నిరుద్యోగ భృతి
ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు
డిగ్రీ, ఆపైన చదివిన యువతకు లబ్ధి
విద్యార్హతను బట్టి నెలకు
వెయ్యి నుంచి రూ. 2 వేలు చెల్లింపు
సమాజ సేవ చేయిస్తూ చేయూత
కులాల వారీ కార్పొరేషన్లకు సెలవు
అన్ని వర్ణాల పేదలకూ సహాయం
ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు
కొత్తవి, పాతవి కలిపి 10 లక్షల ఇళ్లు
ఒకేసారి ఎన్నికల నిర్వహణకు మొగ్గు
మూడంచెల ‘పంచాయతీ’ మేలు
మార్పు కోసం కేంద్రానికి లేఖ రాస్తా
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు
టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు
పెండింగ్ హామీల అమలుపై దృష్టి
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యను అభ్యసించి, ఉపాధి దొరకని యువతకు శుభవార్త! విద్యావంతులైన నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యార్హతను బట్టి రూ.1000 నుంచి 2వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో ఈ అంశాన్ని సీఎం స్వయంగా లేవనెత్తారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలను వివరిస్తూ... ‘అమలు చేయాల్సిన హామీల్లో ముఖ్యమైనది నిరుద్యోగ భృతి’ అని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేద్దామని సీఎం చెప్పారు. డిగ్రీ, ఆ పైన చదువుకున్న యువతకు... ఉపాధి సంపాదించుకునేంతవరకు భృతిని ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తామని... 2017-18 రాష్ట్ర బడ్జెట్లోనే నిరుద్యోగ భృతి కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ నిర్ణయానికి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ‘‘నిరుద్యోగ భృతి చాలా కీలకమైన అంశం. భృతి పేరిట నెలనెలా ఊరికే డబ్బు ఇచ్చినట్టు కాకుండా, వారి చేత సామాజిక సేవ చేయించాలని భావిస్తున్నాం.’’ అని సీఎం తెలిపారు. భృతి అందుకునే వారితో గామ్రాల్లో పిల్లలకు చదువు చెప్పించడంవంటి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు.
అన్ని వర్ణాల పేదలకు సాయం
అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) ఆర్థిక సాయం అందించాలని పొలిట్ బ్యూరోలో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇందుకు 2017-18 బడ్జెట్లోనే నిధులు కేటాయించనున్నట్టు సీఎం చెప్పారు. ఈ అంశం పొలిట్బ్యూరోలో చర్చకు వచ్చినప్పుడు... ఇకపై కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయరాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు.. ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నాయని సభ్యులు ప్రశంసించారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో... కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామని సీఎం చెప్పారు. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 30వేలు డిపాజిట్ చేసి, యుక్త వయసు వచ్చాక రెండు లక్షల రూపాయలను డ్రా చేసి ఇవ్వాలన్న ఎన్నికల హామీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. విధి విధానాలను ఖరారు చేశాక దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ)ను ప్రోత్సహించడం కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో త్వరలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టాన్ని తేనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇక... చంద్రన్న బీమా పథకాన్ని పొలిట్బ్యూరో సభ్యులు ప్రశంసించారు. 2.5 కోట్ల మంది పేదల జీవితాలకు ఈ పథకం భరోసా కల్పిస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో ఉన్నవి, కొత్తగా మంజూరు చేయబోయేవి కలిపి మొత్తం 10 లక్షల గృహాలను 2018లోగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలకే గృహ అవసరం ఉందని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో 50 లక్షల కుటుంబాలకు ఉన్నట్టు చూపించారని, ఇది వాస్తవాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. ఈ ప్రమాణాలను మార్చాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని, మోదీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు.
ఇన్పుట్ సబ్సిడీకి 1600 కోట్లు
కరువుపై టీడీపీ పొలిట్బ్యూరో సుదీర్ఘంగా చర్చించింది. ఈ ఏడాది ఇన్పుట్ సబ్సిడీ... కేంద్రం నుంచి వచ్చేదిగానీ, రాష్ట్రంలో కేటాయించేది కానీ రూ.1600 కోట్లు ఉంటుందని సీఎం చెప్పారు. ఈ వేసవిలో మంచి నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీకి 150 పని దినాలు కల్పించనున్నట్టు సీఎం చెప్పారు.
ఒకేసారి ఎన్నికలకు సై: పార్లమెంటుకు, రాష్ట్రాల శాసన సభలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రతిపాదనతో టీడీపీ ఏకీభవించింది. ప్రధాని మోదీ పదేపదే చేస్తున్న ఈ సూచన మంచిదే అని అభిప్రాయపడింది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడంవల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీల దృష్టి మొత్తం ఆవైపే ఉంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఎన్నికల వల్ల కేంద్రంలో పరిపాలన కుంటుపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ అమలు తీరునే ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. ‘‘కేంద్రం ఇచ్చిన హామీలలో కొన్నింటికి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం. ఆ ప్రక్రియ వాయిదా పడుతోంది. ఇతర హామీల అమలూ నెమ్మదిగానే ఉంది. పార్లమెంటు ఎన్నికలు జరిగిననాటి నుంచి ప్రతి సంవత్సరమూ రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి. గత ఏడాది మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే... ఇప్పుడు ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. వచ్చే ఏడాది కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 నుంచి 4 నెలలు రాషా్ట్రల ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ఓసారి కోడ్... రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినప్పుడల్లా కోడ్ అమలు... ఇలా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పరిపాలనకు ఆటంకం కలుగుతోంది.
అలా కాకుండా ఒకేసారి అన్ని ఎన్నికలూ జరిగితే మిగిలిన కాలమంతా అభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు’’ అని సీఎం వివరించారు. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన విధానాన్నే రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం పొలిట్బ్యూరోలో వ్యక్తమైంది. ప్రస్తుతం జరగాల్సిన మునిసిపల్ ఎన్నికలు మినహా మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరగానే ఉన్నాయని, ఆ విషయంలో రాష్ట్రం కొంచెం మెరుగని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ అన్ని రకాల ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలలకే పూర్తి చేస్తే మిగిలిన నాలుగున్నరేళ్లు అభివృద్ధిపైనే దృష్టి పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదనకు పొలిట్బ్యూరో సభ్యులంతా ఆమోదం తెలిపారు.
మూడంచెల ‘పంచాయతీ’ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఐదంచెల వ్యవస్థకు బదులు మూడంచెల వ్యవస్థ ఉంటే బాగుంటుందని సీఎం చెప్పారు. ‘‘ ప్రస్తుతం సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నామ్కేవాస్తేగా ఉన్నారు. వారికి విధులేవీ లేవు. ఆ రెండంచెలను రద్దు చేసి... సర్పంచ్లు, మండలాధ్యక్షులు, జడ్పీ చైర్పర్సన్లతో వ్యవస్థను నడిపించవచ్చు’’ అని వివరించారు. దీనిపై కేంద్రానికి కూడా లేఖ రాస్తానని చెప్పారు. అమరావతి నిర్మాణం నుంచి అమెరికాలో తెలుగువారిపై దాడుల వరకు అనేక అంశాలపై టీడీపీ పొలిట్బ్యూరోలో చర్చించారు. ఉమ్మడి అంశాలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి 15 ఉండగా... తెలంగాణకు ప్రత్యేకించిన మరో రెండు అంశాలపైనా చర్చ జరిగింది. సమావేశం తర్వాత ముఖ్యమైన నిర్ణయాలను పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖరరెడ్డి సంయుక్తంగా విలేకరులకు వెల్లడించారు.
అన్ని వర్ణాల పేదలకు సాయం
అన్ని వర్ణాల పేదలకు సాయం
అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) ఆర్థిక సాయం అందించాలని పొలిట్ బ్యూరోలో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇందుకు 2017-18 బడ్జెట్లోనే నిధులు కేటాయించనున్నట్టు సీఎం చెప్పారు. ఈ అంశం పొలిట్బ్యూరోలో చర్చకు వచ్చినప్పుడు... ఇకపై కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయరాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు.. ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నాయని సభ్యులు ప్రశంసించారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో... కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామని సీఎం చెప్పారు. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 30వేలు డిపాజిట్ చేసి, యుక్త వయసు వచ్చాక రెండు లక్షల రూపాయలను డ్రా చేసి ఇవ్వాలన్న ఎన్నికల హామీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. విధి విధానాలను ఖరారు చేశాక దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ)ను ప్రోత్సహించడం కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో త్వరలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టాన్ని తేనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇక... చంద్రన్న బీమా పథకాన్ని పొలిట్బ్యూరో సభ్యులు ప్రశంసించారు. 2.5 కోట్ల మంది పేదల జీవితాలకు ఈ పథకం భరోసా కల్పిస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో ఉన్నవి, కొత్తగా మంజూరు చేయబోయేవి కలిపి మొత్తం 10 లక్షల గృహాలను 2018లోగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలకే గృహ అవసరం ఉందని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో 50 లక్షల కుటుంబాలకు ఉన్నట్టు చూపించారని, ఇది వాస్తవాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. ఈ ప్రమాణాలను మార్చాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని, మోదీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు.
A request from a girl in Mahanadu, is approved by Andhra Pradesh Cabinet Yesterday. A young girl in her speech in Mahanadu, requested Chief Minister to give free cycles to girl students. She has recollected that, while she was studying, she has got free cycle from then TDP government and she used to go on to school and cycle. Now she has completed here PG. She, requested to implement this again, so that many girl students can use this opportunity to study in the schools. The dropout rate among the girls was high as the parents are not willing to send their wards to schools outside their village without a proper mode of transport. As this is also one of the TDP promises in 2014 elections, AP Cabinet yesterday has decided to distribute bicycles to girl students studying in government, aided and municipal schools. The government plans to implement the scheme in all 13 districts, and as many as 1.80 lakh girl students will be benefited.