Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
కళతప్పుతున్న పాపికొండలు పర్యాటకం 
 

 

కళతప్పుతున్న పాపికొండలు పర్యాటకం వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: సెలవు రోజు వచ్చిందంటే చాలు పర్యాటకులతో గోదావరి తీరం కిటకిటలాడుతుండేది. ప్రస్తుతం దసరా సెలవులు ప్రకటించి వారం రోజులు కావస్తున్నా.. పాపికొండలు పర్యాటకం గత వైభవాన్ని అందుకోలేక పోతోంది. ఈ వారం రోజుల్లో మండలంలోని పోచవరం లాంచీల రేవు నుంచి ఒక్కరోజూ 400 మంది పర్యాటకులు వెళ్లలేదని నిర్వాహకులు చెబుతున్నారు. బుధవారం ఏడు లాంచీల్లో 250 మంది మాత్రమే పోచవరం రేవు నుంచి పర్యాటకానికి తరలి వెళ్లారు. దిగువ ప్రాంతం నుంచి ఆశించిన స్థాయిలో పర్యాటకులు రాకపోవడంతో పాపికొండలు, పేరంటాలపల్లి, కొల్లూరు ఇసుక తెన్నెలు కళ తప్పాయి. పర్యాటకులు తగ్గడంతో వెదురు అల్లికల  వస్తువులు కొనేవారు లేక గిరిజనులు నిరాశ చెందుతున్నారు.

ప్రకృతి కన్నెర్ర.. వరుస ప్రమాదాలు.. 
దేవీపట్నం మండలం పరిధిలోని గోదావరిలో ఈ ఏడాది వేసవిలో జరిగిన వరుస లాంచీ ప్రమాదాలు పర్యాటకానికి గెడ్డలిపెట్టులా మారాయి. దేవీపట్నం మండలం పరిధిలో గోదావరిలో పర్యాటక రేవు మార్పిడి, పదిరోజుల క్రితం కొల్లూరు రాత్రిబస పర్యాటకంలో నల్గొండకు చెందిన పర్యాటకుడు గోదావరిలో మృతి చెందడం తదితర కారణాలతో పర్యాటకుల రద్దీ తగ్గినట్లు భావిస్తున్నారు.

గతంలో పండుగ సెలవులు వచ్చాయంటే.. 
దేవీపట్నం, వీఆర్‌పురం మండలాల్లోని పర్యాటక లాంచీల రేవుల్లో సందడి వాతావరణం ఉండేది. లాంచీలన్నీ రద్దీగా ఉండేవి. ఒక్కోరోజు ఉదయం 7 గంటకే పర్యాటకం ప్రారంభమయ్యేది. ఒక్కో లాంచీ రెండు ట్రిప్పులు వేసినా పర్యాటకులకు టిక్కెట్లు దొరక్క వెనక్కి వెళ్లిపోయేవారు.  ప్రధానంగా దసరా, సంక్రాంతి పండుగల సెలవుల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. సెలవులు పది రోజుల్లో దాదాపు 30వేల మందికి పైగా పర్యాటకులు పోచవరం రేవు నుంచి వెళ్లేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. పర్యాటక లాంచీలు ఖాళీగా ఒడ్డుకే పరిమితమయ్యాయి.

Link to comment
Share on other sites

పర్యాటక ‘వరం’
13-11-2018 03:29:26
 
  • పర్యాటక కేంద్రంగా పోలవరం
  • రూ.5 వేల కోట్లతో పర్యాటకాభివృద్ధి
  • 7 స్టార్‌ హోటల్‌, ఫిల్మ్‌సిటీ నిర్మాణం
  • ఏడేళ్లలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక
  • పర్యాటక శాఖ మాస్టర్‌ ప్లాన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ జాతీయ ప్రాజెక్టుకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌, దాని చుట్టు పక్కల గ్రామాలను ‘హరిత పర్యాటక’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ బాధ్యత మొత్తం పర్యాటక శాఖకు అప్పగించింది. ఇటీవల సీఎం చంద్రబాబు సూచనల మేరకు డ్రాఫ్ట్‌ ప్లాన్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. అనంతరం సీఎం దీనికి ఆమోదం తెలిపారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పోలవరం ప్రాంతాన్ని రూ.5000 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 
5 నుంచి 7 ఏళ్ల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ డ్రాప్ట్‌ ప్లాన్‌కు అధికారులు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు. పోలవరం ప్రాంతంలో వాటర్‌ ఫ్రంట్‌తో పాటు 7 స్టార్‌, 5 స్టార్‌ హోటళ్లు, డ్యామ్‌ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కన్వెన్షన్‌ సెంటర్‌, గోల్ఫ్‌ క్లబ్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, ఫిల్మ్‌సిటీని కూడా నిర్మించనున్నారు. రవాణా సౌలభ్య కోసం ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని వాటర్‌ ట్రాన్స్‌పోర్టుతో అనుసంధానం చేస్తున్నారు. దీని కోసం 25 ప్రత్యేక ఎలక్ర్టానిక్‌ బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. పోలవరం పర్యాటక ప్రాజెక్టు ద్వారా 13 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
 
హెరిటేజ్‌, ఆధ్యాత్మిక టూరిజం
కొత్త నిర్మాణాలతో పాటు పోలవరం చుట్టు పక్కల ఉన్న పురావస్తు ప్రాంతాలు, దేవాలయాలను కూడా ప్రభుత్వం టూరిజం కిందకు తీసుకుంది. భద్రాచలం ప్రారంభం నుంచి రాజమండ్రి వరకూ నదీ తీరాన ఉన్న దేవాలయాలను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. పోలవరం సమీపంలోని కేదారేశ్వర దేవాలయం, వెంకటేశ్వరస్వామి దేవాలయం, బుట్టాయగూడెంలోని శివాలయం, శ్రీరామగిరి దేవాలయాను కూడా పర్యాటక శాఖ తీసుకుంది. గుణదల, రాయనిపేట, చొక్కనపల్లి, రుద్రంకోట వంటి పురావస్తు ప్రాంతాలనూ అభివృద్ధి చేయనున్నారు.
 
2sf2sdfws.jpg 
Link to comment
Share on other sites

ఫిబ్రవరి 2 నుంచి కొండవీడు ఉత్సవాలు
13-11-2018 03:58:17
 
గుంటూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కొండవీడు ఉత్సవాలను ఫిబ్రవరి 2 నుంచి నిర్వహిస్తున్నట్టు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ విషయమై కొండవీడు కోటపై మంత్రులు అఖిలప్రియ, నక్కా ఆనందబాబు, కలెక్టర్‌ కోన శశిధర్‌, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు వివరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...