abhi Posted September 24, 2017 Posted September 24, 2017 Super eppatikie appudu leader medha respect nd love increase avutune vundhe
sonykongara Posted September 26, 2017 Author Posted September 26, 2017 ఏపీలో అవినీతిపై ముప్పేట దాడి26-09-2017 12:29:47 విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో అవినీతిపై అప్రకటిత యుద్ధం జరుగుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా లంచగొండులపై శివమెత్తే వ్యవస్థలను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజలను పీడించే వారిపై 1100 అస్త్రాన్ని ప్రయోగించారు. ఇక ఉన్నత స్థాయిలో అవినీతికి పాల్పడి సంపాదనను గుట్టల్లా పోగేసుకున్న బడా బాబుల జాతకాలను ఏసీబీ బయటపెడుతోంది. కొన్ని నెలలుగా కొందరు ఉన్నతాధికారులు వందలకోట్ల ఆస్తులతో సహా పట్టుబడుతున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అవినీతి అంతం చూసేదాకా వెనక్కి తగ్గవద్దని ప్రభుత్వం ఏసీబీ భుజం తడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యవస్థీకృతం. గ్రామస్థాయి అధికారి నుంచి పై స్థాయి వరకు ఎలాంటి పనులు జరగాలన్నా ప్రజలు లంచాలు ముట్టజెప్పాల్సిన పరిస్థితి. ప్రజలకు ఈ అవినీతే పెనుభారం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఫిర్యాదులు చేసిచేసి విసిగిపోయారు. ఈ పరిస్థితిని నవ్యాంధ్రలో మార్చాలని ఏపీ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. లోటు బడ్జెట్తో కొత్త రాష్ట్రం నడక ప్రారంభించినా ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదని తర్వాత ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో వెల్లడైంది. రెండేళ్ల పాటు మార్పు కోసం వేచి చూసిన ప్రభుత్వం ఇక కట్టడికి రంగంలోకి దిగింది. ఏస్థాయిలో అవినీతికి ఆస్థాయి తగ్గట్టుగా అడ్డుకట్ట వేసే వ్యవస్థలను సిద్ధం చేసి ప్రయోగించడం ప్రారంభించింది. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి అధికారులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. డెడ్లైన్ పెట్టి మరీ అవినీతికి అంతం పలకాలని స్పష్టం చేశారు. హెచ్చరికలతోనే సీఎం సరిపెట్టలేదు. సమగ్రమైన కార్యాచరణతో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏసీబీలో సమర్థులైన అధికారులను నియమించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ను ఏసీబీ డీజీగా నియమించారు. ఆయన డీజీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏసీబీలో దూకుడు పెరిగింది. లంచం తీసుకుంటూ దొరికిపోయే వారిపై దాడులు చేయడం ఒకవైపు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న అధికారులపై విరుచుకుపడటం రెండోవైపు. చెక్పోస్టులు, ఆర్టీఏ కార్యాలయాలు, రిజిస్టార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులతో మూడోవైపు ముప్పేట దాడిని ఏసీబీ ప్రారంభించింది. ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు రూ.వందలకోట్ల మార్కెట్ విలువ ఉన్న ఆస్తులతో పట్టుబడ్డారు. దీంతో చంద్రబాబు ఏసీబీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. సమాచారాన్ని ధృవీకరించుకుని ఎంతటి వారి పైన అయినా దాడులు ప్రారంభించాలని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏసీబీ ఇప్పటికే దాదాపుగా 80ట్రాప్ కేసులను నమోదు చేసింది. సాక్షాత్తు జిల్లా పోలీసు కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్లను కూడా వదలడం లేదు. చిత్తూరు జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ బి.వెంకటేశం లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. గ్రామా రెవెన్యూ అధికారి వద్ద నుంచి ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి గుండెకాయ అయిన సచివాలయంలో జాయింట్ సెక్రటరీ వరకు దాడుల్లో పట్టుకున్నారు. మందు, విందుతో ఆదివారం వినోదం చేస్తూ లంచం తీసుకుంటున్న నెల్లూరు జిల్లా విద్యుత్ అధికారి ధనుంజయ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడే వారినే కాదని ఇప్పటి వరకు ప్రజలను పీల్చి పిప్పి చేసిన వారినీ వదిలిపెట్టొద్దని చంద్రబాబు ఏసీబీ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు కోట్లు కూడబెట్టుకున్న అనకొండల వివరాలను బయటకు తీసింది. ఒక్కొక్కరినీ బోనులోకి లాగడం ప్రారంభించింది. ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ చీఫ్ పాండురంగారావు కూడబెట్టుకున్న ఆస్తులు రూ.150 కోట్లు అయితే మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ రూ.700 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధరం, పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ బి.సురేష్ బాబుల ఆస్తులు కూడా ఏసీబీ చరిత్రలో రికార్డులు సృష్టించాయి. తాజాగా ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ టెక్నికల్ అధికారి నల్లూరి శివప్రసాద్ల గృహాల్లో అందరూ ఆశ్చర్యపోయేలా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఏకకాలంలో 23 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు సంచలనం రేకెత్తించాయి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ శివప్రసాద్ ఇంట్లో బంగారు నగలు, వజ్రాల హారాలు చూసిన ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ డీఎస్పీ రమాదేవి ఆశ్చర్యపోయి ఇది ఇల్లా బంగారపు నగల దుకాణమా అని నోరు వెల్లబెట్టారు. వడ్డాణాలు, బంగారపు జడలు, లక్ష్మీహారాలు, బంగారపు పల్లెం, డైనింగ్ సెట్, వజ్రాల గాజులు, నెక్లెస్లు ఇలా ఒక్కటేమిటి నగల్లో అన్ని రకాల వస్తువులు అక్కడ దర్శనం ఇచ్చే సరికి ఏసీబీ అధికారులు బిత్తరపోయారు. రూ.50లక్షల కరెన్సీ కళ్ల ముందు కనిపించే సరికి ఏసీబీ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంకా దాడులు కొనసాగుతున్నాయని లెక్కలు తేల్చాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక స్థిరాస్తుల లెక్కకు అంతేలేదు. డాక్యుమెంట్లు కుప్పుల, కప్పులుగా బయటపడ్డాయి. ఇక అవినీతి తిమింగలాల పరిస్థితి ఇలా ఉంటే గ్రామ, మండల స్థాయిలో కార్యాలయాల్లో పనులు చేయకుండా పదేపదే తిప్పుకుంటూ ప్రజలను పీడిస్తున్న కిందిస్థాయి ఉద్యోగుల భరతం పట్టేందుకు 1100కాల్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నిర్లక్ష్యం అవినీతిని అరికట్టేందుకు ప్రజలు కాల్ సెంటర్ను ఉపయోగించుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా ఒక్క ఫోన్కాల్తో పరిష్కారం అవుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని ఓ మండలంలో ట్రాన్స్కో లైన్మెన్ ఒకరు విద్యుత్ కనెక్షన్ కోసం 9మంది రైతుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు రెండు సంవత్సరాల క్రితం వసూలు చేయగా ఒక రైతు 1100 పరిష్కార వేదికకు ఫోన్ చేయడంతో చిత్తూరు కలెక్టర్ విచారణ జరిపారు. విచారణ విషయం తెలుసుకున్న లైన్మెన్ రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న రూ.25వేల చెప్పున 9 మందికి ఇచ్చేసి సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో అవినీతిపై ముప్పేట దాడి ప్రారంభమైంది. అది పతాక స్థాయికి చేరింది. అవినీతి అనకొండల వద్ద వందలకోట్లు బయటపడటం, కిందిస్థాయిలో ఉద్యోగులు 1100 పరిష్కార వేదిక దెబ్బతో లంచం తిరిగి ఇచ్చేస్తుండటంతో ఉద్యోగ సంఘాలు కూడా కిమ్మనడం లేదు. ఓసారి అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కితే అన్ని విధాలుగా నష్టపోతారని, అవినీతికి దూరంగా ఉండాలని ఉద్యోగులను ఏసీబీ డీజీ ఠాకూర్ హెచ్చరిస్తున్నారు. అవినీతిపై జరుగుతున్న పోరాటంపై ప్రజలు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
sonykongara Posted September 26, 2017 Author Posted September 26, 2017 http://www.andhrajyothy.com/artical?SID=469233
Saichandra Posted September 27, 2017 Posted September 27, 2017 30000 calls vachiniyyi eroju ippativaruku terrific Thanks you aj manchi article rasaru
AnnaGaru Posted October 13, 2017 Posted October 13, 2017 AP lo 1100 anedi commonmen lo oka vajrayudham....chala baaga vellipoindi idi villages loki.... Villages lo poor&farmers baga vadutunnaru. major calls vallave..at last vallaki oka ayudham dorikindi..... Still requires lot of improvement but started in good direction.... IAS Ahmad babu irgatestunadu ilanti ideas....
sonykongara Posted October 13, 2017 Author Posted October 13, 2017 http://www.nandamurifans.com/forum/index.php?/topic/412642-people-first-1100-aps-%E2%80%9Cparishkara-vedika%E2%80%9D/
sonykongara Posted October 13, 2017 Author Posted October 13, 2017 http://www.nandamurifans.com/forum/index.php?/topic/403001-1100-effect-%E0%B0%B2%E0%B0%82%E0%B0%9A%E0%B0%82-%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF/
AnnaGaru Posted October 30, 2017 Posted October 30, 2017 idi wonders chestundi ani manam cheppam ippudu chivaraki Bhoomi vaade agree chestunadu
phani2 Posted December 22, 2017 Posted December 22, 2017 Ground level lo deeni meeda chaala manchi feedback vacchindhi. Party leaders ki kuda headache taggindhi antunnaru. Chinna chinna problems ki leaders daggara ki vaache vaaru.....uppudu leaders kuda 1100 ki call cheyandi ani cheppukuntunnaru
sonykongara Posted October 20, 2018 Author Posted October 20, 2018 మా నష్టం చూడండినష్టం మదింపు చేస్తున్నామన్న ఆర్టీజీఎస్ ఈనాడు, అమరావతి: పీపుల్ ఫస్ట్ యాప్ను మూడు రోజుల్లో 30 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ద్వారా శుక్రవారం రాత్రి 8 గంటల దాకా తిత్లీ తుపాను నష్టానికి సంబంధించి 4,410 చిత్రాలు ప్రభుత్వానికి అందాయి. ఎక్కువగా పంటనష్టం, దెబ్బతిన్న ఇళ్లు, పడిపోయిన పశువుల పాకలు, మరణించిన పశువుల వివరాలు యాప్ ద్వారా అందుతున్నాయని ఆర్టీజీఎస్ (రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ) ఒక ప్రకటనలో తెలిపింది. వీటి ఆధారంగా సత్వరమే నష్టాన్ని మదించి బాధితుల ఖాతాలకు పరిహారం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా మ్యాపింగ్పీపుల్ ఫస్ట్ యాప్ ద్వారా వచ్చే చిత్రాలను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేస్తున్నారు. పంటనష్టం, కూలిన చెట్లు, దెబ్బతిన్న ఇళ్లు ఇలా 11 అంశాలను విభజించారు. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించి తక్షణమే అక్కడకు బృందాలను పంపి నష్టం లెక్కలు తీయిస్తున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now