Jump to content

హాస్యనటుడు పృథ్వీరాజ్‌పై కేసు


OnlyTDP

Recommended Posts

హైదరాబాద్ : హాస్యనటుడు పృథ్వీరాజ్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు వేధింపులు, చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకుపురానికి చెందిన కె.కవితకు మల్లికార్జున్‌ అనే వ్యక్తితో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక పెద్దల సమక్షంలో విడిపోయారు. కవిత పిల్లలతో సహా నగరానికి వచ్చి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లో నివసిస్తోంది. ఉద్యోగం కోసం వెతుకుతుండగా అనిల్‌ అనే వ్యక్తి పరిచయ మయ్యాడు. 2010 జూలైలో హాస్యనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ వద్దకు ఆమెను తీసుకెళ్లగా... తన కార్యాలయంలో కవితకు ఉద్యోగం ఇచ్చాడు. కొద్ది రోజుల తరువాత ప్రేమిస్తున్నానంటూ... నమ్మించి సినిమా ఫక్కీలో వివాహమాడాడు. కవిత పిల్లలను స్కూల్‌లో అడ్మిట్‌ చేసి కాపురం పెట్టాడు. ఆరు నెలలుపాటు అంతా బాగానే సాగింది. పృథ్వీరాజ్‌కు మరో మహిళతో సంబంధం ఉన్నట్టు కవితకు తెలియడంతో అతడిని నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను విస్మరించడంతోపాటు మాయమాటలు చెప్పి రెండు లక్షలు, బంగారు నగలు తీసుకొని మోసం చేశాడని పోలీసులకు కవిత ఫిర్యాదు చేసింది. 498ఎ, 420 సెక్షన్‌ కింద పృథ్వీరాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...