Jump to content

sonykongara

Members
  • Posts

    66,780
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. ప్రభాకర్‌రావు చుట్టూనే..! ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ఐజీగా, ఆ తర్వాత ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. Updated : 02 Apr 2024 06:51 IST భారాస అసమ్మతివర్గీయులు, ప్రతిపక్ష నేతలపై నిఘాకే ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం’ ఏర్పాటు ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందినవారి డబ్బు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ఐజీగా, ఆ తర్వాత ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి ప్రతిపక్ష నేతలతోపాటు అధికార పార్టీలోని అసమ్మతివర్గీయులపై నిఘా పెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు.. దీనికి ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం’ అని పేరు పెట్టినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడైంది. సామాజికవర్గం ప్రాతిపదికన సస్పెండెడ్‌ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఏరికోరి దీని బాధ్యతలు అప్పగించినట్లు బహిర్గతమైంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందిన డబ్బును పట్టుకున్నట్లు కూడా తేలింది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్‌రావు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత గురువారం అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఐబీ విధానాలకు విరుద్ధంగా ప్రత్యేక బృందం.. 2014లో భారాస(అప్పటి తెరాస) తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజికవర్గ సమీకరణాల మేరకు 2016లో ప్రభాకర్‌రావును నిఘా విభాగానికి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆయన తన సామాజికవర్గానికే చెందిన వారితోపాటు గతంలో తనతో కలిసి పనిచేసిన వారిలో కొందర్ని నిఘా విభాగంలోని వేర్వేరు ఉప విభాగాల్లో నియమించారు. వీరిలో నల్గొండ జిల్లా నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ కమిషనరేట్‌ నుంచి భుజంగరావు, సైబరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌రావు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి తిరుపతన్న తదితరులు ఉన్నారు. వీరందరితో ‘స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం’ ఏర్పాటు చేశారు. దీని నాయకత్వ బాధ్యతను ప్రణీత్‌రావుకు అప్పజెప్పారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, సొంత పార్టీలోని తిరుగుబాటుదారులపై నిఘా పెట్టడమే ఈ బృందం ఏర్పాటు ఉద్దేశం. ఎస్‌ఐబీ విధానాలకు ఇది పూర్తిగా విరుద్ధం. రాధాకిషన్‌రావు సూచనతో ఎస్‌ఐబీలోకి గట్టుమల్లు సామాజిక సమీకరణాలతోపాటు ప్రభాకర్‌రావు సూచనల ప్రకారం హైదరాబాద్‌ నగరంపై రాజకీయంగా, ఇతరత్రా పట్టు నిలుపుకొనేందుకు భారాస అధినాయకత్వం 2017లో తనను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించిందని రాధాకిషన్‌రావు విచారణలో అంగీకరించారు. ఆ తర్వాత తన సూచన మేరకు గట్టుమల్లును పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ప్రభుత్వం నియమించిందన్నారు. అక్కడ రెండేళ్లపాటు అంటే 2021 వరకూ పనిచేశాక.. తమ ఉమ్మడి లక్ష్యసాధన(భారాస పాలన కొనసాగేలా చూడటం)లో భాగంగా తన సూచన మేరకు గట్టుమల్లును ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీలోకి తీసుకున్నారని రాధాకిషన్‌రావు వెల్లడించారు. ఆ తర్వాతి నుంచి రాష్ట్రంలో భారాస(అప్పటి తెరాస)ను బలోపేతం చేయడంతోపాటు అదే పార్టీ పాలన కొనసాగేలా చూసేందుకు ప్రభాకర్‌రావు, భుజంగరావు, వేణుగోపాల్‌రావు, ప్రణీత్‌రావులు తరచూ సమావేశమవుతుండేవారు. తమ రహస్య, అనధికారిక కార్యకలాపాలు బయటకు పొక్కకుండా వాట్సప్‌, సిగ్నల్‌, స్నాప్‌చాట్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారానే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో భారాసను ఎలాగైనా మళ్లీ అధికారంలోకి తేవడంతోపాటు పార్టీపై అధినేతకు పూర్తి అజమాయీషీ ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ప్రభాకర్‌రావు బృందం భావించిందని, దీనిలో భాగంగా ప్రతిపక్షాల నాయకులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, వ్యాపారులు, భారాస అసమ్మతి వర్గీయులతోపాటు అదే పార్టీలో అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా పెట్టిందని రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడించారు. రాజకీయ పలుకుబడితో రెండుసార్లు ఓఎస్డీగా.. రాధాకిషన్‌రావుకు సంబంధించిన కొన్ని కీలకాంశాలను పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. 2020 ఆగస్టులో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఆయన పదవీ విరమణ చేశారు. రాజకీయ పలుకుబడి, సామాజికవర్గ సమీకరణాలు ఉపయోగించి, అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి మూడేళ్లపాటు ఓఎస్డీగా నియమితులయ్యారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ అధినేతగా కొనసాగారు. 2023 ఆగస్టు నాటికి మూడేళ్లు పూర్తి కాగా.. మరో మూడేళ్లపాటు ఇదే హోదాలో పనిచేసేందుకు ఇంకోసారి అనుమతి తెచ్చుకున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్లో తమ పట్టు కొనసాగించాలంటే రాధాకిషన్‌రావు అవసరం ఉందని అప్పటి రాజకీయ పెద్దలతోపాటు ప్రభాకర్‌రావు కూడా భావించారు. ఆయన ఆదేశాలతోనే ఎన్నికల డబ్బు స్వాధీనం టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసినప్పుడు ప్రభాకర్‌రావు ఆదేశాలు, ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్‌రావు డబ్బు స్వాధీనం వంటి కేసులు పట్టుకున్నారు. వాస్తవానికి టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రభాకర్‌రావు సూచనల మేరకు 2018 ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని రాధాకిషన్‌రావుకు ప్రణీత్‌రావు చేరవేశారు. దీని ఆధారంగా రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది హైదరాబాద్‌లోని రామ్‌గోపాల్‌పేట ఠాణా పరిధిలో ప్యారడైజ్‌ హోటల్‌ వద్ద శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన భవ్య సిమెంట్స్‌ సంస్థ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు చెందిన రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2020లో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్‌రావు బృందం సాంకేతిక నిఘా (టెక్నికల్‌ సర్వేలైన్స్‌) కార్యకలాపాలు నిర్వహించింది. ఈ బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువులకు సంబంధించి సిద్దిపేటలోని ఒక చిట్‌ఫండ్‌ కంపెనీకి చెందిన కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2022 మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు సాంకేతిక నిఘా నిర్వహించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నాటి భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులైన గుంట సాయికుమార్‌రెడ్డి, కుండె మహేశ్‌, డి.సందీప్‌కుమార్‌, ఎం.మహేందర్‌, ఎ.అనూష్‌రెడ్డి, వెన్నం భరత్‌ల నుంచి రూ.3.5 కోట్లు స్వాధీనం చేసుకుని.. గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు.
  2. mana me janga ni baytaki pamapichama..
  3. ante yanamala lekunte finance minister chese vadu ledu ani ani munde ohisthunaru
  4. YCP yadava community ki 2 MP seats icchindi. TDP yadava community ki icchina okka seat kuda vennaki tisukunte ela? BJP RRR ki MP seat icche laga cheyyali kani ela chesthe TDP ke bad avuthundi, yanamala kakapothe inko yadava ki ivvandi icchina seat tisukunte TDP ke nastam.
  5. కేటీఆర్ అంటే క‌ల్వ‌కుంట్ల ట్యాపింగ్ రావు వారిది ట్యాపింగ్ ఫ్యామిలీ- - మంత్రి కోమ‌టిరెడ్డి
  6. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ani rasaru 3 seats naku telusu, yadav lo MP ki dabbu pette vadu leka icharu putta mahesh ki .
  7. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. evi ah 4 seats ??
  8. ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! By nymisha 3 hours ago 1 రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీ .. బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ సీటును తీసుకుని.. నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే.. రఘురామ కృష్ణరాజు తానుపోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏలూరు నుంచి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్‌కు సీటు ఇచ్చింది. ఆయన యనమల అల్లుడు. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఏలూరులో బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. చివరికి మహేష్ యాదవ్ మాత్రమే కనిపించారు. నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది. తర్వాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది. నర్సాపురం టిక్కెట్ రఘురామకు బీజేపీ కేటాయించి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. అంతా స్మూత్ గా వెళ్లిపోయేది. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమయింది. రఘురామకు టిక్కెట్ కేటాయించేలేము అనుకున్నప్పుడు.. వేరే నియోజకవర్గాన్ని బీజేపీ ఆప్షన్ గా తీసుకున్నట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. రఘురామకు టిక్కెట్ ఇవ్వకపోవడం.. జగన్ కు బలం అన్న పరిస్థితి రావడంతో టీడీపీ ఆయనను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. బీజేపీ హైకమాండ్.. స్పందన ఎలా ఉంటుందో… చూడాల్సి ఉంది. Read more at telugu360.com: ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! - https://www.telugu360.com/te/tdp-lobbying-for-raghurama-krishnam-raju-ticket/
  9. ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! By nymisha 3 hours ago 1 రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీ .. బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ సీటును తీసుకుని.. నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే.. రఘురామ కృష్ణరాజు తానుపోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏలూరు నుంచి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్‌కు సీటు ఇచ్చింది. ఆయన యనమల అల్లుడు. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఏలూరులో బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. చివరికి మహేష్ యాదవ్ మాత్రమే కనిపించారు. నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది. తర్వాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది. నర్సాపురం టిక్కెట్ రఘురామకు బీజేపీ కేటాయించి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. అంతా స్మూత్ గా వెళ్లిపోయేది. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమయింది. రఘురామకు టిక్కెట్ కేటాయించేలేము అనుకున్నప్పుడు.. వేరే నియోజకవర్గాన్ని బీజేపీ ఆప్షన్ గా తీసుకున్నట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. రఘురామకు టిక్కెట్ ఇవ్వకపోవడం.. జగన్ కు బలం అన్న పరిస్థితి రావడంతో టీడీపీ ఆయనను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. బీజేపీ హైకమాండ్.. స్పందన ఎలా ఉంటుందో… చూడాల్సి ఉంది. Read more at telugu360.com: ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! - https://www.telugu360.com/te/tdp-lobbying-for-raghurama-krishnam-raju-ticket/
  10. https://www.telugu360.com/te/tdp-lobbying-for-raghurama-krishnam-raju-ticket/
  11. Palnadu lo Congi, YCP ki yadav community max vellataniki Janga ne karanam, kani ippudu vallu entha mandi vastharo TDP loki anedi theliyadu, janga ki sambdam lekunda ne chala mandi TDP ki vastharu, athani valla kontha help avuthundi anukutunna, Palnadu lo weaker community nundi TDP loki joings baga avuthunnayi yadav, madiga ne kakunada mala community nundi kuda TDP ki vasthaunaru adi chusthe undercurrent ga kontha TDP ki undha anipisthundi last week nundi, kani TDP loni kontha covert gallu waste kodukulu TDP loki ravalni vache vallani ma thata ni tittaru, ma nanani tittaru nannu titteru ani aputunnaru, macherla win kaledu ante adi purthiga TDP tappu avuthundi, NRT TDP lo kuda 3 varagalu unnayi andaru gattiga chesthe bayata padavacchu elane unte pothundi, kanna ni NRT ki vesi STP BC ki isthe bagundedi anipisthundi.
  12. emo govt vasthe edokati istharu
  13. మాచర్ల, ఏప్రిల్1: అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) సోమవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతోపాటు ఆ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేసేశారు. ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ లేకుంటే 6వ తేదీ.. పల్నాడు జిల్లాలో జరిగే కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పాల్గొనున్నారు. ఆయన సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు. మరోవైపు జంగా కృష్ణమూర్తి వర్గమంతా ముకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేసింది. వారు కూడా నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అయితే గురజాల ఎమ్మెల్యే వైసీపీ టికెట్‌ను జంగా కృష్ణమూర్తి ఆశించారు. కానీ మరొకరికి ఆ టికెట్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేటాయించారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇంకో వైపు బీసీ నేతగా మంచి పేరున్న జంగా కృష్ణమూర్తి.. నరసారావుపేట నుంచి ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపనున్నారనే ఓ ప్రచారం సైతం ఇటీవల వరకు సాగింది. కానీ ఆ టికెట్ సైతం మరొకరికి ఇచ్చేశారు. అటు ఎంపిీ, ఇటు ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించక పోవడంతో జగన్ పార్టీకి జంగా బై బై చెప్పినట్లు సమాచారం. ఇటీవల టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవికి వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి బీసీ నేత జంగా కృష్ణమూర్తికి కట్టబెడతారంటూ ఓ ప్రచారం అయితే గట్టినే నడిచింది. కానీ ఆ పదవిలో వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే నియమించారు. దాంతో జంగాతోపాటు ఆయన వర్గం సైతం తీవ్ర అసంతృప్తికి గురైందని తెలుస్తోంది. జంగా.. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేయడానికి ఇది ఒక ముఖ్య కారణమని ఆయన వర్గం అభిప్రాయపడుతోంది. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ గెలుపులో ఇదే జంగా కృష్ణమూర్తి అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాదించింది. దీంతో కేసీఆర్ కేబినెట్‌లోని బీసీ మంత్రులను గురజాల వేదిక జంగా కృష్ణమూర్తి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఘనంగా సన్మానించారు. తద్వారా ఆ మరుసటి ఏడాది అంటే 2019లో జరిగిన ఏఫీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపునకు.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఈ కార్యక్రమం గొప్పగా దోహదపడిందనే ఓ చర్చ అయితే నేటికి పోలిటికల్ సర్కిల్‌లో వాడివేడిగా వైరల్ అవుతోంది.
  14. independent vesthe TDP JSP help tho easyga win avvachu
×
×
  • Create New...