Jump to content

మన్మోహన్ సుద్దులు


satya

Recommended Posts

న్యూఢిల్లీ : మంత్రులు వ్యాపారాలు చేయరాదు... ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటించాలి. కుటుంబ సభ్యుల ఉద్యోగాలను గురించి కూడా నివేదికలో పొందుపరచాలి... ఇవీ ప్రధాని మన్మోహన్ సింగ్ పెట్టిన నియమాలు. ఈ నిబంధనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రులు అందరికీ వర్తిస్తాయి. సుపరిపాలన సాధనలో భాగంగా ప్రధాని మన్మోహన్ ఈ కఠిన నియమావళిని విధించారు. మంత్రులంతా ఇకపై విధిగా తమ ఆస్తులు, అప్పులు ప్రకటించాలని నియమావళిలో ప్రధాని పేర్కొన్నారు. బహుళజాతి సంస్థల్లో మంత్రులు కుటుంబ సభ్యులు పని చేస్తుంటే తప్పనిసరిగా అనుమతి పొందాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ లైసెన్స్ లు అవసరమైన వ్యాపార సంస్థల్లో చేరవద్దని ప్రధాని నియామాళిలలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మంత్రులకు వాటాలు ఉంటే వాటి వివరాలు వెల్లడించాలన్నారు. కొత్త వ్యాపార సంస్థలను మంత్రలు ఎవరూ ప్రారంభించవద్దని ప్రధాని తెలిపారు.కాగా, మంత్రులకు ప్రధాని విధించిన నియమనిబంధనలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఎం వీరప్ప మొయిలీ స్వాగతించారు. మంత్రులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. అంతేగాక ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...