. ఈ భూముల్లో కొన్నింటిని ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ ఏర్పాటుచేయబోయే ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడ పనులు చేపట్టాల్సిన అవసరం లేదు. రాంబిల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్లో రోజుకు 95 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు రూ.303.60 కోట్లతో పనులు. రాంబిల్లి పారిశ్రామిక పార్కులోని స్టార్టప్ ఏరియా 392 ఎకరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.187 కోట్లతో ప్రతిపాదన. రాంబిల్లిలో ప్రతిపాదించిన పనులను కేటాయించేందుకు గత ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకురాలేదు. వాటిని ఇప్పుడు ప్రారంభించినా పూర్తిచేయడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now