-
Posts
11,143 -
Joined
-
Last visited
-
Days Won
11
Everything posted by Siddhugwotham
-
అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు. ‘వచ్చే ఎన్నికల్లో వచ్చేది మీరేగా! వచ్చిన తర్వాత ఆ విచారణ ఏదో మీరే జరిపించుకోండి’’ అని ఆయన వారితో నవ్వుతూ అన్నారు. తమ గెలుపు ఖాయమని, గవర్నర్ నజీర్ చేతుల మీదుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము కోరుకొంటున్నామని వారు చెప్పగా, ఆయన కూడా నవ్వారు. గవర్నర్ను వారు విజయవాడ రాజ్భవన్లో శనివారం సాయంత్రం కలిశారు.
-
-
Rakul Rao to Brahmanandm
-
Let's do one thing... join in BJP And bargain with Pawan .... inko seat thyaagam chestaadu
-
Karma never loses Address....
-
Light... to prove there is no alliance between BJP and BRS before general elections.....
-
-
అభ్యర్థుల ఎంపికలో ప్రజల్లో పట్టున్నవారికే తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోంది. 94 మందితో ఇదివరకే విడుదల చేసిన మొదటి జాబితాలోనేగాక 34 మంది అభ్యర్థులతో గురువారం ప్రకటించిన రెండో జాబితాలో కూడా ఇదే కోణం ప్రధానంగా ప్రతిఫలించింది. ఈ 34 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. కొన్నిచోట్ల మార్పుపై తర్జనభర్జనలు జరిగినా ప్రజల్లో సానుకూలత ఉందనుకున్న చోట సీనియర్లకే అవకాశం ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు దీనికి ఉదాహరణ. వయోవృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్.వరదరాజులురెడ్డి(81)కి టికెట్లభించింది. ఆయన వయసు రీత్యా బాగా సీనియర్. ఆయన కంటే ఆర్థికంగా బాగా స్థితిమంతులు, యువ నేతలు పోటీపడ్డారు. కానీ పార్టీ సర్వేల్లో ప్రజాదరణలో వరదరాజులురెడ్డికే ఎక్కువ మొగ్గు ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనకే అవకాశమిచ్చారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో మాజీ ఎమ్మెల్యే కేఎ్సఎన్ఎస్ రాజు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు నియోజకవర్గ బాధ్యతలు వద్దంటూ వైదొలిగారు. అక్కడ బత్తుల తాతయ్యబాబును ఇన్చార్జిగా నియమించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ రాజు పార్టీ పనికి ముందుకొచ్చారు. తాతయ్యబాబుతో వైరం పెట్టుకోకుండా కలిసి పనిచేశారు. ఇప్పుడు సర్వేలు చేస్తే ప్రజలు ఆయనవైపే మొగ్గు చూపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రజాదరణ వల్ల ఆయనకు అవకాశం దక్కింది. మొదటి జాబితాలో నంద్యాల అసెంబ్లీ సీటును ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన టీడీపీ.. రెండో జాబితాలో గుంటూరు తూర్పు, మదనపల్లె సీట్లను ఆ వర్గానికే చెందిన మహమ్మద్ నజీర్, షాజహాన్ బాషాలకు కట్టబెట్టింది. ఒక టీవీ చానల్లో పాత్రికేయుడిగా పనిచేసిన డాక్టర్ మురళీమోహన్కు పూతలపట్టు (ఎస్సీ) స్థానం కేటాయించారు. రంపచోడవరం (ఎస్టీ)లో అంగన్వాడీ మాజీ కార్యకర్త శిరీషకు అవకాశం దక్కింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు స్థానం రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త భాష్యం ప్రవీణ్కు దక్కింది. ముప్పిడి ఇటూ ఇటూ రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలో టీడీపీ దళిత నేత, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన గతంలో గోపాలపురం(ఎస్సీ) ఎమ్మెల్యేగా చేశారు. ఆ నియోజకవర్గంలో ఒక వర్గం ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇవ్వాలని కోరింది. అదే లోక్సభ స్థానం పరిధిలోని కొవ్వూరు (ఎస్సీ) నియోజకవర్గ టీడీపీ నేతలు సైతం అనూహ్యంగా ఆయన్ను తమ స్థానంలో నిలబెట్టాలని అధిష్ఠానాన్ని కోరడం విశేషం. ఒక దళిత నేత కోసం రెండు నియోజకవర్గాల నుంచి అభ్యర్థనలు రావడం అరుదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ముప్పిడిని కొవ్వూరు అభ్యర్థిగా ఎంపిక చేశారు. కుటుంబ సభ్యులకు అవకాశం.. కొన్నిసీట్లలో ప్రస్తుత ఇన్చార్జుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం లభించింది. కడప జిల్లా కమలాపురంలో ప్రస్తుత ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి బదులు ఆయన కుమారుడు చైతన్యరెడ్డికి, తిరుపతి జిల్లా వెంకటగిరి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్థానంలో ఆయన కుమార్తె సాయి లక్ష్మీప్రియకు, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి, ప్రస్తుత ఇన్చార్జి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూర, అదే జిల్లా కదిరిలో ప్రస్తుత ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదాదేవికి టికెట్లు ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల రాజా ఆకస్మికంగా మరణించడంతో ఆయన సతీమణి సత్యప్రభకు టికెట్ ఇచ్చారు. వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలకు రెండో జాబితాలో టీడీపీ టికెట్లు లభించాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు టికెట్ ఇవ్వగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. అదే నియోజకవర్గానికి టీడీపీ టికెట్ పొందారు. టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సతీమణి ప్రశాంతికి కోవూరు సీటిచ్చారు. బీసీ కోణంలో.. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో ఒక సీటు తప్పనిసరిగా బీసీ వర్గాలకు ఇవ్వాలన్న నిర్ణయంతో గుంటూరు పశ్చిమ సీటు పిడుగురాళ్ల మాధవికి దక్కింది. ఆ సీటుకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు పరిశీలించినా బీసీ కోణంలో ఆయనకు అవకాశం దక్కలేదు. మంత్రి విడదల రజనితో మాధవి తలపడనున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో సీనియర్ నేత తిక్కారెడ్డి అవకాశం కోల్పోయారు. అక్కడ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్కు టికెట్ దక్కింది. ఇంటర్, ఆపైన 29 మంది టీడీపీ అభ్యర్థుల తాజా జాబితాలో 29మంది అభ్యర్థులు ఇంటర్, ఆపైన చదివినవారే. ఇంటర్ చదివినవారు 8మంది కాగా గ్రాడ్యుయేట్లు-9, పీజీ-11, పీహెచ్డీ-1, టెన్త్లోపు చదివినవారు ఐదుగురు ఉన్నారు. 75 ఏళ్లు మించిన అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు. వీరిలో వరదరాజులురెడ్డికి 81ఏళ్లు కాగా... గోరంట్ల బుచ్చయ్యచౌదరికి 77 ఏళ్లు. 25-35 ఏళ్ల మధ్య ఇద్దరు, 36-45 మధ్య 8, 45-60 మధ్య 19, 61-75 మధ్య ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. తాజా జాబితాలో టికెట్లు పొందిన 34 మందిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. 16 స్థానాలు త్వరలోనే ఖరారు మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుంది. వీటిలో ఇప్పటికి రెండు జాబితాల్లో కలిపి 128 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 16 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు టీడీపీ ప్రకటించిన సీట్లలో బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలిపి 45శాతం (58సీట్లు) దక్కాయి. ఇందులో ఎస్సీలకు 27, బీసీలకు 24, ఎస్టీలకు 4, మైనారిటీలకు 3 లభించాయి. రెడ్డి సామాజిక వర్గానికి 28, కమ్మ-28, కాపు-8, క్షత్రియ-5, వెలమ-1, వైశ్యులకు రెండు, దక్కాయి. నేడు టీడీపీ ఎంపీల జాబితా? టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 25 లోక్సభ సీట్లకు గాను పొత్తులో భాగంగా టీడీపీ 17 స్థానాల్లో పోటీచేయనుంది. టీడీపీ వర్గాల ఆంతరంగిక సమాచారం ప్రకారం ఇప్పటికి ఖరారైన అభ్యర్థులు.. శ్రీకాకుళం-కింజరాపు రామ్మోహన్నాయుడు, విశాఖపట్నం-ఎం.భరత్, విజయవాడ-కేశినేని శివనాథ్ (చిన్ని), ఒంగోలు-మాగుంట రాఘవరెడ్డి, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నరసరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు, చిత్తూరు (ఎస్సీ)-దగ్గుమళ్ల ప్రసాదరావు, రాజంపేట-సుగవాసి బాలసుబ్రమణ్యం, నంద్యాల-బైరెడ్డి శబరి. ఇంకా అమలాపురం(ఎస్సీ), బాపట్ల(ఎస్సీ), కర్నూలు, కడప, ఏలూరు, అనంతపురం, హిందూపురం స్థానాలకు అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. కమలాపురం, కదిరిలో నేతల కుటుంబ సభ్యులకు అవకాశం బీసీ కోటాలో గుంటూరు పశ్చిమకు మాధవి మంత్రాలయంలో రాఘవేందర్ కూడా.. వైసీపీ నుంచి వచ్చిన ఆనం, ఆదిమూలానికీ సీట్లు పూతలపట్టులో పాత్రికేయుడికి చాన్సు రంప టికెట్ అంగన్వాడీ కార్యకర్తకు
-
కమ్మ సామాజిక వర్గం నుంచి టీడీపీ M L A అభ్యర్థులు.... 01. విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు 02. మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు 03. తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ 04. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు 05. గుడివాడ వెనిగండ్ల రాము 06. విజయవాడ(ఈ) గద్దె రామ్మోహన్ 07. మంగళగిరి నారా లోకేష్ 08. పొన్నూరు ధూళిపాళ నరేంద్ర 09. చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు 10. వినుకొండ జీవీ ఆంజనేయులు 11. పర్చూరు ఏలూరి సాంబశివరావు 12. అద్దంకి గొట్టిపాటి రవి కుమార్ 13. ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు 14. ఉదయగిరి కాకర్ల సురేష్ 15. ఉరవకొండ పయ్యావుల కేశవ్ 16. కళ్యాణ దుర్గం అమిరినేని సురేందర్ బాబు 17. రాప్తాడు పరిటాల సునీత 18. హిందూపురం నందమూరి బాలకృష్ణ 19. నగరి గాలి భానుప్రకాష్ 20. కుప్పం నారా చంద్రబాబు నాయుడు 21. చిత్తూరు గురజాల జగన్మోహన్ 22. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 23. దెందులూరు చింతమనేని ప్రభాకర్ 24. పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్ 25. గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు 26. కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు 27. వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీ ప్రియ 28. చంద్రగిరి పులివర్తి నాని 29. తెనాలి నాదెండ్ల మనోహర్ JSP
-
If somu is candidate, Independent might get chance to win
-
Missing Gowthu Sirisha.... in the list
-
2019 లో ప్రచారం అవ్వగానే భీమవరం లో ఓడిపోతా అని అర్థం అయ్యింది... గాజువాకలో ఓడిపోతా అని ఎలాగూ ముందే తెలుసు - పవన్ కళ్యాణ్*పిఠాపురం జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ - పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన పవన్*
-
బిగ్ బ్రేకింగ్: చింతమనేనికి సీటు కన్ఫార్మ్ చేసిన చంద్రబాబు... అనుమానాలు తొలగిపోయాయి.. సందేహాలు పటాపంచలు అయ్యాయి. దెందులూరు టీడీపీ టిక్కెట్పై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది... టీడీపీ అధినేత చంద్రబాబు చింతమనేనికి ఫోన్ చేసి మరీ టిక్కెట్ కన్పార్మ్ చేశారు. బుధవారం రాత్రి ఖచ్చితంగా 7.50 నిమిషాలకు చింతమనేనికి ఫోన్ చేసిన చంద్రబాబు సీటు ఖరారు చేస్తున్నట్టు చెప్పడంతో పాటు మంచి మెజార్టీతో గెలవబోతున్నావు... జాగ్రత్తగా వర్క్ చేసుకో.. ఈ సారి మంచి పదవిలో ఉంటావ్ అని శుభాకాంక్షలు చెప్పారు ...
-
దర్శి జనసేన నుంచి గొట్టిపాటి హను మంతరావు మనవరాలు ! దర్శి జనసేన అభ్యర్ధిగా దివంగత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు కీర్తి శేషులు గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి దాదాపు సీటు ఖరారు..
-
Warangal BRS MP - kadium daughter
-
No announcement
-
Rural lo Jagan nunchunna gelustadu kotam...
-
చంద్రబాబు గారి రివ్యూ అంటే ఎలా ఉంటుందో పార్టీ వారికి, అధికారులకు, జర్నలిస్ట్ లకి తెలుసు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.. కేంద్ర మంత్రి షేకావత్ గారికి, పాండే గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికి 11 గంటలుగా సాగుతున్న సుదీర్ఘ రివ్యూ మీటింగ్ కొత్తే.. ఇంకా కనీసం 3గంటలు పడుతుంది అంటున్నారు.. సుదీర్ఘ రివ్యూ మీటింగ్ వీరికి ఇబ్బంది అనిపించినా పొత్తులో ఇచ్చిన సీట్ల పైన కూడా మండలాల వారీగా చంద్రబాబు చేస్తున్న విశ్లేషణ, పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కి క్లాస్ రూంలో విద్యార్థులలా ఆశ్చర్యపోయి వింటున్నారని జర్నలిస్ట్ లు అనుకుంటుంటే విన్నా.. Gvl, సోము గార్ల వత్తిడి స్థానాల గురించి వీరు అడిగినప్పుడు బాబు గారు ఎక్సప్లయిన్ చెయ్యడంతో మారు మాట్లాడలేదంట.. రేపు మళ్ళీ కూర్చుందామన్నా లేదు ఈరోజే ఫైనల్ చేద్దాం అని బాబు అంటే ఈయన మనిషా రోబోనా అని విస్తూపోతున్నారట..
-
NBK110 - BB4- Balayya - Boyapati - 14 Reels - RelianceSridhar- Tamman
Siddhugwotham replied to Raaz@NBK's topic in Chat Room
100 movie - 2017 110 movie - 2024 -
For CBN is coming back
-
All of them in one shared auto
-
Chettho aapada .... Addam nunchonnada.... Just asking.....
-
Didi in 1980...