Jump to content

Amaravati


Recommended Posts

అమరావతిలో 13 సంస్థలకు 34.85 ఎకరాలు
01-01-2019 03:16:53
 
  • కొన్నిటికి విక్రయం.. మరికొన్నిటికి లీజు
  • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కార్యాలయాలు, శాఖల స్థాపన కోసం 13 సంస్థలకు భూములను 34.85 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలు, విద్యాసంస్థలు ఉన్నాయి. కొన్నిటికి లీజు ప్రాతిపదికన ఈ కేటాయింపులు జరుగగా.. ఇంకొన్నిటికి మాత్రం నిర్ణీత ధరలు నిర్ణయించి విక్రయిస్తారు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు 7.50 ఎకరాలు ఇచ్చారు. ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్‌ (ఐసీఏడీఆర్‌)కు ఎకరాకు రూ.కోటి లీజు ప్రీమియంతోపాటు చదరపు అడుగుకు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దె చెల్లించే ప్రాతిపదికన 60 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు.
 
అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌కు 4.23 ఎకరాలు కేటాయించారు. ప్రజా గ్రంథాలయ శాఖకు చ.మీ.కు రూ.1 చొప్పున అద్దె ప్రాతిపదికన ఎకరం కేటాయించారు. రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌కు ఎకరా రూ.2 కోట్ల చొప్పున మూడెకరాల విక్రయించారు. రాష్ట్ర సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌కు చ.మీ.కు రూ.1 చొప్పున 4 ఎకరాలు లీజుకు ఇచ్చారు. విజయాబ్యాంకుకు 1.55 ఎకరాలు, కెనరా బ్యాంకు అర ఎకరం... ఎకరా రూ.4 కోట్ల చొప్పున కేటాయించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంట్రప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా, అమరావతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడెమీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థాపన కోసం ఎల్‌ అండ్‌ టీ సంస్థకు భూములు కేటాయించారు.
 
రాజధానిలో నిర్వాసితులకు పరిహారంలో సవరణ..
అమరావతిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించే గృహాలు, స్థలాల యజమానులకు అందజేయాల్సిన పరిహారాన్ని సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. గతంలో ప్రాజెక్టుల వల్ల ప్రభావితులయ్యే చేతివృత్తుల కార్మికులు, చిన్నతరహా వ్యాపారులకు మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇస్తుండగా.. తాజాగా ప్రాజెక్టుల కారణంగా జీవనోపాధిని కోల్పోయే అందరికీ (ఎల్పీఎస్‌ పింఛన్లను తీసుకోని వారై ఉండాలి) పెన్షన్‌ అందజేస్తారు. ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే వారికి తగినంత మొత్తాన్ని ఇస్తామని మాత్రమే గతంలో పేర్కొనగా.. తాజాగా నెలకు రూ.3,000 చొప్పున 12 నెలలపాటు ఇస్తామని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

పాత భవనాలకు తరుగుదల నుంచి మినహాయింపు

 

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు సాయంతో చేపట్టే వివిధ ప్రాజెక్టుల పనుల కోసం తొలగించే పాత భవనాలకు పరిహారం చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. తరుగుదల నుంచి మినహాయింపునిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సీఆర్‌డీఏ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఈమేరకు ఆమోదించింది.

38మందికి అంతర్రాష్ట్ర బదిలీలు 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కింద 38మంది అధ్యాపకులు, గ్రంథపాలకుల బదిలీలకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు, గ్రంథపాలకులు మొత్తం 40మంది దరఖాస్తు చేసుకోగా 38మంది బదిలీలకు ఆమోదం లభించింది.

 

Link to comment
Share on other sites

A glimpse of futuristic capital Amaravati

RamanaRao G Venkataramana Rao
Vijayawada, March 26, 2017 07:49 IST
Updated: March 26, 2017 07:49 IST
Grand plans: Associate architect of Foster + Partners Harsh Thapar giving a presentation on Amaravati at the Assembly Committee Hall in Velagapudi on Saturday.

Grand plans: Associate architect of Foster + Partners Harsh Thapar giving a presentation on Amaravati at the Assembly Committee Hall in Velagapudi on Saturday.   | Photo Credit: CH_VIJAYA BHASKAR

 

Foster + Partners gives a presentation of its opulent features to MLAs, MLCs in the presence of Kodela, Naidu

Foster + Partners unveiled a grand vision of the administrative city of Amaravati, for which it planned some futuristic projects such as a cloud-connected driverless rapid transit and buildings designed to be energy-efficient and that allow free flow of natural air, in a presentation to the MLAs and MLCs of Andhra Pradesh at the Legislative Assembly Committee Hall in Velagapudi on Saturday.

 

History and modernity

Showcasing the opulent features of Amaravati in the presence of Chief Minister N. Chandrababu Naidu, Legislative Council Chairman A. Chakrapani and Assembly Speaker Kodela Siva Prasada Rao, F+P associate architect Harsh Thapar and noted Indian architect Hafeez Contractor said the planning was done by duly taking into account the principles of ‘Vastu’ and the design elements of heritage structures such as temples in deference to Mr. Naidu’s wish to transform Amaravati into a city that combines history with modernity.

Mr. Thapar said the F+P had also factored in the internationally acclaimed grid model of urban development, which was shaped on the basis of a detailed study of elements that confer on a city the distinct characteristics of a capital city.

The striking features of New Delhi, Washington and London had been particularly researched as their urban designs were considered global benchmarks.

Each one of the 27 townships would be blocks measuring 2 km x 2 km and 10 % of its area would be made up of water Modies. Of the 900 acres, 51% would be green spaces, 25% building footprint, 14% roads and 10% waterfronts.

 

Four gateways

Mr. Thapar went on to say that Amaravati would have four prominent gateways that would bear resemblance to the entrance of historic temples and have city squares designed on the lines of Trafalgar, Sloane and the Duke of York Squares.

The city would have public spaces like the Battersea Park and the Rajpath in New Delhi.

Roads with 50, 24, 16, 9, and 7 metres width had been conceived with waterways occupying the central axes of major roads for facilitating water-borne transportation similar to the water taxis of Amsterdam.

 

Waterfront

The city would have a 27-km-long waterfront.

Besides, the facets of a smart city had been incorporated into the plans.

The city had been planned on the basis of wind flow patterns in the Amaravati area using state-of-the art technology and temperature studies conducted in Indian cities, particularly Vijayawada, Mr. Thapar explained.

A.P. Capital Region Development Authority Commissioner Ch. Sreedhar said the seed capital access road was poised for completion by the end of May and it was planned to get the foundation laid by the Chief Minister for seven arterial roads estimated at a cost of ₹1,000 crore on Ugadi.

To a query on the amount of water required and its sources for the water Modies and waterways planned in the administrative city, Mr. Sreedhar said 60% of the the 0.81 tmcft required would be provided by the Palavagu rivulet and the remaining 40% would be drawn, most probably from the Krishna.

Link to comment
Share on other sites

జీఏడీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రారంభం.. 53 మీటర్ల వెడల్పు, పొడవు
03-01-2019 03:55:18
 
636820845191770842.jpg
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలో అమరావతిలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయ సముదాయంలోని 5 టవర్లలో అన్నింటికంటే ఎత్తయిన జీఏడీ టవర్‌(సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు)కు సంబంధించిన ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. 50 అంతస్థులు, 225 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోని సెక్రటేరియట్‌ భవంతులన్నింట్లో అత్యంత ఎత్తయినదిగా రికార్డు సృష్టించనుంది. ఈ టవర్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న ఎన్‌సీసీ సంస్థ బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు, నిపుణుల సమక్షంలో ప్రారంభించింది. 3 రోజులపాటు ఏకధాటిగా జరగనున్న ఫౌండేషన్‌ ప్రక్రియలో 53 మీటర్ల వెడల్పు, 53 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతు కాంక్రీట్‌ను సుమారు 11,200 క్యూబిక్‌ మీటర్ల మేర వేయనున్నారు.
 
కాగా.. సెక్రటేరియట్‌ టవర్లలోని 2వ నెంబర్‌ టవర్‌కు సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థ షాపూర్జీ పల్లోంజీ గత నెల 27నే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించి, 65 గంటల్లో పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి 3వ నెంబర్‌ టవర్‌కు సంబంధిత నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ మొదలు పెట్టింది. ఇది శుక్రవారం పూర్తికానుంది. ఇక, సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌లోని మిగిలిన 2 టవర్ల ర్యాఫ్ట్‌ ఫౌండేఫన్‌ పనులు సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్నాయని సమాచారం.
Link to comment
Share on other sites

అమరావతిలో నాబార్డుకు 4.30 ఎకరాలు

 

ఎకరా రూ.2 కోట్లు చొప్పున కేటాయింపు

ఈనాడు, అమరావతి: నాబార్డు అవసరాల నిమిత్తం అమరావతిలో 4.30 ఎకరాల భూమిని ఎకరా రూ.2 కోట్ల ధరకు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రీయ విద్యాలయానికి రూ.3 కోట్ల ధరకు 8 ఎకరాలు, అమరావతి వెంచర్‌ హేబిటేట్‌ సెంటర్‌ కోసం ఎండియా ఫండ్‌ అడ్వయిజర్స్‌కు 2.30 ఎకరాలు రూ.50 లక్షల ధరకు కేటాయించనున్నారు. చైతన్య మిషన్‌కు మూడెకరాల భూమిని ఎకరా రూ.2 లక్షల ధరకు 35 ఏళ్లపాటు లీజుకు కేటాయించాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

ఇదిగిదిగో అమరావతి!
04-01-2019 03:27:34
 
636821692547802615.jpg
చీమలదండులా కార్మికులు!
ఆకాశాన్ని అంటుతున్నట్లుగా వరుసగా పెద్ద సంఖ్యలో క్రేన్లు!
అల్లంత దూరం నుంచి కాంక్రీటు పోసే భారీ యంత్రాలు!
‘బండెనక బండి కట్టి’ అంటూ ఎడతెరపి లేకుండా...
రయ్య్‌మని తిరుగుతూ మెటీరియల్‌ను చేరవేస్తున్న టిప్పర్లు!
అక్కడ జరుగుతున్నది ఒక మహా నిర్మాణ యజ్ఞం!
అది... నవ్యాంధ్రుల రాజధాని ‘అమరావతి’ కళ్లముందు ఆవిష్కృతమవుతున్న దృశ్యం!
‘ఇన్ని పనులు జరుగుతున్నాయని ఇక్కడికి వచ్చి చూసేదాకా తెలియదు’ అని సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. అమరావతి పూర్తి నిర్మాణ వ్యయం దాదాపు లక్ష కోట్ల రూపాయలు. తొలి దశలో రూ.38 వేల కోట్ల విలువైన పలు నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. మరో పది వేల కోట్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. డిజైన్లు, గ్రాఫిక్‌లను వదిలేస్తే... రాజధానిలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సచిత్ర ప్రత్యేక కథనం..
  • రూపుదిద్దుకుంటున్న ఆకృతి
  • ఒకేసారి రూ.38 వేల కోట్ల విలువైన పనులు
  •  వేలకొద్దీ కార్మికుల భాగస్వామ్యం..
  • శరవేగంగా నిర్మాణ పనులు
  • మొత్తం 61 టవర్లలో 3,840 ఫ్లాట్లు..
  • ఇప్పటికి 1,200 ఫ్లాట్లు దాదాపు పూర్తి
  • భూమిలేని పేదలకు 5 వేల నివాసాలు సిద్ధం..
  • ప్రతి నిర్మాణంలోనూ షియర్‌ వాల్‌ టెక్నాలజీ
  • 285 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం..
  • పాలనా నగరిలో హైటెన్షన్‌ టవర్ల తొలగింపు
  • ముగింపు దశలో జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌..
  • ఐదు సచివాలయ టవర్ల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పూర్తి
 అమరావతి... నవ్యాంధ్రుల నవ రాజధాని! దీనిని ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది! ప్రణాళికలు, డిజైన్లు,గ్రాఫిక్‌లు చూపించింది. ‘అద్భుతం! అపురూపం’ అంటోంది! మరి... అసలు అమరావతిలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అసలు ఏమైనా జరుగుతోందా? ఇప్పటిదాకా అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబీ మాత్రమే తెలుసు! అక్కడ అంతకుమించి ఏమున్నాయి? ఎంతో మంది ప్రశ్నలు... కొందరి సందేహాలు! దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సచిత్ర కథనం ఇది...
 
 
22bb.jpgఇదిగిదిగో.. తెచ్చి... అతికించడం!
ఇటుక మీద ఇటుక పెట్టి, గోడలు కట్టి, స్లాబులు వేసి, క్యూరింగ్‌ చేసి... ఇది సంప్రదాయ పద్ధతి! పిల్లర్ల నుంచి స్లాబు వరకు ఎక్కడి నుంచో తెచ్చి... అతికించి... భవనాన్ని సిద్ధం చేయడం కొత్త పద్ధతి! దీనినే ‘ప్రికాస్ట్‌’ టెక్నాలజీ అంటారు. ఈ పద్ధతిలో చాలా వంతెనలను నిర్మించారు. అయితే, రాజధాని అమరావతి పరిధిలో సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రికాస్ట్‌ విధానంలోనే నిర్మిస్తున్నారు. మెట్లు, గోడలు, శ్లాబ్‌, చివరికి బాత్‌రూమ్‌ గోడలను కూడా ప్రికాస్ట్‌లోనే అమర్చుతారు. ఏడంతస్తుల సువిశాల భవంతిలో సీఆర్డీయేతోపాటు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీరెరా తదితర కార్యాలయాలు కొలువుతీరతాయి.
 
Housing-for-Gazetted-Office.jpgగృహమే కదా స్వర్గసీమ
ఉదయం లేచినప్పటి నుంచి ఆఫీసుకు వెళ్లాలనే తొందర! ఆఫీసు తర్వాత మళ్లీ ఇంటికి చేరుకోవాలనే ఆతృత! బైకు, కారు, బస్సు... వాహనం ఏదైనా ట్రాపిక్‌ ‘జాం’జాటం! అమరావతి లోగిలిలో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ప్రభుత్వ పాలనా నగరి పరిధిలోనే గెజిటెడ్‌ అధికారులకు, ఎన్జీవోలకు, నాలుగో తరగతి ఉద్యోగులకు క్వార్టర్స్‌ నిర్మిస్తున్నారు. సచివాలయంతోపాటు వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే వారికోసం ఇవి ప్రత్యేకం! వీటి నిర్మాణం చకచకా సాగుతోంది. క్వార్టర్స్‌ నుంచి వారు పనిచేసే కార్యాలయాలకు గరిష్ఠ దూరం... పది కిలోమీటర్లు! విశాలమైన రహదారులు ఎలాగూ ఉన్నాయి. పది నిమిషాల్లోపు పనిచేసే చోటికి చేరుకోగలరు! ఏమి హాయులే హలా!
 
 
IAS33artments-in-amaravathi.jpgకట్టిన ఇల్లు చూడు..
రాజధాని అంటేనే అఖిల భారత సర్వీసు అధికారులు, వివిధ స్థాయి ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కొలువు తీరే పరిపాలనా కేంద్రం. వీరందరి కోసం 61 టవర్లలో 3,840 అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. అన్నిచోట్లా షియర్‌ వాల్‌ టెక్నాలజీని వినియోగిస్తూ... పనులను పరుగులు తీయిస్తున్నారు. ఈ టవర్లలో ఇప్పటికే 1,200కు పైగా ఫ్లాట్ల నిర్మాణం పూర్తయి, తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఫిబ్రవరికల్లా కొన్ని గృహ ప్రవేశాలు కూడా జరగనున్నాయి.
 
 
5252.jpg80 రోజుల్లో టవర్‌ రెడీ
ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌... ఇలా ప్రభుత్వ, ప్రజల సేవలో అనేకమంది అఖిల భారత సర్వీసు అధికారులు! వారి హోదా, హుందాకు తగిన విధంగా ‘అదరహో’ అనిపించేలా ప్రత్యేకమైన నివాస సముదాయాలు సిద్ధమవుతున్నాయి. వీరికోసం ప్రత్యేకంగా 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్‌లో 24 ఫ్లాట్లు! ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 3,500 చదరపు అడుగులు! మూడు బెడ్‌రూమ్‌లు, ఒక జిమ్‌, ప్రార్థనా మందిరం, అత్యాధునిక కిచెన్‌, ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు వీలుగా సువిశాలమైన బాల్కనీ, ఏసీలు, టచ్‌తో పనిచేసే స్విచ్‌లు... అంతా ఆధునికమే! ప్రతి ఫ్లాట్‌కూ అనుబంధంగా సర్వెంట్‌ రూమ్‌ అదనం! 12 అంతస్తుల టవర్‌ బేసిక్‌ స్ట్రక్చర్‌ను గరిష్ఠంగా 80 నుంచి 90 రోజుల్లోనే నిర్మించేశారు. ఇంటీరియర్స్‌ పనులు చకచకా చేస్తున్నారు.
 
 
భళా... బంగ్లా
కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల కోసం 186 బంగ్లాలను నిర్మిస్తున్నారు. మంత్రుల కోసం మరో 36 బంగ్లాలు నిర్మిస్తారు. వీటి పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి.
 
 
879.jpgసిద్ధమవుతున్న ‘హైకోర్టు’
పరిపాలనా నగరిలోని జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లోనే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు కానుంది. పూర్తిస్థాయి హైకోర్టు నిర్మించిన తర్వాత ఇందులో సిటీ సివిల్‌ కోర్టులను నిర్వహిస్తారు. 4 ఎకరాల్లో... 2.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇందులో మొత్తం 23 కోర్టు హాళ్లు ఉంటాయి. దీని నిర్మాణం దాదాపుగా పూర్తయింది. హైకోర్టు నిర్వహణకు వీలుగా అవసరమైన ఇంటీరియర్స్‌ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు మొత్తం సిద్ధమవుతుంది.
 
 
454a.jpgగజిబిజి లేదు బాస్‌
ఒక కిలోమీటరు వెడల్పు... 6.6 కిలోమీటర్ల పొడవు! ఇది అమరావతిలోని పాలనా నగరి భౌగోళిక విస్తీర్ణం! ఒకవైపు కృష్ణా నదిని ఆనుకుని ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్‌తో ఈ ‘నగరం’ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా... మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది గృహ సముదాయాలు ఒకవైపు, జడ్జిల బంగళాలు... హైకోర్టు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సచివాలయ టవర్లు మరోవైపు నిర్మితమవుతాయి. శాఖమూరు వరకు పరిపాలనా నగరి విస్తరిస్తుంది. మొత్తం అమరావతికి ‘పరిపాలనా నగరి’ హృదయంలాంటిది. ఇది కేవలం పరిపాలనా, అధికారుల నివాస ప్రాంతంగా మాత్రమే కాకుండా... ప్రజలు, సందర్శకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేలా రూపుదిద్దుకుంటుంది. ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.1096 కోట్లు వ్యయం చేస్తారు. ఈ పనులు 2020 డిసెంబరుకు పూర్తిచేస్తారు. మరో విశేషమేమిటంటే... పరిపాలనా నగరిలో ఎక్కడా గజిబిజితనం కనిపించదు. వీధి దీపాల స్తంభాలు మినహా తీగలు కూడా బయటికి కనిపించవు. ఈ ప్రాంతంలో ఉన్న హైటెన్షన్‌ టవర్లను మరో చోటికి (రీలొకేట్‌) చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు సాగడానికి వీలుగా 6.6 కిలోమీటర్ల పొడవునా కొత్త లైన్‌వేసి ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలను అమర్చారు.
 
 
పేదలకూ చక్కటి గూడు
అమరావతి ప్రజా రాజధాని! ఇక్కడ అన్ని వర్గాల వారికీ చోటుంది! రాజధాని పరిధిలో భూమిలేని పేదల కోసం ప్రత్యేకంగా పీఎంఏవై-ఎన్టీఆర్‌ గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. చక్కటి ప్లానింగ్‌, నిర్మాణ ప్రమాణాలతో ‘ఎంత బాగున్నాయో’ అనిపించేలా వీటిని నిర్మించారు. మొత్తం పది గ్రామాల్లో ఐదు వేల గృహాల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. చాలాచోట్ల ఇక లబ్ధిదారులకు వాటిని కేటాయించడమే మిగిలింది.
 
 
సరస్వతీ నమస్తుభ్యం...
అమరావతిలో పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. వీటిలో విట్‌, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అమృత, ఎన్‌ఐడీ క్యాంపస్‌ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మరికొన్ని సంస్థలు ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉంది.
Link to comment
Share on other sites

రాత్రిళ్లూ.. రాజధాని పనులు

3ap-state2a_1_1.jpg

రాజధాని అమరావతి పరిధిలో వివిధ భవనాల నిర్మాణాలు రాత్రి, పగలూ అనే తేడాలేకుండా శరవేగంగా జరుగుతున్నాయి.  సచివాలయం పరిధిలోని సీఎం టవర్‌ సహా హైకోర్టు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల గృహ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. విద్యుద్దీపాల వెలుగులో జరుగుతున్న సంబంధిత పనులతో ప్రస్తుతం అమరావతి ప్రాంతం కళకళలాడుతోంది. అధికారుల పర్యవేక్షణలో శ్రామికులు షిప్టులవారీగా వారీగా పనిచేస్తున్నారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణరంగ పనుల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఒకవైపు విద్యుద్దీపాల వెలుగులు, మరోవైపు పెద్ద సంఖ్యలో శ్రామికుల సందడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

- ఈనాడు, అమరావతి

3ap-state2b_1.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...