Jump to content

Recommended Posts

Posted
ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఎత్తివేత
19-08-2018 18:35:36
 
636703005382452281.jpg
విజయవాడ: ఎగువ నుంచి భారీగా వరదలు రావడంతో ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఎత్తివేశారు. బ్యారేజి ఇన్‌ఫ్లో-17 వేలు, ఔట్‌ఫ్లో-7 వేల క్యూసెక్కులుగా ఉంది. తూర్పు, పశ్చిమ కాలువలకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని అధికారులు తగ్గించారు. అంతేకాకుండా సుంకేసుల డ్యాం 18 గేట్లను అధికారులు ఎత్తివేత వేశారు. ఇన్‌ఫ్లో 1.39 లక్షలు, ఔట్‌ఫ్లో 1.37 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
  • 3 months later...
Posted

విజయవాడ: పెథాయ్ తుఫాను ప్రభావంతో క్రమంగా కృష్ణమ్మలో నీటి మట్టం పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ నుంచి భారీగా నీరు చేరడంతో ఐదు గేట్లు ఎత్తి కొద్ది మొత్తంలో నీటిని విడుదల చేశారు. కృష్ణానదిలో నీరు మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.

  • 5 years later...
Posted

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 70 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది.

Updated : 07 Aug 2024 13:03 IST
 
 
 
 
 
 

124145621_070824prakasambarrage1a.jpg

విజయవాడ: శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. సాయంత్రం లేదా రాత్రికి లక్షన్నర క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరదనీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

124145621_070824prakasambarrage1b.jpg

Loading video
  • 4 weeks later...
Posted

AP News: వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

Updated : 31 Aug 2024 16:37 IST
 
 
 
 
 
 

310824gates-inner.webp

విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గగుడి పైవంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు. 

Posted

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!

ABN , Publish Date - Sep 02 , 2024 | 09:26 AM

 

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది...

 
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!
Prakasam Barrage
 

 

అమరావతి/విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకొచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజీ గేటు 69ను ఢీ కొన్నది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజీ అయ్యింది. అసలేం జరిగింది..? బోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి..? అని తెలుసుకునే లోపే.. మరోసారి నాలుగు బోట్లు కొట్టుకొని వచ్చాయి. దీంతో అధికారులు అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా పనిగట్టుకుని ఎవరైనా చేస్తున్నారా..? లేకుంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా..? దీని వెనుక ఏమైన కుట్ర ఉందా..? ఒకవేళ కుట్రే అయితే ఎవరి పని..? అనేది తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 

 

 

ABN ఛానల్ ఫాలో అవ్వండి
 
 
Play
Unmute
 
 
Loaded: 0.92%
 
 
Fullscreen
 
 

 

 
Prakasam-Barrage-Boats.jpg

 

నాడు.. నేడు..!

ఈ క్రమంలో గతంలో జరిగిన పరిణామాన్ని అధికారులు, జనాలు గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముంచేందుకు బోటు అడ్డు తగిలిందంటూ నీటి ప్రవాహాన్ని పెంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేసిన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా బ్యారేజీని డ్యామేజీ చేయడానికి అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా..? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా..? ఈ మొత్తం వ్యవహారం ఒకవేళ ఇదే నిజమైతే దీని వెనుకున్న సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు.

 

 
 

Prakasabam-Barrage-Damage.jpg

ఉదయం నుంచే సమీక్ష..

ఇదిలా ఉంటే.. వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం నుంచే సీఎం చంద్రబాబు రివ్యూలు మొదలుపెట్టారు. ఆహారం, బోట్స్ ఎంతవరకు చేరుకున్నాయి..? అని సమీక్షిస్తున్నారు. మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడకు పవర్ బోట్స్ చేరుకుంటున్నాయి. సింగ్ నగర్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రివ్యూ చేస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మళ్లీ ఫీల్డ్ విజిట్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు.

 

 

chandrababu.jpg

చరిత్రలో తొలిసారిగా..

ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుకుంది. బ్యారేజి మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజి చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్‌లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది. బ్యారేజి దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగి పోయాయి. బ్యారేజిపై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.

 

 
 

Prakasam-Barrage-Full-Of-Wa.jpg

పడవ బోల్తా.. నలుగురు సేఫ్

కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద నదిలో పడవ బోల్తా పడింది. ఈ పడవలో నలుగురు మత్స్యకారులు ఉన్నారు. వారి అరుపులు, కేకలు విన్న మత్స్యకార యువత.. నదిలో కొట్టుకుపోతున్న వారిని పడవల్లో వెళ్లి కాపాడారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నదిలో కట్టివేసి ఉన్న పడవ కోసం పోలీసుల కన్నుగప్పి నదిలోకి మత్స్యకారులు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పడవ మునిగి పోవడాన్ని స్థానిక మత్యకారులు గమనించి వెంటనే కాపాడటంతో పెను ముప్పు తప్పినట్లయ్యింది.

 

 

 
Updated Date - Sep 02 , 2024 | 09:43 AM

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...