Jump to content

Amaravati lo Land acquisition


Recommended Posts

27 minutes ago, Raaz@NBK said:

Govt employees (Special deputy collector, Collectors and other employees) as per rules pokunda Govt ki bad name testhunnaru.. 

inka oka nela  lo kotha chattam vasthundiga appudu telusthundi vallaki undavalli batch mari athi cheyyakudadu 17cr kavala mari athi kakapothe

Link to comment
Share on other sites

55 minutes ago, sonykongara said:

inka oka nela  lo kotha chattam vasthundiga appudu telusthundi vallaki undavalli batch mari athi cheyyakudadu 17cr kavala mari athi kakapothe

17cr too much le.. initial stages lone pilichi matladalasindhi..

 

kotha chattam ki patha chattam ki diff enti bro ?

 

BTW Already notification issue ayina vatiki kotha chattam vartinchadhu anukuntunna bro

Link to comment
Share on other sites

4 minutes ago, Raaz@NBK said:

17cr too much le.. initial stages lone pilichi matladalasindhi..

 

kotha chattam ki patha chattam ki diff enti bro ?

 

BTW Already notification issue ayina vatiki kotha chattam vartinchadhu anukuntunna bro

ala emi ledu edi api kotha ga ga  notification istharu

Edited by sonykongara
Link to comment
Share on other sites

భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
  సామాజిక మదింపు లేకుండానే సేకరణకు అవకాశం
  కొన్ని అంశాల్లో ప్రజాభిప్రాయం అవసరం ఉండదు
29ap-main4a.jpg

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆమోదముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం 2013లో చేసిన ‘ద రైట్‌ టు ఫెయిర్‌ కాంపెన్షేషన్‌ అండ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ యాక్ట్‌’లోని నిబంధనలు భూసేకరణకు ఇబ్బందిగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో 12 సవరణలతో కొత్త బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. పలు శాఖల అభిప్రాయం తీసుకున్న తర్వాత కేంద్రహోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. వెంటనే ఆయన దానికి ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త బిల్లువల్ల అభివృద్ధి కార్యక్రమాల కోసం మరింత సులభతరంగా భూమి సేకరించుకొనే వెసలుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది.
పరిహారంపై కలెక్టర్లకు అధికారం: జాతీయ భద్రత, రక్షణ, సాగునీరు, అత్యవసరమైన మౌలికవసతుల కల్పనకోసం

భూమి సేకరించినప్పుడు సామాజిక ప్రభావ మధింపు, ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉండదు.
* భూసేకరణతో ముడిపడిన వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాత పరిహారంపై నిర్ణయం తీసుకొనే అధికారం కలెక్టర్‌కు దక్కుతుంది.
* రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ఇష్టపడితే ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎక్కువ పరిహారం ఇవ్వడానికి వీలవుతుంది.
* పరస్పర ఒప్పందం ద్వారా ఏ ప్రజాప్రయోజనం కోసమైనా భూసేకరణచేయడానికి ప్రభుత్వానికి వెసలుబాటు లభిస్తుంది.
* సహాయ, పునరావాస కార్యక్రమానికి ఒకేసారి పూర్తిమొత్తం ఇవ్వడం ద్వారా నిర్దిష్టమైన ప్రాజెక్టులకోసం భూసేకరణ జరుపుకోవడానికి వీలవుతుంది.

ఐదేళ్ల నిబంధన అప్పుడు.. వర్తించదు
2013 భూసేకరణ చట్టం  ప్రకారం భూసేకరణ అవార్డు ప్రకటించిన అయిదేళ్లలోపు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలి. పరిహారం కూడా ఆలోపే చెల్లించలి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం ఏదైనా భూసేకరణ వ్యవహారం కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతే ఆ కాలానికి అయిదేళ్ల నిబంధన వర్తించదు. బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవహారాల కార్యదర్శి ఎం.విజయరాజుకు వర్తమానం పంపింది.

2013 చట్టప్రకారం అయితే..
2013నాటి చట్టం ప్రకారం ఏ కార్యక్రమం కోసమైనా భూసేకరణ చేయాలంటే తప్పనిసరిగా సామాజిక ప్రభావ మధింపు చేయాల్సి ఉంది. దాంతోపాటు ఆహారభద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. భూసేకరణ అవార్డుతోపాటే బాధితులకు అధిక పరిహారం, సహాయ, పునరావసానికి సంబంధించిన అవార్డు ప్రకటించాల్సి ఉంటుంది. రైతులనుంచి విచక్షణారహితంగా భూమి తీసుకోకూడదు.

సవరణలు ప్రధానంగా ఎందుకోసమంటే..
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. జాతీయరహదారులు, రైల్వేలైన్లు, పోర్టుల నిర్మాణానికి పెద్దఎత్తున శ్రీకారం చుట్టారు. వీటన్నింటికీ తక్షణం భూమి అందుబాటులోకి తేవాల్సి ఉంది. లేదంటే వాటి అంచనా వ్యయాలు భారీగా పెరగడంతోపాటు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.

తొలగనున్న భూసేకరణ ఇబ్బందులు
ప్రస్తుతం ఈ బిల్లు చట్టరూపం దాల్చడంవల్ల రాజధాని ప్రాంతంలో సహా, వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకోసం చేపడుతున్న భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. ప్రభుత్వం, రైతులకు ఆమోదయోగ్యమైన రీతిలో భూసేకరణ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది.

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

ala emi ledu edi api kotha ga ga istharu

Peddhaga change em ledhu bro..  kotha chattam lo samajika survey ledhu anukunta which saves 4-6 months for LA Procedings.. and other minor points changes chesaru.

 

LA process lo stages vuntai bro.. oka stage dhatina vatiki kotha chattam vartinchadhu.. initial stages lo vunna villages ki vartisthadhi. 80% of farmers approval must in newly Amendment LA... 

Kotthaga Collector ki powers icharu to negotiate with farmers independantly.. nothing changes..

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:
  •  
 

ఐదేళ్ల నిబంధన అప్పుడు.. వర్తించదు
2013 భూసేకరణ చట్టం  ప్రకారం భూసేకరణ అవార్డు ప్రకటించిన అయిదేళ్లలోపు సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలి. పరిహారం కూడా ఆలోపే చెల్లించలి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం ఏదైనా భూసేకరణ వ్యవహారం కోర్టు కేసుల్లో ఇరుక్కుపోతే ఆ కాలానికి అయిదేళ్ల నిబంధన వర్తించదు. బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవహారాల కార్యదర్శి ఎం.విజయరాజుకు వర్తమానం పంపింది.

Ee point picha li8 bro.. bcoz 5 years lope state govt Panulu modhalu pedatadhi.. thama land venakki vachesthadhi ani asha padevallaki pedda debba. Ila anukune vala % Entha mandho I don't know bro. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
భూసేకరణకు నిబంధనలివే!
26-07-2018 03:22:36
 
  • రాష్ట్ర చట్టం-2018కి రూల్స్‌
  • రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ
అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం అమలుకు విధివిధానాలు, నియమనిబంధనలను రూపొందిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులను (జీవో నం.390) జారీ చేసింది. కేంద్ర భూసేకరణ చట్టం-2013లోని మూడు అత్యంత కీలకమైన క్లాజులను ముఖ్యమైన ప్రాజెక్టులకు మినహాయింపునిస్తూ, కేవలం రాష్ట్ర అవసరాలను దృష్టిలోపెట్టుకొని ఈ చట్టాన్ని రూపొందించారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం-2018గా పిలుస్తున్నారు. అయితే, ఇది 2014 జనవరి 1 నుంచే అమల్లో ఉన్నట్లుగా తాజాగా రూల్స్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రాధమిక (ప్రిలిమినరీ) నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిపై సూచనలు, సలహాలతోపాటు అభ్యంతరాలను 15 రోజులపాటు స్వీకరించనున్నారు. ఆ విన్నపాలను పరిశీలన చేసి రూల్స్‌పై తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.
 
 
మారిన చట్టంలో...
కేంద్ర చట్టంలో పేర్కొన్న గ్రామసభల తీర్మానం, ఆహారభద్రత, సామాజిక ప్రభావం అంచనా వంటి అంశాలను ఈ చట్టంలోనూ పేర్కొన్నారు. అయితే, ఐదు రకాల ప్రాజెక్టులకు చేపట్టే భూసేకరణకు అవి వర్తించవు. ఈ మేరకు చట్టంలోని చాప్టర్‌ -3ఏలో 10 ఏ కింద మినహాయింపులను ఇచ్చారు. జాతీయ భద్రత, దేశరక్షణ, విద్యుదీకరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పేదలు, ఇతర గృహనిర్మాణరంగం, ప్రభుత్వం చేపట్టే ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ వంటి వాటి కోసం భూములు సేకరించాలనుకుంటే గ్రామసభల ఆమోదం, భూసేకరణ వల్ల కలిగే సామాజిక పరిణామాల అంచనా అంటే సామాజిక అంచనా, ఆహారభద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరు. నేరుగా నోటిఫికేషన్‌ ఇచ్చి భూ సేకరణ చేపట్టేలా రూల్స్‌ను తయారుచేశారు..
 
 
రూల్స్‌లో ఏముంది?
చాలావాటినుంచి మినహాయింపులు ఇచ్చినప్పటికీ భూసేకరణలోనూ అనేక ఆప్షన్స్‌ ఉంచారు. కన్సెంట్‌ అవార్డును పాస్‌చేయడం ద్వారా, నేరుగా రైతులతో చర్చలు జరిపి వారితో ప్రభుత్వమే భూముల సేకరణకు ఒప్పందాలు చేసుకోవడం, ప్రభుత్వమే నేరుగా భూములను కొనుగోలు చేయడం, ఇంకా స్వచ్ఛందంగా భూసేకరణ చేపట్టే పద్ధతుల్లో రూల్స్‌ను తయారు చేశారు. ఇవన్నీ చట్టంలో ఉన్నా...వాటి అమలు ఎలా ఉండాలన్న దానిపై రూల్స్‌ను తయారు చేశారు. ఈ వ్యవహారాలు చూడటానికి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో సంప్రదింపుల కమిటీ ఉంటుంది. చట్టం రూల్స్‌పై వివిధ శాఖల నుంచి వచ్చే సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తప్పకుండా పరిశీలిస్తామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. సచివాలయంలో ఉండే తనకు భూసేకణ చట్టం రూల్స్‌పై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను లిఖితపూర్వకంగా పక్షం రోజుల్లో పంపించాలని ఆయన కోరారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...