రఘురామ ఫిర్యాదు.. ఐపీఎస్ అధికారి సునీల్కుమార్పై కేసు
Jul 12,2024
గుంటూరు: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై కేసు నమోదైంది. టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్తోపాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్పైనా కేసు నమోదు చేశారు.