koushik_k Posted October 3, 2017 Share Posted October 3, 2017 విజయవాడ: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఒక్క ఏపీలోనే లక్ష కోట్ల ఖర్చుతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమాల తర్వాత గడ్కరీ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించారు. 4వ జాతీయ జలరవాణా మార్గానికి ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడు విజయవాడలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీగా హైవే ప్రాజెక్టులు రావడం ఇదే ప్రథమమని చంద్రబాబు అన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. గడ్కరీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆయన ఏ పని మొదలెట్టినా పూర్తి అయ్యేవరకు వెనక్కి తగ్గరని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు పూర్తి స్థాయిలో సహాకారం అందించాలని కోరారు. గడ్కరీపై తనకు నమ్మకం ఉందని అన్నారు. విశాఖ, రాయ్పూర్, అమరావతి, అనంతపురం ఎక్స్ ప్రెస్వే నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొత్త రాష్ట్రమైన ఏపీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గడ్కరీ తెలిపారు. జల రవాణా తన డ్రీమ్ ప్రాజెక్టు అని, రోడ్డు మార్గంతో పోలిస్తే జలరవాణాకు అయ్యే ఖర్చు చాలా తక్కువని ఆయన చెప్పారు. Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted October 3, 2017 Share Posted October 3, 2017 hmm. 1 lakh crores projects anatam malli start chesara Link to comment Share on other sites More sharing options...
MVS Posted October 3, 2017 Share Posted October 3, 2017 oka Ap ke matalo cheputaru 1lakh crores ani Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted October 4, 2017 Share Posted October 4, 2017 oka Ap ke matalo cheputaru 1lakh crores ani Link to comment Share on other sites More sharing options...
abhi Posted October 4, 2017 Share Posted October 4, 2017 oka Ap ke matalo cheputaru 1lakh crores ani Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.