Jump to content

toll gate ruckus


swarnandhra

Recommended Posts

రేయ్‌... నేనొస్తే గేటు తీయరా?
01-01-2018 01:58:51
 
636503687292840081.jpg
  • గేట్లు విరగ్గొట్టి..అద్దాలు పగులకొట్టండ్రా..!
  • టోల్‌గేట్‌ సిబ్బందిపై బీజేపీ నేత దాడి
  • ఏడుగురిపై కేసు నమోదు
నెల్లూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ‘రేయ్‌...సురేష్‌రెడ్డి వస్తే గేటు తీయరా...ఏందిరా వాడిని అడిగేది...గేట్లు విరగ్గొట్టు...కౌంటర్‌ అద్దాలు పగులగొట్టు’ అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి అనుచరులు టోల్‌గేట్‌ వద్ద బీభత్సం సృష్టించారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసుకోవాలని టోల్‌గేటు నిర్వాహకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘నువ్వేమి చేసుకుంటావో చేసుకో...నష్ట పరిహారం ఇచ్చేది లేదు’ అంటూ సురేష్‌రెడ్డి నిర్వాహకులతో దురుసుగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంకటాచలం పోలీసులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
పోలీసు కేసు నమోదు చేసిన తర్వాతే వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి ఆయన అనుచరులు శనివారం ఉదయం ఐదు కార్లలో బయలుదేరారు. వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్‌ప్లాజా ఫ్రీ గేట్లు వద్ద కార్లు ఆగాయి. గేట్లు ఎత్తాలని సిబ్బందిని కోరారు. ఫ్రీ పాస్‌ ఉంటే తప్ప గేట్లు ఎత్తలేమని సెక్యూరిటీ సిబ్బంది బదులిచ్చారు.
 
 
‘రే...సురేష్‌రెడ్డి వస్తే గేట్లు తీయవా’అని ఆగ్రహించిన అనుచరులు గేట్లు, కౌంటర్‌ అద్దాలను ధ్వంసం చేశారు. శనివారం సాయంత్రం తిరిగి వస్తుండగా టోల్‌ప్లాజా నిర్వాహకులు జరిగిందేదో జరిగిపోయింది..సర్దుబాటు చేసుకుం దాం...నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. దీనికి సురేష్‌రెడ్డి అంగీకరించకుండా మరోసారి దురుసుగా ప్రవర్తించారని టోల్‌ప్లాజా సెక్యూరిటీ మేనేజర్‌ పట్రా శివరాం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ వెంకటేశ్వర్లు, గార్డు గురవయ్య, గన్‌మెన్‌ మురళీశర్మలపై దాడి, దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు.
 
 
ఈ ఫిర్యాదు మేరకు వెంకటాచలం పోలీసులు క్రైమ్‌ నెంబరు 321/17తో సురేష్‌రెడ్డి మరో ఏడుగురిపై 427, 352, 506, 290 ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ముందుగానే టోల్‌ప్లాజా వాహన పాస్‌ జారీ చేస్తే ఆ నెంబర్లు ఉన్న వాహనాలు ఫ్రీ గేటు ద్వారా వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. మిగిలిన వాహనాలన్నీ టోల్‌ రుసుము చెల్లించాల్సిందే. ఈ నిబంధన తెలిసి కూడా సురేష్‌రెడ్డి తమపై దాడి చేయడం ఏమిటని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజ్‌లను పోలీసులకు అప్పగించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...