Jump to content

Balayya Guntur Vachesaru


Dictator

Recommended Posts

గుంటూరు : యువగర్జన సదస్సులో పాల్గొనడానికి ప్రముఖ హీరో బాలకృష్ణ ఒక రోజు ముందే గుంటూరుకు చెరుకున్నారు. బాలకృష్ణ గుంటూరులో అడుగుపెట్టడం ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు బాలకృష్ణ నడుం బిగించిన విషయం తెలిసిందే. ఆయనకు దేశం కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సభ సమయానికి వచ్చి వెళ్లిపోవడం కాకుండా సభా ప్రాంగణంలోనే ఉండి సన్నాహాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన ఒక రోజు ముందుగానే బయలుదేరి వచ్చినట్లు తెలుస్తోంది. సభకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి బాలకృష్ణ మిగతా నాయకులతో కలిసి సమీక్షించనున్నారు.

 

గుంటూరులో యువగర్జన సదస్సు జరగనున్న ఎన్టీఆర్‌ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. సదస్సుకోసం సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఎద్దుకొమ్ములను ఇరువైపులా అలంకరించి గర్జించే సింహాలను ఉంచటంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వేదికకు చుట్టుపక్కల ఏర్పాటుచేసిన నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌, తారకరత్న కటౌట్లు,పూల ప్రభలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.సదస్సు ఏర్పాట్లను నందమూరి తారకరత్న పర్యవేక్షించారు. యువగర్జన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఆయన అన్నారు.

 

(fireworks) (fireworks) (fireworks) (fireworks) (fireworks)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...