Jump to content

AP health department


Recommended Posts

  • Replies 517
  • Created
  • Last Reply
  • 3 weeks later...

AP రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో ఏయే మందులు అందుబాటులో ఉన్నాయనే వివరాలు ఆన్లైన్ లో తెలుసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని జూన్2015 ప్రారంభించారు.

1000 కి పైగా ఆరోగ్య కేంద్రాలు,9 జిల్లా,30 ప్రాంతీయ ఆసుపత్రులు,11 వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో ఈ విధానం అమలులోకి వచ్చాయి.

https://pbs.twimg.com/media/DXKyVebVAAA26z1.jpg

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
గిరిజన ప్రాంతాలకు ఆరోగ్య రథాలు
సీఎస్‌ఆర్‌ కింద ఇచ్చిన ఏపీ ట్రాన్స్‌కో
ప్రారంభించిన సీఎం చంద్రబాబు
9ap-state15a.jpg
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రెండు ఆరోగ్య రథాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వీటిని జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన గ్రామాల్లో ప్రతి రోజూ ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకూ ఈ ఆరోగ్య రథాలు సేవలందిస్తాయి. ఈసీజీ, మూత్ర, రక్త తదితర 200 రకాల పరీక్షలను వీటిలో నిర్వహిస్తారు. డిస్పెన్సరీ కూడా అందుబాటులో ఉంటుంది. మలేరియా, మధుమేహం, రక్తపోటు, క్షయ, క్యాన్సర్‌ తదితర రోగాలను ప్రారంభంలోనే గుర్తించి వాటితో బాధపడుతున్న వారిని ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్యసేవకు బదలాయిస్తారు. భవ్య హెల్త్‌కేర్‌ ద్వారా ఈ ఆరోగ్య రథాలను నిర్వహిస్తారు. ఈ వాహనాల్లో వైద్యుడు, స్టాఫ్‌నర్స్‌, ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. విద్యుత్‌ పరిరక్షణ, సంరక్షణ, వాటి వల్ల ఒనగూరే ప్రయోజనాలు నినాదాలు ఆరోగ్యరథంపై ముద్రించారు. కార్యక్రమంలో మంత్రులు కిమిడి కళావెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, అధికారులు అజయ్‌జైన్‌, విజయానంద్‌, దినేష్‌ పరుచూరి, ఉమాపతి, హెచ్‌వై దొర, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

రాష్ట్ర వార్తలు

 
Link to comment
Share on other sites

క్యాన్సర్‌ వైద్య సేవల విస్తృతికి ప్రత్యేక పథకం
ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ ట్రస్టు ద్వారా సహకారం
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఓ పథకానికి రూపకల్పన చేసింది. వైద్య ఆరోగ్య శాఖ, టాటా ట్రస్టు, ఇతర సంస్థలు ఈ పథకం అమలులో పాలుపంచుకోనున్నాయి. క్యాన్సర్‌ వైద్య సేవలు పొందేందుకు అవకాశం లేని జిల్లాల్లో క్యాన్సర్‌ వైద్య సేవల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి తొలిప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడే ‘ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్టు’ ద్వారా ఈ కేంద్రాలకు అవసరమైన సహకారం లభించనుంది. ఈ ట్రస్టులో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, సలహాదారు, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు సీఈఓ, టాటా ట్రస్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైద్య విద్య సంచాలకులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, ముంబయి టాటా మెమోరియల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌, న్యూదిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్‌, బీఆర్‌ రోటరీ క్యాన్సర్‌ ఆస్పత్రి ముఖ్య ప్రతినిధి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రత్యేక వాహక సంస్థ కూడా ఏర్పడనుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పీపీపీ విధానంలో స్థలం, ఆర్థిక సాయం, భవన నిర్మాణాలు, ఇతర విషయాల్లో సహాయ సహాకారాలు ప్రభుత్వం నుంచి లభిస్తాయి. ఈ కేంద్రాల ద్వారా జాతీయ కార్యక్రమాలు అమలుచేసేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు. వీటి ద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన ప్రత్యేక కోర్సులను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన గుర్తింపు ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన సంస్థ ఇవ్వనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వుల్ని జారీచేశారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

సోమవారం నందలూరు దిగువ వీధికి చెందిన మస్తాని అనే మహిళ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా సురక్షితంగా బిడ్డను ప్రసవించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి శివకుమార్ మాట్లాడుతూ. ఎప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రసవించిన తొమ్మిది మంది మహిళలకు ఎన్టీఆర్ బేబికిట్ రూ.1000 చెక్కు

https://pbs.twimg.com/media/DcHJqUOV4AA2TD3.jpg

Link to comment
Share on other sites

kadapa జిల్లాలో కమలాపురం, రాయచోటి, మైదుకూరు, జమ్మలమడుగు, రాజంపేట, కోడూరు, బద్వేల్ లొ ఈ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి

https://pbs.twimg.com/media/DcXMxDGW0AA8VEc.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...