Jump to content

TDP going 2 become National Party


Cyclist

Recommended Posts

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని టిడిపి కార్యాలయంలో కోరుట్ల నియోజక వర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపికి ఆంధ్రా, తెలంగాణ రెండు కళ్లలాంటివని, తాము తెలంగాణను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు. తెలంగాణను ఇచ్చే సత్తా తమ పార్టీకి లేదని, అన్ని పార్టీలు ఏకమై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలే తప్ప ఎవరితో సాధ్యంకాదన్నారు.

 

తెలంగాణను తామే ఇస్తాననడం కాంగ్రెస్‌ పార్టీ ముర్ఖత్వమని, పార్లమెంటులో మెజార్టీ ఉన్నా ఎందుకు తీర్మానం చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. టిడిపిని రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన అన్నారు. కోరుట్ల నియోజక వర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజక వర్గ ఇంఛార్జ్‌ శికారి విశ్వనాధం, మున్సిపల్‌ ఛైర్మెన్‌ ఎంఏ గఫార్‌, నాయకులు గడ్డం మధు, తోట నారాయణ, రుద్ర శ్రీనివాస్‌, సంకు సుధాకర్‌, జిల్లా ధనుంజయ్‌, అన్నం అనిల్‌, పండిత్‌ రాజేశ్వర్‌, పిల్లి గంగారాం, బెజ్జారపు రాజు, రంగు రామాగౌడ్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని టిడిపి కార్యాలయంలో కోరుట్ల నియోజక వర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపికి ఆంధ్రా, తెలంగాణ రెండు కళ్లలాంటివని, తాము తెలంగాణను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు. తెలంగాణను ఇచ్చే సత్తా తమ పార్టీకి లేదని, అన్ని పార్టీలు ఏకమై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలే తప్ప ఎవరితో సాధ్యంకాదన్నారు.

 

తెలంగాణను తామే ఇస్తాననడం కాంగ్రెస్‌ పార్టీ ముర్ఖత్వమని, పార్లమెంటులో మెజార్టీ ఉన్నా ఎందుకు తీర్మానం చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. టిడిపిని రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన అన్నారు. కోరుట్ల నియోజక వర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజక వర్గ ఇంఛార్జ్‌ శికారి విశ్వనాధం, మున్సిపల్‌ ఛైర్మెన్‌ ఎంఏ గఫార్‌, నాయకులు గడ్డం మధు, తోట నారాయణ, రుద్ర శ్రీనివాస్‌, సంకు సుధాకర్‌, జిల్లా ధనుంజయ్‌, అన్నం అనిల్‌, పండిత్‌ రాజేశ్వర్‌, పిల్లి గంగారాం, బెజ్జారపు రాజు, రంగు రామాగౌడ్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

:rofl: :rofl: :rofl: :rofl: :rofl: :rofl: :rofl: :rofl: :rofl:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...