Jump to content

Rythu Runa Mafi


sonykongara

Recommended Posts

రుణమాఫీకి నిధులు సిద్ధం
28-02-2019 03:20:58
 
  • మార్చి 8 తర్వాత చెల్లింపులు
  • 37 లక్షల మంది రైతులకు లబ్ధి
అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు 4, 5 విడతల రుణమాఫీ నిధులు వడ్డీతో కలిపి రూ.8,300 కోట్లు సిద్ధంగా ఉన్నాయని ఆర్థికశాఖ పేర్కొంది. మార్చి 8వ తేదీ తర్వాత నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో పడతాయని.. దీనిపై ఆందోళన వద్దని స్పష్టం చేసింది. 4, 5 విడతల రుణ మాఫీలో 37 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని తెలిపింది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మొదట్లోనే 10 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇచ్చింది. పదేళ్లలో ఆ బాండ్లను ఎప్పుడైనా నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. కానీ 4, 5 విడతల రుణమాఫీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, పోస్టుడేటెడ్‌ చెక్కులు ఇచ్చి రైతులను మోసం చేయబోతోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది.
 
రైతుల చేతిలో ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు ఉన్నాయి కాబట్టి 4,5 విడతల రుణమాఫీల గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు చేసిన మూడు విడతల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు విడుదల చేసింది. మూడో విడత రుణ మాఫీలో 36.68 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. తర్వాత అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో రాష్ట్ర వ్యవసాయ శాఖ రుణమాఫీ ఫిర్యాదుల కార్యక్రమాన్ని చేపట్టింది. మాఫీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మొదటి విడత నుంచి మూడో విడత వరకు లబ్ధి పొందని రైతుల సమస్యలను ఈ ఫిర్యాదుల కార్యక్రమంలో పరిష్కరించి, రుణమాఫీ చేశారు. అందులో చాలా మంది రైతులు 4, 5 విడతల రుణమాఫీకి అర్హులవుతారు.
 

Advertisement

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...