Jump to content

Amaravati


Recommended Posts

ఏపీ సచివాలయం నమూనా!
30state15a.jpg
మరావతిలో నిర్మించే ఏపీ సచివాలయం నమూనాని దాదాపు ఖరారు చేశారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ మొత్తం మూడింటిని రూపొందించింది. మొదటి నమూనాలో పాలవాగుకి ఒకపక్క ముఖ్యమంత్రి కార్యాలయ భవనం, దానికి ఎదురుగా వాగుకి రెండో పక్క నాలుగు టవర్లు జిగ్‌జాగ్‌గా రూపొందించింది. దీన్ని గురువారం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు చూపించగా ఎక్కువ మంది మొగ్గు చూపించారు. 

 

 
Link to comment
Share on other sites

రాజధాని పనులు ముమ్మరం
వచ్చే ఆరు నెలల్లో రాజధాని పనులు ఊపందుకుంటాయని సీఎం తెలిపారు. శాశ్వత సచివాలయంలో శాసనసభ, హైకోర్టు భవనాలను ఐకానిక్‌గా నిర్మిస్తామని స్పష్టం చేశారు. సచివాలయం, శాఖాధిపతుల భవనాలన్నీ ఒకేచోట ఉండేలా నిర్మాణం చేస్తామని తెలిపారు. ‘సచివాలయానికి వచ్చి మళ్లీ అక్కడి నుంచి పనికోసం నాలుగైదు చోట్ల ఉన్న వివిధ శాఖల కార్యాలయాలకు తిరిగే పనుండదు. అన్నీ ఒకేచోట నిర్మిస్తాం. వాటి డిజైన్లూ ఆమోదించాం. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫిబ్రవరిలో పూర్తికావాలి. ఇతర రోడ్లు, రైతుల స్థలాలకు రోడ్లు కూడా ప్రారంభించాం. 68 టవర్ల నిర్మాణ డిజైన్లు ఆమోదించాం. అందులో మంత్రులు, ఎన్‌జీవోలు అందరివీ ఉంటాయి.
 
సచివాలయంలో ఐదు టవర్లు నిర్మిస్తాం. అందులోనే శాఖా కార్యాలయాలతో సహా అన్నీ వస్తాయి.’ అని తెలిపారు. ‘రాజధానిలో ఇటీవలే విట్‌, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాలు తరగతులు ప్రారంభించాయి. మిగతావి పనులు ప్రారంభించనున్నాయి. ఇటీవలే హెచ్‌సీఎల్‌ కూడా వచ్చి నిర్మాణం ప్రారంభిస్తానని తెలిపింది. రాబోయే ఏడాదిన్నరలో మనం అనుకున్నవన్నీ రాజధానికి వస్తాయి.’ అని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఒక ఐటీ కంపెనీ తెచ్చేందుకు ప్రపంచమంతా తిరిగి, అతికష్టంపై మైక్రోసా్‌ఫ్టను తీసుకురాగలిగామని, దాన్ని చూసి ఎన్నో కంపెనీలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ మెట్రో.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆలోచనకు బీజం వేసింది తానేనన్నారు. అమరావతిని కాలుష్యరహిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను కాకుండా ఎలక్ర్టిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
 
ఇప్పటికే 1500 ఇ-వాహనాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చినట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

ఆప్షన్‌-1కే నెటిజన్ల మొగ్గు!
05-12-2017 01:16:34
 
636480333950652546.jpg
  • సచివాలయ డిజైన్లపై అభిప్రాయాలు
  • కొనసాగనున్న ప్రజాభిప్రాయ సేకరణ
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మించనున్న సచివాలయ సముదాయానికి సంబంధించిన డిజైన్లపై దేశ, విదేశాలకు చెందిన పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం కోసం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన మొత్తం మూడు డిజైన్లలో సీఎం చంద్రబాబు రెండు బాగున్నాయనడం తెలిసిందే. ఈ రెండిట్లోనూ మొత్తం 5 బ్లాక్‌లున్నాయి, సీఎంవో బ్లాక్‌ పాలవాగుకు ఒక పక్కన ఉండగా, మిగిలినవి ఆవలివైపున ఉన్నాయి. ఒక డిజైన్లో ఈ నాలుగు బ్లాక్‌లు జిగ్‌జాగ్‌గా ఉండగా, రెండోదానిలో చదరం(స్క్వేర్‌) ఆకృతిలో ఉన్నాయి.
 
 
ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఈ రెండు ఆకృతులనూ ఏపీసీఆర్డీయే వెబ్‌సైట్‌లో ఉంచాలని సీఎం ఆదేశించారు. అత్యధికులు మెచ్చిన డిజైన్‌ను త్వరలోనే ఖరారు చేద్దామన్నారు. ఆ ప్రకారమే సీఆర్డీయే ఈ డిజైన్లను తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాల్లోనూ ఉంచింది. సోమవారం సాయంత్రం వరకు మొత్తం 997 మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చగా, వారిలో 524మంది ఆప్షన్‌-1కు మొగ్గు చూపారు. మిగిలిన 473మంది ఆప్షన్‌-2 బాగుందన్నారు. మరికొన్ని రోజులపాటు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ కొనసాగనున్నందున మరింతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని భావిస్తున్న సీఆర్డీయే ఉన్నతాధికారులు తదనుగుణంగా నివేదికను రూపొందించి, సీఎంకు సమర్పించనున్నారు.
Link to comment
Share on other sites

300 మంది కూర్చునేలా..
శాసనసభ సమావేశ మందిరం తుది ఆకృతి
 13న సీఎంతో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధుల భేటీ

ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో శాసనసభ సమావేశమందిరాన్ని 300 మంది సభ్యులు కూర్చునేలా నిర్మించనున్నారు. ప్రస్తుతం 175 శాసనసభ స్థానాలే ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. 100 మంది సభ్యులు కూర్చొనేలా శాసనమండలి సమావేశమందిరాన్ని నిర్మించనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశాలు నిర్వహించేందుకు, బహుముఖ అవసరాలకు ఉపయోగపడేలా సెంట్రల్‌హాల్‌ ఉంటుంది. శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ అందజేయనుంది. ఆ సంస్థ ప్రతినిధులు ఈ నెల 12న వచ్చి 13న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అక్టోబరులో లండన్‌ వెళ్లినప్పుడు హైకోర్టుకు సంబంధించి ముఖద్వారం ఆకృతిలోను, అంతర్భాగంలోను, శాసనసభ, శాసనమండలి భవనానికి సంబంధించి చతురస్రాకారాపు ఆకృతి, భవనంపై పొడవైన స్తంభం (టవర్‌)తో రూపొందించిన వాటిని మెరుగుపరిచి తీసుకురావాలని సూచించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 13న జరిగే సమావేశంలో వీటిపై స్పష్టత వస్తే వెంటనే టెండర్లు పిలిచేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సిద్ధమవుతోంది. శాసనసభ, హైకోర్టు భవనాల్లో అంతర్గత ప్రణాళిక ఎలా ఉండాలి? ఎన్ని చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉండాలి వంటి అంశాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. శాసనసభ భవనం బేస్‌మెంట్‌ 3 లక్షల చ.అడుగులతో కలిపి మొత్తం 11 లక్షల చ.అడుగులు ఉంటుంది. హైకోర్టు భవనం బేస్‌మెంట్‌ 10 లక్షల చ.అడుగులతో కలిపి 25 లక్షల చ.అడుగులు ఉంటుంది. దీనిలో 36 కోర్టు హాళ్లను తొలి దశలో నిర్మిస్తారు. భవిష్యత్తులో మరో 24 హాళ్లు నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...