Jump to content

Background work


AbbaiG

Recommended Posts

West Godari TDP cop leaders carpet bombing kukatpally, serlingampally

 

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, యలమంచిలి, న్యూస్‌టుడే

weg-top1a.jpg

తెలంగాణ ప్రచారంలో ప్రజాప్రతినిధులు: జిల్లా నాయకులంతా తెలంగాణ ప్రచారంలో తలమునకలయ్యారు. కొంతమంది నాయకులు అభ్యర్థులతోపాటు  ప్రచారంలో పాల్గొంటున్నారు. మరికొంతమంది తెరవెనుక ఉండి వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి మూడు రోజులుగా అక్కడే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. హైదరాబాదులో శేరిలింగంపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి భవ్య ఆనంద్‌ ప్రసాద్‌, ఉప్పల్‌లో దేవేంద్రగౌడ్‌ తనయుడు వీరేంద్రగౌడ్‌ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కూకట్‌పల్లిలో తెదేపా అభ్యర్థిని నందమూరి సుహాసినీతో ప్రచార రథంపై ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప్పల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు వ్యవహరిస్తున్నారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ మూడు రోజులపాటు అక్కడే ఉన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పి.విష్ణువర్థన్‌రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెదేపా, కాంగ్రెస్‌ పార్టీల నాయకులను సమన్వయం చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి కూకట్‌పల్లి ప్రచార బాధ్యతలు అప్పగించారు. గతనెల 28న హైదరాబాదు వెళ్లారు. ప్రచార పర్వం ముగిసే వరకు అక్కడే ఉంటారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నియోజకవర్గాల తెదేపా అభ్యర్థుల తరఫున, కుత్బుల్లాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. అలాగే వ్యూహాలు రచిస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు అశ్వారావుపేట తెదేపా అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉంగుటూరు శాసనసభ్యుడు కూడా అదే నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థితో పాటు ప్రచారం నిర్వహిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...