Jump to content

జగన్ ను ఏకి పారేస్తున్న ఇండియా టుడే జాతీయ ఛానెల్


Recommended Posts

https://www.amaravativoice.com/avnews/news/india-today-news-about-jagan-jerusalem-tour

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారు మోగుతుంది. మొన్నటి దాక ఆ రికార్డు, ఈ రికార్డు, ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది అంటూ జాతీయ ఛానెల్స్ లో మన రాష్ట్రం గురించి వార్తలు వచ్చేవి. అయితే, ఇప్పుడు మాత్రం, నెగటివ్ న్యూస్, నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నటి దాక, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయిన విద్యుత్ ఒప్పందాల రద్దు, 75 శాతం పరిశ్రమల్లో రిజర్వేషన్ వంటి అంశాలు ప్రధానంగా వస్తే, ఈ రోజు మాత్రం, రెండు పూర్తీ నెగటివ్ వార్తలు, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జెరుసలేం టూర్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ముందుగా ఇది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న మొదటి విదేశీ పర్యటన.

అయితే ఇది ఏ పెట్టుబడులు కోసమో కాదు, ఆయన వ్యక్తిగత పర్యటన, కుటుంబంతో కలిసి వెళ్తున్నారు. అయితే వారం రోజుల క్రితం విడుదల చేసిన జీఓలో, ఈ పర్యటన ఖర్చు అంతా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. అయితే నిన్న వచ్చిన ఒక జీఓలో మాత్రం, సెక్యూరిటీ కోసమని 22.50 లక్షలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అయితే అంత పెద్ద మొత్తం, సెక్యూరిటీ కోసం ఎందుకో అర్ధం కాలేదు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటి అంటే, ఈ 22.50 లక్షలు, Triple “S“-RT&T టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ట్రావెలింగ్ కంపెనీకి ఇవ్వమని ఆ జీఓ లో ఉంది. నిజానికి ఇది సెక్యూరిటీ కంపెనీ కాదు. Triple “S“-RT&T అనేది టూర్స్ ప్లాన్ చేసే ఒక ఏజెన్సీ. మరి ఈ కంపెనీకి, 22 లక్షలు సెక్యూరిటీ కింద ఇవ్వమనటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ప్రభుత్వం దీని పై వివరణ ఇస్తే కాని ఒక క్లారిటీ వచ్చే పని లేదు. నిజానికి జెరుసలేం వెళ్ళటానికి, మన దేశం నుంచి అయ్యే ఎయిర్ టికెట్ ఖర్చు, 50 వేలు మాత్రమే ఉంది. ఇవన్నీ చూసుకుంటే, 22 లక్షలు ఎక్కవ అనే చెప్పాలి. ఇదే విషయం ఇండియా టుడే జాతీయ ఛానెల్ నిలదీసింది. సొంత టూర్స్ కి, ప్రజా ధనం వాడతారా అంటూ నిలదీసింది. మరో పక్క, నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను బ్యార్య, తెలంగాణాలో ఒక ట్రాఫిక్ పోలీస్ ని బెదిరిస్తూ, నిన్న కేసిఆర్ తో చెప్పి, సస్పెండ్ చేపిస్తా అనే వీడియో కూడా ప్రముఖంగా ఇండియా టుడేలో వచ్చింది. ఒక ఎమ్మెల్యే కొడుకు పోలీసులని కొడితే, ఎమ్మెల్యే భార్య వచ్చి పోలీసులనే సస్పెండ్ చేపిస్తా అని బెదిరిస్తున్నారని, ఇండియా టుడే ఏకి పారేసింది. ఎందుకో కాని, మన తెలుగు మీడియా, ఈ వార్తలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ వీడియోలు ఇక్కడ చూడచ్చు.

 https://www.facebook.com/IndiaToday/videos/908853212811675/  

https://www.facebook.com/IndiaToday/videos/453858868532056/

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...