July 22, 20241 yr Author ‘ఎక్స్ప్రెస్ వే’ల నిర్మాణానికి కృషి : ఎంపీ శ్రీభరత్ విశాఖలో ‘ఎక్స్ప్రెస్ వే’ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఆదివారం ఆటోనగర్ సమీప గ్రీన్సిటీ కల్యాణ మండపంలో ఫార్మా, అనుబంధ సంఘాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. Published : 22 Jul 2024 03:29 IST కూర్మన్నపాలెం, న్యూస్టుడే : విశాఖలో ‘ఎక్స్ప్రెస్ వే’ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఆదివారం ఆటోనగర్ సమీప గ్రీన్సిటీ కల్యాణ మండపంలో ఫార్మా, అనుబంధ సంఘాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ నగరంతో పాటు గాజువాకలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు అగనంపూడి నుంచి ఆనందపురం వరకు ఉన్న ప్రధాన రహదారిలో సుమారు 12 పైవంతెనలు నిర్మిస్తామన్నారు. షీలానగర్- పోర్టు రోడ్డులో మూడు వంతెనలు కలిపి ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామన్నారు. కాలుష్య నియంత్రణతో పాటు, మల్టీలెవెల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు వీలుగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ... నగరంతో పాటు, గాజువాక అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అనంతరం నిర్వాహకులంతా కలిసి ఎంపీ, ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో భాజపా గాజువాక ఇన్ఛార్జి కరణంరెడ్డి నర్సింగరావు, తెదేపా కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
September 7, 20241 yr Author నగరానికి మణిహారాలే!! నాడు మాటలకే పరిమితంగత ప్రభుత్వంలో జగన్ రూ.60కోట్లతో హనుమంతవాక వద్ద పైవంతెన ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో ఆ వంతెన నిర్మిస్తామంటూ చెప్పుకొచ్చారు Published : 07 Sep 2024 04:31 IST 58 కి.మీ. పరిధిలో పన్నెండు పైవంతెనలు విశాఖలో ట్రాఫిక్ కష్టాలు తీరేలా భారీ ప్రణాళిక ఇటీవల సమీక్షించి కొన్ని మార్పులు సూచించిన సీఎం చంద్రబాబు ఈనాడు-విశాఖపట్నం: నగర పరిధిలో జాతీయ రహదారి 58 కి.మీ. ఉండగా... ఈ కీలక కూడళ్లలో ట్రాఫిక్ కష్టాలు తీరేలా వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. సీఎం సూచనలతో.. ఈ ఏడాది జులైలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైవంతెనలు నిర్మించే కూడళ్ల వివరాల నివేదిక సీఎంకు అధికారులు అందజేశారు. తక్కువ దూరంలోనే నిర్మించాల్సి వస్తే... వాటిని వేర్వేరుగా కాకుండా... ఒక్కటే పెద్ద వంతెనగా నిర్మించాలంటూ కొన్ని మార్పులు, సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం సూచించిన విధంగా ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ వంతెనలు ఎక్కడంటే.. రామారావు ప్రైవేటు ఉద్యోగి. ఎండాడ నుంచి అక్కయ్యపాలెం రావడానికి బస్సులో అర్ధగంటకుపైగా పడుతోంది. ద్విచక్ర వాహనంపై వచ్చినా 25 నిమిషాల సమయం ప్రయాణానికి కేటాయించాల్సి వస్తోంది. ప్రధానంగా హనుమంతవాక, మద్దిలపాలెం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎక్కువ ఆలస్యమవుతోంది.ఒకవేళ ఉదయం కొంచెం ఆలస్యంగా బయలుదేరితే.. స్కూలు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగుల రద్దీతో ఇంకా పూర్తిగా ట్రాఫిక్లో చిక్కినట్లే. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనూ ఇదే పరిస్థితి. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకైనా ఇదే దుస్థితి. విశాఖలో ట్రాఫిక్ కష్టాలు తీరేలా కార్యాచరణ వేగవంతం అయింది. నగర పరిధిలోని ముఖ్యమైన పన్నెండు కూడళ్లలో పైవంతెనల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన ఈ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డీపీఆర్ (సమగ్ర పథక నివేదిక) సాంకేతిక దశలో ప్రస్తుతం రూపు దిద్దుకుంటోంది. ఇది అయిన వెంటనే ఆర్థిక అంశాలపై కసరత్తు చేసి పూర్తి నివేదిక సిద్ధం చేయనున్నారు. కేంద్రం పచ్చజెండా ఊపిన వెంటనే గుత్తేదారులకు బాధ్యతలప్పగించి, వంతెన నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నాడు మాటలకే పరిమితం గత ప్రభుత్వంలో జగన్ రూ.60కోట్లతో హనుమంతవాక వద్ద పైవంతెన ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో ఆ వంతెన నిర్మిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2021 మార్చిలో డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించినా అప్పటి ప్రభుత్వం సరిగా స్పందించలేదన్న విమర్శలున్నాయి. ఎన్నికల వేళ హడావుడిగా 2023 ఆగస్టులో ఓ కన్సల్టెంట్ కంపెనీకి డీపీఆర్ బాధ్యతలిచ్చారు. ప్రస్తుతం ఆ డీపీఆర్ పూర్తయితే వంతెన నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యేలు, సిటీ పోలీసు కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ సమావేశం అవుతారు. ‘కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రేడ్ సపరేటర్స్ స్ట్రక్చర్స్ ఎట్ వేరియంట్ జంక్షన్స్ ఆఫ్ విశాఖ సిటీ’ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రస్తుతం పిలుస్తున్నారు. ఎన్ఏడీ వద్ద పైవంతెన నిర్మించిన తరువాత.. ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరాయి. ఇక్కడ కొంతమేర పనులు ఇంకా చేయాల్సి ఉంది.
November 8, 20241 yr Author విశాఖలో తాజ్ గ్రూప్ భారీ హోటల్! దిగ్గజ ఆతిథ్య, సేవా రంగ సంస్థ తాజ్ గ్రూప్ ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ హోటల్ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. Updated : 08 Nov 2024 10:57 IST స్థలాలను పరిశీలిస్తున్న ప్రతినిధుల బృందం విశాఖలో స్థలాన్ని పరిశీలిస్తున్న తాజ్ గ్రూప్ సంస్థల ప్రతినిధి ఈనాడు-విశాఖపట్నం, న్యూస్టుడే-విజయనగరం: దిగ్గజ ఆతిథ్య, సేవా రంగ సంస్థ తాజ్ గ్రూప్ ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ హోటల్ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు రెండు రోజులుగా స్థల పరిశీలన చేపడుతున్నారు. బుధవారం విశాఖలోని కొన్ని స్థలాలను పరిశీలించగా గురువారం అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో తీరానికి సమీపంలో వంద ఎకరాలు కేటాయిస్తే భారీ హోటల్ నిర్మించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం సమీప ప్రాంతాలనూ వారు పరిశీలించారు. తాజ్ ప్రతినిధులకు పర్యాటక, రెవెన్యూశాఖ అధికారులు ఆయా భూములను చూపించారు.
November 10, 20241 yr Author మళ్లీ తెరపైకి కోస్టల్ కారిడార్ ABN , Publish Date - Nov 10 , 2024 | 01:07 AM రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లా అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షతో పాత ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ మళ్లీ తెరపైకి వచ్చాయి. కంటెయినర్ టెర్మినల్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ 55 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో రహదారి ప్రాజెక్టు వ్యయం రూ.6,289 కోట్లు రూ.1.45 కోట్లతో తయారవుతున్న డీపీఆర్ (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లా అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షతో పాత ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇందులో కోస్టల్ కారిడార్ ఒకటి. జాతీయ రహదారి-16కి సమాంతరంగా విశాఖపట్నం పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి భోగాపురం విమానాశ్రయం జాతీయ రహదారి-16 వరకు ఆరు వరుసల్లో కోస్టల్ కారిడార్ నిర్మించాలనేది ప్రతిపాదన. గత ఏడాదే దీనికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థకు రూ.1.45 కోట్లు మంజూరు చేశారు. దీనిని త్వరగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నం పోర్టు కంటెయినర్ టెర్మినల్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు తీరాన్ని ఆనుకొని 55 కి.మీ. పొడవున ఆరు వరుసల్లో కారిడార్ నిర్మించాలనేది ప్రణాళిక. దీనికి రూ.6,289 కోట్లు అవసరం అని అంచనా వేశారు. కారిడార్లో రెండు వైపులా పది మీటర్ల గ్రీన్ బెల్ట్ నిర్వహించాలని ప్రతిపాదించారు. లాజిస్టిక్ పార్కులు, పర్యాటక ఆకర్షక ప్రాజెక్టులు ఇందులో భాగం చేయాలని సీఎం సూచించారు. భీమిలి నుంచి భోగాపురం మధ్య ఈ కారిడార్ కోసం 346 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. కంగవానిపాలెం, అన్నవరం, మూలకద్దు, ఆ పొరుగునే ఉన్న మరో ఆరు గ్రామాల్లో ఈ భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో జరిగిన చర్చల మేరకు కొన్ని అంగీకారాలు కుదిరాయని జిల్లా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. - ఈ ప్రాజెక్టుకు భూ సేకరణకు రూ.4,315 కోట్లు, నిర్మాణాలకు రూ.1,974 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. - భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు భరించడానికి ఒప్పుకొంది. మిగిలిన మొత్తం కేంద్రం పెట్టుకోవాలి. - నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్, స్టీల్పై జీఎస్టీ మినహాయింపు త్వరలోనే డీపీఆర్ పూర్తి ఈ కోస్టల్ కారిడార్ డీపీఆర్కు గత ఏడాది ఆగస్టులోనే రూ.1.45 కోట్లు మంజూరుచేశారని, ప్రస్తుతం డీపీఆర్ తయారు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి చేసి కేంద్రానికి సమర్పిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు సమావేశంలో వెల్లడించారు. ఇది పూర్తయితే కేంద్ర ప్రతినిధులతో చర్చించి, ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళతామని సీఎం పేర్కొన్నారు. ఇదిలావుండగా వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని నాటి కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇందులో భీమునిపట్నం నుంచి భోగాపురం వరకు 19.66 కి.మీ. పొడవున గ్రీన్ ఫీల్ట్ కారిడార్ వేయాలని నిర్ణయించారు. అయితే భీమిలి తీరం మీదుగా ఈ కారిడార్ వెళ్లాల్సి ఉండగా పట్టణంలో పురాతన కట్టడాలు కూల్చాల్సి వస్తుందని చెప్పి కారిడార్ మలుపు తిప్పారు. ఈ మార్గంలో వైసీపీ నాయకులు కొన్ని వందల ఎకరాలు సొంతం చేసుకున్నారు
Create an account or sign in to comment