sonykongara Posted May 18, 2018 Posted May 18, 2018 వేడెక్కిన కృష్ణా తీరం!18-05-2018 02:56:33 టీడీపీ నుంచి లోక్సభకు సిట్టింగ్ ఎంపీలే.. మంచి అభ్యర్థుల కోసం వైసీపీ అన్వేషణ అసెంబ్లీ స్థానాలకు అటూఇటూ పాతవారే! ఎమ్మెల్యే జలీల్ఖాన్ రిటైర్మెంటు! విజయవాడ పశ్చిమ బరిలో ఆయన కుమార్తె! టీడీపీ నాయకత్వం సుముఖత గుడివాడ, తిరువూరుల్లో అధికారపక్షంలో పోటీ! జగ్గయ్యపేట, పెడనల్లో కూడా? కైకలూరు స్థానంపై ఉత్కంఠ పెనమలూరు వైసీపీ రేసులో పార్థసారథి! విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర నడిబొడ్డు.. రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన కృష్ణా జిల్లాలో క్రమంగా రాజకీయ వేడి అలముకుంటోంది. వేసవి ఎండలకు పేరుగాంచిన బెజవాడ ప్రాంతంలో ఆ స్థాయిలో కాకపోయినా రాజకీయ సెగ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. గట్టి అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ మెజారిటీ నియోజకవర్గాల్లో పట్టు బిగించడంతో వారిని ఢీకొట్టేందుకు మంచి అభ్యర్థుల కోసం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కీలకమైన ఎంపీ స్థానాలు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఇంకా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు స్పష్టత రాలేదు. కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలున్నాయి. విజయవాడ ఎంపీగా సిట్టింగ్ సభ్యుడైన కేశినేని నాని మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట్లో దూకుడుగా వెళ్లి వివాదాలు తెచ్చుకున్న ఆయన... ప్రస్తుతం అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ఆయన వైపే మొగ్గుతారని అంటున్నారు. ఆయనపై గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన కోనేరు ప్రసాద్ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఇక్కడ అభ్యర్థి కోసం వైసీపీ నేతలు అన్వేషిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు వినిపిస్తున్నా ఆయన స్థానికుడు కాకపోవడంతో అవకాశం ఉండకపోవచ్చని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణే తిరిగి టీడీపీ నుంచి పోటీచేసే సూచనలున్నాయి. ఆయన అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నా వివిధ సామాజిక సమీకరణల రీత్యా ఎంపీ స్థానంలో ఆయన్నే బరిలోకి దించాలని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇక్కడా మంచి అభ్యర్థి కోసం వైసీపీ వెతుకుతోంది. మాజీ మంత్రి పార్థసారథి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరును ఆ పార్టీ నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు. విజయవాడలో అభ్యర్థులు ఖరారు! కీలకమైన విజయవాడలోని మూడు అసెంబ్లీ సీట్లలో రెండు ప్రధాన పార్టీలకూ అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. విజయవాడ పశ్చిమలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఈసారి రిటైర్మెంటు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తన కుమార్తెను పోటీచేయించాలని ఆయన అభిలషిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మళ్లీ బరిలో దిగడం ఖాయం. ఆయనపై వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పోటీ చేయనున్నారు. విజయవాడ తూర్పు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తిరిగి పోటీచేయనున్నారు. ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఆయన్ను ఢీకొననున్నారు. గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కే మళ్లీ టికెట్ లభించనుంది. ఆయనపై వైసీపీ నుంచి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పెనమలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై మాజీ మంత్రి పార్థసారథి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ కృష్ణాలో.. పశ్చిమ కృష్ణాలో కొంత అస్పష్టత ఉంది. జగ్గయ్యపేటలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఈసారి కూడా పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం టికెట్ రేసులోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంతవరకూ ఎక్కడా బయటపడలేదు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మళ్లీ పోటీ చేయనున్నారు. నందిగామ (ఎస్సీ) స్థానంలో టీడీపీసిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అక్కడి పార్టీ నేతల్లో కొందరి నుంచి అసమ్మతి ఎదురవుతోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సర్దిచెప్పగలిగితే అభ్యర్థి మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక్కడ ఆయనదే తుది నిర్ణయమని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి జగన్మోహనరావు పోటీ చేయనున్నారు. మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమ ఈసారి నూజివీడు నుంచి పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా ఆయన దానిని తోసిపుచ్చుతున్నారు. తాను మైలవరంలోనే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఆయనపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్ను నిలపాలని వైసీపీ నిర్ణయించింది. నూజివీడులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు లేదా ఆయన తనయుడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ ఆ పార్టీ తరపున పోటీకి ఆయనతో పాటు దివంగత టీడీపీ నేత దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్, పార్టీ నేత అట్లూరి రమేశ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కైకలూరు సీటు విషయం కొంతకాలం ఉత్కంఠభరితంగానే ఉండే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీటుకు బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వస్తే సీటు ఆయనకే లభించే అవకాశం ఉంది. తాను పార్టీ మారనని, బీజేపీలోనే ఉంటానని ఆయన అంటున్నారు. కొన్ని రోజులు గడిస్తే గానీ దీనిపై స్పష్టత రాదని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన కాని పక్షంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ నుంచి ఇక్కడ దూలం నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. తిరువూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి స్వామిదాస్ మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్సైజ్ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ తిరువూరుకు మారతారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన స్వస్థలం తిరువూరే. అయితే తాను ఇక్కడ పోటీచేయనని మంత్రి స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరును కూడా ఇక్కడ పరిశీలించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల కథనం. గుడివాడ రేసులో రావి, బాబ్జీ గుడివాడలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై పోటీకి టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఆయనకు పిన్నమనేని బాబ్జీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. పామర్రులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. తెలుగుదేశం తరపునే ఆమె బరిలోకి దిగనున్నారు. ఆమెపై వైసీపీ ఇన్చార్జి అనిల్ పోటీ చేయనున్నారు. పెడనలో రాజకీయం ఆసక్తికరంగా ఉంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఈసారి పోటీ చేస్తారో లేదో స్పష్టత రావడం లేదు. ఏ కారణం వల్లయినా ఆయనకు ఇవ్వకపోతే తనకు అవకాశం ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కోరుతున్నారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఆయన సోదరుడు బుల్లెయ్య కూడా ఈ సీటుపై ఆసక్తితో ఉన్నా టీడీపీ నాయకత్వం పరిశీలించే అవకాశం తక్కువని అంటున్నారు. ప్రస్తుతం మైలవరం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న జోగి రమేశ్ ఈ నియోజకవర్గానికి మారి ఆ పార్టీ తరపున పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 2009లో ఆయన కాంగ్రెస్ తరపున పెడన నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అవనిగడ్డలో శాసనసభ ఉప సభాపతి, సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై గత ఎన్నికల్లో బరిలోకి దిగిన సింహాద్రి రమేశ్ మళ్లీ పోటీ చేయవచ్చని అంటున్నారు. మచిలీపట్నంలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే, యువజన సర్వీసుల మంత్రి కొల్లు రవీంద్ర తిరిగి పోటీచేస్తారు. టీడీపీ నేతల్లో ఆయనపై కొంత అసమ్మతి ఉన్నా మత్స్యకార వర్గానికి చెందిన ఆయన్ను సామాజిక సమీకరణల దృష్ట్యా మార్చే అవకాశం తక్కువ. ఆయనపై వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తిరిగి పోటీ చేయనున్నారు.
paruchuriphani Posted May 18, 2018 Posted May 18, 2018 (edited) 16 lo MIN 11 Kottali....MAX 13 anukuntunna..... Edited May 18, 2018 by paruchuriphani
venkat232 Posted May 18, 2018 Posted May 18, 2018 (edited) 1 minute ago, paruchuriphani said: 16 lo MIN 11 Kottali....MAX 13 anukuntunna..... last time ycp ki 3 kada.....Godavari dts dent paduddi....remaining kostal last time vachhina no rakapote kastam....... Edited May 18, 2018 by venkat232
paruchuriphani Posted May 18, 2018 Posted May 18, 2018 1 minute ago, venkat232 said: last time ycp ki 3 kada.....Godavari dts dent paduddi....remaining kostal last time vachhina no rakapote kastam....... No.... last time TDP 11 Yes.. ee sari Godavari dist lo 10 to 12 seats taggina Seema lo 5 to 7 seats cover chestamu....
RKumar Posted May 18, 2018 Posted May 18, 2018 If BJP+YCP+JS goes together before elections instead of after elections better to get in parthasaradhi, jogi ramesh. Need to accommodate them. They tried to join TDP in 2014 but UMA objected.
koushik_k Posted May 18, 2018 Posted May 18, 2018 Jaleel khan daughter contest cheyatam super decision ..
koushik_k Posted May 18, 2018 Posted May 18, 2018 (edited) Gudivada - Evaru nilapadda neck to neck untundi fight.. Hope ma tiger malli gelusthadani. machilipatnam MP seat : konakalla ne chestharu.. Nenu mla kinda demote avvanu ani ayana eppudo cheppadu. Machilipatnam MLA : Kollu gelisthe wonder e . Tiruvuru - Swamidas malli assam e time bavunte thappa Pedana - Venkatrao gariki health issues unnatlunnai. Edited May 18, 2018 by koushik_k
koushik_k Posted May 18, 2018 Posted May 18, 2018 (edited) 5 minutes ago, RKumar said: If BJP+YCP+JS goes together before elections instead of after elections better to get in parthasaradhi, jogi ramesh. Need to accommodate them. They tried to join TDP in 2014 but UMA objected. Akkarledu.. TDP already houseful .. Pardhasarathi extra baggage manaki.. E sari kuda gelavadu a candidate. Jogi ni join cheskonte ika party ni kampu chesthadu . Edited May 18, 2018 by koushik_k
nfanswin Posted May 18, 2018 Posted May 18, 2018 1 hour ago, paruchuriphani said: No.... last time TDP 11 Yes.. ee sari Godavari dist lo 10 to 12 seats taggina Seema lo 5 to 7 seats cover chestamu.... Eesari kuda Godavari dists ni sweep chestham. Avasaram iyhe ekkuva kastapadadham.
sonykongara Posted May 19, 2018 Author Posted May 19, 2018 బళ్లారి ఫలితాలు కర్నూలు జిల్లా వైసీపీ నేతలపై ప్రభావం..?19-05-2018 11:06:32 కర్ణాటక ఎన్నికల వల్ల కష్టాల్లో పడ్డ కర్నూలు జిల్లా నేతలు ఎవరు? మైనింగ్ డాన్ గాలి జనార్దన్రెడ్డి సన్నిహిత అభ్యర్ధులకు వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం చేశారా? బళ్లారి ఫలితాలు కర్నూలు జిల్లా వైసీపీ నేతల టిక్కెట్ల కేటాయింపుపై ఏ మేరకు ప్రభావం చూపనుంది? ఆసక్తికర కథనం మీకోసం! కర్ణాటక ఎన్నికల్లో కర్నూలు, బళ్లారి నేతలు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. బళ్లారి జిల్లాలో బీజేపీ గెలుపునకు గాలి జానార్దన్రెడ్డి చక్రంతిప్పిన సంగతి తెలిసిందే! అయితే ఆయన బలపరిచిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ప్రచారం నిర్వహించారు. జయరామ్ బంధువులు కాంగ్రెస్పార్టీ తరపున అక్కడ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో గాలి జానార్దన్రెడ్డి అభ్యర్ధులను ఓడించేందుకు జయరామ్ వేసిన స్కెచ్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయట. ఈ తరుణంలో గాలి నేరుగా రంగంలోకి దిగడంతో ఇద్దరి మధ్య ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగిందట. వాస్తవానికి గాలి జనార్దన్రెడ్డి, గుమ్మనూరు జయరామ్ చాలా కాలంగా సన్నిహితులు. 2014 ఎన్నికల్లో జయరామ్కు ఆలూరు వైసీపీ టిక్కెట్ రావడంలో గాలి జానార్దన్రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జయరామ్ రాజకీయ ఎదుగుదల వెనుక గాలి జనార్దన్రెడ్డి పాత్ర అత్యంత ప్రధానమైనది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్కి టీడీపీలోకి వెళ్లడానికి ఆఫర్ వచ్చిందట. విషయం తెలియగానే గాలి జనార్దన్రెడ్డి ఎంట్రీ ఇచ్చారట. దీంతో ఎమ్మెల్యే జయరామ్ టీడీపీలోకి వెళ్లే ప్రయత్నానికి బ్రేక్ పడిందట. ఇదీ వారి మధ్య ఉన్న రాజకీయ అనుబంధానికి ఒక నిదర్శనం! ఇదిలా ఉంటే, ప్రస్తుత కర్ణాటక ఎన్నికలు గాలి జనార్దన్రెడ్డి, జయరామ్ మధ్య చిచ్చుపెట్టాయట. దీనికి బలమైన కారణమే ఉందట. ఎమ్మెల్యే జయరామ్ తమ్ముడైన నాగేంద్ర బళ్లారి రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. శ్రీరాములు మామ అయిన పక్కిరప్పపై మూడు వేల ఓట్ల మెజారిటీతో నాగేంద్ర గెలుపొందారు. మరోవైపు ఎమ్మెల్యే జయరామ్ అల్లుడైన మురళీకృష్ణ సిరిగుప్ప అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. అక్కడ బీజేపీ అభ్యర్ధి సోమలింగప్ప చేతిలో ఆయన ఓటమి చవిచూశాడు. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో.. సిరుగుప్ప కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని చేపట్టిన ఎమ్మెల్యే జయరామ్ బళ్లారి రూరల్, సిరుగుప్ప అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా గట్టి ప్రచారాన్నే నిర్వహించారు. దీంతో గాలి జనార్దన్రెడ్డి బలపరిచిన బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే జయరామ్పై మండిపడ్డారట. ఎమ్మెల్యే జయరామ్ దూకుడు గాలి జనార్దన్రెడ్డికి ఏమాత్రం మింగుడుపడలేదట. బళ్లారి జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో రహస్య సమావేశం ఏర్పాటుచేసి జయరామ్పై గాలి ఫైర్ అయ్యారట. "జయరామ్కు రాజకీయబిక్ష పెడితే చివరకి నేను బలపరిచిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో ఆలూరు వైసీపీ టిక్కెట్ ఎలా తెచ్చుకుంటాడో చూద్దాం'' అంటూ గాలి తన అనుచరుల ఎదుట వ్యాఖ్యానించినట్టు సమాచారం. ముఖ్యంగా బళ్లారి రూరల్ స్థానంలో గాలి జనార్దన్రెడ్డి మామ పక్కిరప్ప ఓటమిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు బళ్లారి అర్బన్లో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి అనిల్లాడ్ తరపున ప్రచారంచేశారు. అయితే అనిల్లాడ్పై గాలి జనార్దన్రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్రెడ్డి గెలిచాడు. దీంతో కోట్ల మార్క్ బళ్లారిలో ఏమాత్రం పనిచేయలేదన్న భావం వారిలో ఏర్పడింది. తాజా పరిణామాల్లో మరికొన్ని వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. తనకు అడుగడుగునా చుక్కలు చూపించిన ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరామ్, అతని తమ్ముడైన నాగేంద్రను బీజేపీ వైపునకు తిప్పేందుకు గాలి జనార్దన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి కర్నాటకలో చోటుచేసుకున్న పరిణామాలు గాలి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే జయరామ్ మధ్య స్నేహబంధాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి మరి!
Anne Posted May 19, 2018 Posted May 19, 2018 On 5/18/2018 at 9:22 AM, sonykongara said: వేడెక్కిన కృష్ణా తీరం!18-05-2018 02:56:33 టీడీపీ నుంచి లోక్సభకు సిట్టింగ్ ఎంపీలే.. మంచి అభ్యర్థుల కోసం వైసీపీ అన్వేషణ అసెంబ్లీ స్థానాలకు అటూఇటూ పాతవారే! ఎమ్మెల్యే జలీల్ఖాన్ రిటైర్మెంటు! విజయవాడ పశ్చిమ బరిలో ఆయన కుమార్తె! టీడీపీ నాయకత్వం సుముఖత గుడివాడ, తిరువూరుల్లో అధికారపక్షంలో పోటీ! జగ్గయ్యపేట, పెడనల్లో కూడా? కైకలూరు స్థానంపై ఉత్కంఠ పెనమలూరు వైసీపీ రేసులో పార్థసారథి! విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర నడిబొడ్డు.. రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన కృష్ణా జిల్లాలో క్రమంగా రాజకీయ వేడి అలముకుంటోంది. వేసవి ఎండలకు పేరుగాంచిన బెజవాడ ప్రాంతంలో ఆ స్థాయిలో కాకపోయినా రాజకీయ సెగ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. గట్టి అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ మెజారిటీ నియోజకవర్గాల్లో పట్టు బిగించడంతో వారిని ఢీకొట్టేందుకు మంచి అభ్యర్థుల కోసం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కీలకమైన ఎంపీ స్థానాలు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఇంకా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు స్పష్టత రాలేదు. కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలున్నాయి. విజయవాడ ఎంపీగా సిట్టింగ్ సభ్యుడైన కేశినేని నాని మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట్లో దూకుడుగా వెళ్లి వివాదాలు తెచ్చుకున్న ఆయన... ప్రస్తుతం అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ఆయన వైపే మొగ్గుతారని అంటున్నారు. ఆయనపై గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన కోనేరు ప్రసాద్ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఇక్కడ అభ్యర్థి కోసం వైసీపీ నేతలు అన్వేషిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు వినిపిస్తున్నా ఆయన స్థానికుడు కాకపోవడంతో అవకాశం ఉండకపోవచ్చని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణే తిరిగి టీడీపీ నుంచి పోటీచేసే సూచనలున్నాయి. ఆయన అసెంబ్లీకి రావాలని అనుకుంటున్నా వివిధ సామాజిక సమీకరణల రీత్యా ఎంపీ స్థానంలో ఆయన్నే బరిలోకి దించాలని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇక్కడా మంచి అభ్యర్థి కోసం వైసీపీ వెతుకుతోంది. మాజీ మంత్రి పార్థసారథి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరును ఆ పార్టీ నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు. విజయవాడలో అభ్యర్థులు ఖరారు! కీలకమైన విజయవాడలోని మూడు అసెంబ్లీ సీట్లలో రెండు ప్రధాన పార్టీలకూ అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. విజయవాడ పశ్చిమలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఈసారి రిటైర్మెంటు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తన కుమార్తెను పోటీచేయించాలని ఆయన అభిలషిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మళ్లీ బరిలో దిగడం ఖాయం. ఆయనపై వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పోటీ చేయనున్నారు. విజయవాడ తూర్పు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తిరిగి పోటీచేయనున్నారు. ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఆయన్ను ఢీకొననున్నారు. గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కే మళ్లీ టికెట్ లభించనుంది. ఆయనపై వైసీపీ నుంచి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పెనమలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై మాజీ మంత్రి పార్థసారథి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ కృష్ణాలో.. పశ్చిమ కృష్ణాలో కొంత అస్పష్టత ఉంది. జగ్గయ్యపేటలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఈసారి కూడా పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం టికెట్ రేసులోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంతవరకూ ఎక్కడా బయటపడలేదు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మళ్లీ పోటీ చేయనున్నారు. నందిగామ (ఎస్సీ) స్థానంలో టీడీపీసిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అక్కడి పార్టీ నేతల్లో కొందరి నుంచి అసమ్మతి ఎదురవుతోంది. ఈ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సర్దిచెప్పగలిగితే అభ్యర్థి మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక్కడ ఆయనదే తుది నిర్ణయమని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి జగన్మోహనరావు పోటీ చేయనున్నారు. మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమ ఈసారి నూజివీడు నుంచి పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా ఆయన దానిని తోసిపుచ్చుతున్నారు. తాను మైలవరంలోనే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఆయనపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్ను నిలపాలని వైసీపీ నిర్ణయించింది. నూజివీడులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు లేదా ఆయన తనయుడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ ఆ పార్టీ తరపున పోటీకి ఆయనతో పాటు దివంగత టీడీపీ నేత దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్, పార్టీ నేత అట్లూరి రమేశ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కైకలూరు సీటు విషయం కొంతకాలం ఉత్కంఠభరితంగానే ఉండే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీటుకు బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వస్తే సీటు ఆయనకే లభించే అవకాశం ఉంది. తాను పార్టీ మారనని, బీజేపీలోనే ఉంటానని ఆయన అంటున్నారు. కొన్ని రోజులు గడిస్తే గానీ దీనిపై స్పష్టత రాదని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన కాని పక్షంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ నుంచి ఇక్కడ దూలం నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. తిరువూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి స్వామిదాస్ మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్సైజ్ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ తిరువూరుకు మారతారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన స్వస్థలం తిరువూరే. అయితే తాను ఇక్కడ పోటీచేయనని మంత్రి స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరును కూడా ఇక్కడ పరిశీలించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల కథనం. గుడివాడ రేసులో రావి, బాబ్జీ గుడివాడలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై పోటీకి టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఆయనకు పిన్నమనేని బాబ్జీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. పామర్రులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. తెలుగుదేశం తరపునే ఆమె బరిలోకి దిగనున్నారు. ఆమెపై వైసీపీ ఇన్చార్జి అనిల్ పోటీ చేయనున్నారు. పెడనలో రాజకీయం ఆసక్తికరంగా ఉంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఈసారి పోటీ చేస్తారో లేదో స్పష్టత రావడం లేదు. ఏ కారణం వల్లయినా ఆయనకు ఇవ్వకపోతే తనకు అవకాశం ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కోరుతున్నారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఆయన సోదరుడు బుల్లెయ్య కూడా ఈ సీటుపై ఆసక్తితో ఉన్నా టీడీపీ నాయకత్వం పరిశీలించే అవకాశం తక్కువని అంటున్నారు. ప్రస్తుతం మైలవరం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న జోగి రమేశ్ ఈ నియోజకవర్గానికి మారి ఆ పార్టీ తరపున పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 2009లో ఆయన కాంగ్రెస్ తరపున పెడన నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అవనిగడ్డలో శాసనసభ ఉప సభాపతి, సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనపై గత ఎన్నికల్లో బరిలోకి దిగిన సింహాద్రి రమేశ్ మళ్లీ పోటీ చేయవచ్చని అంటున్నారు. మచిలీపట్నంలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే, యువజన సర్వీసుల మంత్రి కొల్లు రవీంద్ర తిరిగి పోటీచేస్తారు. టీడీపీ నేతల్లో ఆయనపై కొంత అసమ్మతి ఉన్నా మత్స్యకార వర్గానికి చెందిన ఆయన్ను సామాజిక సమీకరణల దృష్ట్యా మార్చే అవకాశం తక్కువ. ఆయనపై వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తిరిగి పోటీ చేయనున్నారు. lokesh ni set seyandi ikada
yamaha Posted May 19, 2018 Posted May 19, 2018 18 minutes ago, NatuGadu said: Gudivada kotti supandi Avasaram ledu le baa Paina TDP vaste Chalu
sonykongara Posted May 23, 2018 Author Posted May 23, 2018 టీడీపీలోకి చెన్నుపాటి శ్రీను..!23-05-2018 10:05:14 విజయవాడ: వంగవీటి మోహనరంగా బావమరిది చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరటానికి రంగం సిద్ధం అవుతోంది. మరో వారం రోజుల్లో టీడీపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సైతం ఆయనను పార్టీలోకి తీసుకురావటానికి తెర వెనుక కృషి చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు శ్రీనును తీసుకువెళ్ళినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగా ఒకప్పటి ముఖ్య అనుచరులతో బుధవారం తన కార్యాలయంలో చెన్నుపాటి శ్రీను సమావేశం కానున్నారు. తన నిర్ణయాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్ళి వారి అభిప్రాయాన్ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్కు నగరంలోని మూడు నియోజకవర్గాలలో కూడా అనుచరగణం, స్నేహితులు, అభిమానులు ఉన్నారు. కాల్మనీ కేసుకుముందు తన రాజకీయ భవిష్యత్తును నిర్దేశించు కోవటానికి మూడు నియోజకవర్గాలలో ఆరు సమావేశాలను నిర్వహించారు. ఆ సమావేశాలలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా మద్దతు పలుకుతామని అనుచరులు తెలిపారు. కాల్మనీ కేసు రావటంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కొంత కాలం క్రితం ఈయన వైసీపీ వైపు చూశారని, రాధా నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ప్రచారం జరిగింది. తర్వాత జనసేనలో చేరతారని కూడా చెప్పారు. అయితే ఆయన టీడీపీలో చేరాలనే నిర్ణయించుకున్నారని తెలిసింది. అర్బన్ పార్టీ అధ్యక్షులు బుద్దా వెంకన్నకు, ఆయన సోదరుడికి కూడా శ్రీనుతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈయన పార్టీలో క్రియాశీలంగా పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నా.. ఎమ్మెల్యే రేసులో లేరని తెలియడంతో బొండా ఉమా కూడా శ్రీను చేరికకు కృషి చేస్తుండటం గమనార్హం. తూర్పు నుంచి గద్దె రామమోహన్ శ్రీను చేరికకు తెర వెనుక వ్యూహాత్మక కృషి చేస్తున్నట్టు సమాచారం.
sonykongara Posted May 23, 2018 Author Posted May 23, 2018 Just now, sonykongara said: టీడీపీలోకి చెన్నుపాటి శ్రీను..!23-05-2018 10:05:14 విజయవాడ: వంగవీటి మోహనరంగా బావమరిది చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరటానికి రంగం సిద్ధం అవుతోంది. మరో వారం రోజుల్లో టీడీపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సైతం ఆయనను పార్టీలోకి తీసుకురావటానికి తెర వెనుక కృషి చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు శ్రీనును తీసుకువెళ్ళినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగా ఒకప్పటి ముఖ్య అనుచరులతో బుధవారం తన కార్యాలయంలో చెన్నుపాటి శ్రీను సమావేశం కానున్నారు. తన నిర్ణయాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్ళి వారి అభిప్రాయాన్ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్కు నగరంలోని మూడు నియోజకవర్గాలలో కూడా అనుచరగణం, స్నేహితులు, అభిమానులు ఉన్నారు. కాల్మనీ కేసుకుముందు తన రాజకీయ భవిష్యత్తును నిర్దేశించు కోవటానికి మూడు నియోజకవర్గాలలో ఆరు సమావేశాలను నిర్వహించారు. ఆ సమావేశాలలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా మద్దతు పలుకుతామని అనుచరులు తెలిపారు. కాల్మనీ కేసు రావటంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కొంత కాలం క్రితం ఈయన వైసీపీ వైపు చూశారని, రాధా నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ప్రచారం జరిగింది. తర్వాత జనసేనలో చేరతారని కూడా చెప్పారు. అయితే ఆయన టీడీపీలో చేరాలనే నిర్ణయించుకున్నారని తెలిసింది. అర్బన్ పార్టీ అధ్యక్షులు బుద్దా వెంకన్నకు, ఆయన సోదరుడికి కూడా శ్రీనుతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈయన పార్టీలో క్రియాశీలంగా పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నా.. ఎమ్మెల్యే రేసులో లేరని తెలియడంతో బొండా ఉమా కూడా శ్రీను చేరికకు కృషి చేస్తుండటం గమనార్హం. తూర్పు నుంచి గద్దె రామమోహన్ శ్రీను చేరికకు తెర వెనుక వ్యూహాత్మక కృషి చేస్తున్నట్టు సమాచారం. sai enthani ki emi ayian pattu undha asalu
koushik_k Posted May 23, 2018 Posted May 23, 2018 7 minutes ago, Saichandra said: radha ni tisuku randi ela ayina enduku babu seat assam povatanika... iddari madya elano sayodhya cheyatam chetakadu manaki.. eyana vacchi evadithono godavapadathadu.
Saichandra Posted May 23, 2018 Posted May 23, 2018 7 minutes ago, koushik_k said: enduku babu seat assam povatanika... iddari madya elano sayodhya cheyatam chetakadu manaki.. eyana vacchi evadithono godavapadathadu. seat istaru ani evadiki chepparu?evadi madya sayodya cheyyali,radha vaste party ki positive tappa negative undadu,ranga ni kapulu own chesukunnaru,in case tdp ki vaste kaps dielamma lo padataru js ki support chesevalu kuda
koushik_k Posted May 23, 2018 Posted May 23, 2018 45 minutes ago, Saichandra said: seat istaru ani evadiki chepparu?evadi madya sayodya cheyyali,radha vaste party ki positive tappa negative undadu,ranga ni kapulu own chesukunnaru,in case tdp ki vaste kaps dielamma lo padataru js ki support chesevalu kuda seat ivvakunte enduk osthadu.. seat ivvalsi untundi..
Saichandra Posted May 23, 2018 Posted May 23, 2018 1 minute ago, koushik_k said: seat ivvakunte enduk osthadu.. seat ivvalsi untundi.. Mlc,seat iste gelvadu ani radha ki kuda telusu ??,waste le,vij central ticket radha ki ycp nundi ,bonda uma ni tattukuni nilabadaledu for sure,chuddam
sonykongara Posted June 3, 2018 Author Posted June 3, 2018 టీడీపీలోకి వంగవీటి మోహనరంగా బావమరిది? 03-06-2018 20:28:50 విజయవాడ: వంగవీటి మోహనరంగ బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ టీడీపీలోకి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో చెన్నుపాటి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. అభిమానుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని, వారం, పది రోజుల్లో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు ఎమ్మెల్యే బోండా ఉమ, మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్... శ్రీనివాస్ను టీడీపీలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారనే ప్రచార విజయవాడలో జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే శ్రీనివాస్ ఇటీవల సీఎం చంద్రబాబు కలిసినట్లు సమాచారం.
sonykongara Posted June 4, 2018 Author Posted June 4, 2018 ఏ పార్టీలో చేరేది రెండ్రోజుల్లో ప్రకటిస్తా: చెన్నుపాటి శ్రీను04-06-2018 07:54:43 విజయవాడ: ‘రెండ్రోజుల్లో నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటిస్తా. రాధా, రంగాల ఆశయ సాధన కోసం ఏ పార్టీ పాటుపడుతుందని భావిస్తే.. ఆ పార్టీకి చేరువవుతా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మీ అభిప్రాయం మేరకే తీసుకుంటా..’ అని రాధా, రంగా మిత్రమండలి సభ్యుడు చెన్నుపాటి శ్రీను అన్నారు. ఆదివారం ఐవీ ప్యాలెస్లో రాధా, రంగా మిత్రమండలి ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశాన్ని చెన్నుపాటి శ్రీను నిర్వహించారు. రాధా-రంగా మిత్రమండలి సభ్యులుగా ఉన్న రెండువేలకు పైగా సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ రాధా, రంగ మిత్రమండలి సభ్యులకు అభిమానులు, స్నేహితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాధా, రంగాలు ఎంతో కృషిచేశారన్నారు. సమావేశంలో కాపు సంఘం నేతలు పిళ్ళా వెంకటేశ్వర్లు, యు. సత్యనారాయణ, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పసుపు శ్రేణుల పరోక్ష సహకారం.. తెలుగుదేశం పార్టీలోకి చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న చెన్నుపాటి శ్రీను ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆ విషయం వేదిక మీద చెప్పకపోయినా.. తెర వెనుక టీడీపీ నేతలు ఈ కార్యక్రమ నిర్వహణకు దోహదపడటం గమనార్హం. రాధా - రంగా మిత్రమండలి సభ్యులతో పాటు టీడీపీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ కార్యాలయ కార్యదర్శి కళ్ళే నాగేశ్వరరావు సమావేశానికి వచ్చే వారికి స్వాగతం చెబుతూ సమావేశం జరుగుతున్న ఐవీప్యాలెస్ బయట బ్యానర్లను కూడా కట్టించారు. పలువురు టీడీపీ కార్పొరేటర్ల అనుచరులు సమావేశానికి హాజరయ్యారు.
RKumar Posted June 4, 2018 Posted June 4, 2018 On 5/23/2018 at 4:12 PM, Saichandra said: Mlc,seat iste gelvadu ani radha ki kuda telusu ??,waste le,vij central ticket radha ki ycp nundi ,bonda uma ni tattukuni nilabadaledu for sure,chuddam Vijayawada Central nunchi Jagan Relative Gowtham Reddy & Malladi Vishnu ippatike high hopes tho vunnaru. Malladi ki ticket ivvakapothe YSRCP nunchi jump 100%. Radha ki ticket ivvadam kanna Malladi/Gowtham ticket ivvadaaniki ekkuva chance in YSRCP. Radha ki ticket isthe in TDP better choice than Bonda Uma.
Guest Urban Legend Posted June 4, 2018 Posted June 4, 2018 On 6/4/2018 at 1:43 PM, RKumar said: Vijayawada Central nunchi Jagan Relative Gowtham Reddy & Malladi Vishnu ippatike high hopes tho vunnaru. Malladi ki ticket ivvakapothe YSRCP nunchi jump 100%. Radha ki ticket ivvadam kanna Malladi/Gowtham ticket ivvadaaniki ekkuva chance in YSRCP. Radha ki ticket isthe in TDP better choice than Bonda Uma. bonda bob e term lo kurrolani baaganey pogesadu unlike malladi gowtham reddy...radha antey father nunchi vachidhey tappa sonthaga none
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now