Jump to content

శిరోముండనం కేసు.. వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి జైలు శిక్ష


Recommended Posts

విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.

Contest chestada?

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసుకు సంబంధించి ఎట్టకేలకు తీర్పు విడుదలైంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల (Thota Trimurthulu) కు విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అయితే శిరోముండనం కేసులో సస్పెన్షన్ ఆఫ్ జడ్జిమెంట్ కోసం కోర్టులో తోట త్రిమూర్తులు, సహ నిందితులు ఆపిల్ చేశారు.

వీరి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ... 28 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తోందని చెప్పారు. న్యాయపరంగా ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నానని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయంపై హైకోర్టులో అప్పిల్ వేస్తానని అన్నారు. ఆ కోర్టులో తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. తాను ఈ కేసులో నిర్ధోషిగా బయటకు వస్తాననే నమ్మకం తనకుందన్నారు. రాజకీయంగా కొంతమంది ఈ కేసును ఆసరాగా తీసుకొని తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు.

ఈ కేసు పెట్టిన తర్వాత కూడా తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే ప్రజల మద్దతు తనకుందని అర్థం చేసుకోవాలని చెప్పారు. మండపేట ఎన్నికల్లో కూడా దళిత సోదరులు తన వెంట ఉండి గెలిపిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాలకు, ఈ కేసుకు సంబంధం లేదని తోట త్రిమూర్తులు తేల్చిచెప్పారు.

Link to comment
Share on other sites

వివాదాల తోటలో.. ధర్మమే గెలిచింది!

ఈ కేసులో 2020లో వైసీపీ ఎంపీ పిల్లి సుభా ష్‌చంద్రబోస్‌, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. శిరోముండనం కేసుపై 2020 నవంబరులో ఎంపీ బోస్‌ రాష్ట్ర హోంమంత్రికి లేఖ రాయడం కలకలం రేపింది. ఎన్నో ఏళ్ల కిందట జరిగిన శిరోముండనం కేసులో విచారణను వేగవంతం చేయాలని ఆ లేఖలో అప్ప ట్లో బోస్‌ డిమాండ్‌ చేశారు. దళితులకు అన్యాయం చేసిన నేపథ్యంలో సొంత పార్టీ అయినా సరే త్రిమూర్తులును వది లిపెట్టేది లేదని అప్పట్లో పేర్కొన్నారు. తాజా తీర్పు పైనా బోస్‌ స్పందించారు. పూర్తి తీర్పు చదివిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తానన్నారు.

Edited by Siddhugwotham
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...