Jump to content

OKKA MAGAADU


OneAndOnlyMKC

Recommended Posts

*విజయవాడ*

*రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కామెంట్స్...*

గవర్నర్ పిలుపు మేరకు  గవర్నర్ తో   భేటి అయ్యాను..

ఎన్నికల నిర్వహణ కు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు..

ప్రభుత్వానికి, ఎస్ ఇ సి కి వారధి లాగా పనిచేస్తామన్నారు..

వ్యక్తిగతంగా సి ఏఎస్ , డిజి తో ఎలాంటి భేదాలు లేవు.

సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం, ఉద్యోగులు సహకరిస్తున్నారని  చెప్పాను.
కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని
ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటించాలి..

సాయంత్రానికి మార్పు వచ్చింది...ఇద్దరి అధికారులు పై చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యలు చేయడం సుప్రీంకోర్టు తీర్పు కు విరుద్ధం..

వారి పై ఎలాంటి చర్యలు, సిఫార్స్ లు చేయలేదు..మాకు కక్ష సాధింపు లేదు.

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది గిరిజ శంకర్..

గతం గతహా...

నేను సర్వీస్ నుండి వచ్చినవాడినే.

నా సొంతూరు గుంటూరు జిల్లా దుగ్గిరాల, హైద్రాబాద్ లో ఓట్ హక్కు రద్దు చేసుకున్నా...సొంత ఊర్లో ఓటు  నమోదు చేయమని అడిగా...

నేను స్థానికంగా లేనని ఓటు ఇవ్వలేదు..

విచక్షణాధికారాన్ని గౌరవిస్తా..

ఓటు హక్కు నమోదు పై అప్పీల్ కు వెళ్తా.. కాదంటే కోర్ట్ కు వెళతా.

ఉద్యోగ సంఘాల తో నాకు సాన్నిహిత్యం ఉంది..ఇప్పటి వాళ్లకి తెలియదు..

ఉద్యోగుల నుండి పూర్తి  సహకారం వస్తోంది.

 ఏకగ్రీవాల పై ప్రముఖ పత్రికల్లో ప్రకటన రావడం పట్ల రాజకీయ పార్టీలు ఆందోళనవ్యక్తం చేసాయి..

ఎన్నికల ప్రక్రియ వచ్చిన తరువాత ఈసీ దృష్టికి రాకుండా ప్రకటన చేశారు..

ప్రభావితం చేసే లా ప్రకటన ఉంది..

ఐ అండ్ పి ఆర్ కమీషనర్ కు సంజాయిషీ కోరా..

గతంలో జరిగిన ఏకగ్రీవాలు బలవంతం జరిగాయని ఆరోపణలు ఉన్నాయి..ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

ఏకగ్రీవాలు పరిమితి దాటి  అపరిమిత ము గా పెరిగితే ఏఎస్ ఇసి నిశితంగా పరిశీలిస్తోంది..

ఏకగ్రీవాలు కుదరకుంటే  నామినేషన్ దాఖలు చేసే మార్గం ఏర్పాటు కల్పించాలి.అని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పా... 

సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతి ఒక్కరు స్ఫూర్తి తో కట్టుబడి ఉండాలి..

ధిక్కరిస్తే ఎ ఎస్ ఇసి చర్యలు తీసుకుంటుంది..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...