Jump to content

Recommended Posts

  • 4 weeks later...
  • 1 month later...
Posted
Dilip Buildcon bags Rs 260 cr road project in Andhra Pradesh Dilip Buildcon Ltd, a private sector road-focused engineering procurement construction (EPC) contractor, is developing infrastructure across the country in areas such as roads and bridges, water sanitation and sewage, irrigation, industrial, commercial and residential buildings. | 1 Comments Dilip Buildcon bags Rs 260 cr road project in Andhra Pradesh Dilip Buildcon today said that it has bagged a road project in Andhra Pradesh worth Rs 260 crore. "Ministry of Road....has declared Dilip Buildcon, Bhopal as the successful bidder (L-1) for the project 'rehabilitation and upgradation of Machilipatnam to Avanigadda section...to two lane with paved shoulder in Andhra Pradesh under NHDP-IV through engineering, procurement and construction (EPC) basis at a project cost of Rs 260 crore," the company said in a BSE filing. The completion period of the project is 24 months, it added. Dilip Buildcon Ltd, a private sector road-focused engineering procurement construction (EPC) contractor, is developing infrastructure across the country in areas such as roads and bridges, water sanitation and sewage, irrigation, industrial, commercial and residential buildings

Read more at: http://www.moneycontrol.com/news/business/dilip-buildcon-bags-rs-260-cr-road-projectandhra-pradesh_8121361.html?utm_source=ref_article
Posted

216 జాతీయ రహదారిపై మూడు టోల్‌ప్లాజాలు

పరిశీలనలో అధికారులు

kri-gen5a.jpg

బంటుమిల్లి, న్యూస్‌టుడే: కోస్తా తీరం వెంబడి అభివృద్ధి చేయనున్న 216 జాతీయ రహదారి అభివృద్ధి పనులు కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించిన సర్వే పనులు పూర్తయ్యాయి. భూసేకరణ పనులు పూర్తిచేశారు. అక్కడక్కడ రోడ్డును బైపాస్‌గా మళ్లించనున్నారు. 2018 డిసెంబరు నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లోసరి వంతెన నుంచి మచిలీపట్నం వరకు గల 50 కిలోమీటర్ల రోడ్డు పనులను టాటా కంపెనీ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. ఈ జాతీయ రహదారి వెంబడి మూడు చోట్ల టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. కచ్చితంగా పాయింట్లు నిర్ణయం కానప్పటికి విశ్వసనీయ సమాచారం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వద్ద, కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరు వద్ద, అవనిగడ్డ వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థల పరిశీలనలో ఉన్నారు. శుక్రవారం బంటుమిల్లి మండలం ముంజులూరు, అర్తమూరు పరిసరాల్లో ప్లాజా ఏర్పాటుకు అనువైన ప్రదేశం కోసం అధికారులు పరిశీలించారు. అధికారులతో పాటు గుత్తేదారులు, బంటుమిల్లి తహసీల్దార్‌ శేఖర్‌ పరిశీలనలో పాల్గొన్నారు. అనువైన ప్రదేశాన్ని ఎంపికచేసి స్థల సేకరణ చేయనున్నారు. మొదట్లో జాతీయ రహదారిని 214ఎ గా పిలిచేవారు. ప్రస్తుతం 216గా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది పేరుకే జాతీయ రహదారి. కానీ చాలావరకు మూడు మీటర్ల సింగల్‌ రోడ్డే. బంటుమిల్లి నుంచి మచిలీపట్నం వరకు ఏడు మీటర్ల రహదారిగా ఉంది. ఇప్పుడు ఈ రోడ్డును 10 మీటర్ల వెడల్పున అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో 18 మీటర్ల వరకు విస్తరించినా స్థల సమస్య లేకుండా ముందుగానే స్థల సేకరణ పూర్తయింది.

భవిష్యత్తులో మరింతగా: మచిలీపట్నంలో పోర్టు పనులు పూర్తయి పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పుడు గోదావరి జిల్లాల నుంచి ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నై వరకు రోడ్డును అభివృద్ధి పరచాల్సివస్తే అందుకు తగిన స్థలాన్ని ముందుగానే సేకరించారు. విస్తరణలో బైపాస్‌ రోడ్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు స్థల సేకరణ పూర్తయింది. కొత్తగా ఏర్పాటు చేసే అన్ని బైపాస్‌ రోడ్డులను సిమెంటు రహదారులుగా అభివృద్ధి చేస్తారు. సిమెంటు రోడ్డు నిర్మాణానికి ప్రారంభంలో ఖర్చు అధికమైనప్పటికి ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉంటుందన్న ఆలోచనతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించను న్నారు. బంటుమిల్లి, అర్తమూరు, ముంజులూరు, పెడన వద్ద బైపాస్‌ రోడ్డులను ఏర్పాటు చేయనున్నారు.

Posted

Repalle undi ani ikkda kuda rsadu ga brokattipudi.jpg

 

yes brother. eenadu says "anusandhanam". that clarifies my doubt. That means this road does not touch the town. currently this road takes a sharp turn at Penumudi away from Repalle. there is another access road that connects Repalle to this point(2-3km).

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
Posted
216 జాతీయ రహదారి అభివృద్ధి జరిగేనా..?
 
636272391365934757.jpg
  • రాజధాని నిర్మాణంతో ఈ రోడ్డుకు ప్రాధాన్యం 
  • ఐదు జిల్లాలను కలిపే ప్రాజెక్టుపై అలసత్వం
ఐదు జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన 216 జాతీయ రహదారి పనులు అడుగు ముందుకు పడడం లేదు. కేంద్రం నిధులు ప్రకటించినా.. కేవలం సర్వేలతో కాలం వెళ్లదీస్తున్నారు.
 
రేపల్లె: రెండు దశాబ్ధాలుగా తీరప్రాంత వాసులు ఎదురు చూస్తున్న 216 జాతీయ రహదారి పనులు ముందుకు సాగడం లేదు. దిగమర్రు - ఒంగోలు 216 జాతీయ రహదారి విస్తరణ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయతలపెట్టిన 8వ జాతీయ రహదారి విస్తరణ జాబితాలో 390 కి.మీ మేర అభివృద్ధి చేయాల్సివుంది. గతంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ విజయవాడలో కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 216 జాతీయ రహదారి అభివృద్ధికి రూ.5వేల కోట్లు ప్రకటించారు. 2016 జనవరి 15వ తేదీన భూసేకరణ, రహదారి విస్తరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మార్చి 15వ తేదీన పెనుమూడిలో సర్వేను ప్రారంభించారు. దీంతో తీరప్రాంతవాసులు ఆనందం వ్యక్తమైంది. అయితే ఏడాది కావస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు.
 
ఐదు జిల్లాలతో అనుసంధానం..
కృష్ణా- గుంటూరు రహదారులను అనుసంధానం చేస్తూ పెనుమూడి కృష్ణానదిపై పెనుమూడి -పులిగడ్డ వారధి నిర్మా ణంతో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాలతో రహదారి సంబంధాలు విస్తృతమయ్యాయి. పెనుమూడి వారధి మీదుగా రేపల్లె, చీరాల, ఒంగోలు నుంచి మద్రాసుకు దగ్గర దూరం కావటంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకల సంఖ్య ఊహించని విధంగా రోజు రోజుకు పెరుగుతుంది. నవ్యాంధ్ర రాజధాని గుంటూరు జిల్లా కావటంతో ఈ రహదారికి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది. ఒడిశా, విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు, చెన్నై, కర్ణాటక, కేరళ వెళ్ళే ప్రధాన జాతీయ రహదారి ఇప్పటికే రద్దీ ఏర్పడింది. దానికి ప్రత్యామ్నాయంగా తీరప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ రహదారిని ఏర్పాటు చేస్తే సుమారు 120 కి.మీ తగ్గటమే గాక, అటు ఇంధనం, వాహనాల అరుగుదల, ప్రయాణికులపై చార్జీల మోత తగ్గుతుంది. విశాఖపట్నం, కాకినాడ పోర్టు, మచిలీపట్నం, నిజాంపట్నం, చీరాల ఓడరేవు, కృష్ణపట్నం పోర్టులకు అధికంగా మత్స్యసంపద రావటంతో రవాణాకు ఈ మార్గం తక్కువ సమయంలో ఇతర దేశాలకు పంపించేందుకు దోహదపడుతుంది.
 
రాజధాని నేపథ్యంలో ప్రాధాన్యం
కృష్ణా-గుంటూరు జిల్లాల తీరప్రాంతవాసులు రెండు జిల్లాల అనుసంధానం కోసం వారధి నిర్మాణం, జాతీయ రహదారి కోసం 30 ఏళ్ల పాటు ధర్నాలు, పోరాటాలు నిర్వహించారు. 2004లో గుంటూరు జిల్లా పెనుమూడి నుంచి కృష్ణా జిల్లా పులిగడ్డ వరకు కృష్ణానదిపై వారధి నిర్మించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.71 కోట్లు మంజూరు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో నిర్మాణం చేపట్టారు. శంకుస్థానకు చంద్రబాబునాయుడు ఐదు జిల్లాలను అనుసంధానం చేస్తూ తొలుత 214-ఏ జాతీయ రహదారిగా నామకరణం చేసి రహదారి నిర్మిస్తామని వాగ్ధానం చేశారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారధిని ప్రారంభించారు. అప్పటినుంచి రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఈ రహదారి ఊసే ఎత్తిన దాఖలాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం కృష్ణా-గుంటూరు జిల్లాల్లో రాజధాని నిర్మాణం కాండంతో 216 రహదారి ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ముందుకు సాగని ప్రణాళికలు
తూర్పుగోదావరి జిల్లా దిగమర్రు నుంచి తీరప్రాంత గ్రామాలైన రాజోలు, పాలకొల్లు, గుడివాడ, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల, చీరాల, ఒంగోలులోని జాతీయ రహదారి 5లో కలవనుంది. 33 ప్రాంతాల్లో 650 హెక్టార్లు ఈ రహదారికి భూమిని సేకరించారు. ఏడాది గడుస్తున్నా అభివృద్ధి పనులపై దృష్టి సారించిన అధికారులు లేరు. రెండు సంవత్సరాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసేవిధంగా ప్రణాళికలను రూపొందించారే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదు.
Posted

ఎన్ హెచ్-216 భూసేకరణ ప్రక్రియని పూర్తి చేయాలి
ఒంగోలు - దిగమర్రు జాతీయ రహదారి-216 విస్తరణకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సుమిత దావ్రా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ కృతిక శుక్ల స్పందిస్తూ నెలరోజుల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. బకింగ్‌ హామ్‌ కెనాల్‌కు సమీపంలో ఉన్న ఒక ఫ్యాక్టరీ తన వ్యర్థాలన్నింటిని ఎనహెచ మీదకు పంపిస్తోంది. పైగా ఆ సంస్థ కొత్తగా భ వన సముదాయాల నిర్మాణం చేపట్టింది. వాళ్లకి ఎవరు అనుమతులు ఇస్తున్నారో తెలియడం లేదని అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్‌ అండ్‌ బీ, అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.

Posted

:super: lot of development activities happening with low publicity....

Better late than never, TDP has to publicize aggressively on all mediums about dev done so far this term and in progress. Don't neglect basics and blame people after 2019

Posted

Better late than never, TDP has to publicize aggressively on all mediums about dev done so far this term and in progress. Don't neglect basics and blame people after 2019

  • 2 weeks later...
  • 3 weeks later...
Guest Urban Legend
Posted

Expansion of 394 km Ongole-Kathipudi coast-line highway NH 216 making good progress.

Almost completed between Kathipudi-Kakinada

 

C_8_B4pVoAA2HLM.jpg

C_8_DFAUMAAXviz.jpg

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...